Political News

‘కూట‌మి’ ఎంపీలకు ప‌వ‌న్ విందు.. 108 ర‌కాల వంట‌కాలు!

జ‌న‌సేన అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..తాజాగా ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న విష‌యం తెలిసిం దే. మంగ‌ళ‌వారం ఢిల్లీకి వెళ్లిన ఆయ‌న వ‌రుస‌గా కేంద్ర మంత్రుల‌తో భేటీ అయ్యారు. రాష్ట్ర స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించారు. నిధులు, నీళ్లు స‌హా అనేక విష‌యాల‌ను వారి దృష్టికి తీసుకువెళ్లారు. వాటిని సాధించేందుకు ప్ర‌య‌త్నించారు. బుధ‌వారం పార్ల‌మెంటు భ‌వ‌న్‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతోనూ ప‌వ‌న్ భేటీ అయ్యారు. అనంత‌రం.. మ‌రికొంద‌రు కేంద్ర మంత్ర‌లతోనూ భేటీ అయ్యారు.

అయితే.. బుధ‌వారం రాత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. రెండు తెలుగు రాష్ట్రాల కూట‌మి ఎంపీలు, కేంద్ర మంత్రుల కు ఢిల్లీలోని ప్ర‌ఖ్యాత తాజ్ హోట్‌లో భారీ విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు బీజేపీకి చెందిన రెండు తెలుగు రాష్ట్రాల ఎంపీలు.. పురందేశ్వ‌రి, సీఎం ర‌మేష్, టీడీపీ ఎంపీలు క‌లిశెట్టి అప్ప‌ల‌నాయుడు, కేశినేని చిన్ని స‌హా.. కేంద్ర మంత్రులు పెమ్మ‌సాని, రామ్మోహ‌న్ నాయుడు, కిష‌న్ రెడ్డి, బండి సంజ‌య్ త‌దిత‌రు లు పాల్గొన్నారు.

అదేవిధంగా ఉత్త‌రాదికి చెందిన ప‌లువురు కేంద్ర మంత్రులు కూడా ఈ విందుకు హాజ‌ర‌య్యారు. 108 ర‌కాల ప‌దార్థాల‌తో పూర్తి శాకాహారంతో కూడిన విందు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. ఈ విందులో ఉత్త‌రాది, ద‌క్షిణాది స్వీట్లు, ఇత‌ర ప‌దార్థాల‌కు ప్రాధాన్యం ఇచ్చారు. ప్ర‌స్తుతం కార్తీక‌మాసం కావ‌డంతో అంతా శాకాహార ప‌దార్థాల‌నే వ‌డ్డించడం విశేషం. అయితే.. 108 సంఖ్య‌ను ఎంచుకోవ‌డం వెనుక కూడా ఆధ్యాత్మిక రీజ‌న్ ఉంద‌న్న‌ది జాతీయ మీడియా మాట‌.

ఇటీవ‌ల కాలంలో ప‌వ‌న్ స‌నాత‌నం గురించి ఎక్కువ‌గా చెబుతున్న నేప‌థ్యంలో దానిలో భాగంగానే 108 ర‌కాల‌కు ప్రాధాన్యం ఇచ్చార‌ని అంటున్నారు. ఇదిలావుంటే.. మోడీకి ద‌న్నుగా ప‌వ‌న్ క‌ల్యాణ్ రెండు కీల‌క విష‌యాల‌ను ప్ర‌స్తావించ‌డం ద్వారా జాతీయ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌కు వ‌చ్చారు. 1 బంగ్లాదేశ్‌, 2. పాల‌స్తీనా అంశాల‌ను ప్ర‌స్తావిస్తూ.. మోడీకి మ‌ద్ద‌తుగా వ్యాఖ్యానించారు. ఈ ప‌రిణామాల‌తో రాత్రికిరాత్రి జాతీయ మీడియా ప‌వ‌న్ ను హైలెట్ చేయ‌డం గ‌మ‌నార్హం.

Satya

Recent Posts

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

22 minutes ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

30 minutes ago

పుత్రోత్సాహం కోరుతున్న నందమూరి ఫ్యాన్స్

రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…

3 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

5 hours ago

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

11 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

14 hours ago