భారత పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈ సమావేశాల్లోనే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు సహా.. జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లును కూడా కేంద్రం పార్లమెంటులో ప్రవేశ పెట్టేందుకు సిద్ధమైంది. అదేవిధంగా జీఎస్టీలో చట్టంలో మార్పులు(రాష్ట్రాలు కోరినప్పుడల్లా ఈ చట్టంలో సవరణలు చేసుకునే అవకాశం. తద్వారా మరింత పన్నులు విధించే అవకాశం ఏర్పడుతుంది) చేపట్టే సవరణ బిల్లును కూడా ఈ సభల్లోనే ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది. అలానే ముస్లింలకు సంబంధించి వక్ఫ్ ఆస్తుల విషయంలో వారికి ఇచ్చిన ప్రత్యేక అధికారాలను కట్ చేసేలా సవరణ బిల్లును రూపొందించారు.
ఇలా పలు బిల్లులతో కేంద్రం రెడీ అయింది. దీనికి సంబంధించి అన్ని పక్షాలను అలెర్ట్ చేసింది. సభలను ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని ఎప్పుడూ పాడే పాటనే మరోసారి పాడారు. అయితే.. తొలిరోజే ప్రతిపక్ష పార్టీల నుంచి నిరసన, ఆందోళన రెండూ వ్యక్తమయ్యాయి. ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతం అదానీపై అమెరికాలో కేసులు నమోదు కావడం, భారత దేశంలోని పలు రాష్ట్రాలకు ఆయన లంచాలు ఇవ్వడం వంటి కీలక అంశాలను ప్రతిపక్షాలు లేవనెత్తాయి. ఈ క్రమంలోనే పార్లమెంటరీ సంయుక్త సంఘాన్ని ఏర్పాటు చేయాలని, ఈ లంచాల వ్యవహారంపై నిగ్గు తేల్చాలని కూడా పట్టుబట్టాయి.
ఈ నేపథ్యంలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే సమావేశాల్లో అదానీ వ్యవహారం, ఆయనపై అమెరికాలో నమోదైన కేసులు, ఏపీ సహా పలు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలకు ఆయన ఇచ్చిన లంచాలు వంటివి ప్రధానంగా ప్రతిపక్షాలు లేవనెత్తనున్నాయన్నది సుస్పష్టంగా తెలుస్తోంది. ఇటు లోక్సభలోను, అటు రాజ్యసభలోనూ అదానీ వ్యవహారమే ప్రతిపక్షాలకు ఇప్పుడు అందివచ్చిన అస్త్రంగా మారనుంది. మరీ ముఖ్యంగా టీడీపీ ఇప్పటికే రెడీ అయింది. అదానీ-జగన్ లంచాల విషయాన్ని లోక్సభలో ప్రస్తావించాలని సీఎం చంద్రబాబు తన పార్టీ ఎంపీలకు తేల్చి చెప్పారు. దీంతో లోక్సభలో ఆ పార్టీ ఎంపీలు ఈ విషయాన్ని ప్రస్తావించనున్నారు.
ఇక, కాంగ్రెస్ సహా.. ఇండియా కూటమి పార్టీల సభ్యులు ఉభయ సభల్లోనూ అదానీ విషయాన్నే ప్రస్తావించనున్నారు. అయితే.. మహారాష్ట్రలో దక్కించుకున్న భారీ విజయం సమా.. తమ ఓటు బ్యాంకు పెరగడంతో బీజేపీ సభ్యులు ఆ విషయాన్ని పార్లమెంటు వేదికగా.. ప్రస్తావించి కాంగ్రెస్ను ఇరకాటంలోకి నెట్టవచ్చు. ప్రజా మద్దతు కోల్పోతున్నారని, ఓటు బ్యాంకు హీనంగా మారిందని ఇప్పటికే ప్రధాని చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మహారాష్ట్ర సహా ఇతర ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిని ప్రస్తావించి.. కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా.. ఈ పార్లమెంటు శీతాకాల సమావేశాలు ‘అదానీ’ సమావేశాలుగా అయితే మారడం ఖాయం!!
విడుదలై రెండేళ్లు దాటినా కల్కి 2898 ఏడి మీద సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో ప్రస్తావన వస్తూనే ఉంటుంది.…
ఇటీవలే విడుదలైన లెనిన్ పైరసీ మూడు రోజల వరకు రాకపోవడం మూవీ లవర్స్ ని ఆశ్చర్యపరచడమే కాదు ఇండస్ట్రీ వర్గాలను…
చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసు అధికారే నిబంధనలను ఉల్లంఘించి వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్ శివారులోని గంధంగూడ–బైరాగిగూడ ప్రధాన రహదారిపై ఆరేళ్ల…
టాలీవుడ్ యంగ్ స్టార్స్ పర్సనల్ లైఫ్ లో జరిగిన మార్పులు, ఆ వెంటనే వారు అందుకున్న సక్సెస్ లపై నెటిజన్లు…
తెలుగులో ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీకి వంద కోట్ల వసూళ్లు రావడం అన్నది అనూహ్యమే. అందులోనూ అది ఫ్యామిలీ సినిమా…
వీకెండ్ వసూళ్లను ఘనంగా రాబట్టుకున్న లెనిన్ అసలు పరీక్ష మొదలుపెట్టింది. సోమవారం నుంచి ఆక్యుపెన్సీలు ఎలా ఉండబోతున్నాయనే దాని మీద…