Political News

జ‌గ‌న్ చేసిన ప‌నుల‌తో త‌లెత్తుకోలేక పోతున్నాం.. : మంత్రి

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌పై ఏపీ మంత్రి పొంగూరు నారాయ‌ణ నిప్పులు చెరిగారు. అధికారంలో ఉండ‌గా జ‌గ‌న్ చేసిన ప‌నుల‌తో తాము ఇప్పుడు త‌లెత్తుకోలేక పోతున్నామ‌ని ఆయ‌న మండిప‌డ్డారు. తాజాగా సీఎం చంద్ర‌బాబు నేతృత్వంలో జ‌రిగిన కేబినెట్ భేటీ అనంత‌రం మంత్రి మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉండీ.. ఆయ‌న తిప్పలు పెట్టాడు. ఇప్పుడు అధికారం పోయాక కూడా తిప్ప‌లు పెడుతున్నాడు. ఆయ‌న వ‌ల్ల మేం త‌లెత్తుకోలేక పోతున్నాం. ప్ర‌జ‌ల‌కు ఏం చెప్పాలో అర్థం కావ‌డం లేదు అని నారాయ‌ణ వ్యాఖ్యానించారు.

ఐదేళ్ల‌పాటు అమ‌రావ‌తిని నాశ‌నం చేశార‌ని.. దీని వ‌ల్ల 5 వేల కోట్ల రూపాయ‌ల అద‌న‌పు న‌ష్టం వాటిల్లుతోంద‌ని మంత్రి తెలిపారు. దీనికిసంబంధించి ఆయ‌న ప‌లు లెక్క‌లు చెప్పుకొచ్చారు. రాజ‌ధానిలో 2015-18 మ‌ధ్య జ‌రిగిన ప‌నుల‌ను వైసీపీ వ‌చ్చాక నిలిపి వేశార‌ని.. దీని వ‌ల్ల కొన్ని నిర్మాణాల నాణ్య‌త దెబ్బ‌తింద‌ని.. ఫ‌లితంగా వంద‌ల కోట్ల న‌ష్టం వ‌చ్చింద‌న్నారు. ఇక‌, అప్ప‌ట్లో టెండర్లు ద‌క్కించుకున్న వారు వెళ్లిపోయార‌ని, ఇప్పుడు కొత్త‌గా టెండ‌ర్లు పిలుస్తున్నామ‌ని దీని వల్ల కూడా వంద‌ల కోట్ల రూపాయ‌ల భారం పెరిగింద‌న్నారు. అలాగే.. ర‌హ‌దారులు త‌వ్వేశార‌ని, కాలువ‌లు తెగ్గొట్టార‌ని, దీంతో మ‌రికొన్ని వంద‌ల కోట్ల న‌ష్టం వ‌చ్చింద‌న్నారు.

“ఇవ‌న్నీ చెప్పాలంటే నోరు రావ‌డం లేదు. ఎంత విధ్వంసం చేయాలో అంతా చేశారు. ఇప్పుడు ఇవ‌న్నీ చెబితే.. అతిగా చెప్పిన‌ట్టు ఉంటుంద‌ని అంటున్నారు. కానీ, న‌ష్టాలు వంద‌లు కాదు వేల కొట్ల రూపాయ‌ల్లో ఉన్నాయి. ఎవ‌రు తిన్న‌ట్టు? ఇదంతా ప్ర‌జా ధ‌నం. ఎంతో జాగ్ర‌త్త‌గా ఖ‌ర్చు పెట్టాల‌ని అనుకుంటున్నాం” అని మంత్రి నారాయ‌ణ వ్యాఖ్యానించారు. డిసెంబ‌రు చివ‌రి వారంలో టెండ‌ర్లు పిలుస్తున్న‌ట్టు తెలిపారు. జ‌న‌వ‌రి నుంచి కొత్త‌గా టెండ‌ర్లు ద‌క్కించుకున్న‌వారు రాజ‌ధాని ప‌నులు ప్రారంభిస్తార‌ని తెలిపారు. 11 వేల కోట్ల రూపాయ‌ల‌ను ప్ర‌స్తుతం కేటాయించామ‌ని.. ప‌నులు వేగంగా ప్రారంభ‌మ‌య్యాక సమీక్షించి నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు.

ఇవీ.. జ‌గ‌న్ తెచ్చిన న‌ష్టాలు..

  • అమరావతిలో నిర్మించిన భ‌వ‌నాలు బ‌ల‌హీన‌ప‌డ‌డంతో రూ.286 కోట్ల మేర నష్టం.
  • రాజ‌ధానిలో రోడ్డు త‌వ్వేసిన కార‌ణంగా వ‌చ్చిన న‌ష్టం రూ.150 కోట్లు.
  • పాత టెండ‌ర్లు పోయి.. కొత్త‌గా పిలుస్తున్నందున పెర‌గే భారం రూ.452 కోట్లు.
  • టెండర్ల ద్వారా పనుల విలువ రూ.2,507 కోట్ల మేర అద‌నంగా పెరిగింది.
  • రాజ‌ధానిలో ట్రంక్ రోడ్ల నిర్మాణానికి రూ.461 కోట్ల మేర ధర పెరిగింది.

This post was last modified on December 4, 2024 12:15 am

Share

Recent Posts

కూతురికి ప్లాపొచ్చినా తల్లికి హిట్టు దక్కింది

గత నెల చివరి వారంలో వచ్చిన శ్రీనివాస మంగాపురం ప్రేక్షకులకు గుర్తే. ఘట్టమనేని మూడో తరం వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన…

6 minutes ago

సంక్రాంతికి అప్పుడే హౌస్ ఫుల్ బోర్డు

టాలీవుడ్లో అత్యంత డిమాండ్ ఉండే షార్ట్ సీజన్.. సంక్రాంతి. ఈ టైంలో వచ్చే సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే వసూళ్ల మోత…

1 hour ago

‘విక్రమ్ వేద’ డైరెక్టర్లు… ఆగిన చిరు సినిమాలో

గత దశాబ్ద కాలంలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చిన బెస్ట్ థ్రిల్లర్ సినిమాల్లో ‘విక్రమ్ వేద’ ఒకటి. వినూత్నమైన కథ..…

2 hours ago

విశాల్ నుంచి ఇలాంటి సినిమా ఊహించలేదు

కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే విశాల్ అంటే తమిళంలోనే కాదు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉండేది. పందెం కోడి,…

2 hours ago

డిసి 100 కోట్ల లక్ష్యానికి విశ్వనాథ్ బ్రేక్ ?

గత వారం విడుదలైన డిసికి ముందు రోజు వరకు పెద్దగా అంచనాలు లేవు. లోకేష్ కనగరాజ్ దర్శకుడిగా ఎంత ఫాలోయింగ్…

4 hours ago

ఆగస్ట్ 15 మిలమిల… థియేటర్లు కళకళ

నిన్న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వచ్చిన నేషనల్ హాలిడే బాక్సాఫీస్ కు సూపర్ గా కలిసి వచ్చింది. మాములుగానే వీకెండ్…

4 hours ago