Political News

ఇక‌, జ‌గ‌న్ మాట వినిపించ‌దు.. కూట‌మి ప్లాన్ ఏంటి ..!

“గ‌త ఆన‌వాళ్ల‌ను కూక‌టి వేళ్ల‌తో పెక‌లించి వేయాలి”- ఇదీ.. సీఎం చంద్ర‌బాబు నేరుగా క‌లెక్ట‌ర్లకు చెప్పిన మాట‌. స్థానిక మీడియా కంటే కూడా.. దీనిని జాతీయ మీడియా పెద్ద ఎత్తున హైలెట్ చేసింది. రెండు రోజుల పాటు నిర్వ‌హించిన క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో రెండు రోజులు కూడా .. నొక్కి మ‌రీ చంద్ర‌బాబు చెప్పిన మాట ఇదే. అయితే.. ఇది రాజ‌కీయంగా కంటే కూడా.. పాల‌న ప‌రంగానే ఆయ‌న దిశానిర్దేశం చేయ‌డం గ‌మ‌నార్హం. నిజానికి వైసీపీ తీసుకువ‌చ్చిన‌..అనేక కార్య‌క్ర‌మాలు ఇప్పుడు ఆగిపోయాయి.

వ‌లంటీర్‌, స‌చివాల‌యం, ఇంటికే రేష‌న్‌, ఇంటికే డాక్ట‌ర్ ఇలా.. కొన్ని బ్రాండ్లు వైసీపీ సొంతం. కానీ, వీటిని కూటమి ప్ర‌భుత్వం నిలిపి వేసింది. ఒక‌ర‌కంగా ఇది ట్రైల‌ర్ మాత్ర‌మే. ఎందుకంటే.. వాటిని నిలిపి వేసిన త‌ర్వాత‌.. ప్ర‌జ‌ల నుంచి ఏమైనా వ్య‌తిరేక‌త వ‌స్తుందేమో అని అనుకున్నారు. కానీ, ఎలాంటి వ్య‌తిరేక‌త రాలేదు. దీంతో ఇప్పుడు ముందుకు సాగేందుకు.. మ‌రిన్ని నిర్ణ‌యాలు తీసుకునేందుకు కూట‌మి స‌ర్కారు ప్లాన్ చేస్తోంది. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ మాట వినిపించ‌కూడ‌ద‌న్న వాద‌న కూట‌మి నేత‌ల మ‌ధ్య వినిపిస్తోంది.

ఈ క్ర‌మంలోనే పాఠ‌శాల‌ల్లో తీసుకువ‌చ్చిన మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌నపైనా కూట‌మి ప్ర‌భుత్వం దృష్టి పెట్టింది. జ‌గ‌న్ హ‌యాంలో పాఠ‌శాలల్లో నాడు-నేడు అనే కాన్సెప్టును తీసుకువ‌చ్చారు. ఇప్పుడు దీని స్తానంలో మ‌రిన్ని అభివృద్ది కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుడుతున్నారు. త‌ద్వారా.. నాడు-నేడు పోయి.. ‘ఫ్యూచ‌ర్ స్కూల్స్’ కాన్సెప్టు రానుంది. దీనిపై చంద్ర‌బాబు సోదాహ‌ర‌ణంగా క‌లెక్ట‌ర్ల‌కు వివ‌రించారు. ఇదేస‌మ‌యంలో ప్ర‌తి రెండో శ‌నివారం కూడా.. స్వ‌చ్ఛ ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాన్సెప్టును ప్ర‌క‌టించారు.

ఇది గ్రామీణ స్థాయిలో మ‌రింత మార్పున‌కు శ్రీకారం చుట్ట‌నుంది. చెత్త ఏరివేత‌, ప‌రిశుభ్ర‌త‌కు పెద్ద పీట వేయ‌నున్నారు. మొత్తంగా ఈ రెండు కార్య‌క్ర‌మాలు కూడా వైసీపీ మార్కును దాదాపు చెరిపేయ‌నున్నాయి. ఇంటింటికీ పింఛ‌న్ అనేది త‌మ బ్రాండుగా చెప్పుకొన్న‌వైసీపీ ఇప్పుడు దీనినివ‌దులుకున్న విష‌యం తెలిసిందే. టీడీపీ దీనిని ఓవ‌ర్ టేక్ చేసింది.

ఇలానే.. పాఠ‌శాల‌లు, ఆసుప‌త్రులు.. స‌హా అనేక‌ రంగాల్లో మ‌రింత మెరుగైన సేవ‌ల ద్వారా..జ‌గ‌న్ మార్కును తుడిచేయాల‌న్న కాన్సెప్టు దిశ‌గా కూట‌మి ప్ర‌భుత్వం అడుగులు ముందుకు వేస్తుండ‌డం గ‌మ‌నార్హం. అయితే.. దీనిని త‌ప్పుప‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. అధికారంలో ఎవ‌రు ఉంటే వారి మార్కు పాల‌న సాగాల‌ని కోరుకోవ‌డం స‌రైన నిర్ణ‌య‌మే క‌దా..!

This post was last modified on December 13, 2024 9:44 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

2 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

7 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

7 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

8 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

9 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

10 hours ago