Political News

అవినాష్‌రెడ్డికి మ‌రో చిక్కు.. ఇక‌, బీటెక్ రెడ్డి వంతు!

వైసీపీ కీల‌క నాయ‌కుడు, క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్ప‌టికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒక‌వైపు బాబాయి వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేసులో ఆయ‌న నిందితుడిగా ఉన్నారు. ప్ర‌స్తుతం బెయిల్‌పైనే కాలం గ‌డుపుతున్నారు.ఇక‌, ఆయ‌న ప్రోత్స‌హించిన‌ట్టు చెబుతున్న కొంద‌రు వైసీపీ సానుభూతి ప‌రులు సోష‌ల్ మీడియాలో విశృంఖ‌లంగా కామెంట్లు చేశారు. వీరిని ఇప్ప‌టికే పోలీసులు అరెస్టు చేశారు. కీల‌క‌మైన అవినాష్‌రెడ్డి పీఏ కోసం గాలింపును ముమ్మ‌రం చేశారు.

ఇన్ని చిక్కుముడుల మ‌ధ్య అవినాష్ రెడ్డికి ఊప‌రి కూడా తీసుకునే తీరిక‌లేకుండా పోయింది. ఇక‌, ఇప్పు డు టీడీపీ నాయ‌కుడు, పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ ఓడిపోయిన బీటెక్ ర‌వి(ర‌వీంద్రారెడ్డి) రూపంలో మ‌రో చిక్కు ఎదురైంది. తాజాగా బీటెక్ ర‌వి.. అవినాష్ భూక‌బ్జాల‌కు పాల్ప‌డ్డారంటూ.. ఆధారాల తో స‌హా బ‌హిరంగ ప‌రిచారు.  అవినాష్ రెడ్డి ప్రోత్సాహంతో ఆయ‌న‌ కుటుంబ సభ్యులే తొండూరు మండలంలో 200 ఎకరాల మేర‌కు స‌ర్కారు భూమి ఆక్రమించి సాగు చేశారని చెప్పారు.

అంతేకాదు.. ఈ భూమిని వైసీపీ హ‌యాంలో ఎక‌రా 50 వేల రూపాయ‌ల‌కే అప్ప‌నంగా కొట్టేశార‌ని, అత్యంత త‌క్కువ ధ‌ర‌ల‌కే రేటు నిర్ణ‌యించి రిజిస్ట్రేష‌న్ కూడా చేసుకున్న‌ట్టు బీటెక్ ర‌వి ఆధారాల‌ను వెలికి తీశారు. వీటిపై రాష్ట్ర ప్ర‌భుత్వం విచార‌ణ‌కు ఆదేశించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. అదేవిధంగా వివేకా కేసులో జైలుకు వెళ్లొచ్చిన దేవిరెడ్డి శంకర్ రెడ్డి దొడ్ల వాగు గ్రామంలో 30 ఎకరాల భూమిని ఆక్రమించారని కూడా చెప్పారు.

ఇక‌, వైసీపీ నాయ‌కుడు, పులివెందుల మున్సిపల్ చైర్మన్ డికెటి భూములు ఆక్రమించారని బీటెక్ ర‌వి ఆన్‌లైన్ ఆధారాల‌ను బ‌య‌ట‌కు తీశారు. ఇవ‌న్నీ.. ప్ర‌భుత్వ భూములేన‌ని.. నాటి వైసీపీ హ‌యాంలో వీటిని దోచుకున్నార‌ని ఆరోపించారు. వీటి లెక్క‌ల‌న్నీ ప్ర‌భుత్వానికి పంపిస్తామ‌ని.. విచార‌ణ జ‌రిపి.. ఆయా భూములు వెన‌క్కి తీసుకుంటామ‌ని కూడా.. బీటెక్ ర‌వి వ్యాఖ్యానించారు. మ‌రి దీనిపై అవినాష్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. 

This post was last modified on November 16, 2024 9:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

50 minutes ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

2 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

2 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

2 hours ago

గుణశేఖర్ గారు లాజిక్ మిస్సయ్యారు

ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…

3 hours ago

షాకిచ్చిన రామ్ చరణ్… పెద్ది వస్తోందా?

ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…

3 hours ago