జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబును టీటీడీ ఛైర్మన్ చేయబోతున్నారని చాలాకాలం ప్రచారం జరిగినా…చివరకు బీఆర్ నాయుడును ఆ పదవి వరించింది. దీంతో, నాగబాబును పెద్దల సభకు పంపేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీలోని బీజేపీ పెద్దలతో మంతనాలు జరిపారని ప్రచారం కూడా జరిగింది. అయితే, తాజాగా నాగాబాబును ఏపీ మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారని మరో ప్రచారం తెరపైకి వచ్చింది. నాగబాబుకు బెర్త్ కన్ఫర్మ్ అయిందని తెలుస్తోంది.
ఏపీ కేబినెట్ లోకి 25 మందిని తీసుకునే చాన్స్ ఉండగా…24 మంది మంత్రులను ఆల్రెడీ ఎంపిక చేశారు. మిగిలిన ఆ మంత్రి పదవిని నాగబాబుకు దక్కనుందని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికార ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి ఆర్. కృష్ణయ్య, టీడీపీ నుంచి బీద మస్తాన్రావు, సానా సతీష్ లను రాజ్యసభ అభ్యర్థులుగా ఖరారు చేశారు. ఎన్డీఏ కూటమికి అసెంబ్లీలో ఉన్న సంఖ్యా బలం ప్రకారం ఈ మూడు రాజ్యసభ సీట్లు ఏకగ్రీవం అయ్యే అవకాశముంది. రాజ్యసభ తలుపులు మూసుకుపోవడంతో నాగబాబుకు ఏపీ కేబినెట్ లో బెర్త్ కన్ఫర్మ్ అని తెలుస్తోంది.
This post was last modified on December 9, 2024 11:07 pm
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…