Political News

ఆదివారం కూడా.. కేసీఆర్‌ను వ‌దిలిపెట్ట‌వా రేవంత్‌!?

సండే ఈజ్ ఏ హాలీడే కాబ‌ట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్ర‌జ‌లంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజ‌కీయ‌ నాయ‌కులు మాత్రం సండే అయినా మండే అయినా త‌గ్గేదేలే అన్న‌ట్లుగా త‌మ త‌మ రాజ‌కీయ అజెండాతో ముందుకు సాగుతుంటారు.

అలా తాజాగా ఓ వైపు మ‌హారాష్ట్ర రాజ‌కీయాల్లో బిజీగా ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మ‌రోవైపు తెలంగాణ‌లో త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి అయిన కేసీఆర్ పై విరుచుకుప‌డుతున్నారు. ఈ మేర‌కు కేసీఆర్ క‌ల‌ల ప్రాజెక్టు అయిన కాళేశ్వరం గురించి ఆస‌క్తిక‌ర‌మైన ట్వీట్ చేశారు.

తెలంగాణ ముఖ్య‌మంత్రి హోదాలో కేసీఆర్ త‌న పాల‌న‌లో అనేక స‌వాళ్లు, విమ‌ర్శ‌లు ఎదుర్కొని కాళేశ్వ‌రం ప్రాజెక్టును నిర్మించిన సంగ‌తి తెలిసిందే. కాళేశ్వ‌రం ప్రాజెక్టును తెలంగాణ వ‌ర‌ప్ర‌దాయినిగా కేసీఆర్ ఆండ్ కో ప్రొజెక్ట్ చేసింది. కేసీఆర్ బ్యాడ్ ల‌క్ కావ‌చ్చు లేదా మ‌రేదైనా కార‌ణం అయి ఉండ‌వ‌చ్చు కానీ .. స‌రిగ్గా గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల ముందు కాళేశ్వరంలోని ప్రధాన బ్యారేజీ మేడిగడ్డ ప్రాజెక్టు మూడు పిల్లర్లు కుంగడం తీవ్ర క‌ల‌క‌లం రేపింది. అయితే, దీనిపై గ‌తంలో ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన త‌ర్వాత కాంగ్రెస్ పార్టీ విరుచుకుప‌డుతోంది. ఏకంగా విచార‌ణ‌కు కూడా ఆదేశించింది. నాణ్యత లోపంతోనే పిల్లర్లు కుంగినట్లు ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం కమిషన్ వేసి ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని పేర్కొంటూ ప్రభుత్వం దర్యాప్తు చేస్తోంది.

ఇలా ఓ వైపు కాళేశ్వ‌రంలో క‌థాక‌మామిషు తేల్చ‌డ‌మే కాకుండా మ‌రోవైపు కాళేశ్వ‌రం వ‌ల్ల వ‌చ్చిన ఫ‌లితాలు ఏం లేవంటూ కూడా కేసీఆర్ క‌ల‌ల ప్రాజెక్టుపై రేవంత్ విరుచుకుప‌డుతున్నారు. దీనికి నిద‌ర్శ‌నం తాజాగా రేవంత్ చేసిన ఓ ట్వీట్‌. రాష్ట్రంలో ఈ ఏడాది అత్యధికంగా వరి పంట సాగు జరిగిందని ఓ ప‌త్రిక‌లో వ‌చ్చిన క‌థ‌నాన్ని జోడిస్తూ… ఈ సంవత్సరంలో 66.77లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగైందని, 153 లక్షల టన్నుల ఉత్పత్తి వచ్చిందనే వార్తను ఎక్స్ లో పోస్ట్ చేశారు. ‘కాళేశ్వరం వల్లే వరిసాగు పెరిగిందన్న బిఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచలైంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో నీటిని నిల్వ చేయకపోయినా రైతులు ఈ ఘనత సాధించారు. వారి శ్రమ, చెమట, కష్టం ఫలితం తెలంగాణ రైతు దేశానికే గర్వకారణం. ఈ ఘనత సాధించిన ప్రతి రైతు సోదరుడికి హృదయపూర్వక అభినందనలు’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుతో అసలు సంబంధం లేకుండానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత తొలిసారి రికార్డు స్థాయిలో వరిధాన్యం పండిందని రేవంత్ రెడ్డి ట్వీట్ చేయ‌డం వెనుక అస‌లు లాజిక్… కేసీఆర్ క‌ల‌ల ప్రాజెక్టు వ‌ల్ల రాష్ట్రానికి క‌లిగిన ప్ర‌యోజ‌నం ఏం లేద‌నేది తెలియ‌జేయ‌డ‌మే అనే విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్ప‌టికే, కాళేశ్వ‌రం ప్రాజెక్టు వ‌ల్ల ఆర్థికంగా పెద్ద ఎత్తున భారం ప‌డుతోంద‌ని ఆరోప‌ణ‌లు చేస్తూ…. అవినీతిపై ద‌ర్యాప్తు అంటూ గులాబీ శ్రేణుల్లో గుబులు పుట్టిస్తున్న రేవంత్ తాజాగా ఇప్పుడు ప్రాజెక్టు ప్ర‌యోజ‌నాలు ఏం లేవంటూ కామెంట్ చేయ‌డం చూస్తుంటే…ఆదివారం కూడా విశ్రాంతిలో ఉన్న కేసీఆర్ ను వ‌దిలిపెట్ట‌కుండా రేవంత్ టార్గెట్ చేశార‌నే విష‌యం స్ప‌ష్ట‌మైంద‌ని అంటున్నారు.

This post was last modified on November 17, 2024 8:20 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దేశ చ‌రిత్ర‌లో.. `మ‌మ‌త` గెలిచారు… మరి ఈసీ మాటేంటి?!

సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచార‌ణ‌కు వ‌స్తాయి. న్యాయ‌శాస్త్రంలో ల‌బ్ధ‌ప్ర‌తిష్టులైన అనేక మంది న్యాయ‌వాదులు వాద‌న‌లు వినిపిస్తారు. ఇది…

2 hours ago

గంపెడు సినిమాలు… గుప్పెడు అంచనాలు

రేపు కొత్త శుక్రవారం వచ్చేస్తోంది. సంక్రాంతి సినిమాల హడావిడి పూర్తిగా అయిపోవడంతో ఇప్పుడు మూవీ లవర్స్ దృష్టి వీటివైపు వెళ్లాల్సి…

2 hours ago

సినిమాల్లేవ్ కానీ అంతటా ఆమే..

బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…

6 hours ago

మళ్లీ రెండేళ్లంటే కష్టం రాజా

ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…

10 hours ago

మహేష్ రన్నింగ్ స్టైల్ మార్చడమేంటి జక్కన్నా?

తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…

12 hours ago

దురంధర్ VS విశ్వరూపం – ఎందుకీ రచ్చ?

ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…

12 hours ago