Political News

బీజేపీకి ‘మ‌హా’ విజ‌యం!

మ‌హారాష్ట్ర‌లో బీజేపీ కూట‌మి మ‌హా విజ‌యం ద‌క్కించుకుంది. ఊహ‌ల‌కు సైతం అంద‌ని విధంగా దూకుడుగా ముందుకు సాగింది. తాజాగా జ‌రిగిన మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 288 స్థానాల‌కు గాను బీజేపీ నేతృత్వంలోని మ‌హాయుతి కూట‌మి క‌నీవినీ ఎరుగ‌ని విధంగా.. దూసుకుపోయింది. 210 స్థానాల వ‌ద్ద విజ‌య‌తీరానికి స‌గ‌ర్వంగా చేరుకుంది. ఇదేమీ మామూలు విష‌యం కాదు. 1990 త‌ర్వాత‌.. ఎన్నిక‌ల‌కు ముందు ఏర్ప‌డిన కూట‌మిని ప్ర‌జ‌లు గెలిపించారు.

ముఖ్యంగా బీజేపీకే ఈ క్రెడిట్ ద‌క్క‌నుంది. 2019లో ఏర్ప‌డిన శివ‌సేన‌-బీజేపీ కూట‌మి మ‌ధ్య‌లోనే ముక్కలైంది. సీఎం సీటు విష‌యంలో ఏర్ప‌డిన వివాదంతో శివ‌సేన పోయి పోయి కాంగ్రెస్‌తో చేతులు క‌లిపింది. అనంత‌ర కాలంలో బీజేపీ వేసిన ఎత్తుగ‌డ‌, రాజ‌కీయ వ్యూహాల‌తో శివ‌సేన నిలువునా చీలిపోయి.. బీజేపీతో చేతులు క‌లిపింది. దీనిపై అనేక విమ‌ర్శ‌లు వ‌చ్చినా.. తాజా ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు అస‌లైన శివ‌సేన‌గా ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని పార్టీకే ప‌ట్టం క‌ట్టారు.

ఇక‌, మ‌హాయుతిగా ఏర్ప‌డిన బీజేపీ-శివ‌సేన‌-ఎన్సీపీల‌కు ప్ర‌జ‌లు ప‌ట్టంక‌డ‌తారా? అన్న‌ది పెద్ద చిక్కు ప్ర‌శ్న‌గానే మారింది. ఉద్ద‌వ్ ఠాక్రే ప్ర‌భుత్వాన్ని కుప్ప‌కూల్చి.. బీజేపీ ఇక్క‌డ ప‌గ్గాలు చేప‌ట్టింద‌న్న విమ‌ర్శలు.. వాద‌న‌లు, విశ్లేష‌ణ‌లు.. ఉన్నా.. ప్ర‌జ‌ల‌పై ఆ ప్ర‌భావం చూపించ‌లేదు. బీజేపీ పేర్కొన్న అభివృద్ధితో కూడిన సంక్షేమానికి ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టార‌నే అనుకోవాలి. ముఖ్యంగా సీఎం ఏక్‌నాథ్ షిండే చివ‌రి ద‌శ‌లో అనుస‌రించిన వ్యూహానికి ప్ర‌జ‌లు మ‌ద్దతుగా నిలిచారు.

ఫ‌లితంగా 30 ఏళ్ల చ‌రిత్ర‌లో ఎప్పుడూ లేని విధంగా ఒకే కూట‌మికి 210 స్థానాల‌కు పైగా ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్ట డం గ‌మ‌నార్హం. నిజానికి ఇంత మెజారిటీ ద‌క్కుతుంద‌ని ఏ పార్టీ కూడా ఊహించ‌లేదు. చివ‌ర‌కు స‌ర్వేలు కూడా మ‌హాయుతి కూట‌మి స‌ర్కారుఏర్పాటు చేస్తుంద‌ని చెప్పినా.. ఇంత మెజారిటీ సంఖ్య‌లో సీట్లు ద‌క్కించుకుంటుందని ఎవ‌రూ అంచ‌నా వేయ‌లేక పోయారు. ఈ ప‌రిణామాలతో మ‌హారాష్ట్ర‌లో రాజ‌కీయ సంక్షోభం త‌లెత్తే అవ‌కాశం ఉంద‌న్న చ‌ర్చ‌ల‌కు ఫుల్ స్టాప్ ప‌డిన‌ట్ట‌యింది.

This post was last modified on November 23, 2024 1:06 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎన్నిక‌ల ఎఫెక్ట్‌: కేర‌ళ‌.. ఇక‌పై కేర‌ళం!

త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నికలు జ‌ర‌గ‌నున్న రాష్ట్రాల విష‌యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు కీల‌క క‌స‌ర‌త్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…

1 hour ago

సత్యతో పోలికలు సబబు కాదు

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…

3 hours ago

ఒక్క ఎపిసోడుతో హాట్ టాపిక్ అయ్యింది

ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…

3 hours ago

బిర్యానీ రేంజులో ‘ప్యారడైజ్’ పాట

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…

4 hours ago

తిరుమల జీవోలపై చంద్రబాబు క్లారిటీ

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…

5 hours ago

శ్రీ విష్ణుకు సన్నాఫ్ సత్యమూర్తి ఇచ్చిన షాక్

చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్‌లో మంచి క్రేజ్‌తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…

6 hours ago