మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా సందడిగా ఉన్నాయి. అయితే కథ పరంగా ఉన్న కొన్ని పాయింట్లను తీసుకుని వాటికి పాత సినిమాలతో ముడిపెడుతున్న ట్రెండ్ ఒకటి సోషల్ మీడియాలో కనిపిస్తోంది.
అదేంటంటే పిల్లలు దూరమైన హీరో వాళ్ళ కోసం పరితపించి భార్యకు దగ్గరవ్వాలని ప్రయత్నాలు చేయడం గతంలో అజిత్ విశ్వాసం, వెంకటేష్ తులసిలో చూశాం. ఇప్పుడు వరప్రసాద్ లోనూ ఈ ఎపిసోడ్ ఉంది. కాకతాళీయంగా మూడింట్లో హీరోయిన్ నయనతార కావడం గమనించాల్సిన విషయం.
వినగానే నిజమే అనిపించినా ఇక్కడ కొన్ని ప్రాక్టికల్ కోణాలు చూడాలి. మగధీరలో పూర్వ జన్మలు గుర్తుకు రావడాన్ని మూగ మనసులు నుంచి తీసుకున్నారంటే దానికి ఏం చెప్పగలం. దానికన్నా ముందు జానకి రాముడులోనూ ఈ తరహా ట్రీట్ మెంట్ చూడొచ్చు. విక్రమార్కుడులో విలన్ కొడుకుని చంపే ఎపిసోడ్ వైజయంతి ఐపిఎస్ అనే పాత మూవీలో ఉంటుంది.
చిరంజీవి డాడీలో పాప సెంటిమెంట్ ని మన శంకరవరప్రసాద్ గారులో పాజిటివ్ గా మార్చడం రావిపూడి ఇంటెలిజెన్స్ కి నిదర్శనం. అంతెందుకు సంక్రాంతికి వస్తున్నాంలో భార్య, ప్రియురాలు మధ్య నలిగిపోయే హీరో పాత్రే ఇప్పుడు భర్త మహాశయులకు విజ్ఞప్తిలో ఉంది.
భగవంత్ కేసరిలో తనకు సంబంధం లేని అమ్మాయిని గొప్ప స్థితికి తీసుకెళ్లే బాలయ్య తరహా క్యారెక్టర్ అశ్వినిలో భానుచందర్ ముప్పై సంవత్సరాల క్రితమే చేశారు. ఇలా చెప్పుకుంటూ వందల ఉదాహరణలు వస్తాయి కానీ ఫైనల్ గా కంటెంట్ ఆడియన్స్ కి నచ్చిందా లేదానేదే కీలకం.
అది కనెక్ట్ అయితే చాలు ఇంతకు ముందు చూశామా లేదా అనేది జనాలు పట్టించుకోరు. దానికి నిదర్శనమే మన శంకర వరప్రసాద్ గారు కలెక్షన్లు. మాస్, ఫ్యామిలీ పల్స్ లో పిహెచ్ది చేసిన అనిల్ రావిపూడికి ఈ పోలికలతో పెద్దగా ఫరక్ పడదు కానీ రెండేళ్ల మెగాభిమానుల నిరీక్షణకు తెరదించుతూ హిట్టివ్వడం పట్ల సర్వత్రా సంతోషం వ్యక్తమవుతోంది.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…