Political News

అవినాష్‌రెడ్డికి మ‌రో చిక్కు.. ఇక‌, బీటెక్ రెడ్డి వంతు!

వైసీపీ కీల‌క నాయ‌కుడు, క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్ప‌టికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒక‌వైపు బాబాయి వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేసులో ఆయ‌న నిందితుడిగా ఉన్నారు. ప్ర‌స్తుతం బెయిల్‌పైనే కాలం గ‌డుపుతున్నారు.ఇక‌, ఆయ‌న ప్రోత్స‌హించిన‌ట్టు చెబుతున్న కొంద‌రు వైసీపీ సానుభూతి ప‌రులు సోష‌ల్ మీడియాలో విశృంఖ‌లంగా కామెంట్లు చేశారు. వీరిని ఇప్ప‌టికే పోలీసులు అరెస్టు చేశారు. కీల‌క‌మైన అవినాష్‌రెడ్డి పీఏ కోసం గాలింపును ముమ్మ‌రం చేశారు.

ఇన్ని చిక్కుముడుల మ‌ధ్య అవినాష్ రెడ్డికి ఊప‌రి కూడా తీసుకునే తీరిక‌లేకుండా పోయింది. ఇక‌, ఇప్పు డు టీడీపీ నాయ‌కుడు, పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ ఓడిపోయిన బీటెక్ ర‌వి(ర‌వీంద్రారెడ్డి) రూపంలో మ‌రో చిక్కు ఎదురైంది. తాజాగా బీటెక్ ర‌వి.. అవినాష్ భూక‌బ్జాల‌కు పాల్ప‌డ్డారంటూ.. ఆధారాల తో స‌హా బ‌హిరంగ ప‌రిచారు.  అవినాష్ రెడ్డి ప్రోత్సాహంతో ఆయ‌న‌ కుటుంబ సభ్యులే తొండూరు మండలంలో 200 ఎకరాల మేర‌కు స‌ర్కారు భూమి ఆక్రమించి సాగు చేశారని చెప్పారు.

అంతేకాదు.. ఈ భూమిని వైసీపీ హ‌యాంలో ఎక‌రా 50 వేల రూపాయ‌ల‌కే అప్ప‌నంగా కొట్టేశార‌ని, అత్యంత త‌క్కువ ధ‌ర‌ల‌కే రేటు నిర్ణ‌యించి రిజిస్ట్రేష‌న్ కూడా చేసుకున్న‌ట్టు బీటెక్ ర‌వి ఆధారాల‌ను వెలికి తీశారు. వీటిపై రాష్ట్ర ప్ర‌భుత్వం విచార‌ణ‌కు ఆదేశించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. అదేవిధంగా వివేకా కేసులో జైలుకు వెళ్లొచ్చిన దేవిరెడ్డి శంకర్ రెడ్డి దొడ్ల వాగు గ్రామంలో 30 ఎకరాల భూమిని ఆక్రమించారని కూడా చెప్పారు.

ఇక‌, వైసీపీ నాయ‌కుడు, పులివెందుల మున్సిపల్ చైర్మన్ డికెటి భూములు ఆక్రమించారని బీటెక్ ర‌వి ఆన్‌లైన్ ఆధారాల‌ను బ‌య‌ట‌కు తీశారు. ఇవ‌న్నీ.. ప్ర‌భుత్వ భూములేన‌ని.. నాటి వైసీపీ హ‌యాంలో వీటిని దోచుకున్నార‌ని ఆరోపించారు. వీటి లెక్క‌ల‌న్నీ ప్ర‌భుత్వానికి పంపిస్తామ‌ని.. విచార‌ణ జ‌రిపి.. ఆయా భూములు వెన‌క్కి తీసుకుంటామ‌ని కూడా.. బీటెక్ ర‌వి వ్యాఖ్యానించారు. మ‌రి దీనిపై అవినాష్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. 

This post was last modified on November 16, 2024 9:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రేవంత్ రెడ్డి `వ‌న్ మ్యాన్ ఆర్మీ`… సరిపోవట్లేదా?

తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌లో వ‌న్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి క‌నిపిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి…

4 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో ఎవరిది పైచేయి?

ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల్లో ఒక‌ప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్ద‌గా క‌నిపించ‌డం లేద‌న్న టాక్ వినిపిస్తోంది. కీల‌క నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

4 hours ago

క‌ర‌ణం `క‌ల‌` ఏమైంద‌బ్బా ..!

క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి.. రాజ‌కీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన నేత‌. కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్‌ను ఎమ్మెల్యేగా చూసుకోవాల‌న్న…

8 hours ago

ఏలా చూసినా… మన సీట్లు పెరుగుతాయి

నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…

8 hours ago

RRR వల్ల కానిది దురంధర్ చేయగలదా

బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…

9 hours ago

అక్కడ నెలకు రెండు సార్లు జీతం? ఇదేదో బాగుందే..

ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…

9 hours ago