Political News

రోజా.. కౌంటింగ్ నుంచి ఎందుకు వెళ్లిపోయింది?

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఆరు నెలలు దాటిపోయింది. ఫలితాలు వచ్చి కూడా ఆరు నెలలు కావస్తోంది. ఐతే ఆ ఎన్నికల్లో ఘోర పరాభవం చవిచూసిన వైసీపీ నేతలు ఇప్పటికీ వాస్తవంలోకి రాలేకపోతున్నట్లు కనిపిస్తోంది. అధికారంలో ఉండగా జగన్ అండ్ కో ఎన్నెన్ని తప్పులు చేశారో.. పాలన ఎంత ఘోరంగా సాగిందో తెలిసిందే. కానీ ఆ విషయాలను ఇప్పటికీ ఆ పార్టీ నేతలు అంగీకరించలేకపోతున్నారు.

తమ పాలన అద్భుతంగా సాగిందని.. ఎన్నికల్లో అక్రమాలు చేసి కూటమి గెలిచేసిందని ఇప్పటికీ చెప్పుకుంటూ జనాలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాజీ మంత్రి రోజా వ్యాఖ్యలను చూస్తే వైసీపీ నేతలు ఎప్పటికీ రియాలిటీలోకి రాలేరేమో అనిపిస్తుంది. చాలామంది వైసీపీ నేతల్లాగే ఈవీఎంలతో మాయ చేసి కూటమి గెలిచేసిందనే వాదననే రోజా కూడా వినిపించింది.

ఎన్నికల ఫలితాల రోజు రోజా రెండు రౌండ్ల ఫలితాలు వచ్చేసరికే కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అందుకు కారణాన్ని ఆమె ఈ ఇంటర్వ్యూలో వివరించింది. తొలి రౌండ్లో తనకు బాగా కలిసొచ్చే వడమాల పేట ప్రాంతం ఓట్లు లెక్కిస్తారని.. అది వైసీపీకి కంచుకోట లాంటి ప్రాంతం అని.. అక్కడ ప్రత్యర్థికి 3 వేల మెజారిటీ రావడం చూసి ఈ ఎన్నికలు సక్రమంగా జరగలేదని.. ఈవీఎంల్లో ఏదో చేశారని అర్థమై తాను కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయినట్లు రోజా తెలిపారు.

నియోజకవర్గంలో తాను ఎంతో చేశానని.. సంక్షేమ పథకాలను గొప్పగా అమలు చేశానని.. అలాంటిది దివంగత టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు కూడా రెండు మూడు వేల ఓట్లతో గెలిచిన నియోజకవర్గంలో ఆయన కొడుకు గాలి భాను ప్రకాష్ ఎలా 40 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తాడని రోజా ప్రశ్నించారు. ఎన్నికలకు రెండు నెలల ముందు చిత్తూరు జిల్లాలో పోలీస్ ఉన్నతాధికారులందరినీ మార్చేశారని.. ప్రభుత్వ వ్యవస్థే కూటమి చేతుల్లోకి వెళ్లిపోయినట్లు అనిపించిందని రోజా వివరించింది. జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటికీ ఎంతో మంచి చేశారని.. అలాంటి వ్యక్తిని కాదని వేరే వాళ్లకు జనం ఓటేసే పరిస్థితే లేదని.. అందుకే ఈ ఎన్నికలను తాము నమ్మడం లేదని ఆమె స్పష్టం చేశారు.

This post was last modified on November 25, 2024 10:45 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

2 hours ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

2 hours ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

3 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

5 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

5 hours ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

6 hours ago