Political News

బీజేపీకి ‘మ‌హా’ విజ‌యం!

మ‌హారాష్ట్ర‌లో బీజేపీ కూట‌మి మ‌హా విజ‌యం ద‌క్కించుకుంది. ఊహ‌ల‌కు సైతం అంద‌ని విధంగా దూకుడుగా ముందుకు సాగింది. తాజాగా జ‌రిగిన మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 288 స్థానాల‌కు గాను బీజేపీ నేతృత్వంలోని మ‌హాయుతి కూట‌మి క‌నీవినీ ఎరుగ‌ని విధంగా.. దూసుకుపోయింది. 210 స్థానాల వ‌ద్ద విజ‌య‌తీరానికి స‌గ‌ర్వంగా చేరుకుంది. ఇదేమీ మామూలు విష‌యం కాదు. 1990 త‌ర్వాత‌.. ఎన్నిక‌ల‌కు ముందు ఏర్ప‌డిన కూట‌మిని ప్ర‌జ‌లు గెలిపించారు.

ముఖ్యంగా బీజేపీకే ఈ క్రెడిట్ ద‌క్క‌నుంది. 2019లో ఏర్ప‌డిన శివ‌సేన‌-బీజేపీ కూట‌మి మ‌ధ్య‌లోనే ముక్కలైంది. సీఎం సీటు విష‌యంలో ఏర్ప‌డిన వివాదంతో శివ‌సేన పోయి పోయి కాంగ్రెస్‌తో చేతులు క‌లిపింది. అనంత‌ర కాలంలో బీజేపీ వేసిన ఎత్తుగ‌డ‌, రాజ‌కీయ వ్యూహాల‌తో శివ‌సేన నిలువునా చీలిపోయి.. బీజేపీతో చేతులు క‌లిపింది. దీనిపై అనేక విమ‌ర్శ‌లు వ‌చ్చినా.. తాజా ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు అస‌లైన శివ‌సేన‌గా ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని పార్టీకే ప‌ట్టం క‌ట్టారు.

ఇక‌, మ‌హాయుతిగా ఏర్ప‌డిన బీజేపీ-శివ‌సేన‌-ఎన్సీపీల‌కు ప్ర‌జ‌లు ప‌ట్టంక‌డ‌తారా? అన్న‌ది పెద్ద చిక్కు ప్ర‌శ్న‌గానే మారింది. ఉద్ద‌వ్ ఠాక్రే ప్ర‌భుత్వాన్ని కుప్ప‌కూల్చి.. బీజేపీ ఇక్క‌డ ప‌గ్గాలు చేప‌ట్టింద‌న్న విమ‌ర్శలు.. వాద‌న‌లు, విశ్లేష‌ణ‌లు.. ఉన్నా.. ప్ర‌జ‌ల‌పై ఆ ప్ర‌భావం చూపించ‌లేదు. బీజేపీ పేర్కొన్న అభివృద్ధితో కూడిన సంక్షేమానికి ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టార‌నే అనుకోవాలి. ముఖ్యంగా సీఎం ఏక్‌నాథ్ షిండే చివ‌రి ద‌శ‌లో అనుస‌రించిన వ్యూహానికి ప్ర‌జ‌లు మ‌ద్దతుగా నిలిచారు.

ఫ‌లితంగా 30 ఏళ్ల చ‌రిత్ర‌లో ఎప్పుడూ లేని విధంగా ఒకే కూట‌మికి 210 స్థానాల‌కు పైగా ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్ట డం గ‌మ‌నార్హం. నిజానికి ఇంత మెజారిటీ ద‌క్కుతుంద‌ని ఏ పార్టీ కూడా ఊహించ‌లేదు. చివ‌ర‌కు స‌ర్వేలు కూడా మ‌హాయుతి కూట‌మి స‌ర్కారుఏర్పాటు చేస్తుంద‌ని చెప్పినా.. ఇంత మెజారిటీ సంఖ్య‌లో సీట్లు ద‌క్కించుకుంటుందని ఎవ‌రూ అంచ‌నా వేయ‌లేక పోయారు. ఈ ప‌రిణామాలతో మ‌హారాష్ట్ర‌లో రాజ‌కీయ సంక్షోభం త‌లెత్తే అవ‌కాశం ఉంద‌న్న చ‌ర్చ‌ల‌కు ఫుల్ స్టాప్ ప‌డిన‌ట్ట‌యింది.

Satya

Recent Posts

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

4 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

5 hours ago

జ‌న‌’సేన’ జాగ్ర‌త్త ప‌డాలా?

ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…

7 hours ago

మీనాక్షి ఇష్యూ కాంగ్రెస్ ను ‘హర్ట్’ చేసింది!

ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…

8 hours ago

మోదీ రికార్డును బద్దలుకొట్టడం కష్టమే!

భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…

9 hours ago

పవన్ నోట మరోమారు ‘తెలంగాణ’ మాట

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమారు తెలంగాణ అంశం మీద నోరు విప్పారు. భారత దేశంలో…

10 hours ago