Political News

సునీత పిటిష‌న్‌: అవినాష్‌రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు

వైసీపీ యువ నాయ‌కుడు, క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి సుప్రీంకోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. ఫిబ్ర‌వ‌రి 24న అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని ఆదేశించింది. ఈ మేర‌కు సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ సంజీవ్ ఖ‌న్నా నేతృత్వంలోని ధ‌ర్మాసనం నోటీసులు జారీ చేసింది.

ఏం జ‌రిగింది?

వైసీపీ అధినేత జ‌గ‌న్ బాబాయి.. మాజీ ఎంపీ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేసులో అవినాష్‌రెడ్డి నిందితుడిగా ఉన్న విష‌యం తెలిసిందే. ఈ కేసులో రెండేళ్ల కింద‌ట ఆయ‌న‌ను సీబీఐ అరెస్టు చేసింది. ఆ వెంట‌నే తెలంగాణ హైకోర్టు అవినాష్‌రెడ్డికి బెయిల్ ఇచ్చేసింది. అయితే.. ఈ బెయిల్‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ.. గ‌త ఏడాది వివేకానంద‌రెడ్డికుమార్తె డాక్ట‌ర్ న‌ర్రెడ్డి సునీత సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేశారు.

ప‌లు ద‌ఫాలుగా ఈ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిగినా.. అవినాష్‌కు ఎలాంటి నోటీసులు రాలేదు. అయితే.. మంగ‌ళ‌వారం జ‌రిగిన విచార‌ణ‌లో సునీత త‌ర‌ఫున సీనియ‌ర్ న్యాయ‌వాది సిద్ధార్థ లూథ్రా వాద‌న‌లు వినిపించారు. వివేకా హ‌త్య కేసులో ఉన్న నిందితుల‌ను అవినాష్ రెడ్డి బెదిరిస్తున్నార‌ని సుప్రీంకోర్టుకు తెలిపారు. ముఖ్యంగా ఈ కేసులో అప్రూవ‌ర్‌గా మారిన ద‌స్త‌గిరిని అవినాష్ అనుచ‌రుడిగా ఉన్న‌ శివ‌శంక‌ర్‌రెడ్డి బెదిరించార‌ని సంబంధిత ఆధారాల‌ను కోర్టుకు స‌మ‌ర్పించారు.

అదే విధంగా శివ‌శంక‌ర్‌రెడ్డి కుమారుడు డాక్ట‌ర్ చైత‌న్య ప‌దే ప‌దే క‌డ‌ప జైలుకువెళ్లార‌ని.. ఈయ‌న జైలులో ఖైదీల‌కు వైద్య ప‌రీక్ష‌లు చేసే డాక్ట‌ర్ కాద‌ని లూథ్రా తెలిపారు. కానీ, ఉద్దేశ పూర్వ‌కంగా జైలుకు వెళ్లి నిందితుల‌ను , సాక్షుల‌ను బెదిరించే ప్ర‌య‌త్నం చేశార‌ని పేర్కొన్నారు. ఇవ‌న్నీ అవినాష్ రెడ్డి ఆదేశాల మేర‌కు జ‌రుగుతున్న‌వేన‌ని వివ‌రించారు. ఆయా వివ‌రాల‌ను న‌మోదు చేసుకున్న సుప్రీంకోర్టు ధ‌ర్మాసనం అవినాష్‌రెడ్డినోటీసులు జారీ చేసింది. అదేవిధంగా శివ‌శంక‌ర్‌రెడ్డి కి కూడా నోటీసులు ఇచ్చింది. విచార‌ణ‌కు వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి 24వ తేదీకి వాయిదా వేసింది.

This post was last modified on November 19, 2024 2:07 pm

Share
Show comments

Recent Posts

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

5 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

6 hours ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

7 hours ago

పరాశక్తి పండగ చేసుకుంటుంది కానీ

సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…

7 hours ago

చంద్రబాబు – పవన్‌లకు పని తగ్గిస్తున్న జగన్..!

వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…

10 hours ago

ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి.. జ‌గ‌న్‌ పై బాబు సీరియ‌స్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సీఎం చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ పాల‌న‌తో రాష్ట్రం పూర్తిగా విధ్వంస‌మైందని అన్నారు.…

11 hours ago