Political News

తమ్ముడి మృతి.. తట్టుకోలేక కన్నీరు పెట్టుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన తమ్ముడు నారా రామ్మూర్తినాయుడు అకాల మరణం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న ఏఐజీ ఆసుపత్రిలో రామ్మూర్తినాయుడు మృతి చెందారు. ఆయన పార్థివదేహాన్ని చూసి చంద్రబాబు తట్టుకోలేకపోయారు. తమ్ముడి నిర్జీవ దేహాన్ని చూస్తూ భావోద్వేగానికి లోనయ్యారు.

చంద్రబాబు మాట్లాడుతూ, తమ్ముడి మరణం తన జీవితంలో చాలా పెద్ద లోటు అని పేర్కొన్నారు. “తమ్ముడు రామ్మూర్తినాయుడు ప్రజాసేవకు నిరంతరం అంకితం అయ్యాడు. అతడి సేవలే ఆయనకు చిరస్మరణీయమైన గుర్తింపు తీసుకువచ్చాయి. మా కుటుంబానికి అతను లేకపోవడం అపారమైన నష్టమని భావిస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను,” అని చంద్రబాబు చెప్పారు.

చంద్రబాబుకు తమ్ముడితో మంచి అనుబంధం ఉన్నప్పటికీ బాహ్య ప్రపంచంలో ఎక్కువగా ఏనాడు హడావుడి చేయలేదు. చాలా సౌమ్యంగా ఉండే ఆయన కాంట్రవర్సీలకు దూరంగా ఉండేవారు. చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా కూడా ఆయన సేవలు అందించారు. ఇక రామ్మూర్తినాయుడు పార్థివదేహాన్ని స్వగ్రామమైన చిత్తూరు జిల్లా నారావారిపల్లెలకు తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

గ్రామంలో ఆయన అభిమానులు, బంధువులు పెద్ద సంఖ్యలో చేరుకుని చివరి చూపు కోసం వేచి ఉన్నారు. రేపు నారావారిపల్లెలో పూర్తి రాష్ట్ర సత్కారాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. రామ్మూర్తినాయుడు మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. టీడీపీ నాయకులు, బీజేపీ, జనసేన, ఇతర పార్టీల నేతలు చంద్రబాబుకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామ్మూర్తి నాయుడు వ్యక్తిత్వం, ప్రజాసేవ పట్ల ఉన్న అభిరుచి అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ దుఃఖ సమయంలో చంద్రబాబుతో పాటు నారా కుటుంబానికి అన్ని రాజకీయ పార్టీలు అండగా నిలిచాయి.

This post was last modified on November 18, 2024 1:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రేవంత్ రెడ్డి `వ‌న్ మ్యాన్ ఆర్మీ`… సరిపోవట్లేదా?

తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌లో వ‌న్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి క‌నిపిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి…

4 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో ఎవరిది పైచేయి?

ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల్లో ఒక‌ప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్ద‌గా క‌నిపించ‌డం లేద‌న్న టాక్ వినిపిస్తోంది. కీల‌క నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

4 hours ago

క‌ర‌ణం `క‌ల‌` ఏమైంద‌బ్బా ..!

క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి.. రాజ‌కీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన నేత‌. కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్‌ను ఎమ్మెల్యేగా చూసుకోవాల‌న్న…

8 hours ago

ఏలా చూసినా… మన సీట్లు పెరుగుతాయి

నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…

8 hours ago

RRR వల్ల కానిది దురంధర్ చేయగలదా

బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…

9 hours ago

అక్కడ నెలకు రెండు సార్లు జీతం? ఇదేదో బాగుందే..

ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…

9 hours ago