లగచర్లలో కలెక్టర్పై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె కేటీఆర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దాడి చేయించేందుకు వెనుకనుండి కేటీఆర్ కీలక పాత్ర పోషించారని ఆరోపించారు. అమాయకులను బలి చేసి తమ స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చుకోవడమే బీఆర్ఎస్ నాయకుల లక్ష్యమని పేర్కొన్నారు.
అంతే కాకుండా లగచర్ల ఘటనలో ప్రమేయం ఉన్న అధికారులను విదేశాలకు పంపించారని, ఈ వ్యవహారంలో పలు ఆంతరంగిక అంశాలు ఉన్నాయని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా బయటపడ్డ వాస్తవాలు కేటీఆర్ పాత్రను నిర్ధారిస్తున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ నేతలు నైతిక విలువలు కోల్పోయి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ పాలన వల్ల రాష్ట్రం అప్పులపాలైందని, భవిష్యత్తు తరం చెల్లించలేని స్థాయికి అప్పుల మోత మిగిల్చిందని సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ పాలనను దుయ్యబట్టిన ఆమె, ప్రజల సమస్యలను పక్కనబెట్టి తమ స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే ఈ పార్టీ పనిచేస్తోందని ఆరోపించారు. ఇక బీఆర్ఎస్ దుష్టపాలన అంతమొందించి ఏడాది పూర్తయిన సందర్భంగా లక్ష మందికి పైగా మహిళలతో విజయోత్సవ సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఈ సభ ద్వారా మహిళల స్ఫూర్తిని ప్రపంచానికి చాటుదామని సురేఖ పేర్కొన్నారు. అలాగే వరంగల్ను రాష్ట్రానికి రెండో రాజధానిగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని కొండా సురేఖ తెలిపారు. వరంగల్ అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఆమె స్పష్టం చేశారు.
This post was last modified on November 17, 2024 8:14 pm
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ అడ్వాన్స్ బుకింగ్ వావ్ అనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చాలా ఆలస్యంగా ఓపెన్ చేసినప్పటికీ టికెట్లు…
ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు ఎదురయ్యే చేదు అనుభవాలు అన్ని ఇన్ని కావు. ఇక మేకర్స్ అప్పుడప్పుడు ఓపెన్ గా మాట్లాడే…
ముద్దుల గుర్తులతో మెరిసిపోయిన ఓ కారు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ వీధుల్లో అందరి దృష్టినీ ఆకర్షించింది. కారు మొత్తం దాదాపు 3,400…
రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్ లో వచ్చిన ఇరుముడి బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ అందుకుంటోంది. ఈ సినిమాలో హీరో…
స్థానిక ఎన్నికలకు వైసీపీ శ్రేణులను సమాయత్తం చేసే పనిలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో…
వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం ఇంకా చల్లారలేదు. అదనపు కట్నం కోసం అత్తా మామలు…