Political News

ఇక‌, జ‌గ‌న్ మాట వినిపించ‌దు.. కూట‌మి ప్లాన్ ఏంటి ..!

“గ‌త ఆన‌వాళ్ల‌ను కూక‌టి వేళ్ల‌తో పెక‌లించి వేయాలి”- ఇదీ.. సీఎం చంద్ర‌బాబు నేరుగా క‌లెక్ట‌ర్లకు చెప్పిన మాట‌. స్థానిక మీడియా కంటే కూడా.. దీనిని జాతీయ మీడియా పెద్ద ఎత్తున హైలెట్ చేసింది. రెండు రోజుల పాటు నిర్వ‌హించిన క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో రెండు రోజులు కూడా .. నొక్కి మ‌రీ చంద్ర‌బాబు చెప్పిన మాట ఇదే. అయితే.. ఇది రాజ‌కీయంగా కంటే కూడా.. పాల‌న ప‌రంగానే ఆయ‌న దిశానిర్దేశం చేయ‌డం గ‌మ‌నార్హం. నిజానికి వైసీపీ తీసుకువ‌చ్చిన‌..అనేక కార్య‌క్ర‌మాలు ఇప్పుడు ఆగిపోయాయి.

వ‌లంటీర్‌, స‌చివాల‌యం, ఇంటికే రేష‌న్‌, ఇంటికే డాక్ట‌ర్ ఇలా.. కొన్ని బ్రాండ్లు వైసీపీ సొంతం. కానీ, వీటిని కూటమి ప్ర‌భుత్వం నిలిపి వేసింది. ఒక‌ర‌కంగా ఇది ట్రైల‌ర్ మాత్ర‌మే. ఎందుకంటే.. వాటిని నిలిపి వేసిన త‌ర్వాత‌.. ప్ర‌జ‌ల నుంచి ఏమైనా వ్య‌తిరేక‌త వ‌స్తుందేమో అని అనుకున్నారు. కానీ, ఎలాంటి వ్య‌తిరేక‌త రాలేదు. దీంతో ఇప్పుడు ముందుకు సాగేందుకు.. మ‌రిన్ని నిర్ణ‌యాలు తీసుకునేందుకు కూట‌మి స‌ర్కారు ప్లాన్ చేస్తోంది. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ మాట వినిపించ‌కూడ‌ద‌న్న వాద‌న కూట‌మి నేత‌ల మ‌ధ్య వినిపిస్తోంది.

ఈ క్ర‌మంలోనే పాఠ‌శాల‌ల్లో తీసుకువ‌చ్చిన మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌నపైనా కూట‌మి ప్ర‌భుత్వం దృష్టి పెట్టింది. జ‌గ‌న్ హ‌యాంలో పాఠ‌శాలల్లో నాడు-నేడు అనే కాన్సెప్టును తీసుకువ‌చ్చారు. ఇప్పుడు దీని స్తానంలో మ‌రిన్ని అభివృద్ది కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుడుతున్నారు. త‌ద్వారా.. నాడు-నేడు పోయి.. ‘ఫ్యూచ‌ర్ స్కూల్స్’ కాన్సెప్టు రానుంది. దీనిపై చంద్ర‌బాబు సోదాహ‌ర‌ణంగా క‌లెక్ట‌ర్ల‌కు వివ‌రించారు. ఇదేస‌మ‌యంలో ప్ర‌తి రెండో శ‌నివారం కూడా.. స్వ‌చ్ఛ ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాన్సెప్టును ప్ర‌క‌టించారు.

ఇది గ్రామీణ స్థాయిలో మ‌రింత మార్పున‌కు శ్రీకారం చుట్ట‌నుంది. చెత్త ఏరివేత‌, ప‌రిశుభ్ర‌త‌కు పెద్ద పీట వేయ‌నున్నారు. మొత్తంగా ఈ రెండు కార్య‌క్ర‌మాలు కూడా వైసీపీ మార్కును దాదాపు చెరిపేయ‌నున్నాయి. ఇంటింటికీ పింఛ‌న్ అనేది త‌మ బ్రాండుగా చెప్పుకొన్న‌వైసీపీ ఇప్పుడు దీనినివ‌దులుకున్న విష‌యం తెలిసిందే. టీడీపీ దీనిని ఓవ‌ర్ టేక్ చేసింది.

ఇలానే.. పాఠ‌శాల‌లు, ఆసుప‌త్రులు.. స‌హా అనేక‌ రంగాల్లో మ‌రింత మెరుగైన సేవ‌ల ద్వారా..జ‌గ‌న్ మార్కును తుడిచేయాల‌న్న కాన్సెప్టు దిశ‌గా కూట‌మి ప్ర‌భుత్వం అడుగులు ముందుకు వేస్తుండ‌డం గ‌మ‌నార్హం. అయితే.. దీనిని త‌ప్పుప‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. అధికారంలో ఎవ‌రు ఉంటే వారి మార్కు పాల‌న సాగాల‌ని కోరుకోవ‌డం స‌రైన నిర్ణ‌య‌మే క‌దా..!

This post was last modified on December 13, 2024 9:44 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సినిమాల్లేవ్ కానీ అంతటా ఆమే..

బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…

1 hour ago

మళ్లీ రెండేళ్లంటే కష్టం రాజా

ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…

6 hours ago

మహేష్ రన్నింగ్ స్టైల్ మార్చడమేంటి జక్కన్నా?

తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…

7 hours ago

దురంధర్ VS విశ్వరూపం – ఎందుకీ రచ్చ?

ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…

8 hours ago

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

9 hours ago

టార్గెట్ వైసీపీ… బాబు-ప‌వ‌న్ రచిస్తున్న వ్యూహం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు సుమారు గంట‌కుపైగా చ‌ర్చ‌లు జ‌రిపారు. బుధ‌వారం ఉద‌యం ఉండ‌వ‌ల్లిలోని ముఖ్య‌మంత్రి నివాసానికి…

10 hours ago