Political News

అదానీ 100 కోట్లు వద్దంటోన్న రేవంత్!

సోలార్ విద్యుత్ ఒప్పందాల నేపథ్యంలో భారతీయ కుబేరులలో ఒకరైన గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే, ఈ సోలార్ విద్యుత్ ఒప్పందాల కోసం ఏపీ మాజీ సీఎం జగన్ తో పాటు మరో నాలుగు రాష్ట్రాల సీఎంలకు అదానీ భారీగా ముడుపులిచ్చారని తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలోకి ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’’కి అదానీ ఇస్తానని చెప్పిన 100 కోట్ల రూపాయల విరాళాన్ని తీసుకోబోమని రేవంత్ ప్రకటించారు.

కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా అదానీ అంశంపై రచ్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అదానీ నుంచి తెలంగాణ ప్రభుత్వం 100 కోట్ల రూపాయల విరాళం తీసుకోబోతోందని, రేవంత్ రెడ్డికి అదానీకి మధ్య చీకటి ఒప్పందాలున్నాయని బీఆర్ఎస్ కీలక నేత కేటీఆర్ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై రేవంత్ రెడ్డి తాజాగా స్పందించారు. ఆ స్కిల్ యూనివర్సిటీకి ఎంతో మంది నిధులిచ్చారని, అదే మాదిరిగా అదానీ కూడా నిధులిచ్చారని రేవంత్ అన్నారు. అయితే, అదానీతోపాటు ఏ వ్యాపారవేత్తకైనా విరాళం ఇచ్చే అవకాశం రాజ్యాంగం కల్పించిందని అన్నారు. అంతేకాదు, అదానీ వివాదంతో తెలంగాణకు సంబంధం లేదని స్పష్టం చేశారు.

అయితే, కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాల దృష్ట్యా అదానీ ఇవ్వదలచిన విరాళాన్ని తమ ప్రభుత్వం తీసుకోవడం లేదని రేవంత్ చెప్పారు. అంతే కాదు, ఆ విరాళం వద్దని ప్రభుత్వం తరఫున అదానీ గ్రూప్ నకు అధికారి జయేష్ రంజన్ లేఖ రాశారని చెప్పారు. అదానీ గ్రూప్ ఉదారంగా తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీకి ఇస్తామన్న వంద కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించడానికి సిద్ధంగా లేదని అన్నారు. కాబట్టి, దయచేసి ఆ 100 కోట్లను వర్సిటీకి బదిలీ చేయద్దు అని ఆ లేఖలో పేర్కొన్నామని రేవంత్ రెడ్డి చెప్పారు.

This post was last modified on November 25, 2024 4:05 pm

Share

Recent Posts

అనుప‌మ ఆ రోజు ఏడ్చింది అందుకా?

గ‌త కొన్ని రోజులుగా మ‌ల‌యాళ క‌థానాయిక అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ బ్రేకప్ వ్య‌వ‌హారం సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే.…

5 hours ago

తమిళ ప్రేక్షకుల ప్రేమ ఎందుకు తక్కువంటే

తాజాగా విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ తెలుగులో చూపిస్తున్న జోరు తమిళంలో ప్రదర్శించడం లేదన్నది వాస్తవం. ఓపెనింగ్స్ నెంబర్లు పోల్చుకుని…

5 hours ago

సోష‌ల్ మీడియా ఎటాక్… ఫరియా క‌న్నీళ్లు

జాతిర‌త్నాలు సినిమాతో మంచి గుర్తింపు సంపాదించి, తెలుగులో వ‌రుస‌గా సినిమాలు చేస్తున్న క‌థానాయిక‌.. ఫ‌రియా అబ్దుల్లా. థియేట‌ర్ బ్యాగ్రౌండ్ నుంచి…

8 hours ago

ప‌వ‌న్ ఒక్క ఆలోచ‌న‌… 5 వేల కుటుంబాల క‌ళ్ల‌లో మెరుపులు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. అట‌వీశాఖ మంత్రిగా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆయ‌న చేసిన ఒకే ఒక్క ఆలోచ‌న.. 5…

8 hours ago

రాహుల్ రాముడైతే… జగ్గారెడ్డి హనుమంతుడు

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని జగ్గారెడ్డి వ్యవహార శైలి గురించి తెలిసిందే. తన…

9 hours ago

కేటీఆర్ బిడ్డ చదువుకోవడానికి గొప్ప కాలేజీ లేదా

‘‘రేపు నా బిడ్డను డ్రాప్ చేయడానికి అమెరికా వెళ్లాలి...ఇక్కడే చదువుకోవచ్చు కదా అని అడిగితే...అంత గొప్ప కాలేజీలు ఇక్కడ ఎక్కడున్నాయి…

9 hours ago