Political News

జ‌గ‌న్ చేసిన ప‌నుల‌తో త‌లెత్తుకోలేక పోతున్నాం.. : మంత్రి

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌పై ఏపీ మంత్రి పొంగూరు నారాయ‌ణ నిప్పులు చెరిగారు. అధికారంలో ఉండ‌గా జ‌గ‌న్ చేసిన ప‌నుల‌తో తాము ఇప్పుడు త‌లెత్తుకోలేక పోతున్నామ‌ని ఆయ‌న మండిప‌డ్డారు. తాజాగా సీఎం చంద్ర‌బాబు నేతృత్వంలో జ‌రిగిన కేబినెట్ భేటీ అనంత‌రం మంత్రి మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉండీ.. ఆయ‌న తిప్పలు పెట్టాడు. ఇప్పుడు అధికారం పోయాక కూడా తిప్ప‌లు పెడుతున్నాడు. ఆయ‌న వ‌ల్ల మేం త‌లెత్తుకోలేక పోతున్నాం. ప్ర‌జ‌ల‌కు ఏం చెప్పాలో అర్థం కావ‌డం లేదు అని నారాయ‌ణ వ్యాఖ్యానించారు.

ఐదేళ్ల‌పాటు అమ‌రావ‌తిని నాశ‌నం చేశార‌ని.. దీని వ‌ల్ల 5 వేల కోట్ల రూపాయ‌ల అద‌న‌పు న‌ష్టం వాటిల్లుతోంద‌ని మంత్రి తెలిపారు. దీనికిసంబంధించి ఆయ‌న ప‌లు లెక్క‌లు చెప్పుకొచ్చారు. రాజ‌ధానిలో 2015-18 మ‌ధ్య జ‌రిగిన ప‌నుల‌ను వైసీపీ వ‌చ్చాక నిలిపి వేశార‌ని.. దీని వ‌ల్ల కొన్ని నిర్మాణాల నాణ్య‌త దెబ్బ‌తింద‌ని.. ఫ‌లితంగా వంద‌ల కోట్ల న‌ష్టం వ‌చ్చింద‌న్నారు. ఇక‌, అప్ప‌ట్లో టెండర్లు ద‌క్కించుకున్న వారు వెళ్లిపోయార‌ని, ఇప్పుడు కొత్త‌గా టెండ‌ర్లు పిలుస్తున్నామ‌ని దీని వల్ల కూడా వంద‌ల కోట్ల రూపాయ‌ల భారం పెరిగింద‌న్నారు. అలాగే.. ర‌హ‌దారులు త‌వ్వేశార‌ని, కాలువ‌లు తెగ్గొట్టార‌ని, దీంతో మ‌రికొన్ని వంద‌ల కోట్ల న‌ష్టం వ‌చ్చింద‌న్నారు.

“ఇవ‌న్నీ చెప్పాలంటే నోరు రావ‌డం లేదు. ఎంత విధ్వంసం చేయాలో అంతా చేశారు. ఇప్పుడు ఇవ‌న్నీ చెబితే.. అతిగా చెప్పిన‌ట్టు ఉంటుంద‌ని అంటున్నారు. కానీ, న‌ష్టాలు వంద‌లు కాదు వేల కొట్ల రూపాయ‌ల్లో ఉన్నాయి. ఎవ‌రు తిన్న‌ట్టు? ఇదంతా ప్ర‌జా ధ‌నం. ఎంతో జాగ్ర‌త్త‌గా ఖ‌ర్చు పెట్టాల‌ని అనుకుంటున్నాం” అని మంత్రి నారాయ‌ణ వ్యాఖ్యానించారు. డిసెంబ‌రు చివ‌రి వారంలో టెండ‌ర్లు పిలుస్తున్న‌ట్టు తెలిపారు. జ‌న‌వ‌రి నుంచి కొత్త‌గా టెండ‌ర్లు ద‌క్కించుకున్న‌వారు రాజ‌ధాని ప‌నులు ప్రారంభిస్తార‌ని తెలిపారు. 11 వేల కోట్ల రూపాయ‌ల‌ను ప్ర‌స్తుతం కేటాయించామ‌ని.. ప‌నులు వేగంగా ప్రారంభ‌మ‌య్యాక సమీక్షించి నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు.

ఇవీ.. జ‌గ‌న్ తెచ్చిన న‌ష్టాలు..

  • అమరావతిలో నిర్మించిన భ‌వ‌నాలు బ‌ల‌హీన‌ప‌డ‌డంతో రూ.286 కోట్ల మేర నష్టం.
  • రాజ‌ధానిలో రోడ్డు త‌వ్వేసిన కార‌ణంగా వ‌చ్చిన న‌ష్టం రూ.150 కోట్లు.
  • పాత టెండ‌ర్లు పోయి.. కొత్త‌గా పిలుస్తున్నందున పెర‌గే భారం రూ.452 కోట్లు.
  • టెండర్ల ద్వారా పనుల విలువ రూ.2,507 కోట్ల మేర అద‌నంగా పెరిగింది.
  • రాజ‌ధానిలో ట్రంక్ రోడ్ల నిర్మాణానికి రూ.461 కోట్ల మేర ధర పెరిగింది.

This post was last modified on December 4, 2024 12:15 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రావణుడిని అంత గొప్పగా చూపించగలరా

ఇటీవలే విడుదలైన రామాయణ పార్ట్ 1 టీజర్ మీద మిశ్రమ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ఫీడ్…

2 hours ago

బ్రేకింగ్: లిక్కర్ కేసులో ఏ1 రాజ్ కేసిరెడ్డికి బెయిల్

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు…

2 hours ago

డెకాయిట్ అంచనాల మీటర్ ఎలా ఉంది

ఇంకో మూడు రోజుల్లో డెకాయిట్ థియేటర్లలో అడుగు పెట్టేస్తాడు. హైదరాబాద్ లాంటి మెయిన్ సెంటర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. టికెట్ల…

3 hours ago

ఈసీని విపక్షాలు ఏం చెయ్యలేవా?

కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్.. జ్ఞానేష్ కుమార్ సేఫ్ అయ్యారు. ఆయ‌న‌పై కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని విప‌క్షాలు ఇచ్చిన…

4 hours ago

ఒంట‌రి పోరు వెనుక `విజ‌య్‌` ర‌హ‌స్యం బయటపడిందా?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఒంటరి పోరుకు సిద్ధమైన ప్రముఖ నటుడు దళపతి విజయ్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు పరిశీలకులు…

4 hours ago

బైకర్ స్పీడ్ ఇంకా పెరగాలి

శర్వానంద్ హీరోగా అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన బైకర్ తొలి రెండు రోజులు నెమ్మదిగానే నడిచింది. టాక్ స్లోగా ఉండటం,…

4 hours ago