“గత ఆనవాళ్లను కూకటి వేళ్లతో పెకలించి వేయాలి”- ఇదీ.. సీఎం చంద్రబాబు నేరుగా కలెక్టర్లకు చెప్పిన మాట. స్థానిక మీడియా కంటే కూడా.. దీనిని జాతీయ మీడియా పెద్ద ఎత్తున హైలెట్ చేసింది. రెండు రోజుల పాటు నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో రెండు రోజులు కూడా .. నొక్కి మరీ చంద్రబాబు చెప్పిన మాట ఇదే. అయితే.. ఇది రాజకీయంగా కంటే కూడా.. పాలన పరంగానే ఆయన దిశానిర్దేశం చేయడం గమనార్హం. నిజానికి వైసీపీ తీసుకువచ్చిన..అనేక కార్యక్రమాలు ఇప్పుడు ఆగిపోయాయి.
వలంటీర్, సచివాలయం, ఇంటికే రేషన్, ఇంటికే డాక్టర్ ఇలా.. కొన్ని బ్రాండ్లు వైసీపీ సొంతం. కానీ, వీటిని కూటమి ప్రభుత్వం నిలిపి వేసింది. ఒకరకంగా ఇది ట్రైలర్ మాత్రమే. ఎందుకంటే.. వాటిని నిలిపి వేసిన తర్వాత.. ప్రజల నుంచి ఏమైనా వ్యతిరేకత వస్తుందేమో అని అనుకున్నారు. కానీ, ఎలాంటి వ్యతిరేకత రాలేదు. దీంతో ఇప్పుడు ముందుకు సాగేందుకు.. మరిన్ని నిర్ణయాలు తీసుకునేందుకు కూటమి సర్కారు ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ మాట వినిపించకూడదన్న వాదన కూటమి నేతల మధ్య వినిపిస్తోంది.
ఈ క్రమంలోనే పాఠశాలల్లో తీసుకువచ్చిన మౌలిక సదుపాయాల కల్పనపైనా కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. జగన్ హయాంలో పాఠశాలల్లో నాడు-నేడు అనే కాన్సెప్టును తీసుకువచ్చారు. ఇప్పుడు దీని స్తానంలో మరిన్ని అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. తద్వారా.. నాడు-నేడు పోయి.. ‘ఫ్యూచర్ స్కూల్స్’ కాన్సెప్టు రానుంది. దీనిపై చంద్రబాబు సోదాహరణంగా కలెక్టర్లకు వివరించారు. ఇదేసమయంలో ప్రతి రెండో శనివారం కూడా.. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కాన్సెప్టును ప్రకటించారు.
ఇది గ్రామీణ స్థాయిలో మరింత మార్పునకు శ్రీకారం చుట్టనుంది. చెత్త ఏరివేత, పరిశుభ్రతకు పెద్ద పీట వేయనున్నారు. మొత్తంగా ఈ రెండు కార్యక్రమాలు కూడా వైసీపీ మార్కును దాదాపు చెరిపేయనున్నాయి. ఇంటింటికీ పింఛన్ అనేది తమ బ్రాండుగా చెప్పుకొన్నవైసీపీ ఇప్పుడు దీనినివదులుకున్న విషయం తెలిసిందే. టీడీపీ దీనిని ఓవర్ టేక్ చేసింది.
ఇలానే.. పాఠశాలలు, ఆసుపత్రులు.. సహా అనేక రంగాల్లో మరింత మెరుగైన సేవల ద్వారా..జగన్ మార్కును తుడిచేయాలన్న కాన్సెప్టు దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుండడం గమనార్హం. అయితే.. దీనిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. అధికారంలో ఎవరు ఉంటే వారి మార్కు పాలన సాగాలని కోరుకోవడం సరైన నిర్ణయమే కదా..!
This post was last modified on December 13, 2024 9:44 am
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…
ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…
నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…