Political News

రోజా.. కౌంటింగ్ నుంచి ఎందుకు వెళ్లిపోయింది?

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఆరు నెలలు దాటిపోయింది. ఫలితాలు వచ్చి కూడా ఆరు నెలలు కావస్తోంది. ఐతే ఆ ఎన్నికల్లో ఘోర పరాభవం చవిచూసిన వైసీపీ నేతలు ఇప్పటికీ వాస్తవంలోకి రాలేకపోతున్నట్లు కనిపిస్తోంది. అధికారంలో ఉండగా జగన్ అండ్ కో ఎన్నెన్ని తప్పులు చేశారో.. పాలన ఎంత ఘోరంగా సాగిందో తెలిసిందే. కానీ ఆ విషయాలను ఇప్పటికీ ఆ పార్టీ నేతలు అంగీకరించలేకపోతున్నారు.

తమ పాలన అద్భుతంగా సాగిందని.. ఎన్నికల్లో అక్రమాలు చేసి కూటమి గెలిచేసిందని ఇప్పటికీ చెప్పుకుంటూ జనాలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాజీ మంత్రి రోజా వ్యాఖ్యలను చూస్తే వైసీపీ నేతలు ఎప్పటికీ రియాలిటీలోకి రాలేరేమో అనిపిస్తుంది. చాలామంది వైసీపీ నేతల్లాగే ఈవీఎంలతో మాయ చేసి కూటమి గెలిచేసిందనే వాదననే రోజా కూడా వినిపించింది.

ఎన్నికల ఫలితాల రోజు రోజా రెండు రౌండ్ల ఫలితాలు వచ్చేసరికే కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అందుకు కారణాన్ని ఆమె ఈ ఇంటర్వ్యూలో వివరించింది. తొలి రౌండ్లో తనకు బాగా కలిసొచ్చే వడమాల పేట ప్రాంతం ఓట్లు లెక్కిస్తారని.. అది వైసీపీకి కంచుకోట లాంటి ప్రాంతం అని.. అక్కడ ప్రత్యర్థికి 3 వేల మెజారిటీ రావడం చూసి ఈ ఎన్నికలు సక్రమంగా జరగలేదని.. ఈవీఎంల్లో ఏదో చేశారని అర్థమై తాను కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయినట్లు రోజా తెలిపారు.

నియోజకవర్గంలో తాను ఎంతో చేశానని.. సంక్షేమ పథకాలను గొప్పగా అమలు చేశానని.. అలాంటిది దివంగత టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు కూడా రెండు మూడు వేల ఓట్లతో గెలిచిన నియోజకవర్గంలో ఆయన కొడుకు గాలి భాను ప్రకాష్ ఎలా 40 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తాడని రోజా ప్రశ్నించారు. ఎన్నికలకు రెండు నెలల ముందు చిత్తూరు జిల్లాలో పోలీస్ ఉన్నతాధికారులందరినీ మార్చేశారని.. ప్రభుత్వ వ్యవస్థే కూటమి చేతుల్లోకి వెళ్లిపోయినట్లు అనిపించిందని రోజా వివరించింది. జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటికీ ఎంతో మంచి చేశారని.. అలాంటి వ్యక్తిని కాదని వేరే వాళ్లకు జనం ఓటేసే పరిస్థితే లేదని.. అందుకే ఈ ఎన్నికలను తాము నమ్మడం లేదని ఆమె స్పష్టం చేశారు.

This post was last modified on November 25, 2024 10:45 am

Share

Recent Posts

భారత్ ఫార్మాపై ట్రంప్ టారిఫ్ ల్యాండ్ బాంబ్!

భారత ఫార్మా రంగానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మైండ్ బ్లాకింగ్ అప్‌డేట్ ఇచ్చారు. జెనరిక్ ఔషధాల దిగుమతులపై దశలవారీగా…

12 minutes ago

NBK 111… గాయం మార్చిన లక్ష్యం

బాలయ్య నిన్న జరిగిన NBK 111 షూటింగ్ లో ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తీవ్రమైన గాయం కాకపోవడంతో అభిమానులు…

25 minutes ago

వావ్… ఏపీ లో యూఏఈ పెట్టుబడులు

ఏపీ సీఎం చంద్ర‌బాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ఏడాది దావోస్ లోని ప్రపంచ ఆర్ధిక సదస్సులో కుదుర్చుకున్న మరో…

1 hour ago

డెంగీ తాట తీసే టీకా వచ్చేస్తోంది

‘డెంగీ’ దెబ్బ ఎంతలా ఇబ్బంది పెడుతుందో.. మనిషిని ఎంతలా అతలాకుతలం చేస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే ఉండదు. డెంగీ బారిన…

4 hours ago

విజ‌య్ జననాయకుడు వెనకపడ్డాడు

త‌మిళ సినిమాల మీద తెలుగు ప్రేక్ష‌కుల ఎలాంటిదో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ద‌శాబ్దాలుగా అక్క‌డి నుంచి వ‌చ్చే అనువాద…

9 hours ago

జగన్ ఎలా అంటే కేటీఆర్ కూడా అలానే

జగన్ ఇటీవ‌ల కాలంలో స‌హ‌నం కోల్పోతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో త‌న పార్టీ వారిపై కేసులు పెట్టినా.. త‌మ…

12 hours ago