Political News

జ‌గ‌న్ రాజ‌కీయ అవినీతి ప‌రుడు: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్ పై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి విమ‌ర్శ‌లు గుప్పించారు. తాజాగా వెలుగు చూసిన ప్ర‌ముఖ పారిశ్రామిక గౌతం అదానీ లంచాల వ్య‌వ‌హారంలో జ‌గ‌న్ పాత్ర వ్య‌వ‌హారం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఈ క్ర‌మంలో ష‌ర్మిల స్పందిస్తూ.. జ‌గ‌న్ రాజ‌కీయ అవినీతి ప‌రుడు అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. లంచం ఇస్తే.. ఏపీని కూడా తాక‌ట్టు పెడ‌తాడ‌ని ఆమె అన్నారు. తాజాగా హైద‌రాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ష‌ర్మిల‌.. అదానీ వ్య‌వ‌హారాన్ని వ‌దిలి పెట్ట‌డానికి వీల్లేద‌న్నారు.

అదానీ నుంచి జ‌గ‌న్‌.. 1750 కోట్ల రూపాయ‌ల మేర‌కు లంచాలు తీసుకున్నారన్న‌ది నిజ‌మేన‌ని ష‌ర్మిల చెప్పారు. అమెరికా ఏజెన్సీలు ఆధారాల‌తో స‌హా బ‌య‌ట పెట్టాయ‌ని తెలిపారు. అదానీ-జ‌గ‌న్ అక్ర‌మ వ్య‌వ‌హారాల‌పై విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేశారు. ఆధారాలు ఉన్నాయ‌ని అమెరికా సంస్థ‌లు చెబుతున్నాయ‌ని, అమెరికా ఏజెన్సీలు వెల్ల‌డించే వ‌ర‌కు ఈ అక్ర‌మాలు వెలుగు చూడ‌లేద‌ని తెలిపారు.

జ‌గ‌న్ హ‌యాంలో ఏపీలో అవినీతి ప‌రాకాష్ట‌కు చేరింద‌ని ష‌ర్మిల చెప్పారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా అప్పుల పాలు చేయ‌డంతోపాటు.. అవినీతి మ‌యం కూడా చేశార‌ని దుయ్య‌బ‌ట్టారు. అమెరికా వ‌ర‌కు అవినీతి పాకించిన ఘ‌న‌త జ‌గ‌న్‌కే ద‌క్కుతుంద‌ని ఎద్దేవా చేశారు. జ‌గ‌న్ అవినీతి 2100 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని అంచ‌నాగా ఉంద‌ని ష‌ర్మిల తెలిపారు. అధికారం అడ్డు పెట్టుకుని అవినీతి చేయ‌డ‌మే కాకుండా.. పోర్టుల‌ను కూడా అదానీకి అప్ప‌నంగా అప్ప‌గించేశార‌ని ష‌ర్మిల నిప్పులు చెరిగారు.

This post was last modified on November 22, 2024 2:22 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

గాడ్జిల్లా చూసాం….ఈ నాగ్జిల్లా ఏంటయ్యా

ప్రేక్షకులను బాలీవుడ్ మేకర్స్ ఎలా ఊహించుకుంటున్నారో కానీ కొన్ని సినిమాలు ప్రకటనల స్టేజి దగ్గరే నవ్వు తెప్పిస్తున్నాయి. నిన్న కార్తీక్…

3 minutes ago

ఫౌజీ హీరోయిన్ మీద వివాదమెందుకు

యావత్ దేశాన్ని కుదిపేసిన పెహల్గామ్ సంఘటన తర్వాత ఊహించని కోణాల్లో వివాదాలు తలెత్తున్నాయి. తాజాగా ప్రభాస్ ఫౌజీ ద్వారా హీరోయిన్…

19 minutes ago

వీరయ్య చౌదరి హత్య…రంగంలోకి 12 పోలీసు బృందాలు!

ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో టిడిపి నేత ముప్పవరపు వీరయ్య చౌదరిని దారుణంగా హతమార్చిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి…

52 minutes ago

పీఎస్ఆర్ ఆంజనేయులుకు 14 రోజుల రిమాండ్!

బాలీవుడ్ నటి కాదంబరి జత్వాని కిడ్నాప్ కేసులో ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ ఆర్ ఆంజనేయులు ఆరోపణలు ఎదుర్కొంటున్న…

1 hour ago

బేరాలు మొదలుపెట్టిన కుబేర

ధనుష్, నాగార్జున కలయికతో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న కుబేర పోస్ట్ ప్రొడక్షన్ పనులు దాదాపు కొలిక్కి వస్తున్నాయి. ఎడిటింగ్…

1 hour ago

‘పెద్ది’తో క్లాష్.. నాని ఏమన్నాడంటే?

ఇంకో వారం రోజుల్లో నాని కొత్త చిత్రం ‘హిట్-3’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఒక సినిమా రిలీజ్‌కు రెడీ చేసేలోపే ఇంకో…

2 hours ago