Political News

అదానీ సంకలో కేటీఆర్ దూరాడు: రేవంత్

సోలార్ విద్యుత్ ఒప్పందాల నేపథ్యంలో అదానీ గ్రూప్ పై లంచం ఇచ్చారన్న ఆరోపణలు రావడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’కి అదానీ ఇస్తానన్న 100 కోట్లు వద్దని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కేటీఆర్ పై రేవంత్ విమర్శలతో విరుచుకుపడ్డారు. ఈ బుద్ధిమంతుడు అదానీ సంకలో దూరాడని కేటీఆర్ పై రేవంత్ షాకింగ్ కామెంట్లు చేశారు. కేటీఆర్ కాదు సైకో రాం అంటూ కేటీఆర్ కు రేవంత్ కొత్త బిరుదునిచ్చారు.

తమ ప్రభుత్వంపై కేటీఆర్ తలాతోకా లేని ఆరోపణలు చేస్తున్నారని, ఏం మాట్లాడుతున్నారో కేటీఆర్ కే తెలియడం లేదని ఎద్దేవా చేశారు. కేటీఆర్ పక్కన ఉండేవారికే ఆయన చేష్టలు అర్థం కావటం లేదని, పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని దుయ్యబటట్టారు. కొన్ని మీడియా ఛానెల్స్ ను గత ప్రభుత్వం నిషేధించిన విషయం మర్చిపోయారా అని రేవంత్ నిలదీశారు. అధికారంలో ఉంటే ఒకలా.. ప్రతిపక్షంలో ఉంటే సైకోలా కేటీఆర్ మాట్లాడుతున్నాడని, కేటీఆర్ కు.. సైకో రాం కరెక్ట్ పేరు అని చురకలంటించారు.

ఇక, కేటీఆర్ జైలుకు వెళ్లాలని తహతహలాడుతున్నాడని, జైలుకు వెళ్తే సీఎం అవ్వొచ్చని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. అలా అయితే, కేసీఆర్ కుటుంబం నుండి ఇప్పటికే జైలుకు వెళ్లిన కవితకు కేటీఆర్ కన్నా ముందే సీఎం అయ్యే చాన్స్ ఉందని సెటైర్లు వేశారు. కేసీఆర్ ఫ్యామిలీలో సీఎం సీటు కోసం పోటీ ఎక్కువగా ఉందని రేవంత్ చమత్కరించారు. కవితకు బెయిల్ కోసం పైరవీలు చేసేందుకు ఢిల్లీ వెళ్లలేదని, రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ఎన్ని సార్లైనా ఢిల్లీ వెళతానని రేవంత్ అన్నారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు ఈ రోజు ఢిల్లీ వెళుతున్నానని, ఇది రాజకీయ పర్యటన కాదని స్పష్టం చేశారు.

ఈ ఫొటోలో ఉన్న కేసీఆర్ ను గుర్తు పడతరా..అంటూ అదానీతో కేసీఆర్ ఉన్న ఫొటోను మీడియాకు చూపించి సెటైర్లు వేశారు రేవంత్. అదానీకి గతంలో కేసీఆర్, కేటీఆర్ వంగి వంగి సలాం కొట్టారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ బుద్ధిమంతుడు, ప్రబుద్ధుడు కేటీఆర్ అదానీ సంకలో దూరిండు అంటూ సెటైర్లు వేశారు. తాను ఎప్పుడూ అలా వంగి దండాలు పెట్టలేదని, నోరు తెరిస్తే అబద్దాలు మాట్లాడతారని.. అన్నారు. అదానీ సంస్థకు భారీ సంఖ్యలో ప్రాజెక్టులిచ్చిన గత ప్రభుత్వం కోట్ల రూపాయల కమీషన్లు కొట్టేసిందని సంచలన ఆరోపణలు చేశారు.

అదానీకి ఎన్ని డేటా సెంటర్లు ఇచ్చారు, ఎన్ని రోడ్డు కాంట్రాక్టులు ఇచ్చారో విచారణ చేసేందుకు కేటీఆర్ సిద్ధమా అని సవాల్ విసిరారు. బీఆర్ ఎస్ కు అధికారంతో పాటు మెదడు కూడా పోయిందని రేవంత్ సెటైర్లు వేశారు. అసెంబ్లీలో విచారణ చేయడం దమ్ముంటే అని సవాల్ విసిరింది బీఆర్ఎస్ నేతలేనని, అందుకే సాగునీటి పారుదల, విద్యుత్ వంటి విషయాలపై విచారణ మొదలుబెట్టామని గుర్తు చేశారు. ఇక, తమను పోలీస్ స్టేషన్లో పెట్టమని బీఆర్ఎస్ నేతలు అడుగుతున్నాని, ప్రతిపక్షాన్ని గౌరవించి వాళ్లు అడిగింది చేయాలి కదా అని చమత్కరించారు.

This post was last modified on November 26, 2024 9:56 am

Share

Recent Posts

టాక్ ఎలా ఉన్నా 200 కోట్లు పక్కా

స్టార్ పవర్ అంటే మాటల్లో కొలిచేది కాదు. దాని సత్తా ఏ స్థాయిలో ఉంటుదంటే ఒక్కసారి ట్రేడ్ వర్గాలకు సైతం…

36 minutes ago

మోహన్ బాబుని మిస్ చేసిన మహేష్ బాబు

ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న శ్రీనివాస మంగాపురం మీద సినిమా కంటే ఎక్కువగా మహేష్ బాబు ఆ మూవీ…

53 minutes ago

మహేష్ మల్టీప్లెక్స్‌లో సినిమాలు చూసిన విజయ్

ఈ రోజుల్లో పెద్ద స్టార్లు థియేటర్లకు వచ్చి సినిమాలు చూడడం అన్నది దాదాపు అసాధ్యంగా మారిపోయింది. మిడ్ రేంజ్ హీరోలు…

1 hour ago

జ‌న‌సేన ఎమ్మెల్యే రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తారా ..?

తిరుప‌తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించిన జ‌న‌సేన నాయ‌కుడు, సీనియ‌ర్ నేత ఆర‌ణి శ్రీనివాసులు రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై ఆస‌క్తిక‌ర…

2 hours ago

రకుల్ సినిమాల్లోకి వచ్చింది కారు కోసమే

కొందరు నటనలోకి రావాలని ముందే ఒక లక్ష్యం పెట్టుకుని పని చేస్తారు. కొందరు అనుకోకుండా ఈ రంగంలోకి అడుగు పెడతారు.…

3 hours ago

హెచ్చరికలతో సరిపెడితే ఎలా బాబు గారు

టీడీపీ అధినేత చంద్ర‌బాబు వైఖ‌రి.. పార్టీ నాయ‌కులకు బాగా క‌లిసి వ‌స్తోంద‌న్న‌వాద‌న వినిపిస్తోంది. ఇప్ప‌టికి రెండు సంవ‌త్స‌రాలుగా చంద్ర‌బాబు.. త‌మ్ముళ్ల‌కు…

3 hours ago