ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన తమ్ముడు నారా రామ్మూర్తినాయుడు అకాల మరణం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఉన్న ఏఐజీ ఆసుపత్రిలో రామ్మూర్తినాయుడు మృతి చెందారు. ఆయన పార్థివదేహాన్ని చూసి చంద్రబాబు తట్టుకోలేకపోయారు. తమ్ముడి నిర్జీవ దేహాన్ని చూస్తూ భావోద్వేగానికి లోనయ్యారు.
చంద్రబాబు మాట్లాడుతూ, తమ్ముడి మరణం తన జీవితంలో చాలా పెద్ద లోటు అని పేర్కొన్నారు. “తమ్ముడు రామ్మూర్తినాయుడు ప్రజాసేవకు నిరంతరం అంకితం అయ్యాడు. అతడి సేవలే ఆయనకు చిరస్మరణీయమైన గుర్తింపు తీసుకువచ్చాయి. మా కుటుంబానికి అతను లేకపోవడం అపారమైన నష్టమని భావిస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను,” అని చంద్రబాబు చెప్పారు.
చంద్రబాబుకు తమ్ముడితో మంచి అనుబంధం ఉన్నప్పటికీ బాహ్య ప్రపంచంలో ఎక్కువగా ఏనాడు హడావుడి చేయలేదు. చాలా సౌమ్యంగా ఉండే ఆయన కాంట్రవర్సీలకు దూరంగా ఉండేవారు. చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా కూడా ఆయన సేవలు అందించారు. ఇక రామ్మూర్తినాయుడు పార్థివదేహాన్ని స్వగ్రామమైన చిత్తూరు జిల్లా నారావారిపల్లెలకు తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.
గ్రామంలో ఆయన అభిమానులు, బంధువులు పెద్ద సంఖ్యలో చేరుకుని చివరి చూపు కోసం వేచి ఉన్నారు. రేపు నారావారిపల్లెలో పూర్తి రాష్ట్ర సత్కారాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. రామ్మూర్తినాయుడు మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. టీడీపీ నాయకులు, బీజేపీ, జనసేన, ఇతర పార్టీల నేతలు చంద్రబాబుకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామ్మూర్తి నాయుడు వ్యక్తిత్వం, ప్రజాసేవ పట్ల ఉన్న అభిరుచి అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ దుఃఖ సమయంలో చంద్రబాబుతో పాటు నారా కుటుంబానికి అన్ని రాజకీయ పార్టీలు అండగా నిలిచాయి.
This post was last modified on November 18, 2024 1:34 pm
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…
ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…
ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…