Political News

ఎంపీ అవినాష్ రెడ్డికి బిగుస్తున్న ఉచ్చు?

వైసీపీ ప్రభుత్వం అండ చూసుకొని సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యరమైన పోస్టులు పెట్టిన వారిపై ఏపీ పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రా రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరపగా విస్తుపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవ రెడ్డి స్క్రిప్ట్ ప్రకారమే పోస్టులు పెట్టానని పోలీసులకు రవీంద్రా రెడ్డి వాగ్మూలం ఇవ్వడం సంచలనం రేపింది.

ఈ క్రమంలోనే పరారీలో ఉన్న రాఘవరెడ్డి కోసం పోలీసులు సెర్చ్ వారెంట్ కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రాఘవరెడ్డి ఇంటికి పులివెందుల పోలీసులు నోటీసులు అంటించి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆ ఇంట్లో ఏ క్షణంలో అయినా సోదాలు చేసేందుకు అనుమతి తీసుకున్నామని అధికారులు తెలిపారు. ఇక, వైసీపీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ వివేకానంద రెడ్డికి కూడా పోలీసులు 41-A నోటీసులు జారీ చేశారు.

వివేకా హత్య కేసులో ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తాజాగా పీఏ రాఘవ రెడ్డి రూపంలో కొత్త చిక్కులు వచ్చి పడ్డారు. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో రాఘవ రెడ్డి వెనుక అవినాష్ రెడ్డి ఉన్నారని పుకార్లు వస్తున్నాయి. వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ, వైఎస్ సునీతలపై పెట్టిన పోస్టుల వెనుక రాఘవరెడ్డి ఉన్నాడని తేలిన నేపథ్యంలో అవినాష్ రెడ్డికి ఉచ్చు బిగుస్తోందని తెలుస్తోంది. రాఘవరెడ్డి అరెస్ట్ అయితే ఎంపీ మెడకు మరో ఉచ్చు బిగుసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

This post was last modified on November 17, 2024 5:49 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

`చ‌లానా` పడిందా… బ్యాంక్ నుండి మనీ కట్

వాహ‌న‌దారుల‌కు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ర‌హ‌దారుల‌పై ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా వాహ‌నాలు న‌డుపుతూ..…

26 minutes ago

బాబు, లోకేష్… సొంతూరికి వెళ్తూ స‌మ‌స్య‌ల‌పై దృష్టి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల‌ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…

6 hours ago

జిల్లాల విషయంలో తగ్గేదేలే అంటున్న రేవంత్

రాష్ట్రంలో అభివృద్ది చేసే విష‌యంలో ఎవ‌రు ఎన్ని విధాల అడ్డు ప‌డినా.. తాము ముందుకు సాగుతామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్…

8 hours ago

బడ్జెట్ 2026: అప్పులు తగ్గేలా నిర్మలమ్మ ప్లాన్

2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…

9 hours ago

టీమ్ ఇండియాలోకి కొత్త కుర్రాడు

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…

9 hours ago

ఒక్క సెలవు కూడా తీసుకొని సీఎం

ప్ర‌జ‌ల కోసం తాను ఒక్క‌రోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా ప‌నిచేస్తున్న‌ట్టు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ…

11 hours ago