లగచర్లలో కలెక్టర్పై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె కేటీఆర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దాడి చేయించేందుకు వెనుకనుండి కేటీఆర్ కీలక పాత్ర పోషించారని ఆరోపించారు. అమాయకులను బలి చేసి తమ స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చుకోవడమే బీఆర్ఎస్ నాయకుల లక్ష్యమని పేర్కొన్నారు.
అంతే కాకుండా లగచర్ల ఘటనలో ప్రమేయం ఉన్న అధికారులను విదేశాలకు పంపించారని, ఈ వ్యవహారంలో పలు ఆంతరంగిక అంశాలు ఉన్నాయని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా బయటపడ్డ వాస్తవాలు కేటీఆర్ పాత్రను నిర్ధారిస్తున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ నేతలు నైతిక విలువలు కోల్పోయి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ పాలన వల్ల రాష్ట్రం అప్పులపాలైందని, భవిష్యత్తు తరం చెల్లించలేని స్థాయికి అప్పుల మోత మిగిల్చిందని సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ పాలనను దుయ్యబట్టిన ఆమె, ప్రజల సమస్యలను పక్కనబెట్టి తమ స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే ఈ పార్టీ పనిచేస్తోందని ఆరోపించారు. ఇక బీఆర్ఎస్ దుష్టపాలన అంతమొందించి ఏడాది పూర్తయిన సందర్భంగా లక్ష మందికి పైగా మహిళలతో విజయోత్సవ సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఈ సభ ద్వారా మహిళల స్ఫూర్తిని ప్రపంచానికి చాటుదామని సురేఖ పేర్కొన్నారు. అలాగే వరంగల్ను రాష్ట్రానికి రెండో రాజధానిగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని కొండా సురేఖ తెలిపారు. వరంగల్ అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఆమె స్పష్టం చేశారు.
This post was last modified on November 17, 2024 8:14 pm
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…