Political News

సునీత పిటిష‌న్‌: అవినాష్‌రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు

వైసీపీ యువ నాయ‌కుడు, క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి సుప్రీంకోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. ఫిబ్ర‌వ‌రి 24న అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని ఆదేశించింది. ఈ మేర‌కు సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ సంజీవ్ ఖ‌న్నా నేతృత్వంలోని ధ‌ర్మాసనం నోటీసులు జారీ చేసింది.

ఏం జ‌రిగింది?

వైసీపీ అధినేత జ‌గ‌న్ బాబాయి.. మాజీ ఎంపీ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేసులో అవినాష్‌రెడ్డి నిందితుడిగా ఉన్న విష‌యం తెలిసిందే. ఈ కేసులో రెండేళ్ల కింద‌ట ఆయ‌న‌ను సీబీఐ అరెస్టు చేసింది. ఆ వెంట‌నే తెలంగాణ హైకోర్టు అవినాష్‌రెడ్డికి బెయిల్ ఇచ్చేసింది. అయితే.. ఈ బెయిల్‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ.. గ‌త ఏడాది వివేకానంద‌రెడ్డికుమార్తె డాక్ట‌ర్ న‌ర్రెడ్డి సునీత సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేశారు.

ప‌లు ద‌ఫాలుగా ఈ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిగినా.. అవినాష్‌కు ఎలాంటి నోటీసులు రాలేదు. అయితే.. మంగ‌ళ‌వారం జ‌రిగిన విచార‌ణ‌లో సునీత త‌ర‌ఫున సీనియ‌ర్ న్యాయ‌వాది సిద్ధార్థ లూథ్రా వాద‌న‌లు వినిపించారు. వివేకా హ‌త్య కేసులో ఉన్న నిందితుల‌ను అవినాష్ రెడ్డి బెదిరిస్తున్నార‌ని సుప్రీంకోర్టుకు తెలిపారు. ముఖ్యంగా ఈ కేసులో అప్రూవ‌ర్‌గా మారిన ద‌స్త‌గిరిని అవినాష్ అనుచ‌రుడిగా ఉన్న‌ శివ‌శంక‌ర్‌రెడ్డి బెదిరించార‌ని సంబంధిత ఆధారాల‌ను కోర్టుకు స‌మ‌ర్పించారు.

అదే విధంగా శివ‌శంక‌ర్‌రెడ్డి కుమారుడు డాక్ట‌ర్ చైత‌న్య ప‌దే ప‌దే క‌డ‌ప జైలుకువెళ్లార‌ని.. ఈయ‌న జైలులో ఖైదీల‌కు వైద్య ప‌రీక్ష‌లు చేసే డాక్ట‌ర్ కాద‌ని లూథ్రా తెలిపారు. కానీ, ఉద్దేశ పూర్వ‌కంగా జైలుకు వెళ్లి నిందితుల‌ను , సాక్షుల‌ను బెదిరించే ప్ర‌య‌త్నం చేశార‌ని పేర్కొన్నారు. ఇవ‌న్నీ అవినాష్ రెడ్డి ఆదేశాల మేర‌కు జ‌రుగుతున్న‌వేన‌ని వివ‌రించారు. ఆయా వివ‌రాల‌ను న‌మోదు చేసుకున్న సుప్రీంకోర్టు ధ‌ర్మాసనం అవినాష్‌రెడ్డినోటీసులు జారీ చేసింది. అదేవిధంగా శివ‌శంక‌ర్‌రెడ్డి కి కూడా నోటీసులు ఇచ్చింది. విచార‌ణ‌కు వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి 24వ తేదీకి వాయిదా వేసింది.

This post was last modified on November 19, 2024 2:07 pm

Share
Show comments

Recent Posts

హ్యాపీగా వస్తే ఎవరూ పట్టించుకోలేదు

జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…

21 minutes ago

‘మావిగన్’ పేరుతో జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…

2 hours ago

కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంచు విష్ణు కౌంటర్

టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…

2 hours ago

అమరావతిపై జగన్ అక్కసు తగ్గలేదా?

ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…

3 hours ago

జయలలిత స్ట్రాటజీ మళ్లీ: విజయ్ పెద్ద ప్లాన్

సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…

3 hours ago

యుద్ధంలో కేబుల్స్ కట్?

అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…

3 hours ago