వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్పై ఏపీ మంత్రి పొంగూరు నారాయణ నిప్పులు చెరిగారు. అధికారంలో ఉండగా జగన్ చేసిన పనులతో తాము ఇప్పుడు తలెత్తుకోలేక పోతున్నామని ఆయన మండిపడ్డారు. తాజాగా సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీ అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉండీ.. ఆయన తిప్పలు పెట్టాడు. ఇప్పుడు అధికారం పోయాక కూడా తిప్పలు పెడుతున్నాడు. ఆయన వల్ల మేం తలెత్తుకోలేక పోతున్నాం. ప్రజలకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు అని నారాయణ వ్యాఖ్యానించారు.
ఐదేళ్లపాటు అమరావతిని నాశనం చేశారని.. దీని వల్ల 5 వేల కోట్ల రూపాయల అదనపు నష్టం వాటిల్లుతోందని మంత్రి తెలిపారు. దీనికిసంబంధించి ఆయన పలు లెక్కలు చెప్పుకొచ్చారు. రాజధానిలో 2015-18 మధ్య జరిగిన పనులను వైసీపీ వచ్చాక నిలిపి వేశారని.. దీని వల్ల కొన్ని నిర్మాణాల నాణ్యత దెబ్బతిందని.. ఫలితంగా వందల కోట్ల నష్టం వచ్చిందన్నారు. ఇక, అప్పట్లో టెండర్లు దక్కించుకున్న వారు వెళ్లిపోయారని, ఇప్పుడు కొత్తగా టెండర్లు పిలుస్తున్నామని దీని వల్ల కూడా వందల కోట్ల రూపాయల భారం పెరిగిందన్నారు. అలాగే.. రహదారులు తవ్వేశారని, కాలువలు తెగ్గొట్టారని, దీంతో మరికొన్ని వందల కోట్ల నష్టం వచ్చిందన్నారు.
“ఇవన్నీ చెప్పాలంటే నోరు రావడం లేదు. ఎంత విధ్వంసం చేయాలో అంతా చేశారు. ఇప్పుడు ఇవన్నీ చెబితే.. అతిగా చెప్పినట్టు ఉంటుందని అంటున్నారు. కానీ, నష్టాలు వందలు కాదు వేల కొట్ల రూపాయల్లో ఉన్నాయి. ఎవరు తిన్నట్టు? ఇదంతా ప్రజా ధనం. ఎంతో జాగ్రత్తగా ఖర్చు పెట్టాలని అనుకుంటున్నాం” అని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. డిసెంబరు చివరి వారంలో టెండర్లు పిలుస్తున్నట్టు తెలిపారు. జనవరి నుంచి కొత్తగా టెండర్లు దక్కించుకున్నవారు రాజధాని పనులు ప్రారంభిస్తారని తెలిపారు. 11 వేల కోట్ల రూపాయలను ప్రస్తుతం కేటాయించామని.. పనులు వేగంగా ప్రారంభమయ్యాక సమీక్షించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఇవీ.. జగన్ తెచ్చిన నష్టాలు..
This post was last modified on December 4, 2024 12:15 am
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తొలి గంటలో ఆసక్తికర…
తమిళనాడు ఎన్నికల ముంగిట రాజకీయాలతో సంబంధం లేని ఒక వ్యక్తి పేరు బాగా చర్చనీయాంశం అయిందే. ఆ పేరు ఇంకేదో…
ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ ఏర్పడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా పశ్చిమ…
గత శుక్రవారం జెట్లీ అనే సినిమా రిలీజైంది. అది కమెడియన్ సత్య హీరోగా పరిచయం అయిన సినిమా. అయినా సరే..…
ఒకప్పుడు తెలుగు సినిమాల మీద తమిళ చిత్రాలు స్పష్టమైన ఆధిపత్యం చూపించేవి. అక్కడ ఎంతోమంది మేటి దర్శకులు ఉండేవాళ్లు. కొత్త…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరో టెస్ట్ ఎదురు కానుందా? మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం చూస్తున్న నేపథ్యంలో ఆయన ఎవరిని…