చిక్కడు దొరకడు టైపులో సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లపై ఏడాది కిందట చేసిన వ్యాఖ్యలు, పెట్టిన సోషల్ మీడియా పోస్టులపై వర్మపై కేసు నమోదైంది. ప్రకాశం జిల్లాకు చెందిన రామలింగం అనే టీడీపీ స్థానిక నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ, ఈ కేసు ఎదుర్కొంటున్నది బలమైన వర్మ.. పైగా ఆయన లాజిక్కులు కూడా భిన్నంగా ఉంటున్నాయి!
ఎందుకంటే.. ఇలాంటి కేసులు, ఘటనలు, హత్యలపై వర్మకు ఉన్న పరిజ్ఞానం అంతా ఇంతా కాదు. చదువు రూపంలో ఆయనకు నాలెడ్జ్లేకపోవచ్చు. రాజ్యాంగం ప్రకారం ఆయనకు నిబంధనలు తెలియక పోవచ్చు. కానీ, తాను సంపాయించుకున్న అపారమైన అనుభవం.. అనేక సినిమాల అనుభవంవంటివి వర్మకు కలిసి వస్తున్నాయి. అందుకే వర్మ.. చిక్కడు, దొరకడు టైపులో పోలీసులతో ఆడుకుంటున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
తాజాగా సోసల్ మీడియాలో ఓ నెటిజన్ చేసిన వ్యాఖ్య ఆసక్తిగా మారింది. “ఎవరు పిల్లి.. ఎవరు ఎలుక?” అని ఏపీ పోలీసులు- వర్మ వ్యవహరిస్తున్న తీరుపై కామెంట్ చేశారు. సహజంగానే పోలీసులు నోటీసులు ఇచ్చాక హాజరు కావాలి. కానీ, వర్మ ఇప్పటికి రెండు సార్లు టైం తీసుకున్నారు. అయినా హాజరు కావడం లేదు. దీంతో ఆయనను అరెస్టు చేయాలన్నది ఏపీ పోలీసుల ఉద్దేశం. కానీ, ఇది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఎందుకంటే లాజిక్కులతో వర్మ కొట్టేస్తున్నారు.
“ఏడాది కిందటి కేసు. విచారణకు సహకరిస్తానన్నా.. నా కోసం వెతుకున్నారు. ఇదేం పద్ధతి” అని ఆయన ప్రశ్నించిన తీరు.. నిజంగానే పోలీసులను పక్కకు తప్పుకొనేలా ఉంది. ఇక, “అసలు నేను చేసిన కామెంట్లు ఒకరి గురించి. కానీ, మనో భావాలు ఎవరికో గాయపడ్డాయి. ఇదేం చిత్రం” అని కూడా వర్మ వ్యాఖ్యానించారు. ఇది రేపు కోర్టులో బలమైన వాదనగా మారనుంది.
ఎందుకంటే.. బాధితులుగా ఉన్న వారు పిర్యాదు చేస్తే.. ఆ ఎఫెక్ట్ వేరేగా ఉంటుంది. కానీ, ఇక్కడ బాధితుల కంటే మనో భావాలు దెబ్బతిన్నవారు వేరేగా ఉన్నారు. వారు బయటకు వచ్చే పరిస్థితి లేదు. సో.. అప్పుడు కేసుకు పెద్దగా బలం ఉండదనేది వర్మ వాదన. దీంతో వర్మ.. ఇప్పట్లో అయితే చిక్కడు – దొరకడు టైపేనని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on November 27, 2024 11:18 am
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…
మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…
ఒక గంట కునుకు పడితే ఎక్కడ పనికి బ్రేక్ పడుతుందో అన్న రేంజ్ లో చివరి దశ ప్యారడైజ్ పనులను…
దేవుడు నుదుటి మీద రాసే రాతైనా అర్ధం అవుతుందేమో కానీ వైద్యుడు రాసే మందుల పేర్లు మాత్రం అర్ధం కావన్నది…
రెండేళ్ల క్రితం పెద్దగా అంచనాలు లేకుండా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న మహారాజ త్వరలో హాలీవుడ్ రీమేక్ కాబోతోందన్న వార్త…
సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయమవుతున్న ఎల్లమ్మను నెలల తరబడి వేధించిన సమస్య హీరోయిన్ ఎంపిక. మృణాల్ ఠాకూర్,…