Political News

కేజ్రీవాల్ కు మరో దెబ్బ..

దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఒకప్పుడు బెస్ట్ లీడర్ అంటూ పొగిడిన సొంత నేతలే ఇప్పుడు అధినేత కేజ్రీవాల్ కు శత్రువులుగా మారుతున్నారు. ఈసారి ఏకంగా ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాస్ గెహ్లాట్ తన మంత్రి పదవికి రాజీనామా చేస్తూ పార్టీలో (ఆప్) కొత్త చర్చకు తెరలేపారు. ప్రభుత్వ అవినీతిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 

కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం ప్రజాసంక్షేమ బాటను విడిచిపోయిందని, అవినీతి పాలనలో మునిగిపోయిందని ఆయన ఆరోపించారు. అంతేకాదు, పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజీనామా లేఖలో గెహ్లాట్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను నేరుగా టార్గెట్ చేశారు. సీఎంగా ఉన్న కేజ్రీవాల్ నివాసం పునరుద్ధరణ కోసం రూ.45 కోట్ల ఖర్చు చేయడం ప్రజల నిధుల దుర్వినియోగం కాదా అని ప్రశ్నించారు. ఆ ఖర్చును తాను సమర్థించలేనని, ఈ తరహా నిర్ణయాలు ప్రజలకు చీకటి రోజులు తీసుకువస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.

పార్టీ లోపలే సమస్యలున్నాయని స్పష్టం చేసిన గెహ్లాట్, ప్రజల పట్ల ఉన్న నిబద్ధతను ఆప్ రాజకీయ ప్రయోజనాల కోసం త్యజించిందని విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమవుతూ, అవినీతి ఆరోపణలతో నిండిన పాలనకు తాను సాక్షిగా నిలవలేనని గెహ్లాట్ వ్యాఖ్యానించారు. ఈ పరిణామం ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, గెహ్లాట్ రాజీనామా ఆప్ ప్రతిష్టపై మచ్చగా మారే అవకాశముంది. 

ఇప్పటికే లిక్కర్ స్కామ్ ద్వారా పలు సమస్యలు ఎదుర్కొంటున్న ఆప్‌కు ఈ రాజీనామా కొత్త సవాళ్లు తెస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజీనామా తర్వాత గెహ్లాట్ ఏ రాజకీయ ప్రస్థానం ఎంచుకుంటారనే ఆసక్తి నెలకొంది. బీజేపీ లేదా కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తారా, లేదా స్వతంత్రంగా ఎన్నికల్లో బరిలోకి దిగుతారా అన్న చర్చలు సాగుతున్నాయి. ఈ పరిణామాలతో ఆప్‌లో అంతర్గత రాజకీయాలు మరింత వేడెక్కినట్లు కనిపిస్తోంది.

Satya

Recent Posts

పోక్సో కేసు నిందితుడికి బెయిలు రానివ్వకూడదు: రేవంత్ తో పవన్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘ‌ట‌న దారుణం`` అని…

15 minutes ago

ప్రజాధనం అంటే పవన్ ఒప్పుకోరు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…

16 minutes ago

ముద్ర‌గ‌డ పాడె మోసిన జ‌గ‌న్‌

కాపు ఉద్య‌మ నాయ‌కుడు, మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం అంత్య‌క్రియ‌లు ముగిశాయి. తూర్పుగోదావ‌రి జిల్లా కిర్లంపూడిలోని ఆయ‌న ఇంటి ప్రాంగ‌ణంలోనే…

46 minutes ago

బాబు సర్కారును పొగిడిన కేటీఆర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్‌నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…

50 minutes ago

అభిమానం తోడుతో… ఇంటికి చేరిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌!

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుప‌త్రి నుంచి  డిశ్చార్జ్ అయి..…

2 hours ago

ఇంత అహంకారమెందుకు అంబటి

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం ఉదయం ముద్రగడను…

2 hours ago