సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డిపై వైఎస్ జగన్ హయాంలో తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. జగన్ మెప్పు పొందేందుకు ఉద్యోగుల ప్రయోజనాలను ఆయన తాకట్టు పెట్టారని ప్రతిపక్షాలు విమర్శించాయి. ఇక, వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా వెంకట్రామిరెడ్డి తన హవా సాగించాలని చూస్తున్నారు. సచివాలయ ఉద్యోగులను మద్యం ఇచ్చి ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించిన వెంకట్రామిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.
త్వరలో జరగబోతోన్న సచివాలయ ఉద్యోగుల క్యాంటీన్ డైరెక్టర్ పదవులు దక్కించునేందుకు వెంకట్రామిరెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మందు, విందు ఇచ్చే క్రమంలో ఆయన అడ్డంగా బుక్కయ్యారు. వెంకట్రామి రెడ్డి, పలువురు ఉద్యోగులు అనుమతి లేకుండా మద్యం సరఫరా చేశారని ఎక్సైజ్ శాఖ పోలీసులకు సమాచారం అందింది.
దీంతో, తాడేపల్లిలోని కొండపావులూరి గార్డెన్లో ఉద్యోగులకు వెంకట్రామిరెడ్డి ఇస్తున్న మందు పార్టీపై పోలీసులు దాడి చేసి వెంకట్రామిరెడ్డిని అర్థరాత్రి అరెస్టు చేశారు. ఉద్యోగులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీంతో, వెంకట్రామిరెడ్డి ఏమిటీ పాడుపని అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
This post was last modified on November 29, 2024 2:16 pm
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…
ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…
ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా దశాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన కథానాయిక సమంత. కానీ కొన్నేళ్లుగా…
సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…