టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం దేశవ్యాప్తంగా ఎంత ఉత్కంఠ రేపిందో…ఆయన విడుదల వ్యవహారం అంతకన్నా తీవ్ర ఉత్కంఠను రేపింది. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినప్పటికీ రాత్రంతా అల్లు అర్జున్ ను సాంకేతిక కారణాలతో జైలు అధికారులు జైల్లో ఉంచారు. ఈ క్రమంలోనే జైలు అధికారులపై చట్టపరంగా ముందుకు వెళతామని అల్లు అర్జున్ తరఫు లాయర్లు తెలిపారు.
బెయిల్ ఆర్డర్ కాపీ అందుకున్న వెంటనే అల్లు అర్జున్ ను విడుదల చేయాలని హైకోర్టు స్పష్టంగా ఉత్తర్వులు ఇచ్చిందని, కానీ, జైలు అధికారులు విడుదల చేయలేదని అల్లు అర్జున్ తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి చెప్పారు. అందుకే, సంబంధిత అధికారులపై న్యాయపోరాటం చేస్తామని అన్నారు. అల్లు అర్జున్ ను చట్టవ్యతిరేకంగా జైలులో రాత్రంతా ఉంచారని, ఈ విషయంపై కచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు.
బెయిల్ ఆర్డర్ కాపీని జైలు అధికారులకు నిన్న సాయంత్రం అందించామని, అది అందిన వెంటనే అల్లు అర్జున్ ను ఎందుకు విడుదల చేయలేదో జైలు అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంటుందని అన్నారు. బెయిల్ ఆర్డర్ కాపీ అందిన తర్వాత అల్లు అర్జున్ ను జైలులో ఉంచకూడదని హైకోర్టు స్పష్టంగా చెప్పిందని, అయినా సరే రాత్రంతా అల్లు అర్జున్ ను జైలులో ఉంచారని అన్నారు. మరోవైపు, ఈ విషయంపై అల్లు అర్జున్, అల్లు అరవింద్ చాలా అసహనంగా ఉన్నారని, తప్పకుండా జైలు అధికారులపై లీగల్ గా ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…
హీరోయిన్లు కెరీర్లో కొంచెం కుదురుకోగానే పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న ఎదురవుతుంది మీడియా నుంచి. ఆ తంతు పూర్తయ్యాక తల్లెప్పుడు…
సింగ్ గీతంని విష్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ తన మిత్రుడు రామ్ చరణ్ పెద్దికి మాత్రం ఎలాంటి ట్వీట్ వేయకపోవడం…
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇండీ కూటమిలో భాగంగా డీఎంకే, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగిన…
2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్లపై అప్పట్లో ఓ రేంజ్ లో…
ఎంత గొప్ప దర్శకులైనా ఏదో ఒక దశలో ఫామ్ కోల్పోవాల్సిందే. ట్రెండును అందుకోలేక వైఫల్యాలు చవిచూడాల్సిందే. తెలుగు సినీ చరిత్రలో…