గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యక్తిగత కార్యదర్శి(పీఏ) రాజాను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతోపాటు 11 మంది అనుచరులను కూడా అదుపులోకి తీసుకుని గన్నవరం మండలం బాపులపాడు పోలీసు స్టేషన్లో విచారిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా గన్నవరం రాజకీయాలు వేడెక్కినట్టు అయింది. నిన్న మొన్నటి వరకు పీఎ రాజా తప్పించుకుని తిరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై పోలీసులు ఇప్పటికి రెండు సార్లు వార్నింగులు కూడా ఇచ్చారు.
ఏంటీ కేసు?
గన్నవరం నియోజకవర్గంలో వంశీ అనుచరుల దూకుడు గురించి అందరికీ తెలిసిందే. ఆయన వరుస విజయాలతో నియోజకవర్గంలో అప్రతిహతంగా దూసుకుపోయారు. ఈ క్రమంలోనే 2019-24 మధ్య టీడీపీ తరఫున గెలిచినప్పటికీ.. మధ్యలో వైసీపీకి జై కొట్టారు. ఆ తర్వాత.. టీడీపీ అధినేత చంద్రబాబు సహా.. ఇతర నాయకులపైనా తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇదే అదునుగా.. స్థానిక పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు.
ఈ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన సమయంలో నలుగురు నాయకులు అక్కడే ఉన్నారు. వారిని కూడా చితక బాదారు. ఈ పరిణామాలపై అప్పట్లోనే పోలీసులు కేసులు నమోదు చేసినా.. వైసీపీ హయాంలో ఈ కేసులు ముందుకు సాగలేదు. ఇక, టీడీపీ కూటమి సర్కారు వచ్చిన తర్వాత.. ఈ కేసు వేగవంతం అయింది. ఈ క్రమంలోనే వంశీ అనుచరులను అరెస్టు చేసిన పోలీసులు వంశీ పీఏ కోసం వెతులాట ప్రారంభించారు. గురువారం రాత్రి ఆయన తన స్నేహితుడి ఇంట్లో ఉన్నాడని తెలుసుకుని దాడి చేసి అరెస్టు చేశారు.
ఇక, ఈ పరిణామాలను గమనిస్తే.. మాజీ ఎమ్మెల్యే వంశీ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఆయనపై కూడా పోలీసులు కేసు నమోదు చేయొచ్చని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. పీఏ ఇచ్చే సమాచారం ఆధారంగా.. టీడీపీ ఆఫీసుపై దాడిని ఎవరు ప్రోత్సహించారన్న విషయంపై పోలీసులు కూపీ లాగి వంశీపైనా కేసు పెట్టవచ్చన్నది రాజకీయ వర్గాల మాట. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on December 6, 2024 2:10 pm
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…