వైసీపీ ప్రభుత్వం అండ చూసుకొని సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యరమైన పోస్టులు పెట్టిన వారిపై ఏపీ పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రా రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరపగా విస్తుపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవ రెడ్డి స్క్రిప్ట్ ప్రకారమే పోస్టులు పెట్టానని పోలీసులకు రవీంద్రా రెడ్డి వాగ్మూలం ఇవ్వడం సంచలనం రేపింది.
ఈ క్రమంలోనే పరారీలో ఉన్న రాఘవరెడ్డి కోసం పోలీసులు సెర్చ్ వారెంట్ కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రాఘవరెడ్డి ఇంటికి పులివెందుల పోలీసులు నోటీసులు అంటించి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆ ఇంట్లో ఏ క్షణంలో అయినా సోదాలు చేసేందుకు అనుమతి తీసుకున్నామని అధికారులు తెలిపారు. ఇక, వైసీపీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ వివేకానంద రెడ్డికి కూడా పోలీసులు 41-A నోటీసులు జారీ చేశారు.
వివేకా హత్య కేసులో ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తాజాగా పీఏ రాఘవ రెడ్డి రూపంలో కొత్త చిక్కులు వచ్చి పడ్డారు. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో రాఘవ రెడ్డి వెనుక అవినాష్ రెడ్డి ఉన్నారని పుకార్లు వస్తున్నాయి. వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ, వైఎస్ సునీతలపై పెట్టిన పోస్టుల వెనుక రాఘవరెడ్డి ఉన్నాడని తేలిన నేపథ్యంలో అవినాష్ రెడ్డికి ఉచ్చు బిగుస్తోందని తెలుస్తోంది. రాఘవరెడ్డి అరెస్ట్ అయితే ఎంపీ మెడకు మరో ఉచ్చు బిగుసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
This post was last modified on November 17, 2024 5:49 am
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…