Political News

కేజ్రీవాల్ కు మరో దెబ్బ..

దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఒకప్పుడు బెస్ట్ లీడర్ అంటూ పొగిడిన సొంత నేతలే ఇప్పుడు అధినేత కేజ్రీవాల్ కు శత్రువులుగా మారుతున్నారు. ఈసారి ఏకంగా ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాస్ గెహ్లాట్ తన మంత్రి పదవికి రాజీనామా చేస్తూ పార్టీలో (ఆప్) కొత్త చర్చకు తెరలేపారు. ప్రభుత్వ అవినీతిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 

కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం ప్రజాసంక్షేమ బాటను విడిచిపోయిందని, అవినీతి పాలనలో మునిగిపోయిందని ఆయన ఆరోపించారు. అంతేకాదు, పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజీనామా లేఖలో గెహ్లాట్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను నేరుగా టార్గెట్ చేశారు. సీఎంగా ఉన్న కేజ్రీవాల్ నివాసం పునరుద్ధరణ కోసం రూ.45 కోట్ల ఖర్చు చేయడం ప్రజల నిధుల దుర్వినియోగం కాదా అని ప్రశ్నించారు. ఆ ఖర్చును తాను సమర్థించలేనని, ఈ తరహా నిర్ణయాలు ప్రజలకు చీకటి రోజులు తీసుకువస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.

పార్టీ లోపలే సమస్యలున్నాయని స్పష్టం చేసిన గెహ్లాట్, ప్రజల పట్ల ఉన్న నిబద్ధతను ఆప్ రాజకీయ ప్రయోజనాల కోసం త్యజించిందని విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమవుతూ, అవినీతి ఆరోపణలతో నిండిన పాలనకు తాను సాక్షిగా నిలవలేనని గెహ్లాట్ వ్యాఖ్యానించారు. ఈ పరిణామం ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, గెహ్లాట్ రాజీనామా ఆప్ ప్రతిష్టపై మచ్చగా మారే అవకాశముంది. 

ఇప్పటికే లిక్కర్ స్కామ్ ద్వారా పలు సమస్యలు ఎదుర్కొంటున్న ఆప్‌కు ఈ రాజీనామా కొత్త సవాళ్లు తెస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజీనామా తర్వాత గెహ్లాట్ ఏ రాజకీయ ప్రస్థానం ఎంచుకుంటారనే ఆసక్తి నెలకొంది. బీజేపీ లేదా కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తారా, లేదా స్వతంత్రంగా ఎన్నికల్లో బరిలోకి దిగుతారా అన్న చర్చలు సాగుతున్నాయి. ఈ పరిణామాలతో ఆప్‌లో అంతర్గత రాజకీయాలు మరింత వేడెక్కినట్లు కనిపిస్తోంది.

This post was last modified on November 17, 2024 8:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

2 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

3 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

4 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

4 hours ago

గుణశేఖర్ గారు లాజిక్ మిస్సయ్యారు

ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…

4 hours ago

షాకిచ్చిన రామ్ చరణ్… పెద్ది వస్తోందా?

ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…

5 hours ago