వైసీపీ ప్రభుత్వం అండ చూసుకొని సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యరమైన పోస్టులు పెట్టిన వారిపై ఏపీ పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రా రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరపగా విస్తుపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవ రెడ్డి స్క్రిప్ట్ ప్రకారమే పోస్టులు పెట్టానని పోలీసులకు రవీంద్రా రెడ్డి వాగ్మూలం ఇవ్వడం సంచలనం రేపింది.
ఈ క్రమంలోనే పరారీలో ఉన్న రాఘవరెడ్డి కోసం పోలీసులు సెర్చ్ వారెంట్ కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రాఘవరెడ్డి ఇంటికి పులివెందుల పోలీసులు నోటీసులు అంటించి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆ ఇంట్లో ఏ క్షణంలో అయినా సోదాలు చేసేందుకు అనుమతి తీసుకున్నామని అధికారులు తెలిపారు. ఇక, వైసీపీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ వివేకానంద రెడ్డికి కూడా పోలీసులు 41-A నోటీసులు జారీ చేశారు.
వివేకా హత్య కేసులో ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తాజాగా పీఏ రాఘవ రెడ్డి రూపంలో కొత్త చిక్కులు వచ్చి పడ్డారు. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో రాఘవ రెడ్డి వెనుక అవినాష్ రెడ్డి ఉన్నారని పుకార్లు వస్తున్నాయి. వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ, వైఎస్ సునీతలపై పెట్టిన పోస్టుల వెనుక రాఘవరెడ్డి ఉన్నాడని తేలిన నేపథ్యంలో అవినాష్ రెడ్డికి ఉచ్చు బిగుస్తోందని తెలుస్తోంది. రాఘవరెడ్డి అరెస్ట్ అయితే ఎంపీ మెడకు మరో ఉచ్చు బిగుసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి..…