వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్పై ఏపీ మంత్రి పొంగూరు నారాయణ నిప్పులు చెరిగారు. అధికారంలో ఉండగా జగన్ చేసిన పనులతో తాము ఇప్పుడు తలెత్తుకోలేక పోతున్నామని ఆయన మండిపడ్డారు. తాజాగా సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీ అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉండీ.. ఆయన తిప్పలు పెట్టాడు. ఇప్పుడు అధికారం పోయాక కూడా తిప్పలు పెడుతున్నాడు. ఆయన వల్ల మేం తలెత్తుకోలేక పోతున్నాం. ప్రజలకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు అని నారాయణ వ్యాఖ్యానించారు.
ఐదేళ్లపాటు అమరావతిని నాశనం చేశారని.. దీని వల్ల 5 వేల కోట్ల రూపాయల అదనపు నష్టం వాటిల్లుతోందని మంత్రి తెలిపారు. దీనికిసంబంధించి ఆయన పలు లెక్కలు చెప్పుకొచ్చారు. రాజధానిలో 2015-18 మధ్య జరిగిన పనులను వైసీపీ వచ్చాక నిలిపి వేశారని.. దీని వల్ల కొన్ని నిర్మాణాల నాణ్యత దెబ్బతిందని.. ఫలితంగా వందల కోట్ల నష్టం వచ్చిందన్నారు. ఇక, అప్పట్లో టెండర్లు దక్కించుకున్న వారు వెళ్లిపోయారని, ఇప్పుడు కొత్తగా టెండర్లు పిలుస్తున్నామని దీని వల్ల కూడా వందల కోట్ల రూపాయల భారం పెరిగిందన్నారు. అలాగే.. రహదారులు తవ్వేశారని, కాలువలు తెగ్గొట్టారని, దీంతో మరికొన్ని వందల కోట్ల నష్టం వచ్చిందన్నారు.
“ఇవన్నీ చెప్పాలంటే నోరు రావడం లేదు. ఎంత విధ్వంసం చేయాలో అంతా చేశారు. ఇప్పుడు ఇవన్నీ చెబితే.. అతిగా చెప్పినట్టు ఉంటుందని అంటున్నారు. కానీ, నష్టాలు వందలు కాదు వేల కొట్ల రూపాయల్లో ఉన్నాయి. ఎవరు తిన్నట్టు? ఇదంతా ప్రజా ధనం. ఎంతో జాగ్రత్తగా ఖర్చు పెట్టాలని అనుకుంటున్నాం” అని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. డిసెంబరు చివరి వారంలో టెండర్లు పిలుస్తున్నట్టు తెలిపారు. జనవరి నుంచి కొత్తగా టెండర్లు దక్కించుకున్నవారు రాజధాని పనులు ప్రారంభిస్తారని తెలిపారు. 11 వేల కోట్ల రూపాయలను ప్రస్తుతం కేటాయించామని.. పనులు వేగంగా ప్రారంభమయ్యాక సమీక్షించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఇవీ.. జగన్ తెచ్చిన నష్టాలు..
This post was last modified on December 4, 2024 12:15 am
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…