వైసీపీ ప్రభుత్వం అండ చూసుకొని సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యరమైన పోస్టులు పెట్టిన వారిపై ఏపీ పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రా రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరపగా విస్తుపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవ రెడ్డి స్క్రిప్ట్ ప్రకారమే పోస్టులు పెట్టానని పోలీసులకు రవీంద్రా రెడ్డి వాగ్మూలం ఇవ్వడం సంచలనం రేపింది.
ఈ క్రమంలోనే పరారీలో ఉన్న రాఘవరెడ్డి కోసం పోలీసులు సెర్చ్ వారెంట్ కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రాఘవరెడ్డి ఇంటికి పులివెందుల పోలీసులు నోటీసులు అంటించి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆ ఇంట్లో ఏ క్షణంలో అయినా సోదాలు చేసేందుకు అనుమతి తీసుకున్నామని అధికారులు తెలిపారు. ఇక, వైసీపీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ వివేకానంద రెడ్డికి కూడా పోలీసులు 41-A నోటీసులు జారీ చేశారు.
వివేకా హత్య కేసులో ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తాజాగా పీఏ రాఘవ రెడ్డి రూపంలో కొత్త చిక్కులు వచ్చి పడ్డారు. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో రాఘవ రెడ్డి వెనుక అవినాష్ రెడ్డి ఉన్నారని పుకార్లు వస్తున్నాయి. వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ, వైఎస్ సునీతలపై పెట్టిన పోస్టుల వెనుక రాఘవరెడ్డి ఉన్నాడని తేలిన నేపథ్యంలో అవినాష్ రెడ్డికి ఉచ్చు బిగుస్తోందని తెలుస్తోంది. రాఘవరెడ్డి అరెస్ట్ అయితే ఎంపీ మెడకు మరో ఉచ్చు బిగుసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
This post was last modified on November 17, 2024 5:49 am
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…
వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…
గజ్వేల్ నియోజకవర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట. అయితే.. ఇక్కడే పాగా వేయాలని.. వచ్చే…
తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…
అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…