సోలార్ విద్యుత్ ఒప్పందాల నేపథ్యంలో అదానీ గ్రూప్ పై లంచం ఇచ్చారన్న ఆరోపణలు రావడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’కి అదానీ ఇస్తానన్న 100 కోట్లు వద్దని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కేటీఆర్ పై రేవంత్ విమర్శలతో విరుచుకుపడ్డారు. ఈ బుద్ధిమంతుడు అదానీ సంకలో దూరాడని కేటీఆర్ పై రేవంత్ షాకింగ్ కామెంట్లు చేశారు. కేటీఆర్ కాదు సైకో రాం అంటూ కేటీఆర్ కు రేవంత్ కొత్త బిరుదునిచ్చారు.
తమ ప్రభుత్వంపై కేటీఆర్ తలాతోకా లేని ఆరోపణలు చేస్తున్నారని, ఏం మాట్లాడుతున్నారో కేటీఆర్ కే తెలియడం లేదని ఎద్దేవా చేశారు. కేటీఆర్ పక్కన ఉండేవారికే ఆయన చేష్టలు అర్థం కావటం లేదని, పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని దుయ్యబటట్టారు. కొన్ని మీడియా ఛానెల్స్ ను గత ప్రభుత్వం నిషేధించిన విషయం మర్చిపోయారా అని రేవంత్ నిలదీశారు. అధికారంలో ఉంటే ఒకలా.. ప్రతిపక్షంలో ఉంటే సైకోలా కేటీఆర్ మాట్లాడుతున్నాడని, కేటీఆర్ కు.. సైకో రాం కరెక్ట్ పేరు అని చురకలంటించారు.
ఇక, కేటీఆర్ జైలుకు వెళ్లాలని తహతహలాడుతున్నాడని, జైలుకు వెళ్తే సీఎం అవ్వొచ్చని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. అలా అయితే, కేసీఆర్ కుటుంబం నుండి ఇప్పటికే జైలుకు వెళ్లిన కవితకు కేటీఆర్ కన్నా ముందే సీఎం అయ్యే చాన్స్ ఉందని సెటైర్లు వేశారు. కేసీఆర్ ఫ్యామిలీలో సీఎం సీటు కోసం పోటీ ఎక్కువగా ఉందని రేవంత్ చమత్కరించారు. కవితకు బెయిల్ కోసం పైరవీలు చేసేందుకు ఢిల్లీ వెళ్లలేదని, రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ఎన్ని సార్లైనా ఢిల్లీ వెళతానని రేవంత్ అన్నారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు ఈ రోజు ఢిల్లీ వెళుతున్నానని, ఇది రాజకీయ పర్యటన కాదని స్పష్టం చేశారు.
ఈ ఫొటోలో ఉన్న కేసీఆర్ ను గుర్తు పడతరా..అంటూ అదానీతో కేసీఆర్ ఉన్న ఫొటోను మీడియాకు చూపించి సెటైర్లు వేశారు రేవంత్. అదానీకి గతంలో కేసీఆర్, కేటీఆర్ వంగి వంగి సలాం కొట్టారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ బుద్ధిమంతుడు, ప్రబుద్ధుడు కేటీఆర్ అదానీ సంకలో దూరిండు అంటూ సెటైర్లు వేశారు. తాను ఎప్పుడూ అలా వంగి దండాలు పెట్టలేదని, నోరు తెరిస్తే అబద్దాలు మాట్లాడతారని.. అన్నారు. అదానీ సంస్థకు భారీ సంఖ్యలో ప్రాజెక్టులిచ్చిన గత ప్రభుత్వం కోట్ల రూపాయల కమీషన్లు కొట్టేసిందని సంచలన ఆరోపణలు చేశారు.
అదానీకి ఎన్ని డేటా సెంటర్లు ఇచ్చారు, ఎన్ని రోడ్డు కాంట్రాక్టులు ఇచ్చారో విచారణ చేసేందుకు కేటీఆర్ సిద్ధమా అని సవాల్ విసిరారు. బీఆర్ ఎస్ కు అధికారంతో పాటు మెదడు కూడా పోయిందని రేవంత్ సెటైర్లు వేశారు. అసెంబ్లీలో విచారణ చేయడం దమ్ముంటే అని సవాల్ విసిరింది బీఆర్ఎస్ నేతలేనని, అందుకే సాగునీటి పారుదల, విద్యుత్ వంటి విషయాలపై విచారణ మొదలుబెట్టామని గుర్తు చేశారు. ఇక, తమను పోలీస్ స్టేషన్లో పెట్టమని బీఆర్ఎస్ నేతలు అడుగుతున్నాని, ప్రతిపక్షాన్ని గౌరవించి వాళ్లు అడిగింది చేయాలి కదా అని చమత్కరించారు.
This post was last modified on November 26, 2024 9:56 am
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…