Political News

జ‌గ‌న్ రాజ‌కీయ అవినీతి ప‌రుడు: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్ పై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి విమ‌ర్శ‌లు గుప్పించారు. తాజాగా వెలుగు చూసిన ప్ర‌ముఖ పారిశ్రామిక గౌతం అదానీ లంచాల వ్య‌వ‌హారంలో జ‌గ‌న్ పాత్ర వ్య‌వ‌హారం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఈ క్ర‌మంలో ష‌ర్మిల స్పందిస్తూ.. జ‌గ‌న్ రాజ‌కీయ అవినీతి ప‌రుడు అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. లంచం ఇస్తే.. ఏపీని కూడా తాక‌ట్టు పెడ‌తాడ‌ని ఆమె అన్నారు. తాజాగా హైద‌రాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ష‌ర్మిల‌.. అదానీ వ్య‌వ‌హారాన్ని వ‌దిలి పెట్ట‌డానికి వీల్లేద‌న్నారు.

అదానీ నుంచి జ‌గ‌న్‌.. 1750 కోట్ల రూపాయ‌ల మేర‌కు లంచాలు తీసుకున్నారన్న‌ది నిజ‌మేన‌ని ష‌ర్మిల చెప్పారు. అమెరికా ఏజెన్సీలు ఆధారాల‌తో స‌హా బ‌య‌ట పెట్టాయ‌ని తెలిపారు. అదానీ-జ‌గ‌న్ అక్ర‌మ వ్య‌వ‌హారాల‌పై విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేశారు. ఆధారాలు ఉన్నాయ‌ని అమెరికా సంస్థ‌లు చెబుతున్నాయ‌ని, అమెరికా ఏజెన్సీలు వెల్ల‌డించే వ‌ర‌కు ఈ అక్ర‌మాలు వెలుగు చూడ‌లేద‌ని తెలిపారు.

జ‌గ‌న్ హ‌యాంలో ఏపీలో అవినీతి ప‌రాకాష్ట‌కు చేరింద‌ని ష‌ర్మిల చెప్పారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా అప్పుల పాలు చేయ‌డంతోపాటు.. అవినీతి మ‌యం కూడా చేశార‌ని దుయ్య‌బ‌ట్టారు. అమెరికా వ‌ర‌కు అవినీతి పాకించిన ఘ‌న‌త జ‌గ‌న్‌కే ద‌క్కుతుంద‌ని ఎద్దేవా చేశారు. జ‌గ‌న్ అవినీతి 2100 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని అంచ‌నాగా ఉంద‌ని ష‌ర్మిల తెలిపారు. అధికారం అడ్డు పెట్టుకుని అవినీతి చేయ‌డ‌మే కాకుండా.. పోర్టుల‌ను కూడా అదానీకి అప్ప‌నంగా అప్ప‌గించేశార‌ని ష‌ర్మిల నిప్పులు చెరిగారు.

This post was last modified on November 22, 2024 2:22 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కలెక్షన్లు అంటే కామెడీ అయిపోయింది

మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…

2 hours ago

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

4 hours ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

4 hours ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

4 hours ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

5 hours ago

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…

5 hours ago