Political News

‘పీఠాలు’ క‌దులుతున్నాయి.. జ‌గ‌నే ప‌ట్టించుకోలేదు!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ లైట్ తీసుకున్నారే కానీ.. ఇత‌ర వ‌ర్గాలు.. ముఖ్యంగా ప్ర‌జ‌లు మాత్రం చాలా సీరియ‌స్‌గానే తీసుకున్నారు. ఒక్క‌సారి రాజ‌ధానిని ఫిక్స్ చేయ‌డం.. అక్క‌డి రైతుల నుంచి భూములు తీసుకుని కొంత మేర‌కు ప్లాన్లు కూడా రెడీ చేసుకోవ‌డం, స‌చివాల‌యం, హైకోర్టు, శాస‌న స‌భ‌, మండ‌లి వంటివాటిని నిర్మించడం.. వంటివి ప్ర‌జ‌లు సీరియ‌స్‌గానే తీసుకున్నార‌న్న విష‌యం.. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో స్ప‌ష్టంగా తెలిసింది. అయితే.. జ‌గ‌నే ప్ర‌జ‌ల నాడిని తెలుసుకోలేక పోయారు.

రాజ‌ధాని నిర్మాణం కోసం.. అనేక మంది కానుక‌లు ఇచ్చారు. కొంద‌రు నిలువు దోపిడీ కూడా(ఒంటిపై ఉన్న బంగారాన్ని అప్ప‌టికిప్పుడు తీసి ఇవ్వ‌డం) ఇచ్చారు. మ‌హిళ‌లు తాము దాచుకున్న పుట్టింటి ఆస్తిలో కొంత భాగాన్ని ఇచ్చిన విష‌యం కూడా తెలిసిందే. ఇక‌, చిన్న పిల్ల‌లు కూడా.. పెద్ద ఎత్తున కిట్టీబ్యాంక్ సొమ్మును ఇచ్చారు. మ‌రికొంద‌రు త‌మ‌కు వ‌చ్చే సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌ను(4000)ను కూడా అందించారు. ఇలా.. రాజ‌ధానికి త‌మ వంతు సాయం చేసిన వారు ఉన్నారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇలా ప్ర‌జ‌లు త‌ర‌లి వ‌చ్చి.. ప్రాంతాల‌కు అతీతంగా.. విరాళాలు ఇస్తున్నారంటే ఏమ‌నుకోవాలి.. వారు బ‌లంగా రాజ‌ధాని అమ‌రావ‌తిని కోరుకుంటున్నార‌నే క‌దా!

ఇక‌, ఇప్పుడు తాజాగా ఏం జ‌రిగిందంటే.. రాజ‌కీయాల‌కు.. ఇలాంటి ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌కు కూడా క‌డు దూరంలో ఉండే.. మ‌ఠాలు కూడా.. రాజ‌ధాని బాగు కోరుకుంటున్నాయి. రాజ‌ధాని నిర్మాణానికి త‌ర‌లి వ‌స్తున్నాయి. తాజాగా క‌ర్నూలు జిల్లా మంత్రాల‌యానికి గురు రాఘ‌వేంద్ర మ‌ఠం.. రాజ‌ధానికి విరాళం ఇచ్చింది. రాఘ‌వేంద్ర మ‌ఠం అంటే.. ఆషామాషీ కాదు.. ఇన్నేళ్లలో ఒక్క ఆరోప‌ణ కానీ, ఒక్క నింద కానీ.. ఆ మ‌ఠంపై లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

అంతేకాదు.. రాజ‌కీయాల్లోకి అస‌లు ప్ర‌వేశం లేదు. ఎంత వ‌ర‌కు వ్య‌వ‌హ‌రించాలో అంత‌వ‌ర‌కే మ‌ఠం అనుస‌రిస్తుంది.. అవ‌స‌రం ఉన్న వ‌ర‌కే స్పందిస్తుంది. అలాంటి రాఘ‌వేంద్ర మ‌ఠం తాజాగా.. అమ‌రావ‌తి నిర్మాణానికి రూ.50 ల‌క్ష‌లు ఇచ్చింది. మ‌ఠం స్వామి సుబుదేంద్ర‌తీర్థులు తాజాగా సీఎం చంద్ర‌బాబును కలిసి.. విరాళాలు ఇచ్చారు.

అంతేకాదు.. అమ‌రావ‌తికి ఎలాంటి విఘ్నాలు లేకుండా.. ముందుకు సాగేందుకు త‌మ వంతు కృషి చేస్తామ‌ని కూడా చెప్పారు. అదేవిధంగా అహోబిలం మ‌ఠం కూడా అమ‌రావ‌తికి 50 ల‌క్ష‌లు ప్ర‌క‌టించింది. అయితే.. దీనిని త్వ‌ర‌లోనే అంద‌జేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. ఇలా.. రాజ‌కీయాల‌కు సంబంధం లేని మ‌ఠాలే రాజ‌ధాని కోసం క‌దులుతున్నాయంటే.. ఎంత ప్రాధాన్యం ఉందో.. జ‌గ‌న్ గుర్తించ‌లేక పోవ‌డం.. శోచ‌నీయం అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on December 6, 2024 10:57 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈసారి భోగి ముందుగానే వస్తుంది

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

26 minutes ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

47 minutes ago

నంది అవార్డులంటే అంత చులకనా

ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…

1 hour ago

నాని టార్గెట్ స్పష్టంగా ఉంది

నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…

2 hours ago

ప‌రిష్కారం దొరికేసిన‌ట్టేనా.. `బీసీ బాబు`..

ఏపీ సీఎం చంద్ర‌బాబు... `బీసీ బాబు`గా మార‌నున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న స‌మ‌స్య‌ను పరిష్క‌రించేందుకు న‌డుంబిగించారా? అంటే.. ఔన‌నే…

6 hours ago

మాట జారొద్దు: జ‌న‌సేనలో కీల‌క చ‌ర్చ.. !

జ‌న‌సేన పార్టీ నాయ‌కుల‌కు ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌, మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్‌.. కీల‌క విష‌యాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…

6 hours ago