వైసీపీ యువ నాయకుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డికి సుప్రీంకోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 24న అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
ఏం జరిగింది?
వైసీపీ అధినేత జగన్ బాబాయి.. మాజీ ఎంపీ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో అవినాష్రెడ్డి నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో రెండేళ్ల కిందట ఆయనను సీబీఐ అరెస్టు చేసింది. ఆ వెంటనే తెలంగాణ హైకోర్టు అవినాష్రెడ్డికి బెయిల్ ఇచ్చేసింది. అయితే.. ఈ బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ.. గత ఏడాది వివేకానందరెడ్డికుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
పలు దఫాలుగా ఈ పిటిషన్పై విచారణ జరిగినా.. అవినాష్కు ఎలాంటి నోటీసులు రాలేదు. అయితే.. మంగళవారం జరిగిన విచారణలో సునీత తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. వివేకా హత్య కేసులో ఉన్న నిందితులను అవినాష్ రెడ్డి బెదిరిస్తున్నారని సుప్రీంకోర్టుకు తెలిపారు. ముఖ్యంగా ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరిని అవినాష్ అనుచరుడిగా ఉన్న శివశంకర్రెడ్డి బెదిరించారని సంబంధిత ఆధారాలను కోర్టుకు సమర్పించారు.
అదే విధంగా శివశంకర్రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య పదే పదే కడప జైలుకువెళ్లారని.. ఈయన జైలులో ఖైదీలకు వైద్య పరీక్షలు చేసే డాక్టర్ కాదని లూథ్రా తెలిపారు. కానీ, ఉద్దేశ పూర్వకంగా జైలుకు వెళ్లి నిందితులను , సాక్షులను బెదిరించే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. ఇవన్నీ అవినాష్ రెడ్డి ఆదేశాల మేరకు జరుగుతున్నవేనని వివరించారు. ఆయా వివరాలను నమోదు చేసుకున్న సుప్రీంకోర్టు ధర్మాసనం అవినాష్రెడ్డినోటీసులు జారీ చేసింది. అదేవిధంగా శివశంకర్రెడ్డి కి కూడా నోటీసులు ఇచ్చింది. విచారణకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 24వ తేదీకి వాయిదా వేసింది.
This post was last modified on November 19, 2024 2:07 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…