సండే ఈజ్ ఏ హాలీడే కాబట్టి… ఆ మూడ్లోకి వెళుతూ ప్రజలంతా రిలాక్స్ మూడ్లోకి వెళ్తుంటే… రాజకీయ నాయకులు మాత్రం సండే అయినా మండే అయినా తగ్గేదేలే అన్నట్లుగా తమ తమ రాజకీయ అజెండాతో ముందుకు సాగుతుంటారు.
అలా తాజాగా ఓ వైపు మహారాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోవైపు తెలంగాణలో తన రాజకీయ ప్రత్యర్థి అయిన కేసీఆర్ పై విరుచుకుపడుతున్నారు. ఈ మేరకు కేసీఆర్ కలల ప్రాజెక్టు అయిన కాళేశ్వరం గురించి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ తన పాలనలో అనేక సవాళ్లు, విమర్శలు ఎదుర్కొని కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన సంగతి తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ వరప్రదాయినిగా కేసీఆర్ ఆండ్ కో ప్రొజెక్ట్ చేసింది. కేసీఆర్ బ్యాడ్ లక్ కావచ్చు లేదా మరేదైనా కారణం అయి ఉండవచ్చు కానీ .. సరిగ్గా గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల ముందు కాళేశ్వరంలోని ప్రధాన బ్యారేజీ మేడిగడ్డ ప్రాజెక్టు మూడు పిల్లర్లు కుంగడం తీవ్ర కలకలం రేపింది. అయితే, దీనిపై గతంలో ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడుతోంది. ఏకంగా విచారణకు కూడా ఆదేశించింది. నాణ్యత లోపంతోనే పిల్లర్లు కుంగినట్లు ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం కమిషన్ వేసి ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని పేర్కొంటూ ప్రభుత్వం దర్యాప్తు చేస్తోంది.
ఇలా ఓ వైపు కాళేశ్వరంలో కథాకమామిషు తేల్చడమే కాకుండా మరోవైపు కాళేశ్వరం వల్ల వచ్చిన ఫలితాలు ఏం లేవంటూ కూడా కేసీఆర్ కలల ప్రాజెక్టుపై రేవంత్ విరుచుకుపడుతున్నారు. దీనికి నిదర్శనం తాజాగా రేవంత్ చేసిన ఓ ట్వీట్. రాష్ట్రంలో ఈ ఏడాది అత్యధికంగా వరి పంట సాగు జరిగిందని ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని జోడిస్తూ… ఈ సంవత్సరంలో 66.77లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగైందని, 153 లక్షల టన్నుల ఉత్పత్తి వచ్చిందనే వార్తను ఎక్స్ లో పోస్ట్ చేశారు. ‘కాళేశ్వరం వల్లే వరిసాగు పెరిగిందన్న బిఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచలైంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో నీటిని నిల్వ చేయకపోయినా రైతులు ఈ ఘనత సాధించారు. వారి శ్రమ, చెమట, కష్టం ఫలితం తెలంగాణ రైతు దేశానికే గర్వకారణం. ఈ ఘనత సాధించిన ప్రతి రైతు సోదరుడికి హృదయపూర్వక అభినందనలు’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో అసలు సంబంధం లేకుండానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత తొలిసారి రికార్డు స్థాయిలో వరిధాన్యం పండిందని రేవంత్ రెడ్డి ట్వీట్ చేయడం వెనుక అసలు లాజిక్… కేసీఆర్ కలల ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి కలిగిన ప్రయోజనం ఏం లేదనేది తెలియజేయడమే అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఆర్థికంగా పెద్ద ఎత్తున భారం పడుతోందని ఆరోపణలు చేస్తూ…. అవినీతిపై దర్యాప్తు అంటూ గులాబీ శ్రేణుల్లో గుబులు పుట్టిస్తున్న రేవంత్ తాజాగా ఇప్పుడు ప్రాజెక్టు ప్రయోజనాలు ఏం లేవంటూ కామెంట్ చేయడం చూస్తుంటే…ఆదివారం కూడా విశ్రాంతిలో ఉన్న కేసీఆర్ ను వదిలిపెట్టకుండా రేవంత్ టార్గెట్ చేశారనే విషయం స్పష్టమైందని అంటున్నారు.
This post was last modified on November 17, 2024 8:20 pm
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…
ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…
ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…