అదానీతో విద్యుత్ ఒప్పందం, లంచం వ్యవహారాలపై ఏపీ మాజీ సీఎం జగన్ స్పందించిన సంగతి తెలిసిందే. ఆ ఒప్పందం రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న సెకీకి మధ్య జరిగిందని జగన్ అన్నారు. తక్కువ ధరకే విద్యుత్ కొన్న తనను పొగిడి శాలువా కప్పి అవార్డు ఇవ్వాల్సింది పోయి అభాండాలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే జగన్ కు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు. అదానీ వల్ల ఆర్థికంగా లబ్ధి పొందలేదు అని బైబిల్ మీద ప్రమాణం చేసే దమ్ముందా అని జగన్ కు షర్మిల సవాల్ విసిరారు.
అబద్ధాలను అందంగా అల్లడంలో జగన్ గారికి ఆస్కార్ అవార్డు ఇచ్చి శాలువా కప్పాలని సెటైర్లు వేశారు. శాలువలు, సన్మానాలు, అవార్డులు కోరుకొనే ముందు జగన్ గారు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. రూ 2.49 పైసలకు యూనిట్ కొనే సమయంలో సెకీ అమ్ముతోన్న విద్యుత్ గరిష్ట ధర రూ.2.16 అని, ఎక్కువ పెట్టి కొన్నందుకు శాలువలు కప్పాలా? అని ప్రశ్నించారు. గుజరాత్ యూనిట్ రూ 1.99 పైసలకే యూనిట్ కొన్న సమయంలో 50పైసలు ఎక్కువ పెట్టి ఏపీ కొన్నందుకు సన్మానం చేయాలా అని నిలదీశారు.
ఏ రాష్ట్రం అదానీతో ఒప్పందానికి ముందుకు రాని సమయంలో ఆఘమేఘాల మీద ఏపీ ఒప్పందం చేసుకుందని, అందుకు జగన్ కు అవార్డులు ఇవ్వాలా ? అని ఎద్దేవా చేశారు. ట్రాన్స్మిషన్ ఛార్జీలు గరిష్ఠంగా యూనిట్ కు రూ.1.70 పైసలు పడతాయని ఇంధన శాఖ చెబుతోందని, ఎటువంటి ఛార్జీలు లేవని జగన్ చెబుతున్న మాటలు శుద్ధ అబద్ధం కాదా? అని నిలదీశారు. ఒక ముఖ్యమంత్రిని ఒక వ్యాపారవేత్త అధికారికంగా కలిస్తే గోప్యత ఎందుకు పాటించారో చెప్పాలని ప్రశ్నించారు.
అదానీతో జగన్ ఒప్పందం అంతర్జాతీయ స్కామ్ అని,1750 కోట్లు సీఎంకు ముడుపులు ఇవ్వడం చరిత్ర అని అన్నారు. అదానీ కోసం అన్ని టెండర్లు రద్దు చేయడం, అర్ధరాత్రి ఫైళ్లు పంపడం, హడావిడిగా కేబినెట్ లో ఆమోదింపజేయడం చరిత్ర అని చురకలంటించారు. ఒక వ్యక్తి ప్రయోజనాల కోసం రూ.1.67 లక్షల కోట్ల భారాన్ని జనంపై మోపడం చరిత్ర అని అన్నారు. 2021లో ఏపీ చీఫ్ మినిస్టర్ కు లంచం ఇచ్చారని అమెరికా దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయని, ఆనాడు సీఎం మీరు కారా, ఇదేం ఆఫ్ బేస్ట్ నాలెడ్జ్ ? ఇదేం అహంకారపు తిరస్కరణ సమాధానం..? అని ఎద్దేవా చేశారు. అదానీ వల్ల ఆర్థికంగా లబ్ధి పొందలేదు అని బైబిల్ మీద ప్రమాణం చేసే దమ్ముందా అని షర్మిల సవాల్ విసిరారు. మరి, షర్మిల సవాల్ ను జగన్ స్వీకరిస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది.
This post was last modified on November 29, 2024 2:17 pm
సౌత్ లో అతి పెద్ద నిర్మాణ సంస్థగా ఎదగాలని ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్. మూలాలు కర్ణాటకనే…
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంకేతికత సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. టీవీకే అధినేత విజయ్ ప్రత్యక్షంగా అన్ని నియోజకవర్గాలను సందర్శించడం కష్టంగా…
ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టిక చూస్తుంటే రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి 'రాజసం' ఉట్టిపడేలా ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ గెలిచి…
ఇండస్ట్రీకి లీకులు కొత్త కాదు. నిన్నటికి నిన్న జన నాయగన్ సినిమానే బయటికొచ్చింది. పైరసీని కట్టడి చేశారు కానీ భారీ…
అదేంటో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు దర్శకుల మార్పు పెద్ద తలనెప్పిగా మారిపోయింది. అయన, కమల్ హాసన్ కలిసి నటించే…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ ఈనెల 23న జరగనుంది. అంటే పది రోజుల్లో ప్రజలు తమ ఓటు ద్వారా ప్రభుత్వాన్ని…