Political News

ఇక‌, ‘అదానీ పార్ల‌మెంటు’.. నేటి నుంచి స‌మావేశాలు!

భార‌త పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాలు సోమ‌వారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈ స‌మావేశాల్లోనే వ‌క్ఫ్ బోర్డు స‌వ‌ర‌ణ బిల్లు స‌హా.. జ‌మిలి ఎన్నిక‌లకు సంబంధించిన బిల్లును కూడా కేంద్రం పార్ల‌మెంటులో ప్ర‌వేశ పెట్టేందుకు సిద్ధ‌మైంది. అదేవిధంగా జీఎస్టీలో చ‌ట్టంలో మార్పులు(రాష్ట్రాలు కోరిన‌ప్పుడ‌ల్లా ఈ చ‌ట్టంలో స‌వ‌ర‌ణ‌లు చేసుకునే అవ‌కాశం. త‌ద్వారా మ‌రింత ప‌న్నులు విధించే అవ‌కాశం ఏర్ప‌డుతుంది) చేప‌ట్టే స‌వ‌ర‌ణ బిల్లును కూడా ఈ స‌భ‌ల్లోనే ప్ర‌వేశ పెట్టాల‌ని నిర్ణ‌యించింది. అలానే ముస్లింల‌కు సంబంధించి వ‌క్ఫ్ ఆస్తుల విష‌యంలో వారికి ఇచ్చిన ప్ర‌త్యేక అధికారాల‌ను క‌ట్ చేసేలా స‌వ‌ర‌ణ బిల్లును రూపొందించారు.

ఇలా ప‌లు బిల్లుల‌తో కేంద్రం రెడీ అయింది. దీనికి సంబంధించి అన్ని ప‌క్షాల‌ను అలెర్ట్ చేసింది. స‌భ‌ల‌ను ప్ర‌శాంతంగా జ‌రిగేలా స‌హ‌క‌రించాల‌ని ఎప్పుడూ పాడే పాట‌నే మ‌రోసారి పాడారు. అయితే.. తొలిరోజే ప్ర‌తిప‌క్ష పార్టీల నుంచి నిర‌స‌న‌, ఆందోళ‌న రెండూ వ్య‌క్త‌మ‌య్యాయి. ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త గౌతం అదానీపై అమెరికాలో కేసులు న‌మోదు కావ‌డం, భార‌త దేశంలోని ప‌లు రాష్ట్రాల‌కు ఆయ‌న లంచాలు ఇవ్వ‌డం వంటి కీల‌క అంశాల‌ను ప్ర‌తిప‌క్షాలు లేవ‌నెత్తాయి. ఈ క్ర‌మంలోనే పార్ల‌మెంట‌రీ సంయుక్త సంఘాన్ని ఏర్పాటు చేయాల‌ని, ఈ లంచాల వ్య‌వ‌హారంపై నిగ్గు తేల్చాల‌ని కూడా ప‌ట్టుబ‌ట్టాయి.

ఈ నేప‌థ్యంలో సోమ‌వారం నుంచి ప్రారంభ‌మ‌య్యే స‌మావేశాల్లో అదానీ వ్య‌వ‌హారం, ఆయ‌న‌పై అమెరికాలో న‌మోదైన కేసులు, ఏపీ స‌హా ప‌లు రాష్ట్రాల్లోని ప్ర‌భుత్వాల‌కు ఆయ‌న ఇచ్చిన లంచాలు వంటివి ప్ర‌ధానంగా ప్ర‌తిప‌క్షాలు లేవ‌నెత్త‌నున్నాయ‌న్న‌ది సుస్ప‌ష్టంగా తెలుస్తోంది. ఇటు లోక్‌స‌భ‌లోను, అటు రాజ్య‌స‌భ‌లోనూ అదానీ వ్య‌వ‌హార‌మే ప్ర‌తిప‌క్షాల‌కు ఇప్పుడు అందివ‌చ్చిన అస్త్రంగా మార‌నుంది. మ‌రీ ముఖ్యంగా టీడీపీ ఇప్ప‌టికే రెడీ అయింది. అదానీ-జ‌గ‌న్ లంచాల విష‌యాన్ని లోక్‌స‌భ‌లో ప్ర‌స్తావించాల‌ని సీఎం చంద్ర‌బాబు త‌న పార్టీ ఎంపీల‌కు తేల్చి చెప్పారు. దీంతో లోక్‌స‌భ‌లో ఆ పార్టీ ఎంపీలు ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించ‌నున్నారు.

ఇక‌, కాంగ్రెస్ స‌హా.. ఇండియా కూట‌మి పార్టీల స‌భ్యులు ఉభ‌య స‌భ‌ల్లోనూ అదానీ విష‌యాన్నే ప్ర‌స్తావించ‌నున్నారు. అయితే.. మ‌హారాష్ట్ర‌లో ద‌క్కించుకున్న భారీ విజ‌యం స‌మా.. త‌మ ఓటు బ్యాంకు పెరగ‌డంతో బీజేపీ స‌భ్యులు ఆ విష‌యాన్ని పార్ల‌మెంటు వేదిక‌గా.. ప్ర‌స్తావించి కాంగ్రెస్‌ను ఇర‌కాటంలోకి నెట్ట‌వ‌చ్చు. ప్ర‌జా మ‌ద్దతు కోల్పోతున్నార‌ని, ఓటు బ్యాంకు హీనంగా మారింద‌ని ఇప్ప‌టికే ప్ర‌ధాని చేసిన వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో మ‌హారాష్ట్ర స‌హా ఇత‌ర ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఓట‌మిని ప్ర‌స్తావించి.. కౌంట‌ర్ ఇచ్చే అవ‌కాశం ఉంది. ఏదేమైనా.. ఈ పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాలు ‘అదానీ’ స‌మావేశాలుగా అయితే మార‌డం ఖాయం!!

This post was last modified on November 25, 2024 6:24 am

Share

Recent Posts

చెల్లెలిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

క‌లిసి రాజ‌కీయం చేయ‌క‌పోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మ‌ధ్య కొన్ని పోలిక‌లు క‌నిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణ‌లో ఈ…

27 minutes ago

చెన్నైలో చింటు మేనియా

సోష‌ల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. త‌న సినిమాల ఈవెంట్ల‌లో, ఇంట‌ర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్ర‌ముఖ తెలుగు…

30 minutes ago

కనకరాజు లెక్కలు సేఫ్ గానే ఉన్నాయా?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…

38 minutes ago

బాగుంది ఆదివారం… థియేటర్లలో జన సందోహం

ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…

1 hour ago

కాలేజీలు కాదు… విద్యార్థుల ఖాతాల్లోకే ఫీజు రీయంబర్స్మెంట్ జమ?

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…

1 hour ago

పోలీసు యూనిఫాంలో ఉగ్ర‌వాదులు… ఢిల్లీ నిర‌స‌న‌ల్లో కుట్ర‌?

నీట్ ప్ర‌శ్న‌ప‌త్రం లీకేజీకి వ్య‌తిరేకంగా విద్యార్థులు చేప‌ట్టిన ఢిల్లీ నిర‌స‌న‌లో ఉగ్ర‌వాదుల కుట్ర కోణం బ‌య‌ట ప‌డింద‌ని ఢిల్లీ టాస్క్‌ఫోర్స్…

2 hours ago