వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్కు భారీ షాక్ తగిలింది. జగన్ కుటుంబానికి చెందిన సరస్వతి పవర్ ప్రాజెక్టుకు సంబంధించి కేటాయించిన భూములను తాజాగా కూటమి సర్కారు వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని స్వయంగా సీఎం చంద్రబాబు.. కలెక్టర్ల సదస్సులోనే ప్రకటించడం గమనార్హం. రెండో రోజు కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఆక్రమిత భూములతో పాటు.. అసైన్డ్ భూములను కూడా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా గురజాల సహా పల్నాడులోని పలు ప్రాంతాల్లో సరస్వతి పవర్ ప్రాజెక్టు కోసం కేటాయించిన భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటున్నట్టు సీఎం తెలిపారు. ఈ భూములను గత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జగన్ కు కేటాయించారు. అయితే.. ఇక్కడ ఇండస్ట్రీ ఏర్పాటు చేయకపోవడంతోపాటు..ఇటీవల వివాదాలకు కూడా కారణమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అసైన్డ్ భూములను వెనక్కి తీసుకుంటున్నట్టు సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించడం గమనార్హం.
ఉత్తర్వులు జారీ ..
అయితే.. దీనికి సంబంధించి పల్నాడు ప్రాంతానికి చెందిన తహసీల్దార్ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. తిరిగి స్వాధీనం చేసుకున్న భూముల్లో మొత్తం 17.69 ఎకరాలు ఉన్నాయి. వీటిలో పల్నాడు జిల్లాలోని మాచవరం మండలం వేమవరంలో 13.80 ఎకరాలు, పిన్నెల్లి గ్రామ పరిధిలో 3.89 ఎకరాలు వెనక్కి తీసుకుంటున్నట్టు స్థానిక తహసీల్దార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ అసైన్డ్ భూములను సంబంధిత వర్గాలకు తిరిగి కేటాయించే అవకాశం ఉందని ఆయన పేర్కొనడం గమనార్హం.
This post was last modified on December 12, 2024 11:58 am
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…
సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…