Political News

‘కూట‌మి’ ఎంపీలకు ప‌వ‌న్ విందు.. 108 ర‌కాల వంట‌కాలు!

జ‌న‌సేన అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..తాజాగా ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న విష‌యం తెలిసిం దే. మంగ‌ళ‌వారం ఢిల్లీకి వెళ్లిన ఆయ‌న వ‌రుస‌గా కేంద్ర మంత్రుల‌తో భేటీ అయ్యారు. రాష్ట్ర స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించారు. నిధులు, నీళ్లు స‌హా అనేక విష‌యాల‌ను వారి దృష్టికి తీసుకువెళ్లారు. వాటిని సాధించేందుకు ప్ర‌య‌త్నించారు. బుధ‌వారం పార్ల‌మెంటు భ‌వ‌న్‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతోనూ ప‌వ‌న్ భేటీ అయ్యారు. అనంత‌రం.. మ‌రికొంద‌రు కేంద్ర మంత్ర‌లతోనూ భేటీ అయ్యారు.

అయితే.. బుధ‌వారం రాత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. రెండు తెలుగు రాష్ట్రాల కూట‌మి ఎంపీలు, కేంద్ర మంత్రుల కు ఢిల్లీలోని ప్ర‌ఖ్యాత తాజ్ హోట్‌లో భారీ విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు బీజేపీకి చెందిన రెండు తెలుగు రాష్ట్రాల ఎంపీలు.. పురందేశ్వ‌రి, సీఎం ర‌మేష్, టీడీపీ ఎంపీలు క‌లిశెట్టి అప్ప‌ల‌నాయుడు, కేశినేని చిన్ని స‌హా.. కేంద్ర మంత్రులు పెమ్మ‌సాని, రామ్మోహ‌న్ నాయుడు, కిష‌న్ రెడ్డి, బండి సంజ‌య్ త‌దిత‌రు లు పాల్గొన్నారు.

అదేవిధంగా ఉత్త‌రాదికి చెందిన ప‌లువురు కేంద్ర మంత్రులు కూడా ఈ విందుకు హాజ‌ర‌య్యారు. 108 ర‌కాల ప‌దార్థాల‌తో పూర్తి శాకాహారంతో కూడిన విందు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. ఈ విందులో ఉత్త‌రాది, ద‌క్షిణాది స్వీట్లు, ఇత‌ర ప‌దార్థాల‌కు ప్రాధాన్యం ఇచ్చారు. ప్ర‌స్తుతం కార్తీక‌మాసం కావ‌డంతో అంతా శాకాహార ప‌దార్థాల‌నే వ‌డ్డించడం విశేషం. అయితే.. 108 సంఖ్య‌ను ఎంచుకోవ‌డం వెనుక కూడా ఆధ్యాత్మిక రీజ‌న్ ఉంద‌న్న‌ది జాతీయ మీడియా మాట‌.

ఇటీవ‌ల కాలంలో ప‌వ‌న్ స‌నాత‌నం గురించి ఎక్కువ‌గా చెబుతున్న నేప‌థ్యంలో దానిలో భాగంగానే 108 ర‌కాల‌కు ప్రాధాన్యం ఇచ్చార‌ని అంటున్నారు. ఇదిలావుంటే.. మోడీకి ద‌న్నుగా ప‌వ‌న్ క‌ల్యాణ్ రెండు కీల‌క విష‌యాల‌ను ప్ర‌స్తావించ‌డం ద్వారా జాతీయ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌కు వ‌చ్చారు. 1 బంగ్లాదేశ్‌, 2. పాల‌స్తీనా అంశాల‌ను ప్ర‌స్తావిస్తూ.. మోడీకి మ‌ద్ద‌తుగా వ్యాఖ్యానించారు. ఈ ప‌రిణామాల‌తో రాత్రికిరాత్రి జాతీయ మీడియా ప‌వ‌న్ ను హైలెట్ చేయ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on November 28, 2024 11:00 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

1 hour ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

2 hours ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

2 hours ago

జగన్ ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలపై సీఎం బాబు రియాక్షన్ ఏంటి?

తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…

5 hours ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

6 hours ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

7 hours ago