అమెరికాలో అదానీపై కేసు వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలను కూడా కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ మాజీ సీఎం జగన్ కు అదానీ లంచం ఇచ్చారని, సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అదానీతో జగన్ కు లింకులు ఉన్నాయని ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారంపై ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నేతలు స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో అదానీ- జగన్ ఇష్యూపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు.
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అదానీ ముడుపులిచ్చారని కోర్టు చెప్పిందని, అయితే ఎవరికి ఇచ్చారో కూడా చెప్పమనండి అని కేటీఆర్ అన్నారు. కోర్టు చెప్పిన తర్వాత చట్టం, ధర్మం, న్యాయం ప్రకారం కచ్చితంగా చర్యలు తీసుకోవాలని, అందులో తప్పు లేదని అన్నారు. లంచం ఎవరికిచ్చినా సరే…అది ఎవరైనా సరే..మీడియా ప్రతినిధులు అంటున్నట్లు జగన్ అయినా సరే చర్యలు తీసుకోవాలని అన్నారు. అయితే, ముడుపులు ఎవరికిచ్చారో తనకు తెలియదని…ఇచ్చిన మాట నిజమే అయితే తప్పకుండా చర్యలు.తీసుకోవాలని కేటీఆర్ కోరారు.
తెలంగాణలో అదానీ వ్యాపార సామ్రాజ్యం విస్తరించేందుకు రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అదానీ తెలంగాణకు రాలేదని, కాంగ్రెస్ అధిష్టానానికి తెలియకుండానే అదానీకి రేవంత్ రెడ్డి రెడ్ కార్పెట్ పరిచారా అని కేటీఆర్ ప్రశ్నించారు. అదానీ కంపెనీలతో 12,400 కోట్ల రూపాయల విలువైన ఎంవోయూలు రేవంత్ రెడ్డి కుదుర్చుకున్నారని ఆరోపించారు.
విద్యుత్ ప్రాజెక్టులను అదానీకి అప్పగించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నించారని, ఈ క్రమంలోనే స్కిల్ యూనివర్సిటీకి ఆయన 100 కోట్ల రూపాయల విరాళం కూడా ఇచ్చారని సంచలన ఆరోపణ చేశారు. రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ప్రభుత్వంతో అదాని కంపెనీలు చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
This post was last modified on November 23, 2024 10:00 am
స్టార్ పవర్ అంటే మాటల్లో కొలిచేది కాదు. దాని సత్తా ఏ స్థాయిలో ఉంటుదంటే ఒక్కసారి ట్రేడ్ వర్గాలకు సైతం…
ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న శ్రీనివాస మంగాపురం మీద సినిమా కంటే ఎక్కువగా మహేష్ బాబు ఆ మూవీ…
ఈ రోజుల్లో పెద్ద స్టార్లు థియేటర్లకు వచ్చి సినిమాలు చూడడం అన్నది దాదాపు అసాధ్యంగా మారిపోయింది. మిడ్ రేంజ్ హీరోలు…
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన జనసేన నాయకుడు, సీనియర్ నేత ఆరణి శ్రీనివాసులు రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర…
కొందరు నటనలోకి రావాలని ముందే ఒక లక్ష్యం పెట్టుకుని పని చేస్తారు. కొందరు అనుకోకుండా ఈ రంగంలోకి అడుగు పెడతారు.…
టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరి.. పార్టీ నాయకులకు బాగా కలిసి వస్తోందన్నవాదన వినిపిస్తోంది. ఇప్పటికి రెండు సంవత్సరాలుగా చంద్రబాబు.. తమ్ముళ్లకు…