“గత ఆనవాళ్లను కూకటి వేళ్లతో పెకలించి వేయాలి”- ఇదీ.. సీఎం చంద్రబాబు నేరుగా కలెక్టర్లకు చెప్పిన మాట. స్థానిక మీడియా కంటే కూడా.. దీనిని జాతీయ మీడియా పెద్ద ఎత్తున హైలెట్ చేసింది. రెండు రోజుల పాటు నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో రెండు రోజులు కూడా .. నొక్కి మరీ చంద్రబాబు చెప్పిన మాట ఇదే. అయితే.. ఇది రాజకీయంగా కంటే కూడా.. పాలన పరంగానే ఆయన దిశానిర్దేశం చేయడం గమనార్హం. నిజానికి వైసీపీ తీసుకువచ్చిన..అనేక కార్యక్రమాలు ఇప్పుడు ఆగిపోయాయి.
వలంటీర్, సచివాలయం, ఇంటికే రేషన్, ఇంటికే డాక్టర్ ఇలా.. కొన్ని బ్రాండ్లు వైసీపీ సొంతం. కానీ, వీటిని కూటమి ప్రభుత్వం నిలిపి వేసింది. ఒకరకంగా ఇది ట్రైలర్ మాత్రమే. ఎందుకంటే.. వాటిని నిలిపి వేసిన తర్వాత.. ప్రజల నుంచి ఏమైనా వ్యతిరేకత వస్తుందేమో అని అనుకున్నారు. కానీ, ఎలాంటి వ్యతిరేకత రాలేదు. దీంతో ఇప్పుడు ముందుకు సాగేందుకు.. మరిన్ని నిర్ణయాలు తీసుకునేందుకు కూటమి సర్కారు ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ మాట వినిపించకూడదన్న వాదన కూటమి నేతల మధ్య వినిపిస్తోంది.
ఈ క్రమంలోనే పాఠశాలల్లో తీసుకువచ్చిన మౌలిక సదుపాయాల కల్పనపైనా కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. జగన్ హయాంలో పాఠశాలల్లో నాడు-నేడు అనే కాన్సెప్టును తీసుకువచ్చారు. ఇప్పుడు దీని స్తానంలో మరిన్ని అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. తద్వారా.. నాడు-నేడు పోయి.. ‘ఫ్యూచర్ స్కూల్స్’ కాన్సెప్టు రానుంది. దీనిపై చంద్రబాబు సోదాహరణంగా కలెక్టర్లకు వివరించారు. ఇదేసమయంలో ప్రతి రెండో శనివారం కూడా.. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కాన్సెప్టును ప్రకటించారు.
ఇది గ్రామీణ స్థాయిలో మరింత మార్పునకు శ్రీకారం చుట్టనుంది. చెత్త ఏరివేత, పరిశుభ్రతకు పెద్ద పీట వేయనున్నారు. మొత్తంగా ఈ రెండు కార్యక్రమాలు కూడా వైసీపీ మార్కును దాదాపు చెరిపేయనున్నాయి. ఇంటింటికీ పింఛన్ అనేది తమ బ్రాండుగా చెప్పుకొన్నవైసీపీ ఇప్పుడు దీనినివదులుకున్న విషయం తెలిసిందే. టీడీపీ దీనిని ఓవర్ టేక్ చేసింది.
ఇలానే.. పాఠశాలలు, ఆసుపత్రులు.. సహా అనేక రంగాల్లో మరింత మెరుగైన సేవల ద్వారా..జగన్ మార్కును తుడిచేయాలన్న కాన్సెప్టు దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుండడం గమనార్హం. అయితే.. దీనిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. అధికారంలో ఎవరు ఉంటే వారి మార్కు పాలన సాగాలని కోరుకోవడం సరైన నిర్ణయమే కదా..!
This post was last modified on December 13, 2024 9:44 am
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…
ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…
నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…
ఏపీ సీఎం చంద్రబాబు... `బీసీ బాబు`గా మారనున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు నడుంబిగించారా? అంటే.. ఔననే…
జనసేన పార్టీ నాయకులకు ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్.. కీలక విషయాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…