Political News

జ‌గ‌న్ చేసిన ప‌నుల‌తో త‌లెత్తుకోలేక పోతున్నాం.. : మంత్రి

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌పై ఏపీ మంత్రి పొంగూరు నారాయ‌ణ నిప్పులు చెరిగారు. అధికారంలో ఉండ‌గా జ‌గ‌న్ చేసిన ప‌నుల‌తో తాము ఇప్పుడు త‌లెత్తుకోలేక పోతున్నామ‌ని ఆయ‌న మండిప‌డ్డారు. తాజాగా సీఎం చంద్ర‌బాబు నేతృత్వంలో జ‌రిగిన కేబినెట్ భేటీ అనంత‌రం మంత్రి మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉండీ.. ఆయ‌న తిప్పలు పెట్టాడు. ఇప్పుడు అధికారం పోయాక కూడా తిప్ప‌లు పెడుతున్నాడు. ఆయ‌న వ‌ల్ల మేం త‌లెత్తుకోలేక పోతున్నాం. ప్ర‌జ‌ల‌కు ఏం చెప్పాలో అర్థం కావ‌డం లేదు అని నారాయ‌ణ వ్యాఖ్యానించారు.

ఐదేళ్ల‌పాటు అమ‌రావ‌తిని నాశ‌నం చేశార‌ని.. దీని వ‌ల్ల 5 వేల కోట్ల రూపాయ‌ల అద‌న‌పు న‌ష్టం వాటిల్లుతోంద‌ని మంత్రి తెలిపారు. దీనికిసంబంధించి ఆయ‌న ప‌లు లెక్క‌లు చెప్పుకొచ్చారు. రాజ‌ధానిలో 2015-18 మ‌ధ్య జ‌రిగిన ప‌నుల‌ను వైసీపీ వ‌చ్చాక నిలిపి వేశార‌ని.. దీని వ‌ల్ల కొన్ని నిర్మాణాల నాణ్య‌త దెబ్బ‌తింద‌ని.. ఫ‌లితంగా వంద‌ల కోట్ల న‌ష్టం వ‌చ్చింద‌న్నారు. ఇక‌, అప్ప‌ట్లో టెండర్లు ద‌క్కించుకున్న వారు వెళ్లిపోయార‌ని, ఇప్పుడు కొత్త‌గా టెండ‌ర్లు పిలుస్తున్నామ‌ని దీని వల్ల కూడా వంద‌ల కోట్ల రూపాయ‌ల భారం పెరిగింద‌న్నారు. అలాగే.. ర‌హ‌దారులు త‌వ్వేశార‌ని, కాలువ‌లు తెగ్గొట్టార‌ని, దీంతో మ‌రికొన్ని వంద‌ల కోట్ల న‌ష్టం వ‌చ్చింద‌న్నారు.

“ఇవ‌న్నీ చెప్పాలంటే నోరు రావ‌డం లేదు. ఎంత విధ్వంసం చేయాలో అంతా చేశారు. ఇప్పుడు ఇవ‌న్నీ చెబితే.. అతిగా చెప్పిన‌ట్టు ఉంటుంద‌ని అంటున్నారు. కానీ, న‌ష్టాలు వంద‌లు కాదు వేల కొట్ల రూపాయ‌ల్లో ఉన్నాయి. ఎవ‌రు తిన్న‌ట్టు? ఇదంతా ప్ర‌జా ధ‌నం. ఎంతో జాగ్ర‌త్త‌గా ఖ‌ర్చు పెట్టాల‌ని అనుకుంటున్నాం” అని మంత్రి నారాయ‌ణ వ్యాఖ్యానించారు. డిసెంబ‌రు చివ‌రి వారంలో టెండ‌ర్లు పిలుస్తున్న‌ట్టు తెలిపారు. జ‌న‌వ‌రి నుంచి కొత్త‌గా టెండ‌ర్లు ద‌క్కించుకున్న‌వారు రాజ‌ధాని ప‌నులు ప్రారంభిస్తార‌ని తెలిపారు. 11 వేల కోట్ల రూపాయ‌ల‌ను ప్ర‌స్తుతం కేటాయించామ‌ని.. ప‌నులు వేగంగా ప్రారంభ‌మ‌య్యాక సమీక్షించి నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు.

ఇవీ.. జ‌గ‌న్ తెచ్చిన న‌ష్టాలు..

  • అమరావతిలో నిర్మించిన భ‌వ‌నాలు బ‌ల‌హీన‌ప‌డ‌డంతో రూ.286 కోట్ల మేర నష్టం.
  • రాజ‌ధానిలో రోడ్డు త‌వ్వేసిన కార‌ణంగా వ‌చ్చిన న‌ష్టం రూ.150 కోట్లు.
  • పాత టెండ‌ర్లు పోయి.. కొత్త‌గా పిలుస్తున్నందున పెర‌గే భారం రూ.452 కోట్లు.
  • టెండర్ల ద్వారా పనుల విలువ రూ.2,507 కోట్ల మేర అద‌నంగా పెరిగింది.
  • రాజ‌ధానిలో ట్రంక్ రోడ్ల నిర్మాణానికి రూ.461 కోట్ల మేర ధర పెరిగింది.

This post was last modified on December 4, 2024 12:15 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబు, లోకేష్… సొంతూరికి వెళ్తూ స‌మ‌స్య‌ల‌పై దృష్టి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల‌ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…

4 hours ago

జిల్లాల విషయంలో తగ్గేదేలే అంటున్న రేవంత్

రాష్ట్రంలో అభివృద్ది చేసే విష‌యంలో ఎవ‌రు ఎన్ని విధాల అడ్డు ప‌డినా.. తాము ముందుకు సాగుతామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్…

6 hours ago

బడ్జెట్ 2026: అప్పులు తగ్గేలా నిర్మలమ్మ ప్లాన్

2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…

8 hours ago

టీమ్ ఇండియాలోకి కొత్త కుర్రాడు

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…

8 hours ago

ఒక్క సెలవు కూడా తీసుకొని సీఎం

ప్ర‌జ‌ల కోసం తాను ఒక్క‌రోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా ప‌నిచేస్తున్న‌ట్టు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ…

10 hours ago

సమస్య చిన్నదయినా, పెద్దదయినా పవన్ కు ఒకటే

సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…

12 hours ago