Political News

జగన్ లంచం తీసుకొని ఉంటే శిక్షించాలి: కేటీఆర్

అమెరికాలో అదానీపై కేసు వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలను కూడా కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ మాజీ సీఎం జగన్ కు అదానీ లంచం ఇచ్చారని, సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అదానీతో జగన్ కు లింకులు ఉన్నాయని ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారంపై ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నేతలు స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో అదానీ- జగన్ ఇష్యూపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు.

సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అదానీ ముడుపులిచ్చారని కోర్టు చెప్పిందని, అయితే ఎవరికి ఇచ్చారో కూడా చెప్పమనండి అని కేటీఆర్ అన్నారు. కోర్టు చెప్పిన తర్వాత చట్టం, ధర్మం, న్యాయం ప్రకారం కచ్చితంగా చర్యలు తీసుకోవాలని, అందులో తప్పు లేదని అన్నారు. లంచం ఎవరికిచ్చినా సరే…అది ఎవరైనా సరే..మీడియా ప్రతినిధులు అంటున్నట్లు జగన్ అయినా సరే చర్యలు తీసుకోవాలని అన్నారు. అయితే, ముడుపులు ఎవరికిచ్చారో తనకు తెలియదని…ఇచ్చిన మాట నిజమే అయితే తప్పకుండా చర్యలు.తీసుకోవాలని కేటీఆర్ కోరారు.

తెలంగాణలో అదానీ వ్యాపార సామ్రాజ్యం విస్తరించేందుకు రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అదానీ తెలంగాణకు రాలేదని, కాంగ్రెస్ అధిష్టానానికి తెలియకుండానే అదానీకి రేవంత్ రెడ్డి రెడ్ కార్పెట్ పరిచారా అని కేటీఆర్ ప్రశ్నించారు. అదానీ కంపెనీలతో 12,400 కోట్ల రూపాయల విలువైన ఎంవోయూలు రేవంత్ రెడ్డి కుదుర్చుకున్నారని ఆరోపించారు.

విద్యుత్ ప్రాజెక్టులను అదానీకి అప్పగించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నించారని, ఈ క్రమంలోనే స్కిల్ యూనివర్సిటీకి ఆయన 100 కోట్ల రూపాయల విరాళం కూడా ఇచ్చారని సంచలన ఆరోపణ చేశారు. రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ప్రభుత్వంతో అదాని కంపెనీలు చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Satya

Recent Posts

ఓజి… పెద్ది… విశ్వంభర ఏదీ

గత ఏడాది పవన్ కళ్యాణ్ ఓజితో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. కెరీర్ లో మొదటిసారి మూడు వందల కోట్ల క్లబ్బులోకి…

20 minutes ago

బాలకృష్ణ లైనప్ స్పష్టంగా ఉంది

సీనియర్లలో ఎక్కువ వేగంగా సినిమాలు చేస్తున్న హీరోల్లో మొదటి స్థానం బాలకృష్ణకే ఇవ్వాలి. ఎందుకంటే భోళాశంకర్ తర్వాత చిరంజీవి ఏకంగా…

29 minutes ago

ఈసారి పాదయాత్ర ఈజీ కాదేమో జగన్

ఇప్ప‌టి వ‌ర‌కు ఒక లెక్క‌.. ఇక నుంచి మరో లెక్క‌.. అన్న‌ట్టుగా వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ ప‌రిస్థితి…

1 hour ago

పట్టు వదలకుండా పరిగెత్తాలి పెద్ది

పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…

2 hours ago

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

7 hours ago

కేంద్ర మంత్రుల ‘కార్ పూలింగ్’ షురూ!

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇందన పొదుపు దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశాక… మన…

7 hours ago