Political News

108 వాహనాల్లో అంత స్కామ్ జరిగిందా?

వైసీపీ హయాంలో భారీగా భూ కుంభకోణాలు జరిగాయని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డిలు వందలాది ఎకరాల భూములు కబ్జా చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు అసెంబ్లీలో అసైన్డ్ భూముల వ్యవహారం చర్చకు వచ్చింది. అయితే, అంతకన్నా పెద్ద స్కామ్ మరోటి ఉందని ఆరోగ్య శాఖా మంత్రి సత్య కుమార్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

ఏపీలో 108 సేవ ముసుగులో అరబిందో సంస్థ భారీ దోపిడీకి పాల్పడిందని సత్యకుమార్ సంచలన ఆరోపణలు చేశారు. వందల కోట్లు దోచుకున్న ఆ సంస్థ సకాలంలో రోగులను ఆస్పత్రులకు చేర్చలేక పోయిందని విమర్శించారు. 2016లో ఒక్కో అంబులెన్స్‌కు లక్షా 30వేల రూపాయల చొప్పున 436 అంబులెన్స్‌ల కోసం ఒప్పందం కుదిరిందని సత్యకుమార్ వెల్లడించారు. 2020లో పాత అంబులెన్స్‌లకు రూ. 2,27,257, కొత్త అంబులెన్స్ లకు రూ.1,75,078లు చెల్లించేలా ఒప్పందం కుదిరిందన్నారు.

కానీ, సరైన సేవలు ఇవ్వకుండా కోట్లు దండుకుని 108 వ్యవస్ధను నిర్వీర్యం చేశారని, గోల్డెన్ అవర్‌లో వైద్య సర్వీసులు దారుణంగా ఉన్నాయని ఆరోపించారు. గోల్డెన్ అవర్‌లో 11 నుంచి 20 శాతం రోగులను మాత్రమే ఆస్పత్రులకు చేర్చగలిగారని సత్యకుమార్ చెప్పారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 108, 104 వాహనాల నిర్వహణ బాధ్యతలను అరబిందో సంస్థ చూసిన నేపథ్యంలో సత్య కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అరబిందో అక్రమాలపై ఫోకస్ చేసింది. ఈ క్రమంలోనే కాంట్రాక్టు గడువు మిగిలి ఉండగానే నిర్వహణ బాధ్యతల నుంచి అరబిందో తప్పుకుంది. అరబిందో స్థానంలో నిర్వహణ బాధ్యతలను మరొకరికి అప్పగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

This post was last modified on November 19, 2024 9:52 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సినిమాల్లేవ్ కానీ అంతటా ఆమే..

బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…

3 hours ago

మళ్లీ రెండేళ్లంటే కష్టం రాజా

ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…

7 hours ago

మహేష్ రన్నింగ్ స్టైల్ మార్చడమేంటి జక్కన్నా?

తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…

9 hours ago

దురంధర్ VS విశ్వరూపం – ఎందుకీ రచ్చ?

ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…

9 hours ago

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

11 hours ago

టార్గెట్ వైసీపీ… బాబు-ప‌వ‌న్ రచిస్తున్న వ్యూహం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు సుమారు గంట‌కుపైగా చ‌ర్చ‌లు జ‌రిపారు. బుధ‌వారం ఉద‌యం ఉండ‌వ‌ల్లిలోని ముఖ్య‌మంత్రి నివాసానికి…

11 hours ago