సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డిపై వైఎస్ జగన్ హయాంలో తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. జగన్ మెప్పు పొందేందుకు ఉద్యోగుల ప్రయోజనాలను ఆయన తాకట్టు పెట్టారని ప్రతిపక్షాలు విమర్శించాయి. ఇక, వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా వెంకట్రామిరెడ్డి తన హవా సాగించాలని చూస్తున్నారు. సచివాలయ ఉద్యోగులను మద్యం ఇచ్చి ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించిన వెంకట్రామిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.
త్వరలో జరగబోతోన్న సచివాలయ ఉద్యోగుల క్యాంటీన్ డైరెక్టర్ పదవులు దక్కించునేందుకు వెంకట్రామిరెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మందు, విందు ఇచ్చే క్రమంలో ఆయన అడ్డంగా బుక్కయ్యారు. వెంకట్రామి రెడ్డి, పలువురు ఉద్యోగులు అనుమతి లేకుండా మద్యం సరఫరా చేశారని ఎక్సైజ్ శాఖ పోలీసులకు సమాచారం అందింది.
దీంతో, తాడేపల్లిలోని కొండపావులూరి గార్డెన్లో ఉద్యోగులకు వెంకట్రామిరెడ్డి ఇస్తున్న మందు పార్టీపై పోలీసులు దాడి చేసి వెంకట్రామిరెడ్డిని అర్థరాత్రి అరెస్టు చేశారు. ఉద్యోగులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీంతో, వెంకట్రామిరెడ్డి ఏమిటీ పాడుపని అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
This post was last modified on November 29, 2024 2:16 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…