“గత ఆనవాళ్లను కూకటి వేళ్లతో పెకలించి వేయాలి”- ఇదీ.. సీఎం చంద్రబాబు నేరుగా కలెక్టర్లకు చెప్పిన మాట. స్థానిక మీడియా కంటే కూడా.. దీనిని జాతీయ మీడియా పెద్ద ఎత్తున హైలెట్ చేసింది. రెండు రోజుల పాటు నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో రెండు రోజులు కూడా .. నొక్కి మరీ చంద్రబాబు చెప్పిన మాట ఇదే. అయితే.. ఇది రాజకీయంగా కంటే కూడా.. పాలన పరంగానే ఆయన దిశానిర్దేశం చేయడం గమనార్హం. నిజానికి వైసీపీ తీసుకువచ్చిన..అనేక కార్యక్రమాలు ఇప్పుడు ఆగిపోయాయి.
వలంటీర్, సచివాలయం, ఇంటికే రేషన్, ఇంటికే డాక్టర్ ఇలా.. కొన్ని బ్రాండ్లు వైసీపీ సొంతం. కానీ, వీటిని కూటమి ప్రభుత్వం నిలిపి వేసింది. ఒకరకంగా ఇది ట్రైలర్ మాత్రమే. ఎందుకంటే.. వాటిని నిలిపి వేసిన తర్వాత.. ప్రజల నుంచి ఏమైనా వ్యతిరేకత వస్తుందేమో అని అనుకున్నారు. కానీ, ఎలాంటి వ్యతిరేకత రాలేదు. దీంతో ఇప్పుడు ముందుకు సాగేందుకు.. మరిన్ని నిర్ణయాలు తీసుకునేందుకు కూటమి సర్కారు ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ మాట వినిపించకూడదన్న వాదన కూటమి నేతల మధ్య వినిపిస్తోంది.
ఈ క్రమంలోనే పాఠశాలల్లో తీసుకువచ్చిన మౌలిక సదుపాయాల కల్పనపైనా కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. జగన్ హయాంలో పాఠశాలల్లో నాడు-నేడు అనే కాన్సెప్టును తీసుకువచ్చారు. ఇప్పుడు దీని స్తానంలో మరిన్ని అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. తద్వారా.. నాడు-నేడు పోయి.. ‘ఫ్యూచర్ స్కూల్స్’ కాన్సెప్టు రానుంది. దీనిపై చంద్రబాబు సోదాహరణంగా కలెక్టర్లకు వివరించారు. ఇదేసమయంలో ప్రతి రెండో శనివారం కూడా.. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కాన్సెప్టును ప్రకటించారు.
ఇది గ్రామీణ స్థాయిలో మరింత మార్పునకు శ్రీకారం చుట్టనుంది. చెత్త ఏరివేత, పరిశుభ్రతకు పెద్ద పీట వేయనున్నారు. మొత్తంగా ఈ రెండు కార్యక్రమాలు కూడా వైసీపీ మార్కును దాదాపు చెరిపేయనున్నాయి. ఇంటింటికీ పింఛన్ అనేది తమ బ్రాండుగా చెప్పుకొన్నవైసీపీ ఇప్పుడు దీనినివదులుకున్న విషయం తెలిసిందే. టీడీపీ దీనిని ఓవర్ టేక్ చేసింది.
ఇలానే.. పాఠశాలలు, ఆసుపత్రులు.. సహా అనేక రంగాల్లో మరింత మెరుగైన సేవల ద్వారా..జగన్ మార్కును తుడిచేయాలన్న కాన్సెప్టు దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుండడం గమనార్హం. అయితే.. దీనిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. అధికారంలో ఎవరు ఉంటే వారి మార్కు పాలన సాగాలని కోరుకోవడం సరైన నిర్ణయమే కదా..!
This post was last modified on December 13, 2024 9:44 am
సౌత్ లో అతి పెద్ద నిర్మాణ సంస్థగా ఎదగాలని ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్. మూలాలు కర్ణాటకనే…
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంకేతికత సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. టీవీకే అధినేత విజయ్ ప్రత్యక్షంగా అన్ని నియోజకవర్గాలను సందర్శించడం కష్టంగా…
ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టిక చూస్తుంటే రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి 'రాజసం' ఉట్టిపడేలా ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ గెలిచి…
ఇండస్ట్రీకి లీకులు కొత్త కాదు. నిన్నటికి నిన్న జన నాయగన్ సినిమానే బయటికొచ్చింది. పైరసీని కట్టడి చేశారు కానీ భారీ…
అదేంటో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు దర్శకుల మార్పు పెద్ద తలనెప్పిగా మారిపోయింది. అయన, కమల్ హాసన్ కలిసి నటించే…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ ఈనెల 23న జరగనుంది. అంటే పది రోజుల్లో ప్రజలు తమ ఓటు ద్వారా ప్రభుత్వాన్ని…