ఆంధ్రప్రదేశ్ శాసన సభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2.94 లక్షల కోట్లతో 2024-25 వార్షిక బడ్జెట్ ను ఏపీ ఆర్ధిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ సభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ లో గృహ నిర్మాణానికి రూ.4012 కోట్లు, పురపాలక, పట్టణాభివృద్ధి -రూ.11,490 కోట్లు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి -రూ.16739 కోట్లు కేటాయించారు. ఈ క్రమంలోనే పేదలకు ఉచితంగా ఇళ్లు, ఇళ్లపట్టాలపై సభలో పయ్యావుల కీలక ప్రకటన చేశారు.
2029 నాటికి పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించిందని పయ్యావుల అన్నారు. ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన-ఎన్టీఆర్ నగరాలు’ పథకం కింది ఆర్థికంగా వెనుకబడిన వారికి 25 లక్షల ఇళ్లు, ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించిందని ఆయన ప్రకటించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం..రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలకు ఈ పథకం ఊతం ఇస్తుంది అని అన్నారు. ఈ పథకం కింద 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని పయ్యావుల వెల్లడించారు.
This post was last modified on November 11, 2024 11:43 am
https://youtu.be/COhEUjI-GEk?si=vlcLiVU0tytCMihG ఎంఆర్పీ సినిమా టీజర్ విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రముఖ నిర్మాత సాహు గారపాటి చేతుల మీదుగా…
జూన్ నెలకు వాయిదా వేసుకున్న పెద్ది చివరి ఘట్టంకు వచ్చేసింది. ఐటెం సాంగ్ తీస్తే గుమ్మడికాయ కొట్టొచ్చు. దర్శకుడు బుచ్చిబాబు…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు(90) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో సతమతం అవుతున్న నాదెండ్ల…
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఇక జైలు ఊచలు లెక్కపెట్టక తప్పేలా లేదు. ఎందుకంటే...తన వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం అనే…
ప్రస్తుతం మంచి ఊపులో షూటింగ్ జరుపుకుంటున్న బాలకృష్ణ - గోపీచంద్ మలినేని మూవీలో ముందు తీసుకున్న హీరోయిన్ నయనతార. ఇది…
స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన, పరీక్షలు రాయాల్సిన వయసులో ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఎలా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం. సినీ…