ఆంధ్రప్రదేశ్ శాసన సభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2.94 లక్షల కోట్లతో 2024-25 వార్షిక బడ్జెట్ ను ఏపీ ఆర్ధిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ సభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ లో గృహ నిర్మాణానికి రూ.4012 కోట్లు, పురపాలక, పట్టణాభివృద్ధి -రూ.11,490 కోట్లు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి -రూ.16739 కోట్లు కేటాయించారు. ఈ క్రమంలోనే పేదలకు ఉచితంగా ఇళ్లు, ఇళ్లపట్టాలపై సభలో పయ్యావుల కీలక ప్రకటన చేశారు.
2029 నాటికి పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించిందని పయ్యావుల అన్నారు. ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన-ఎన్టీఆర్ నగరాలు’ పథకం కింది ఆర్థికంగా వెనుకబడిన వారికి 25 లక్షల ఇళ్లు, ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించిందని ఆయన ప్రకటించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం..రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలకు ఈ పథకం ఊతం ఇస్తుంది అని అన్నారు. ఈ పథకం కింద 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని పయ్యావుల వెల్లడించారు.
This post was last modified on November 11, 2024 11:43 am
తమిళ స్టార్ హీరోల్లో ఒకడైన రవి మోహన్ అలియాస్ జయం రవి.. ఈ మధ్య సినిమాలతో కంటే వ్యక్తిగత జీవితానికి…
ఉమ్మడి రాష్ట్రం ఏపీ, తెలంగాణగా విడిపోయాక సినిమా పరిశ్రమకు సంబంధించిన చర్చలు ఎప్పటికప్పుడు ప్రభుత్వ పెద్దల మధ్య ప్రస్తావనకు రావడం…
తాను తీసే సినిమా కథ గురించి ఆరంభ దశలోనే మీడియాతో విశేషాలు పంచుకోవడం దర్శక ధీరుడు రాజమౌళికి అలవాటు. ‘ఆర్ఆర్ఆర్’…
ఏపీలో రెండు రోజుల క్రితం ఓ కీలక అదికారిక కార్యక్రమం జరిగింది. ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చేసిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ…
ఒకప్పుడు యూత్ ఫుల్ హిట్లతో మంచి ఊపు మీద ఉన్న నితిన్ దాన్ని నిలబెట్టుకునే క్రమంలో వేగంగా చేసిన సినిమాలు…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో పాటు ఎక్కువ కాలం షూటింగ్ జరుపుకున్న సినిమాగా…