Political News

జ‌గ‌న్ కోసం మాట‌లు ప‌డాలా? ర‌గులుతున్న ఎమ్మెల్యేలు!

పిల్లి సాధు జంతువే. ఎంతో ముచ్చ‌ట‌గా ఉంటుంది. మ‌నం చెప్పిన‌ట్టు చేస్తుంది. కానీ, దానిని బంధిస్తే.. ఎదురు తిరుగుతుంది. ఇప్పుడు వైసీపీలోనూ ఇదే జ‌రుగుతోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు జ‌గ‌న్ అంటే భ‌య భ‌క్తులు ప్ర‌ద‌ర్శించిన ఎమ్మెల్యేలు.. ఇప్పుడు ఎదురు తిరిగేందుకు రెడీ అవుతున్నారు. ఇది వాస్త‌వం. క్షేత్ర‌స్థాయిలో రాజ‌కీయాలు మారుతున్నాయి. వైసీపీకి ఉన్న 11 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది వ‌ర‌కు ఇప్పుడు జ‌గ‌న్‌ను ఎదిరించేందుకు రెడీ అయ్యారు.

ఏ ఎమ్మెల్యే అయినా.. అంతిమ ల‌క్ష్యం.. నియోజ‌క‌వ‌ర్గంలో పేరు సంపాయించుకోవ‌డం. ప్ర‌జ‌ల‌కు చేరువ గా ఉండ‌డం. ఇది జ‌ర‌గాలంటే.. నియోజ‌క‌వ‌ర్గంలో అంతో ఇంతో ప‌నులు చేయించుకోవాలి. ఇది కావాలంటే.. స‌భ‌కు వెళ్లాలి.. స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చ‌కు పెట్టాలి. అంతేకాదు.. ప్ర‌స్తుతం పెరిగిపోయిన‌.. సోష‌ల్ మీడియా ప్రభావంతో ఎమ్మెల్యే స‌భ‌లో మాట్టాడారో లేదో .. తెలుసుకోవ‌డం ప్ర‌జ‌ల‌కు ఈజీ అయిపోయింది. దీంతో త‌మ ఎమ్మెల్యే స‌భ‌లో ఏం చేస్తున్నాడ‌నే చ‌ర్చ కూడా చేస్తున్నారు.

అయితే.. వైసీపీ ఎమ్మెల్యేలు స‌భ‌కు వెళ్ల‌కుండా జ‌గ‌న్ అడ్డుకుంటున్నారు. త‌న పంతానికి ఎమ్మెల్యేల‌ను బ‌లి చేస్తున్నారనే వాద‌న వైసీపీలో క్షేత్ర‌స్థాయిలోనే వినిపిస్తున్న వాద‌న‌. ఇది ఆయ‌న‌కు ఇబ్బందిగా మారింది. అయినా.. జ‌గ‌న్ త‌న పంతం .. ప‌ట్టుద‌ల‌ల‌ను వీడ‌డం లేదు. దీంతో ఎమ్మెల్యేలు కూడా.. ఇక‌, మేం మారాల్సిందే! అనే నిర్ణ‌యానికివ‌చ్చేస్తున్నారు. ఈ క్ర‌మంలో వారు త‌మ దారి తాము చూసుకునేందుకు రెడీ అవుతున్నారు.

జ‌గ‌న్‌ను ఎదిరించి అయినా.. స‌భ‌కు వెళ్లేందుకు న‌లుగురి నుంచి ఆరుగురు ఎమ్మెల్యేల వ‌ర‌కు రెడీ అయ్యారు. మ‌హా అయితే.. పార్టీ నుంచి స‌స్పెండ్ చేస్తారు. స‌భ్య‌త్వం అయితే ర‌ద్దు కాదు క‌దా!? అనేది వారి ఆలోచ‌న‌. ఇలా వెళ్ల‌కుండా.. జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు ఉండిపోతే.. నియోజ‌క‌వ‌ర్గంలో డమ్మీలు అయిపోతున్నామ‌న్న బాధ‌, ఆవేద‌న రెండూ వారిలో క‌నిపిస్తున్నాయి. కొత్త‌గా ఎన్నికైన వారైతే.. స‌భ రూపు రేఖ‌లు కూడా ఇంకా చూడ‌లేద‌న్న ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

దీంతో ఇలాంటి వారు స‌భ‌కు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. మ‌రోవైపు.. జ‌గ‌న్‌ను ఎద‌రించి స‌భ‌కు వ‌చ్చే వారికి.. స‌మ‌స్య‌లు ప్ర‌స్తావించే వారికి అధికార ప‌క్షం అండ‌గా ఉండేలా వ్య‌వ‌హ‌రించేందుకు రెడీగా ఉంది. సో.. ఏక్ష‌ణ‌మైనావైసీపీలో ముస‌లం పుట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇక‌, జ‌గ‌న్ మాట ను వినేందుకు ఎవ‌రూ సిద్ధంగా అయితే లేరు. కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసుకుని, కూట‌మి ప్ర‌భావాన్ని ఎదుర్కొని గెలిచిన త‌ర్వాత‌.. ఇంట్లో ఉంటే.. ఇక‌, ఎప్ప‌టికీ ప్ర‌జ‌లు త‌మ‌ను విశ్వ‌సించ‌ర‌నే భావ‌న కూడా వారిని వెంటాడుతుండ‌డం గ‌మ‌నార్హం. సో.. వ‌చ్చే రెండు మూడు రోజుల్లో సంచ‌ల‌నాలు చోటు చేసుకునే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

This post was last modified on November 12, 2024 1:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దేవిశ్రీ ప్రసాద్ దూరానికి కారణమిదేనా ?

పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…

23 minutes ago

పెంపుడు పిల్లి చ‌నిపోయింద‌ని.. ఉరేసుకున్న విద్యార్థిని!

పెంపుడు జంతువుల ప‌ట్ల య‌జ‌మానులు, కుటుంబ స‌భ్యులు ఎంత ప్రేమ‌ను పెంచుకుంటారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయా జంతువులు…

45 minutes ago

ఉస్తాద్ పాట‌ల వాడ‌కం.. ఎంత ఖ‌ర్చు పెట్టారో?

ఒక‌ప్పుడు పాత సినిమాల పాట‌లను య‌థేచ్ఛ‌గా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవ‌రికీ ఏ అభ్యంత‌రాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…

2 hours ago

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…

5 hours ago

స‌మంత బంగారం కోసం రాజు గారు వ‌స్తారా?

ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళంలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ద‌శాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన క‌థానాయిక స‌మంత‌. కానీ కొన్నేళ్లుగా…

5 hours ago

ఆ యూట్యూబర్లకు ‘పరాభవం’ తప్పదట

సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…

6 hours ago