ఆంధ్రప్రదేశ్ శాసన సభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2.94 లక్షల కోట్లతో 2024-25 వార్షిక బడ్జెట్ ను ఏపీ ఆర్ధిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ సభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ లో గృహ నిర్మాణానికి రూ.4012 కోట్లు, పురపాలక, పట్టణాభివృద్ధి -రూ.11,490 కోట్లు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి -రూ.16739 కోట్లు కేటాయించారు. ఈ క్రమంలోనే పేదలకు ఉచితంగా ఇళ్లు, ఇళ్లపట్టాలపై సభలో పయ్యావుల కీలక ప్రకటన చేశారు.
2029 నాటికి పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించిందని పయ్యావుల అన్నారు. ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన-ఎన్టీఆర్ నగరాలు’ పథకం కింది ఆర్థికంగా వెనుకబడిన వారికి 25 లక్షల ఇళ్లు, ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించిందని ఆయన ప్రకటించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం..రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలకు ఈ పథకం ఊతం ఇస్తుంది అని అన్నారు. ఈ పథకం కింద 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని పయ్యావుల వెల్లడించారు.
This post was last modified on November 11, 2024 11:43 am
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…