Political News

సునీత పిటిష‌న్‌: అవినాష్‌రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు

వైసీపీ యువ నాయ‌కుడు, క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి సుప్రీంకోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. ఫిబ్ర‌వ‌రి 24న అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని ఆదేశించింది. ఈ మేర‌కు సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ సంజీవ్ ఖ‌న్నా నేతృత్వంలోని ధ‌ర్మాసనం నోటీసులు జారీ చేసింది.

ఏం జ‌రిగింది?

వైసీపీ అధినేత జ‌గ‌న్ బాబాయి.. మాజీ ఎంపీ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేసులో అవినాష్‌రెడ్డి నిందితుడిగా ఉన్న విష‌యం తెలిసిందే. ఈ కేసులో రెండేళ్ల కింద‌ట ఆయ‌న‌ను సీబీఐ అరెస్టు చేసింది. ఆ వెంట‌నే తెలంగాణ హైకోర్టు అవినాష్‌రెడ్డికి బెయిల్ ఇచ్చేసింది. అయితే.. ఈ బెయిల్‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ.. గ‌త ఏడాది వివేకానంద‌రెడ్డికుమార్తె డాక్ట‌ర్ న‌ర్రెడ్డి సునీత సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేశారు.

ప‌లు ద‌ఫాలుగా ఈ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిగినా.. అవినాష్‌కు ఎలాంటి నోటీసులు రాలేదు. అయితే.. మంగ‌ళ‌వారం జ‌రిగిన విచార‌ణ‌లో సునీత త‌ర‌ఫున సీనియ‌ర్ న్యాయ‌వాది సిద్ధార్థ లూథ్రా వాద‌న‌లు వినిపించారు. వివేకా హ‌త్య కేసులో ఉన్న నిందితుల‌ను అవినాష్ రెడ్డి బెదిరిస్తున్నార‌ని సుప్రీంకోర్టుకు తెలిపారు. ముఖ్యంగా ఈ కేసులో అప్రూవ‌ర్‌గా మారిన ద‌స్త‌గిరిని అవినాష్ అనుచ‌రుడిగా ఉన్న‌ శివ‌శంక‌ర్‌రెడ్డి బెదిరించార‌ని సంబంధిత ఆధారాల‌ను కోర్టుకు స‌మ‌ర్పించారు.

అదే విధంగా శివ‌శంక‌ర్‌రెడ్డి కుమారుడు డాక్ట‌ర్ చైత‌న్య ప‌దే ప‌దే క‌డ‌ప జైలుకువెళ్లార‌ని.. ఈయ‌న జైలులో ఖైదీల‌కు వైద్య ప‌రీక్ష‌లు చేసే డాక్ట‌ర్ కాద‌ని లూథ్రా తెలిపారు. కానీ, ఉద్దేశ పూర్వ‌కంగా జైలుకు వెళ్లి నిందితుల‌ను , సాక్షుల‌ను బెదిరించే ప్ర‌య‌త్నం చేశార‌ని పేర్కొన్నారు. ఇవ‌న్నీ అవినాష్ రెడ్డి ఆదేశాల మేర‌కు జ‌రుగుతున్న‌వేన‌ని వివ‌రించారు. ఆయా వివ‌రాల‌ను న‌మోదు చేసుకున్న సుప్రీంకోర్టు ధ‌ర్మాసనం అవినాష్‌రెడ్డినోటీసులు జారీ చేసింది. అదేవిధంగా శివ‌శంక‌ర్‌రెడ్డి కి కూడా నోటీసులు ఇచ్చింది. విచార‌ణ‌కు వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి 24వ తేదీకి వాయిదా వేసింది.

This post was last modified on November 19, 2024 2:07 pm

Share
Show comments

Recent Posts

తమన్నాకు తెలుగులో మళ్లీ ఓ మంచి ఛాన్స్?

ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…

3 hours ago

8 వారాల వైపు సీరియస్ అడుగులు

థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…

3 hours ago

ఈసారి జ‌గ‌న్ వదిలిన ట్రోల్ పాయింట్?

అధికారంలోకి రావ‌డానికి ముందు వ‌ర‌కు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చాలా ఫెరోషియ‌స్‌గా క‌నిపించేవారు. అవినీతి కేసుల వ్య‌వ‌హారం పక్క‌న పెడితే…

4 hours ago

బన్నీ గ్లింప్స్ షారుఖ్ చేతుల మీదుగా?

‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…

4 hours ago

ప్రేమ పెళ్లితో షాకిచ్చిన వైర‌ల్ మోనాలిసా

మోనాలిసా.. గ‌త ఏడాది సోష‌ల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్‌ప్రదేశ్‌లో జ‌రిగిన‌ మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…

5 hours ago

కిం క‌ర్త‌వ్యం… అంత‌ర్మ‌థ‌నంలో బీఆర్ఎస్‌?

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, ఆ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్‌, మాజీ మంత్రి పార్టీ కీల‌క…

6 hours ago