ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన తమ్ముడు నారా రామ్మూర్తినాయుడు అకాల మరణం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఉన్న ఏఐజీ ఆసుపత్రిలో రామ్మూర్తినాయుడు మృతి చెందారు. ఆయన పార్థివదేహాన్ని చూసి చంద్రబాబు తట్టుకోలేకపోయారు. తమ్ముడి నిర్జీవ దేహాన్ని చూస్తూ భావోద్వేగానికి లోనయ్యారు.
చంద్రబాబు మాట్లాడుతూ, తమ్ముడి మరణం తన జీవితంలో చాలా పెద్ద లోటు అని పేర్కొన్నారు. “తమ్ముడు రామ్మూర్తినాయుడు ప్రజాసేవకు నిరంతరం అంకితం అయ్యాడు. అతడి సేవలే ఆయనకు చిరస్మరణీయమైన గుర్తింపు తీసుకువచ్చాయి. మా కుటుంబానికి అతను లేకపోవడం అపారమైన నష్టమని భావిస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను,” అని చంద్రబాబు చెప్పారు.
చంద్రబాబుకు తమ్ముడితో మంచి అనుబంధం ఉన్నప్పటికీ బాహ్య ప్రపంచంలో ఎక్కువగా ఏనాడు హడావుడి చేయలేదు. చాలా సౌమ్యంగా ఉండే ఆయన కాంట్రవర్సీలకు దూరంగా ఉండేవారు. చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా కూడా ఆయన సేవలు అందించారు. ఇక రామ్మూర్తినాయుడు పార్థివదేహాన్ని స్వగ్రామమైన చిత్తూరు జిల్లా నారావారిపల్లెలకు తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.
గ్రామంలో ఆయన అభిమానులు, బంధువులు పెద్ద సంఖ్యలో చేరుకుని చివరి చూపు కోసం వేచి ఉన్నారు. రేపు నారావారిపల్లెలో పూర్తి రాష్ట్ర సత్కారాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. రామ్మూర్తినాయుడు మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. టీడీపీ నాయకులు, బీజేపీ, జనసేన, ఇతర పార్టీల నేతలు చంద్రబాబుకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామ్మూర్తి నాయుడు వ్యక్తిత్వం, ప్రజాసేవ పట్ల ఉన్న అభిరుచి అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ దుఃఖ సమయంలో చంద్రబాబుతో పాటు నారా కుటుంబానికి అన్ని రాజకీయ పార్టీలు అండగా నిలిచాయి.
This post was last modified on November 18, 2024 1:34 pm
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…