ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఆరు నెలలు దాటిపోయింది. ఫలితాలు వచ్చి కూడా ఆరు నెలలు కావస్తోంది. ఐతే ఆ ఎన్నికల్లో ఘోర పరాభవం చవిచూసిన వైసీపీ నేతలు ఇప్పటికీ వాస్తవంలోకి రాలేకపోతున్నట్లు కనిపిస్తోంది. అధికారంలో ఉండగా జగన్ అండ్ కో ఎన్నెన్ని తప్పులు చేశారో.. పాలన ఎంత ఘోరంగా సాగిందో తెలిసిందే. కానీ ఆ విషయాలను ఇప్పటికీ ఆ పార్టీ నేతలు అంగీకరించలేకపోతున్నారు.
తమ పాలన అద్భుతంగా సాగిందని.. ఎన్నికల్లో అక్రమాలు చేసి కూటమి గెలిచేసిందని ఇప్పటికీ చెప్పుకుంటూ జనాలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాజీ మంత్రి రోజా వ్యాఖ్యలను చూస్తే వైసీపీ నేతలు ఎప్పటికీ రియాలిటీలోకి రాలేరేమో అనిపిస్తుంది. చాలామంది వైసీపీ నేతల్లాగే ఈవీఎంలతో మాయ చేసి కూటమి గెలిచేసిందనే వాదననే రోజా కూడా వినిపించింది.
ఎన్నికల ఫలితాల రోజు రోజా రెండు రౌండ్ల ఫలితాలు వచ్చేసరికే కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అందుకు కారణాన్ని ఆమె ఈ ఇంటర్వ్యూలో వివరించింది. తొలి రౌండ్లో తనకు బాగా కలిసొచ్చే వడమాల పేట ప్రాంతం ఓట్లు లెక్కిస్తారని.. అది వైసీపీకి కంచుకోట లాంటి ప్రాంతం అని.. అక్కడ ప్రత్యర్థికి 3 వేల మెజారిటీ రావడం చూసి ఈ ఎన్నికలు సక్రమంగా జరగలేదని.. ఈవీఎంల్లో ఏదో చేశారని అర్థమై తాను కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయినట్లు రోజా తెలిపారు.
నియోజకవర్గంలో తాను ఎంతో చేశానని.. సంక్షేమ పథకాలను గొప్పగా అమలు చేశానని.. అలాంటిది దివంగత టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు కూడా రెండు మూడు వేల ఓట్లతో గెలిచిన నియోజకవర్గంలో ఆయన కొడుకు గాలి భాను ప్రకాష్ ఎలా 40 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తాడని రోజా ప్రశ్నించారు. ఎన్నికలకు రెండు నెలల ముందు చిత్తూరు జిల్లాలో పోలీస్ ఉన్నతాధికారులందరినీ మార్చేశారని.. ప్రభుత్వ వ్యవస్థే కూటమి చేతుల్లోకి వెళ్లిపోయినట్లు అనిపించిందని రోజా వివరించింది. జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటికీ ఎంతో మంచి చేశారని.. అలాంటి వ్యక్తిని కాదని వేరే వాళ్లకు జనం ఓటేసే పరిస్థితే లేదని.. అందుకే ఈ ఎన్నికలను తాము నమ్మడం లేదని ఆమె స్పష్టం చేశారు.
This post was last modified on November 25, 2024 10:45 am
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…