Political News

సునీత పిటిష‌న్‌: అవినాష్‌రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు

వైసీపీ యువ నాయ‌కుడు, క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి సుప్రీంకోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. ఫిబ్ర‌వ‌రి 24న అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని ఆదేశించింది. ఈ మేర‌కు సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ సంజీవ్ ఖ‌న్నా నేతృత్వంలోని ధ‌ర్మాసనం నోటీసులు జారీ చేసింది.

ఏం జ‌రిగింది?

వైసీపీ అధినేత జ‌గ‌న్ బాబాయి.. మాజీ ఎంపీ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేసులో అవినాష్‌రెడ్డి నిందితుడిగా ఉన్న విష‌యం తెలిసిందే. ఈ కేసులో రెండేళ్ల కింద‌ట ఆయ‌న‌ను సీబీఐ అరెస్టు చేసింది. ఆ వెంట‌నే తెలంగాణ హైకోర్టు అవినాష్‌రెడ్డికి బెయిల్ ఇచ్చేసింది. అయితే.. ఈ బెయిల్‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ.. గ‌త ఏడాది వివేకానంద‌రెడ్డికుమార్తె డాక్ట‌ర్ న‌ర్రెడ్డి సునీత సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేశారు.

ప‌లు ద‌ఫాలుగా ఈ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిగినా.. అవినాష్‌కు ఎలాంటి నోటీసులు రాలేదు. అయితే.. మంగ‌ళ‌వారం జ‌రిగిన విచార‌ణ‌లో సునీత త‌ర‌ఫున సీనియ‌ర్ న్యాయ‌వాది సిద్ధార్థ లూథ్రా వాద‌న‌లు వినిపించారు. వివేకా హ‌త్య కేసులో ఉన్న నిందితుల‌ను అవినాష్ రెడ్డి బెదిరిస్తున్నార‌ని సుప్రీంకోర్టుకు తెలిపారు. ముఖ్యంగా ఈ కేసులో అప్రూవ‌ర్‌గా మారిన ద‌స్త‌గిరిని అవినాష్ అనుచ‌రుడిగా ఉన్న‌ శివ‌శంక‌ర్‌రెడ్డి బెదిరించార‌ని సంబంధిత ఆధారాల‌ను కోర్టుకు స‌మ‌ర్పించారు.

అదే విధంగా శివ‌శంక‌ర్‌రెడ్డి కుమారుడు డాక్ట‌ర్ చైత‌న్య ప‌దే ప‌దే క‌డ‌ప జైలుకువెళ్లార‌ని.. ఈయ‌న జైలులో ఖైదీల‌కు వైద్య ప‌రీక్ష‌లు చేసే డాక్ట‌ర్ కాద‌ని లూథ్రా తెలిపారు. కానీ, ఉద్దేశ పూర్వ‌కంగా జైలుకు వెళ్లి నిందితుల‌ను , సాక్షుల‌ను బెదిరించే ప్ర‌య‌త్నం చేశార‌ని పేర్కొన్నారు. ఇవ‌న్నీ అవినాష్ రెడ్డి ఆదేశాల మేర‌కు జ‌రుగుతున్న‌వేన‌ని వివ‌రించారు. ఆయా వివ‌రాల‌ను న‌మోదు చేసుకున్న సుప్రీంకోర్టు ధ‌ర్మాసనం అవినాష్‌రెడ్డినోటీసులు జారీ చేసింది. అదేవిధంగా శివ‌శంక‌ర్‌రెడ్డి కి కూడా నోటీసులు ఇచ్చింది. విచార‌ణ‌కు వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి 24వ తేదీకి వాయిదా వేసింది.

This post was last modified on November 19, 2024 2:07 pm

Share

Recent Posts

మాజీ ముఖ్యమంత్రి తనయుడు అరెస్టు… అక్కడ పొలిటికల్ హీట్!

తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష,…

17 minutes ago

ఆ వైరస్ యమ డేంజర్… ఇప్పటికే 22 మంది పిల్లలు మృతి

గుజరాత్‌లో చాందిపుర వైరస్‌ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్‌ కారణంగా ఇప్పటికే 22 మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర…

34 minutes ago

సినిమా చూడాలంటే మ‌నోళ్ల త‌ర్వాతే ఎవ‌రైనా…

సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వ‌రైనా ఒప్పుకోవాల్సిందే. త‌మ సినిమాల‌ను ప్ర‌మోట్ చేయ‌డం కోసం తెలుగు రాష్ట్రాల‌కు…

49 minutes ago

సూపర్ స్టార్ కూతురు ఎలా చేసింది

మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…

2 hours ago

పీకే విక్టరీ బీజేపీకి డేంజర్ బెల్స్ మోగించినట్టేనా?

బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…

6 hours ago

40 నిముషాల్లోనే శ్రీవారి దర్శనం… కేవలం వారికే!

నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…

10 hours ago