వైసీపీ యువ నాయకుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డికి సుప్రీంకోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 24న అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
ఏం జరిగింది?
వైసీపీ అధినేత జగన్ బాబాయి.. మాజీ ఎంపీ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో అవినాష్రెడ్డి నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో రెండేళ్ల కిందట ఆయనను సీబీఐ అరెస్టు చేసింది. ఆ వెంటనే తెలంగాణ హైకోర్టు అవినాష్రెడ్డికి బెయిల్ ఇచ్చేసింది. అయితే.. ఈ బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ.. గత ఏడాది వివేకానందరెడ్డికుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
పలు దఫాలుగా ఈ పిటిషన్పై విచారణ జరిగినా.. అవినాష్కు ఎలాంటి నోటీసులు రాలేదు. అయితే.. మంగళవారం జరిగిన విచారణలో సునీత తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. వివేకా హత్య కేసులో ఉన్న నిందితులను అవినాష్ రెడ్డి బెదిరిస్తున్నారని సుప్రీంకోర్టుకు తెలిపారు. ముఖ్యంగా ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరిని అవినాష్ అనుచరుడిగా ఉన్న శివశంకర్రెడ్డి బెదిరించారని సంబంధిత ఆధారాలను కోర్టుకు సమర్పించారు.
అదే విధంగా శివశంకర్రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య పదే పదే కడప జైలుకువెళ్లారని.. ఈయన జైలులో ఖైదీలకు వైద్య పరీక్షలు చేసే డాక్టర్ కాదని లూథ్రా తెలిపారు. కానీ, ఉద్దేశ పూర్వకంగా జైలుకు వెళ్లి నిందితులను , సాక్షులను బెదిరించే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. ఇవన్నీ అవినాష్ రెడ్డి ఆదేశాల మేరకు జరుగుతున్నవేనని వివరించారు. ఆయా వివరాలను నమోదు చేసుకున్న సుప్రీంకోర్టు ధర్మాసనం అవినాష్రెడ్డినోటీసులు జారీ చేసింది. అదేవిధంగా శివశంకర్రెడ్డి కి కూడా నోటీసులు ఇచ్చింది. విచారణకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 24వ తేదీకి వాయిదా వేసింది.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…