Political News

అదానీ-జ‌గ‌న్‌.. మ‌ధ్య‌లో చంద్ర‌బాబుకు చిక్కులు!

ప్ర‌ముఖ వ్యాపార వేత్త‌, ప్ర‌పంచ కుబేరుడు గౌతం అదానీ.. ఏపీలో సౌర విద్యుత్‌కు సంబంధించి చేసుకున్న ఒప్పందాల వ్య‌వ‌హారంలో అప్ప‌టి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు రూ.1750 కోట్ల మేర‌కు లంచాలు ఇచ్చార‌న్న అమెరికా ద‌ర్యాప్తు సంస్థ‌(ఎఫ్ బీఐ) అక్క‌డి కోర్టుకు స‌మ‌ర్పించిన అఫిడ‌విట్ ఏపీలో రాజ‌కీయ మంట‌లు రేపుతోంది. అదానీ ప‌రిస్థితి ఎలా ఉన్నా.. జ‌గ‌న్ విష‌యంలో సీఎం చంద్ర‌బాబుకు చిక్కులు పెరుగుతున్నాయి. జ‌గ‌న్‌పై చ‌ర్య‌ల‌కు ప‌ట్టుబ‌డుతూ.. క‌మ్యూనిస్టులు ఒక‌వైపు, కాంగ్రెస్ పీసీసీచీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోవైపు.. చంద్ర‌బాబుకు సెగ‌లు పెంచుతున్నారు.

సౌర విద్యుత్‌కు సంబంధించి దేశంలో ఏ రాష్ట్రం కూడా చేసుకోని విధంగా భారీ ఎత్తున 7 వేల మెగా వాట్ల విద్యుత్‌ను 25 సంవ‌త్స‌రాలు పాటు కొనుగోలు చేసేలా జ‌గ‌న్ అదానీతో ఒప్పందం చేసుకున్నార‌న్న విష‌యం తెలిసిందే. అయితే.. వైసీపీ వాద‌న వేరేగా ఉంది. తాము ఒప్పందం చేసుకున్న‌ది సోలార్ ఎన‌ర్జీ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా(సెకీ)తో అయితే.. మ‌ధ్య అదానీ ఎవ‌రంటూ.. వైసీపీ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. ఇది ఎవ‌రికీ అంతు చిక్క‌ని, కొరుకుడు ప‌డ‌ని వ్య‌వ‌హారంగా మారిపోయింది.

పోనీ.. అదానీని కార్న‌ర్ చేయాలంటే.. బీజేపీకి ఆగ్ర‌హం వ‌స్తుంది. ఆయ‌న‌ను వ‌దిలేసి జ‌గ‌న్‌ను ఒక్క‌డిని విచారించాలంటే.. అస‌లు ఒప్పందం చేసుకున్న‌దే అదానీ! ఇది కూట‌మి స‌ర్కారుకు త‌ల‌నొప్పిగా మారింది.

దీంతో కూట‌మి పార్టీల‌ను చంద్ర‌బాబు దాదాపు సైలెంట్ చేసేశారు. ఈ విష‌యంపై తానే తేల్చుకుంటాన‌ని ఎవ‌రూ మాట్లాడ వ‌ద్ద‌ని ఆయ‌న చెప్ప‌డంతో కూట‌మిలోని కీల‌క‌మైన టీడీపీ, జ‌న‌సేన పార్టీ నాయ‌కులు ఎవ‌రూ ఈ వివాదం జోలికి పోవ‌డం లేదు. కానీ, తురుపు ముక్క‌లుగా ఉన్న కాంగ్రెస్ , క‌మ్యూనిస్టులు మాత్రం చంద్ర‌బాబును కేంద్రంగా చేసుకుని నిప్పులు చెరుగుతున్నారు. జ‌గ‌న్ చేసుకున్న ఒప్పందాల‌ను అనుమ‌తుల‌ను త‌క్ష‌ణ‌మే ర‌ద్దు చేయాలంటూ ష‌ర్మిల డిమాండ్ చేస్తున్నారు. జ‌గ‌న్ హ‌యాంలో అర్ధ‌రాత్రి చేసుకున్న ఒప్పందాల నిగ్గు తేల్చాల‌ని కూడా ఆమె కోరుతున్నారు.

ఇక‌, క‌మ్యూనిస్టుల విష‌యానికి వ‌స్తే.. సీపీఎం నాయ‌కుడు బీవీ రాఘ‌వులు కూడా ఇదే స్వ‌రం వినిపిస్తున్నారు. ఒప్పందాలు ర‌ద్దు చేసి.. ప్ర‌జ‌ల‌పై భారం త‌గ్గించాల‌ని కోరుతున్నారు. ఇదేస‌మ‌యంలో జ‌గ‌న్ హ‌యాంలో అదానీ కంపెనీతో కుదుర్చుకున్న స్మార్ట్ మీట‌ర్ల ఒప్పందాన్నికూడా స‌మీక్షించి ర‌ద్దు చేయాల‌ని ఆయ‌న ప‌ట్టుబ‌డుతున్నారు. కానీ, ఈ రెండు ఒప్పందాలు ర‌ద్దు చేసుకునే ప‌రిస్థితి లేదు. ఎందుకంటే నిబంధ‌న‌ల్లో పేర్కొన్న‌ట్టుగా.. ఈ ఒప్పందాల‌ను ర‌ద్దు చేసుకుంటే సుమారు రెండు ఒప్పందాల‌కు క‌లిపి 5 వేల కోట్ల‌ను అదానీ కంపెనీకి ఏపీ ప్ర‌భుత్వం చెల్లించాల్సి ఉంటుంది. పైగా ఇది కేంద్రంలోని పెద్ద‌ల‌తో ముడిప‌డిన వ్య‌వ‌హారం కావ‌డంతో చంద్ర‌బాబుకు ఇప్పుడు చిక్కులు ఎద‌రవుతున్నాయి. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on November 26, 2024 9:52 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

2 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

6 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

6 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

6 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

8 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

10 hours ago