Political News

‘కూట‌మి’ ఎంపీలకు ప‌వ‌న్ విందు.. 108 ర‌కాల వంట‌కాలు!

జ‌న‌సేన అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..తాజాగా ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న విష‌యం తెలిసిం దే. మంగ‌ళ‌వారం ఢిల్లీకి వెళ్లిన ఆయ‌న వ‌రుస‌గా కేంద్ర మంత్రుల‌తో భేటీ అయ్యారు. రాష్ట్ర స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించారు. నిధులు, నీళ్లు స‌హా అనేక విష‌యాల‌ను వారి దృష్టికి తీసుకువెళ్లారు. వాటిని సాధించేందుకు ప్ర‌య‌త్నించారు. బుధ‌వారం పార్ల‌మెంటు భ‌వ‌న్‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతోనూ ప‌వ‌న్ భేటీ అయ్యారు. అనంత‌రం.. మ‌రికొంద‌రు కేంద్ర మంత్ర‌లతోనూ భేటీ అయ్యారు.

అయితే.. బుధ‌వారం రాత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. రెండు తెలుగు రాష్ట్రాల కూట‌మి ఎంపీలు, కేంద్ర మంత్రుల కు ఢిల్లీలోని ప్ర‌ఖ్యాత తాజ్ హోట్‌లో భారీ విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు బీజేపీకి చెందిన రెండు తెలుగు రాష్ట్రాల ఎంపీలు.. పురందేశ్వ‌రి, సీఎం ర‌మేష్, టీడీపీ ఎంపీలు క‌లిశెట్టి అప్ప‌ల‌నాయుడు, కేశినేని చిన్ని స‌హా.. కేంద్ర మంత్రులు పెమ్మ‌సాని, రామ్మోహ‌న్ నాయుడు, కిష‌న్ రెడ్డి, బండి సంజ‌య్ త‌దిత‌రు లు పాల్గొన్నారు.

అదేవిధంగా ఉత్త‌రాదికి చెందిన ప‌లువురు కేంద్ర మంత్రులు కూడా ఈ విందుకు హాజ‌ర‌య్యారు. 108 ర‌కాల ప‌దార్థాల‌తో పూర్తి శాకాహారంతో కూడిన విందు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. ఈ విందులో ఉత్త‌రాది, ద‌క్షిణాది స్వీట్లు, ఇత‌ర ప‌దార్థాల‌కు ప్రాధాన్యం ఇచ్చారు. ప్ర‌స్తుతం కార్తీక‌మాసం కావ‌డంతో అంతా శాకాహార ప‌దార్థాల‌నే వ‌డ్డించడం విశేషం. అయితే.. 108 సంఖ్య‌ను ఎంచుకోవ‌డం వెనుక కూడా ఆధ్యాత్మిక రీజ‌న్ ఉంద‌న్న‌ది జాతీయ మీడియా మాట‌.

ఇటీవ‌ల కాలంలో ప‌వ‌న్ స‌నాత‌నం గురించి ఎక్కువ‌గా చెబుతున్న నేప‌థ్యంలో దానిలో భాగంగానే 108 ర‌కాల‌కు ప్రాధాన్యం ఇచ్చార‌ని అంటున్నారు. ఇదిలావుంటే.. మోడీకి ద‌న్నుగా ప‌వ‌న్ క‌ల్యాణ్ రెండు కీల‌క విష‌యాల‌ను ప్ర‌స్తావించ‌డం ద్వారా జాతీయ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌కు వ‌చ్చారు. 1 బంగ్లాదేశ్‌, 2. పాల‌స్తీనా అంశాల‌ను ప్ర‌స్తావిస్తూ.. మోడీకి మ‌ద్ద‌తుగా వ్యాఖ్యానించారు. ఈ ప‌రిణామాల‌తో రాత్రికిరాత్రి జాతీయ మీడియా ప‌వ‌న్ ను హైలెట్ చేయ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on November 28, 2024 11:00 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తమన్నాకు తెలుగులో మళ్లీ ఓ మంచి ఛాన్స్?

ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…

1 hour ago

8 వారాల వైపు సీరియస్ అడుగులు

థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…

1 hour ago

ఈసారి జ‌గ‌న్ వదిలిన ట్రోల్ పాయింట్?

అధికారంలోకి రావ‌డానికి ముందు వ‌ర‌కు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చాలా ఫెరోషియ‌స్‌గా క‌నిపించేవారు. అవినీతి కేసుల వ్య‌వ‌హారం పక్క‌న పెడితే…

2 hours ago

బన్నీ గ్లింప్స్ షారుఖ్ చేతుల మీదుగా?

‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…

2 hours ago

ప్రేమ పెళ్లితో షాకిచ్చిన వైర‌ల్ మోనాలిసా

మోనాలిసా.. గ‌త ఏడాది సోష‌ల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్‌ప్రదేశ్‌లో జ‌రిగిన‌ మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…

3 hours ago

కిం క‌ర్త‌వ్యం… అంత‌ర్మ‌థ‌నంలో బీఆర్ఎస్‌?

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, ఆ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్‌, మాజీ మంత్రి పార్టీ కీల‌క…

4 hours ago