చిక్కడు దొరకడు టైపులో సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లపై ఏడాది కిందట చేసిన వ్యాఖ్యలు, పెట్టిన సోషల్ మీడియా పోస్టులపై వర్మపై కేసు నమోదైంది. ప్రకాశం జిల్లాకు చెందిన రామలింగం అనే టీడీపీ స్థానిక నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ, ఈ కేసు ఎదుర్కొంటున్నది బలమైన వర్మ.. పైగా ఆయన లాజిక్కులు కూడా భిన్నంగా ఉంటున్నాయి!
ఎందుకంటే.. ఇలాంటి కేసులు, ఘటనలు, హత్యలపై వర్మకు ఉన్న పరిజ్ఞానం అంతా ఇంతా కాదు. చదువు రూపంలో ఆయనకు నాలెడ్జ్లేకపోవచ్చు. రాజ్యాంగం ప్రకారం ఆయనకు నిబంధనలు తెలియక పోవచ్చు. కానీ, తాను సంపాయించుకున్న అపారమైన అనుభవం.. అనేక సినిమాల అనుభవంవంటివి వర్మకు కలిసి వస్తున్నాయి. అందుకే వర్మ.. చిక్కడు, దొరకడు టైపులో పోలీసులతో ఆడుకుంటున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
తాజాగా సోసల్ మీడియాలో ఓ నెటిజన్ చేసిన వ్యాఖ్య ఆసక్తిగా మారింది. “ఎవరు పిల్లి.. ఎవరు ఎలుక?” అని ఏపీ పోలీసులు- వర్మ వ్యవహరిస్తున్న తీరుపై కామెంట్ చేశారు. సహజంగానే పోలీసులు నోటీసులు ఇచ్చాక హాజరు కావాలి. కానీ, వర్మ ఇప్పటికి రెండు సార్లు టైం తీసుకున్నారు. అయినా హాజరు కావడం లేదు. దీంతో ఆయనను అరెస్టు చేయాలన్నది ఏపీ పోలీసుల ఉద్దేశం. కానీ, ఇది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఎందుకంటే లాజిక్కులతో వర్మ కొట్టేస్తున్నారు.
“ఏడాది కిందటి కేసు. విచారణకు సహకరిస్తానన్నా.. నా కోసం వెతుకున్నారు. ఇదేం పద్ధతి” అని ఆయన ప్రశ్నించిన తీరు.. నిజంగానే పోలీసులను పక్కకు తప్పుకొనేలా ఉంది. ఇక, “అసలు నేను చేసిన కామెంట్లు ఒకరి గురించి. కానీ, మనో భావాలు ఎవరికో గాయపడ్డాయి. ఇదేం చిత్రం” అని కూడా వర్మ వ్యాఖ్యానించారు. ఇది రేపు కోర్టులో బలమైన వాదనగా మారనుంది.
ఎందుకంటే.. బాధితులుగా ఉన్న వారు పిర్యాదు చేస్తే.. ఆ ఎఫెక్ట్ వేరేగా ఉంటుంది. కానీ, ఇక్కడ బాధితుల కంటే మనో భావాలు దెబ్బతిన్నవారు వేరేగా ఉన్నారు. వారు బయటకు వచ్చే పరిస్థితి లేదు. సో.. అప్పుడు కేసుకు పెద్దగా బలం ఉండదనేది వర్మ వాదన. దీంతో వర్మ.. ఇప్పట్లో అయితే చిక్కడు – దొరకడు టైపేనని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on November 27, 2024 11:18 am
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…