వైసీపీ యువ నాయకుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డికి సుప్రీంకోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 24న అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
ఏం జరిగింది?
వైసీపీ అధినేత జగన్ బాబాయి.. మాజీ ఎంపీ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో అవినాష్రెడ్డి నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో రెండేళ్ల కిందట ఆయనను సీబీఐ అరెస్టు చేసింది. ఆ వెంటనే తెలంగాణ హైకోర్టు అవినాష్రెడ్డికి బెయిల్ ఇచ్చేసింది. అయితే.. ఈ బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ.. గత ఏడాది వివేకానందరెడ్డికుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
పలు దఫాలుగా ఈ పిటిషన్పై విచారణ జరిగినా.. అవినాష్కు ఎలాంటి నోటీసులు రాలేదు. అయితే.. మంగళవారం జరిగిన విచారణలో సునీత తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. వివేకా హత్య కేసులో ఉన్న నిందితులను అవినాష్ రెడ్డి బెదిరిస్తున్నారని సుప్రీంకోర్టుకు తెలిపారు. ముఖ్యంగా ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరిని అవినాష్ అనుచరుడిగా ఉన్న శివశంకర్రెడ్డి బెదిరించారని సంబంధిత ఆధారాలను కోర్టుకు సమర్పించారు.
అదే విధంగా శివశంకర్రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య పదే పదే కడప జైలుకువెళ్లారని.. ఈయన జైలులో ఖైదీలకు వైద్య పరీక్షలు చేసే డాక్టర్ కాదని లూథ్రా తెలిపారు. కానీ, ఉద్దేశ పూర్వకంగా జైలుకు వెళ్లి నిందితులను , సాక్షులను బెదిరించే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. ఇవన్నీ అవినాష్ రెడ్డి ఆదేశాల మేరకు జరుగుతున్నవేనని వివరించారు. ఆయా వివరాలను నమోదు చేసుకున్న సుప్రీంకోర్టు ధర్మాసనం అవినాష్రెడ్డినోటీసులు జారీ చేసింది. అదేవిధంగా శివశంకర్రెడ్డి కి కూడా నోటీసులు ఇచ్చింది. విచారణకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 24వ తేదీకి వాయిదా వేసింది.
నిజామాబాద్లో నటరాజ్ అనే ఒక సింగిల్ స్క్రీన్. దాని లీజ్ మార్పు గొడవ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ ఎస్వీసీ…
ఏపీ అధికార పార్టీ జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. సంచలన ప్రకటన చేశారు. పార్టీలో యువతరాన్ని ఆకర్షించేందుకు..…
పాలన విషయంలో మంత్రి లోకేష్ పక్కా ప్లానింగ్తో వ్యవహరిస్తున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. రాజకీయాలను విధానపరమైన అంశాలను కలగాపులగం…
పద్దెనిమిదేళ్ల అవమానాలు, ఎగతాళి మాటలకు బెంగళూరు జట్టు శాశ్వతంగా ముగింపు పలికింది. ఐపీఎల్ చరిత్రలో ట్రోల్స్ కు కేరాఫ్ అడ్రస్…
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. ఇప్పటికే పాలక మండలి కూడా రద్దయింది. ప్రత్యేక అధికారి పాలనలోకి…
ఈ మధ్య కనిపించడం కాస్త తగ్గించినా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ను మన ప్రేక్షకులు అంత సులభంగా మర్చిపోరు. మొన్న…