Political News

‘ప‌రువు న‌ష్టం’.. జ‌గ‌న్ సాధించేదేంటి ..!

త‌న ప‌రువుకు భంగం క‌లిగింద‌ని పేర్కొంటూ.. వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. ఢిల్లీ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త గౌతం అదానీ నుంచి జ‌గ‌న్ రూ.1750 కోట్ల మేర‌కు లంచాలు తీసుకున్నారంటూ.. రెండు ప్ర‌ధాన ప‌త్రిక‌లు రాసిన వార్త‌ల‌ను ఖండిస్తూ.. ఈ పిటిస‌న్‌ను ఆయ‌న దాఖ‌లు చేశారు. దీనిని విచార‌ణ‌కు స్వీక‌రించిన ఢిల్లీ హైకోర్టు ఆయా ప‌త్రిక‌ల‌కు నోటీసులు జారీ చేసింది. ఇదేస‌మ‌యంలో గూగుల్ సంస్థ‌పైనా జ‌గ‌న్ పిటిష‌న్ వేశారు.

అయితే.. ఈ పిటిష‌న్ల‌పై ఏం జ‌రుగుతుంద‌నేది ప‌క్క‌న పెడితే.. రెండు కీల‌క విష‌యాలు చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. 1) ఏపీ మాజీ సీఎం ఇక్క‌డి కోర్టుల‌ను ఆశ్ర‌యించ‌కుండా.. ఢిల్లీలో ఉన్న కోర్టులో పిటిష‌న్ వేయ‌డం. 2) మీడియాపై ప‌రువునష్టం కేసు వేయ‌డం. ఈ రెండు అంశాలు కూడా ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ కు వ‌స్తున్నాయి. మొద‌టి విష‌యాన్ని తీసుకుంటే.. వాస్త‌వానికి ఏపీ ప‌త్రిక‌లు రాసిన‌ప్పుడు.. కేసులు వేయాల‌ని అనుకుంటే.. ఏపీ కోర్టుల్లోనే వేయాలి. కానీ, జ‌గ‌న్‌.. దీనికి విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించారు.

అంటే.. దీనిని బ‌ట్టి జ‌గ‌న్‌కు ఏపీ హైకోర్టుపై న‌మ్మ‌కం లేద‌ని భావించాల్సి వ‌స్తోంద‌ని న్యాయ‌నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇదేస‌మ‌యంలో త‌న‌పై జ‌రుగుతున్న ప్ర‌చారానికి గూగుల్ కూడా.. స‌హ‌క‌రిస్తోంద‌న్న ఆవేద‌న‌తో ఉన్న జ‌గ‌న్‌.. గూగుల్ వంటి సంస్థ‌ల‌పై కేసులు వేయ‌డం కూడా చ‌ర్చ‌గా మారింది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఢిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించార‌న్న‌ది ఒక వైపు వాద‌న‌. కానీ, ఇలా చేయ‌డం ద్వారా.. ఏపీలో ఉన్న ఏపీ న్యాయ‌వ్య‌వ‌స్థ‌ను న‌మ్మ‌డం లేద‌న్న చ‌ర్చ రాజ‌కీయంగా ఆయ‌న‌కు ఇబ్బందిగా మారే అవ‌కాశం ఉంది.

ఇక‌, రెండో అంశం.. ప‌త్రిక‌ల‌పైప‌రువు న‌ష్టం కేసు. ఇలా వేయ‌డం కొత్త కాక‌పోయినా.. ఏపీలో మాత్రం ఇదే తొలిసారి. గ‌తంలో వైఎస్‌రాజ‌శేఖ‌ర‌రెడ్డి కేంద్రంగా కూడా.. ఈ రెండు ప‌త్రిక‌లు అనేక క‌థ‌నాలు రాశాయి. అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న సంయ‌మ‌నం పాటించి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌చ్చారు. ఇప్పుడు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌చ్చి వివ‌ర‌ణ ఇచ్చుకునే ప‌రిస్థితిలో జ‌గ‌న్ లేర‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయిన త‌ర్వాత‌.. తాపీగా కోర్టును ఆశ్ర‌యించినా.. ప్ర‌యోజ‌నం ద‌క్క‌డం క‌ష్ట‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

Satya

Recent Posts

పవన్ సభకు తెలంగాణ పోలీసుల ‘నో’

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు భారీ షాక్ తగిలింది. తెలంగాణలో జనసేన బలోపేతం దిశగా…

30 minutes ago

రాజమౌళి లక్ష్యం… సినీ ప్రియుల స్వప్మం

తెలుగు మూవీ లవర్స్ చిరకాల వాంఛ ఐమాక్స్ గురించి గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఎడతెగని చర్చ…

2 hours ago

సేతుపతి స్థానంలో రాజశేఖర్?

దక్షిణాదిన క్యారెక్టర్, విలన్ పాత్రలకు మాంచి డిమాండ్ ఉన్న నటుల్లో విజయ్ సేతుపతి ఒకడు. సుకుమార్ అంతటి పెద్ద దర్శకుడు…

3 hours ago

అరడజను సినిమాలు ‘పెద్ది’కి పోటీగా

అదేంటి పెద్ది వస్తుంటే ఇంకెవరు పోటీకి దిగుతారనే డౌట్ వస్తోందా. టాలీవుడ్ ప్రొడ్యూసర్లు అంత సాహసం చేయరు కానీ ఇతర…

3 hours ago

తెలంగాణలో పెద్ది టెన్షన్… కానీ ఏపీలో మొదలెట్టేశారు

తెలుగులో రిలీజయ్యే ఏ సినిమాకైనా అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఒకేసారి షోలు మొదలుపెట్టాల్సి ఉంటుంది. ఒకట్రెండు గంటల తేడా…

3 hours ago

తెలుగు రాష్ట్రాల మధ్య మళ్ళీ చిచ్చు రాజుకుందా…?

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్ పై ఓ రేంజి తరహా వ్యాఖ్యలు చేసిన…

3 hours ago