నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’ నిన్న రాత్రి ప్రిమియర్స్ నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఉదయానికి అది కాస్తా బ్లాక్ బస్టర్ టాక్గా మారిపోయింది. సంక్రాంతికి పర్ఫెక్ట్గా సరిపోయే ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో సినిమా పెద్ద రేంజికి వెళ్లబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
ట్రైలర్ రిలీజైనపుడు కొంచెం మిక్స్డ్ రెస్పాన్స్ కనిపించింది కానీ.. రిలీజ్ దగ్గర పడేసరికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ అడ్వాన్స్ బుకింగ్స్ మంచి ఊపుమీద సాగాయి. ముఖ్యంగా ప్రభాస్ మూవీ ‘రాజాసాబ్’ అంచనాలకు అందుకోకపోవడం చిరు సినిమాకు ప్లస్ అయింది. ఓవర్సీస్ ప్రి సేల్స్.. ‘రాజాసాబ్’ రిలీజ్ తర్వాతి రోజు నుంచే ఊపందుకోవడం గమనార్హం. యుఎస్లో ‘మన శంకర వరప్రసాద్ గారు’ బుకింగ్స్ మొదలైనపుడు అమ్మకాలు కొంచెం నెమ్మదిగా సాగడంతో ప్రిమియర్స్ కలెక్షన్లు ఆశించిన స్థాయిలో ఉండవేమో అన్న సందేహాలు కలిగాయి.
కానీ రిలీజ్ దగ్గర పడేసరికి బుకింగ్స్ మాంచి స్పీడు అందుకోవడంతో చిరు సినిమా ఆశ్చర్యకరంగా ప్రిమియర్స్తోనేే 1 మిలియన్ డాలర్ల క్లబ్బులోకి అడుగు పెట్టేసింది. ఓవరాల్గా ప్రిమియర్స్ నుంచి 1.2 మిలియన్ డాలర్లు కలెక్ట్ కావడం విశేషం. దీని వల్ల దర్శకుడు అనిల్ రావిపూడి.. నిర్మాత సాహు గారపాటికి కారు సమర్పించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. దీనికి సంబంధించి ఒక ఛాలెంజ్ గురించి ‘మన శంకర వరప్రసాద్ గారు’ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సాహు వెల్లడించాడు.
ఇంతకుముందు ‘భగవంత్ కేసరి’ సినిమా హిట్టవడంతో అనిల్కు కారు ఇచ్చాడు సాహు. మరి చిరు సినిమాకు కూడా అలాంటిదేమైనా ప్లాన్ చేస్తున్నారా అంటే.. ఈసారి రివర్సులో ఆయనే కారు ఇస్తాడని చెప్పాడు. కారణమేంటని అడిగితే.. యుఎస్లో ప్రిమియర్స్తో మిలియన్ మార్కు అందుకుంటే కారు ఇస్తానని అనిల్ ఛాలెంజ్ చేశాడట. తాను అది జరగదేమో అనుకుని, ఏదో ఒక ఎమోషన్లో ఛాలెంజ్ చేశాడని.. కానీ ఇప్పుడా సినిమా నిజంగానే ఆ మార్కును అందుకునేలా కనిపిస్తోందని అనిల్ అన్నాడు. ఆ అంచనాకు తగ్గట్లే సినిమా మిలియన్ ప్రిమియర్స్తో అదరగొట్టింది. మరి చెప్పినట్లే నిర్మాతకు అనిల్ కారు ఇస్తాడేమో చూడాలి.
This post was last modified on January 12, 2026 5:02 pm
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…