పుష్ప 2 ది రూల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు సంబంధించి సామ్ సిఎస్ పేరు టైటిల్ కార్డులో అడిషినల్ అని వేశారు కానీ ఇటీవలే ఒక ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 90 శాతం బిజిఎం తనదేనని చెప్పడం ఫ్యాన్స్ మధ్య చర్చకు దారి తీసింది. విడుదలకు రెండు వారాల నుంచే హాట్ టాపిక్ గా మారిన ఈ అంశంలోకి తమన్ పేరు రావడం, నేను ఫస్టాఫ్ కు పని చేశానని తను ఒక ఈవెంట్లో చెప్పడం రకరకాల ఊహాగానాలకు తెరలేపింది. ఫైనల్ గా దేవి, సామ్ మాత్రమే హైలైట్ అయ్యారు. పాటలు వేర్వేరుగా కంపోజ్ చేస్తే ఎవరు ఏ సాంగ్ అనేది గుర్తుపట్టొచ్చు. కానీ బిజిఎంకు అలా పసిగట్టడం సాధ్యం కాదు.
ఇంతకీ సామ్ సిఎస్ ఏమన్నాడో చూద్దాం. “నేను మాములుగా ఏ సినిమాకైనా పని చేస్తున్నప్పుడు స్క్రిప్ట్ మొత్తం చదువుతాను. కానీ పుష్ప 2 రేర్ కేసు. అలా కుదరలేదు. ఎందుకంటే ఎడిటింగ్ అయ్యాక నేను చేరాల్సి వచ్చింది. ఇలాంటి అనూహ్య పరిస్థితుల్లో చాలా పని ఒత్తిడి ఉంటుంది. నేను మొత్తం మూవీకి పని చేశాను. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం కొంత అలాగే ఉంచినప్పటికీ క్లైమాక్స్ తో సహా 90 శాతం నేను కంపోజ్ చేసిందే. నిర్మాణ సంస్థ త్వరగా పనులు పూర్తి చేసే ఉద్దేశంతో నన్ను తీసుకుంది. ఒక ప్రేక్షకుడిగా నేను ఇందులో భాగమై నా వంతుగా పుష్ప 2కి శాయశక్తులా బెస్ట్ ఇవ్వడానికి కష్టపడ్డాను.”
ఇదంతా సామ్ మాటల సారాంశం. దీనికి దేవి ఎలా స్పందిస్తాడనేది పక్కనపెడితే కిరణ్ అబ్బవరం ‘క’ సక్సెస్ లో కీలక పాత్ర పోషించిన సామ్ ఇప్పుడు పుష్ప 2కి వస్తున్న స్పందనలోనూ అంతే భాగం తీసుకుంటాడు. కాకపోతే దర్శకుడు సుకుమార్, నిర్మాతల వైపు నుంచి ఎక్కడా తన గురించి ప్రత్యేక ప్రస్తావన రాలేదు. దేవిశ్రీ ప్రసాద్ గురించే మాట్లాడారు తప్పించి సామ్ సిఎస్ ఇంత ఎక్కువ పని చేసింది మాత్రం చెప్పలేదు. కారణాలు ఏమైనా ఇన్నేళ్ల తర్వాత సరైన బ్రేక్ అందుకున్న ఈ యువ సంగీత దర్శకుడికి ఇప్పుడు ఆఫర్లు భారీగా వస్తున్నాయి. సోలోగా స్టార్ హీరో ప్రాజెక్ట్ పడితే కెరీర్ సెట్టు.
This post was last modified on December 6, 2024 2:20 pm
సౌత్ దర్శకుల్లో రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ తర్వాత అంతకన్నా తక్కువో ఎక్కువో స్టార్ డం తెచ్చుకున్న వాళ్లలో లోకేష్ కనగరాజ్…
ఇటీవలే జరిగిన ఒక ఈవెంట్ లో అమీర్ ఖాన్ మాట్లాడుతూ థియేటర్ ఓటిటి మధ్య ఇప్పుడున్న గ్యాప్ సరిపోదని నాలుగు…
రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాల ఇంచార్జ్లను మార్చనున్నట్లు వైసీపీ అధినేత జగన్ చెప్పారు. అయితే దీనికి కొంత సమయం పడుతుందన్నారు.…
పహల్ గాం ఉగ్రవాద దాడి తదనంతర పరిణామాల్లో భాగంగా మంగళవార తెల్లవారుజామున భారత త్రివిధ దళాలు పాకిస్తాన్ భూభాగంలోని ఆ దేశ…
టాలీవుడ్లో ఒకప్పుడు టాప్-4 హీరోల్లో ఒకడిగా ఒక వెలుగు వెలిగిన హీరో.. అక్కినేని నాగార్జున. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్లతో పోటాపోటీగా…
పహల్గామ్లో ఉగ్రదాడి అనంతరం.. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురైనా దేశ ప్రజలు…