Political News

108 వాహనాల్లో అంత స్కామ్ జరిగిందా?

వైసీపీ హయాంలో భారీగా భూ కుంభకోణాలు జరిగాయని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డిలు వందలాది ఎకరాల భూములు కబ్జా చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు అసెంబ్లీలో అసైన్డ్ భూముల వ్యవహారం చర్చకు వచ్చింది. అయితే, అంతకన్నా పెద్ద స్కామ్ మరోటి ఉందని ఆరోగ్య శాఖా మంత్రి సత్య కుమార్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

ఏపీలో 108 సేవ ముసుగులో అరబిందో సంస్థ భారీ దోపిడీకి పాల్పడిందని సత్యకుమార్ సంచలన ఆరోపణలు చేశారు. వందల కోట్లు దోచుకున్న ఆ సంస్థ సకాలంలో రోగులను ఆస్పత్రులకు చేర్చలేక పోయిందని విమర్శించారు. 2016లో ఒక్కో అంబులెన్స్‌కు లక్షా 30వేల రూపాయల చొప్పున 436 అంబులెన్స్‌ల కోసం ఒప్పందం కుదిరిందని సత్యకుమార్ వెల్లడించారు. 2020లో పాత అంబులెన్స్‌లకు రూ. 2,27,257, కొత్త అంబులెన్స్ లకు రూ.1,75,078లు చెల్లించేలా ఒప్పందం కుదిరిందన్నారు.

కానీ, సరైన సేవలు ఇవ్వకుండా కోట్లు దండుకుని 108 వ్యవస్ధను నిర్వీర్యం చేశారని, గోల్డెన్ అవర్‌లో వైద్య సర్వీసులు దారుణంగా ఉన్నాయని ఆరోపించారు. గోల్డెన్ అవర్‌లో 11 నుంచి 20 శాతం రోగులను మాత్రమే ఆస్పత్రులకు చేర్చగలిగారని సత్యకుమార్ చెప్పారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 108, 104 వాహనాల నిర్వహణ బాధ్యతలను అరబిందో సంస్థ చూసిన నేపథ్యంలో సత్య కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అరబిందో అక్రమాలపై ఫోకస్ చేసింది. ఈ క్రమంలోనే కాంట్రాక్టు గడువు మిగిలి ఉండగానే నిర్వహణ బాధ్యతల నుంచి అరబిందో తప్పుకుంది. అరబిందో స్థానంలో నిర్వహణ బాధ్యతలను మరొకరికి అప్పగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

This post was last modified on November 19, 2024 9:52 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

దేవిశ్రీ ప్రసాద్ దూరానికి కారణమిదేనా ?

పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…

23 minutes ago

పెంపుడు పిల్లి చ‌నిపోయింద‌ని.. ఉరేసుకున్న విద్యార్థిని!

పెంపుడు జంతువుల ప‌ట్ల య‌జ‌మానులు, కుటుంబ స‌భ్యులు ఎంత ప్రేమ‌ను పెంచుకుంటారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయా జంతువులు…

45 minutes ago

ఉస్తాద్ పాట‌ల వాడ‌కం.. ఎంత ఖ‌ర్చు పెట్టారో?

ఒక‌ప్పుడు పాత సినిమాల పాట‌లను య‌థేచ్ఛ‌గా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవ‌రికీ ఏ అభ్యంత‌రాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…

2 hours ago

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…

5 hours ago

స‌మంత బంగారం కోసం రాజు గారు వ‌స్తారా?

ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళంలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ద‌శాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన క‌థానాయిక స‌మంత‌. కానీ కొన్నేళ్లుగా…

5 hours ago

ఆ యూట్యూబర్లకు ‘పరాభవం’ తప్పదట

సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…

6 hours ago