Political News

‘కూట‌మి’ ఎంపీలకు ప‌వ‌న్ విందు.. 108 ర‌కాల వంట‌కాలు!

జ‌న‌సేన అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..తాజాగా ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న విష‌యం తెలిసిం దే. మంగ‌ళ‌వారం ఢిల్లీకి వెళ్లిన ఆయ‌న వ‌రుస‌గా కేంద్ర మంత్రుల‌తో భేటీ అయ్యారు. రాష్ట్ర స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించారు. నిధులు, నీళ్లు స‌హా అనేక విష‌యాల‌ను వారి దృష్టికి తీసుకువెళ్లారు. వాటిని సాధించేందుకు ప్ర‌య‌త్నించారు. బుధ‌వారం పార్ల‌మెంటు భ‌వ‌న్‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతోనూ ప‌వ‌న్ భేటీ అయ్యారు. అనంత‌రం.. మ‌రికొంద‌రు కేంద్ర మంత్ర‌లతోనూ భేటీ అయ్యారు.

అయితే.. బుధ‌వారం రాత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. రెండు తెలుగు రాష్ట్రాల కూట‌మి ఎంపీలు, కేంద్ర మంత్రుల కు ఢిల్లీలోని ప్ర‌ఖ్యాత తాజ్ హోట్‌లో భారీ విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు బీజేపీకి చెందిన రెండు తెలుగు రాష్ట్రాల ఎంపీలు.. పురందేశ్వ‌రి, సీఎం ర‌మేష్, టీడీపీ ఎంపీలు క‌లిశెట్టి అప్ప‌ల‌నాయుడు, కేశినేని చిన్ని స‌హా.. కేంద్ర మంత్రులు పెమ్మ‌సాని, రామ్మోహ‌న్ నాయుడు, కిష‌న్ రెడ్డి, బండి సంజ‌య్ త‌దిత‌రు లు పాల్గొన్నారు.

అదేవిధంగా ఉత్త‌రాదికి చెందిన ప‌లువురు కేంద్ర మంత్రులు కూడా ఈ విందుకు హాజ‌ర‌య్యారు. 108 ర‌కాల ప‌దార్థాల‌తో పూర్తి శాకాహారంతో కూడిన విందు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. ఈ విందులో ఉత్త‌రాది, ద‌క్షిణాది స్వీట్లు, ఇత‌ర ప‌దార్థాల‌కు ప్రాధాన్యం ఇచ్చారు. ప్ర‌స్తుతం కార్తీక‌మాసం కావ‌డంతో అంతా శాకాహార ప‌దార్థాల‌నే వ‌డ్డించడం విశేషం. అయితే.. 108 సంఖ్య‌ను ఎంచుకోవ‌డం వెనుక కూడా ఆధ్యాత్మిక రీజ‌న్ ఉంద‌న్న‌ది జాతీయ మీడియా మాట‌.

ఇటీవ‌ల కాలంలో ప‌వ‌న్ స‌నాత‌నం గురించి ఎక్కువ‌గా చెబుతున్న నేప‌థ్యంలో దానిలో భాగంగానే 108 ర‌కాల‌కు ప్రాధాన్యం ఇచ్చార‌ని అంటున్నారు. ఇదిలావుంటే.. మోడీకి ద‌న్నుగా ప‌వ‌న్ క‌ల్యాణ్ రెండు కీల‌క విష‌యాల‌ను ప్ర‌స్తావించ‌డం ద్వారా జాతీయ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌కు వ‌చ్చారు. 1 బంగ్లాదేశ్‌, 2. పాల‌స్తీనా అంశాల‌ను ప్ర‌స్తావిస్తూ.. మోడీకి మ‌ద్ద‌తుగా వ్యాఖ్యానించారు. ఈ ప‌రిణామాల‌తో రాత్రికిరాత్రి జాతీయ మీడియా ప‌వ‌న్ ను హైలెట్ చేయ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on November 28, 2024 11:00 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

52 minutes ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

2 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

2 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

2 hours ago

గుణశేఖర్ గారు లాజిక్ మిస్సయ్యారు

ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…

3 hours ago

షాకిచ్చిన రామ్ చరణ్… పెద్ది వస్తోందా?

ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…

3 hours ago