Political News

జగన్ లంచం తీసుకొని ఉంటే శిక్షించాలి: కేటీఆర్

అమెరికాలో అదానీపై కేసు వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలను కూడా కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ మాజీ సీఎం జగన్ కు అదానీ లంచం ఇచ్చారని, సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అదానీతో జగన్ కు లింకులు ఉన్నాయని ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారంపై ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నేతలు స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో అదానీ- జగన్ ఇష్యూపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు.

సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అదానీ ముడుపులిచ్చారని కోర్టు చెప్పిందని, అయితే ఎవరికి ఇచ్చారో కూడా చెప్పమనండి అని కేటీఆర్ అన్నారు. కోర్టు చెప్పిన తర్వాత చట్టం, ధర్మం, న్యాయం ప్రకారం కచ్చితంగా చర్యలు తీసుకోవాలని, అందులో తప్పు లేదని అన్నారు. లంచం ఎవరికిచ్చినా సరే…అది ఎవరైనా సరే..మీడియా ప్రతినిధులు అంటున్నట్లు జగన్ అయినా సరే చర్యలు తీసుకోవాలని అన్నారు. అయితే, ముడుపులు ఎవరికిచ్చారో తనకు తెలియదని…ఇచ్చిన మాట నిజమే అయితే తప్పకుండా చర్యలు.తీసుకోవాలని కేటీఆర్ కోరారు.

తెలంగాణలో అదానీ వ్యాపార సామ్రాజ్యం విస్తరించేందుకు రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అదానీ తెలంగాణకు రాలేదని, కాంగ్రెస్ అధిష్టానానికి తెలియకుండానే అదానీకి రేవంత్ రెడ్డి రెడ్ కార్పెట్ పరిచారా అని కేటీఆర్ ప్రశ్నించారు. అదానీ కంపెనీలతో 12,400 కోట్ల రూపాయల విలువైన ఎంవోయూలు రేవంత్ రెడ్డి కుదుర్చుకున్నారని ఆరోపించారు.

విద్యుత్ ప్రాజెక్టులను అదానీకి అప్పగించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నించారని, ఈ క్రమంలోనే స్కిల్ యూనివర్సిటీకి ఆయన 100 కోట్ల రూపాయల విరాళం కూడా ఇచ్చారని సంచలన ఆరోపణ చేశారు. రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ప్రభుత్వంతో అదాని కంపెనీలు చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

This post was last modified on November 23, 2024 10:00 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

హిట్ 3 హింస అంచనాలకు మించి

ఇంకో పద్దెనిమిది రోజుల్లో హిట్ 3 ది థర్డ్ కేస్ విడుదల కానుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని 2…

18 minutes ago

‘టాప్’ లేపిన తెలుగు రాష్ట్రాలు

తెలుగు రాష్ట్రాలు సత్తా చాటుతున్నాయి. వృద్ధి రేటులో ఇప్పటికే గణనీయ వృద్ధిని సాధించిన తెలుగు రాష్ట్రాలు తాజాగా ద్రవ్యోల్బణం (Inflation)…

2 hours ago

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బ్రిడ్జ్.. చైనా అద్భుత సృష్టి!

ఈమధ్య AI టెక్నాలజీతో హాట్ టాపిక్ గా నిలిచిన చైనా టారిఫ్ వార్ తో కూడా అమెరికాతో పోటీ పడడం…

6 hours ago

మంచి నిర్మాతకు దెబ్బ మీద దెబ్బ

తెలుగులో ఒకప్పుడు వెలుగు వెలిగిన నిర్మాతలు చాలామంది కనుమరుగైపోయారు. కానీ అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి కొద్ది మంది…

7 hours ago

బాబు మాటతో ఆక్వాకు భరోసా దక్కింది!

అగ్రరాజ్యం అమెరికా కొత్తగా సుంకాల పెంపు కారణంగా ఏపీలో ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం పడినా... కూటమి సర్కారు తీసుకున్న…

7 hours ago

వీడియో : కొడుకుని తీసుకొని ఇంటికి తిరిగి వచ్చిన పవన్ కళ్యాణ్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ తో కలిసి…

8 hours ago