Political News

108 వాహనాల్లో అంత స్కామ్ జరిగిందా?

వైసీపీ హయాంలో భారీగా భూ కుంభకోణాలు జరిగాయని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డిలు వందలాది ఎకరాల భూములు కబ్జా చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు అసెంబ్లీలో అసైన్డ్ భూముల వ్యవహారం చర్చకు వచ్చింది. అయితే, అంతకన్నా పెద్ద స్కామ్ మరోటి ఉందని ఆరోగ్య శాఖా మంత్రి సత్య కుమార్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

ఏపీలో 108 సేవ ముసుగులో అరబిందో సంస్థ భారీ దోపిడీకి పాల్పడిందని సత్యకుమార్ సంచలన ఆరోపణలు చేశారు. వందల కోట్లు దోచుకున్న ఆ సంస్థ సకాలంలో రోగులను ఆస్పత్రులకు చేర్చలేక పోయిందని విమర్శించారు. 2016లో ఒక్కో అంబులెన్స్‌కు లక్షా 30వేల రూపాయల చొప్పున 436 అంబులెన్స్‌ల కోసం ఒప్పందం కుదిరిందని సత్యకుమార్ వెల్లడించారు. 2020లో పాత అంబులెన్స్‌లకు రూ. 2,27,257, కొత్త అంబులెన్స్ లకు రూ.1,75,078లు చెల్లించేలా ఒప్పందం కుదిరిందన్నారు.

కానీ, సరైన సేవలు ఇవ్వకుండా కోట్లు దండుకుని 108 వ్యవస్ధను నిర్వీర్యం చేశారని, గోల్డెన్ అవర్‌లో వైద్య సర్వీసులు దారుణంగా ఉన్నాయని ఆరోపించారు. గోల్డెన్ అవర్‌లో 11 నుంచి 20 శాతం రోగులను మాత్రమే ఆస్పత్రులకు చేర్చగలిగారని సత్యకుమార్ చెప్పారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 108, 104 వాహనాల నిర్వహణ బాధ్యతలను అరబిందో సంస్థ చూసిన నేపథ్యంలో సత్య కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అరబిందో అక్రమాలపై ఫోకస్ చేసింది. ఈ క్రమంలోనే కాంట్రాక్టు గడువు మిగిలి ఉండగానే నిర్వహణ బాధ్యతల నుంచి అరబిందో తప్పుకుంది. అరబిందో స్థానంలో నిర్వహణ బాధ్యతలను మరొకరికి అప్పగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

This post was last modified on November 19, 2024 9:52 am

Share

Recent Posts

రామాయణ, వారణాసి… ఓ క్లారిటీ వస్తుందా?

రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…

3 hours ago

చెల్లెలిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

క‌లిసి రాజ‌కీయం చేయ‌క‌పోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మ‌ధ్య కొన్ని పోలిక‌లు క‌నిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణ‌లో ఈ…

6 hours ago

చెన్నైలో చింటు మేనియా

సోష‌ల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. త‌న సినిమాల ఈవెంట్ల‌లో, ఇంట‌ర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్ర‌ముఖ తెలుగు…

6 hours ago

కనకరాజు లెక్కలు సేఫ్ గానే ఉన్నాయా?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…

6 hours ago

బాగుంది ఆదివారం… థియేటర్లలో జన సందోహం

ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…

7 hours ago

కాలేజీలు కాదు… విద్యార్థుల ఖాతాల్లోకే ఫీజు రీయంబర్స్మెంట్ జమ?

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…

7 hours ago