గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యక్తిగత కార్యదర్శి(పీఏ) రాజాను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతోపాటు 11 మంది అనుచరులను కూడా అదుపులోకి తీసుకుని గన్నవరం మండలం బాపులపాడు పోలీసు స్టేషన్లో విచారిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా గన్నవరం రాజకీయాలు వేడెక్కినట్టు అయింది. నిన్న మొన్నటి వరకు పీఎ రాజా తప్పించుకుని తిరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై పోలీసులు ఇప్పటికి రెండు సార్లు వార్నింగులు కూడా ఇచ్చారు.
ఏంటీ కేసు?
గన్నవరం నియోజకవర్గంలో వంశీ అనుచరుల దూకుడు గురించి అందరికీ తెలిసిందే. ఆయన వరుస విజయాలతో నియోజకవర్గంలో అప్రతిహతంగా దూసుకుపోయారు. ఈ క్రమంలోనే 2019-24 మధ్య టీడీపీ తరఫున గెలిచినప్పటికీ.. మధ్యలో వైసీపీకి జై కొట్టారు. ఆ తర్వాత.. టీడీపీ అధినేత చంద్రబాబు సహా.. ఇతర నాయకులపైనా తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇదే అదునుగా.. స్థానిక పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు.
ఈ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన సమయంలో నలుగురు నాయకులు అక్కడే ఉన్నారు. వారిని కూడా చితక బాదారు. ఈ పరిణామాలపై అప్పట్లోనే పోలీసులు కేసులు నమోదు చేసినా.. వైసీపీ హయాంలో ఈ కేసులు ముందుకు సాగలేదు. ఇక, టీడీపీ కూటమి సర్కారు వచ్చిన తర్వాత.. ఈ కేసు వేగవంతం అయింది. ఈ క్రమంలోనే వంశీ అనుచరులను అరెస్టు చేసిన పోలీసులు వంశీ పీఏ కోసం వెతులాట ప్రారంభించారు. గురువారం రాత్రి ఆయన తన స్నేహితుడి ఇంట్లో ఉన్నాడని తెలుసుకుని దాడి చేసి అరెస్టు చేశారు.
ఇక, ఈ పరిణామాలను గమనిస్తే.. మాజీ ఎమ్మెల్యే వంశీ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఆయనపై కూడా పోలీసులు కేసు నమోదు చేయొచ్చని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. పీఏ ఇచ్చే సమాచారం ఆధారంగా.. టీడీపీ ఆఫీసుపై దాడిని ఎవరు ప్రోత్సహించారన్న విషయంపై పోలీసులు కూపీ లాగి వంశీపైనా కేసు పెట్టవచ్చన్నది రాజకీయ వర్గాల మాట. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on December 6, 2024 2:10 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…