షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. అల్లరి చేసే విద్యార్థులను మందలించటం టీచర్లు మామూలుగా చేసే పని. అలా చేయటమే ఒక టీచర్ ప్రాణాలు పోయేలా చేసింది. దీనికి ఏపీలోని అన్నమయ్య జిల్లా వేదికైంది. జిల్లాలోని రాయచోటికిలోని కొత్తపల్లి ఉర్దూ జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రవర్తన సరిగా లేని విద్యార్థులను మందలించిన టీచర్ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.
42 ఏళ్ల టీచర్ ఏజాష్ అహ్మద్ ఒక క్లాస్ లో పాఠాలు చెబుతున్నారు. పక్కనే ఉన్న తొమ్మిదో క్లాస్ పిల్లలు అల్లరి చేస్తున్నారు. దీంతో.. అక్కడకు వెళ్లిన ఏజాష్.. అల్లరి చేస్తున్న విద్యార్థుల్ని మందలించారు. మందలించిన విద్యార్థుల్లో ఇద్దరు కవలలు ఉన్నారు. వారిలో ఒకరు టీచర్ ఏజాష్ మీద దాడి చేశారు. దీంతో.. అతడి సోదరుడు.. మరో విద్యార్థి కూడా దాడికి పాల్పడ్డారు. విద్యార్థులు తనపై దాడి చేయటాన్ని తట్టుకోలేని టీచర్ తీవ్ర వేదనకు గురయ్యారు.
దీంతో కలుగజేసుకున్న ఇతర టీచర్లు.. దాడి చేసిన ముగ్గురు విద్యార్థుల చేత సారీ చెప్పే ప్రయత్నం చేశారు. అందుకు దాడికి గురైన అహ్మద్ సున్నితంగా తిరస్కరించారు. కాసేపటికి.. తీవ్రమైన మానసిక వేదనతో కూర్చున్న కుర్చీలోనే కుప్పకూలిపోయారు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లుగా వైద్యులు నిర్దారించారు. ఈ ఉదంతం షాకింగ్ గా మారింది. దీనిపై ఉన్నతాధికారులు ప్రాథమిక విచారణ చేపట్టి రిపోర్టు సిద్ధం చేశారు.
అందులో దాడికి పాల్పడిన పిల్లల ప్రవర్తన సరిగా ఉండదని.. గంజాయికి అలవాటు పడి ఉన్నారన్న విషయాన్ని గుర్తించినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. దాడి చేసిన కవలల్లో ఒకరి వద్ద కడియం ఉందని.. ఎవరైనా ఏమైనా అన్నంతనే ఆ కడియాన్ని చేతికి వేసుకొని దాడి చేస్తారని చెబుతున్నారు. టీచర్ పై దాడి సమయంలోనూ కడియాన్ని వాడారని చెబుతున్నారు. కడియం దెబ్బతో టీచర్ ఎడమ కన్ను వద్ద గాయమైనట్లుగా చెబుతున్నారు. మొత్తంగా మంచి బుద్ధులు నేర్పి.. క్రమశిక్షణ అలవాటు చేసేందుకు ప్రయత్నించిన టీచర్.. సదరు విద్యార్థుల చేతిలో దాడి.. ఆ తర్వాత ప్రాణాలు కోల్పోవటం ఇప్పుడు సంచలనంగా మారింది.
This post was last modified on December 6, 2024 11:59 am
అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…
కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…
యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…
వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…
కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…
కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ సర్పంచ్ కారును బీజేపీ కార్యకర్తలు…