Political News

రోజా.. కౌంటింగ్ నుంచి ఎందుకు వెళ్లిపోయింది?

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఆరు నెలలు దాటిపోయింది. ఫలితాలు వచ్చి కూడా ఆరు నెలలు కావస్తోంది. ఐతే ఆ ఎన్నికల్లో ఘోర పరాభవం చవిచూసిన వైసీపీ నేతలు ఇప్పటికీ వాస్తవంలోకి రాలేకపోతున్నట్లు కనిపిస్తోంది. అధికారంలో ఉండగా జగన్ అండ్ కో ఎన్నెన్ని తప్పులు చేశారో.. పాలన ఎంత ఘోరంగా సాగిందో తెలిసిందే. కానీ ఆ విషయాలను ఇప్పటికీ ఆ పార్టీ నేతలు అంగీకరించలేకపోతున్నారు.

తమ పాలన అద్భుతంగా సాగిందని.. ఎన్నికల్లో అక్రమాలు చేసి కూటమి గెలిచేసిందని ఇప్పటికీ చెప్పుకుంటూ జనాలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాజీ మంత్రి రోజా వ్యాఖ్యలను చూస్తే వైసీపీ నేతలు ఎప్పటికీ రియాలిటీలోకి రాలేరేమో అనిపిస్తుంది. చాలామంది వైసీపీ నేతల్లాగే ఈవీఎంలతో మాయ చేసి కూటమి గెలిచేసిందనే వాదననే రోజా కూడా వినిపించింది.

ఎన్నికల ఫలితాల రోజు రోజా రెండు రౌండ్ల ఫలితాలు వచ్చేసరికే కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అందుకు కారణాన్ని ఆమె ఈ ఇంటర్వ్యూలో వివరించింది. తొలి రౌండ్లో తనకు బాగా కలిసొచ్చే వడమాల పేట ప్రాంతం ఓట్లు లెక్కిస్తారని.. అది వైసీపీకి కంచుకోట లాంటి ప్రాంతం అని.. అక్కడ ప్రత్యర్థికి 3 వేల మెజారిటీ రావడం చూసి ఈ ఎన్నికలు సక్రమంగా జరగలేదని.. ఈవీఎంల్లో ఏదో చేశారని అర్థమై తాను కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయినట్లు రోజా తెలిపారు.

నియోజకవర్గంలో తాను ఎంతో చేశానని.. సంక్షేమ పథకాలను గొప్పగా అమలు చేశానని.. అలాంటిది దివంగత టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు కూడా రెండు మూడు వేల ఓట్లతో గెలిచిన నియోజకవర్గంలో ఆయన కొడుకు గాలి భాను ప్రకాష్ ఎలా 40 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తాడని రోజా ప్రశ్నించారు. ఎన్నికలకు రెండు నెలల ముందు చిత్తూరు జిల్లాలో పోలీస్ ఉన్నతాధికారులందరినీ మార్చేశారని.. ప్రభుత్వ వ్యవస్థే కూటమి చేతుల్లోకి వెళ్లిపోయినట్లు అనిపించిందని రోజా వివరించింది. జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటికీ ఎంతో మంచి చేశారని.. అలాంటి వ్యక్తిని కాదని వేరే వాళ్లకు జనం ఓటేసే పరిస్థితే లేదని.. అందుకే ఈ ఎన్నికలను తాము నమ్మడం లేదని ఆమె స్పష్టం చేశారు.

Satya

Recent Posts

అమ‌ర్నాథా… ఇప్పుడు కూడా రాజ‌కీయ‌మేంట‌య్యా!

స్వ‌తంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్న‌ట్టుగా వైసీపీ నాయ‌కుల‌కు ఎక్క‌డ ఎలా వ్య‌వ‌హరించాలో తెలియ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.…

43 minutes ago

మీనాక్షికి షాకిచ్చిన ఈసీ… ఏం జరిగింది?

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…

1 hour ago

ప‌వ‌న్‌-లోకేష్‌… బాధ్య‌త పంచుకున్నారు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌లు.. కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క రోల్ పోషిస్తున్న విష‌యం తెలిసిందే.…

2 hours ago

మ్యాజిక్ చేయడానికి బుల్లితెరకు వెళ్తున్నారు

రెగ్యులర్ గా టాలీవుడ్ ని ఫాలో అయ్యేవాళ్ళకు మ్యాజిక్ అంటే వెంటనే గుర్తొచ్చే కాంబినేషన్ గౌతమ్ తిన్ననూరి - అనిరుద్…

2 hours ago

స్పందించిన బన్నీ… సర్దుకుంటాయా అన్నీ

మెగా ఫ్యాన్స్, ఐకాన్ స్టార్ అభిమానుల మధ్య బయటికి కనిపించని కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. హీరోలు వాళ్ళు వాళ్ళు…

4 hours ago

ప్యారడైజ్ కొత్త ముహూర్తం ఫిక్సయ్యిందా

ప్యాన్ ఇండియా సినిమాలకు వాయిదాలు మంచి నీళ్లు తాగినంత సులభంగా మారిపోయాయి. రెండు కన్నా తక్కువ డేట్లు మార్చుకుని థియేటర్లకు…

5 hours ago