Political News

బాబు వార్నింగ్.. వైసీపీ కుటుంబాల జోలికెళ్లారో!

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చర్చలన్నీ.. వైసీపీ సోషల్ మీడియా మీద ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం మీదే నడుస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొన్ని నెలల పాటు సంయమనంతోనే వ్యవహరించింది.

ఒకప్పుడు వైసీపీ ప్రభుత్వ తరహాలో కక్ష సాధింపు చర్యలకు దిగలేదు. కానీ దీన్ని అలుసుగా తీసుకుని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఎప్పట్లాగే రెచ్చిపోతున్నారని.. టీడీపీ, జనసేన నేతలను బూతులు తిడుతూ.. ప్రభుత్వాన్ని, అధికార పార్టీలను అస్సలు లెక్క చేయనట్లు వ్యవహరిస్తున్నాయనే విమర్శలు ఆ పార్టీల మద్దతుదారుల నుంచి వినిపించాయి.

ఇటీవలే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోం మంత్రిత్వ శాఖ, పోలీసులు మెతకగా వ్యవహరిస్తున్నారనే విధంగా మాట్లాడ్డంతో ప్రభుత్వం ఒక్కసారిగా అలెర్ట్ అయింది. అప్పట్నుంచి వైసీపీ సోషల్ మీడియా మీద పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేల మందికి నోటీసులు వెళ్లాయి. కేసులు నమోదవుతున్నాయి. అరెస్టులు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు సైతం కొన్ని రోజులుగా సోషల్ మీడియా దుష్పరిణామాల మీద మాట్లాడుతున్నారు. పోలీసు చర్యలను సమర్థించుకునేలా.. సోషల్ మీడియాలో హద్దులు దాటి ప్రవర్తించే, దారుణమైన భాషతో పోస్టులు పెట్టే వారి గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఆడవాళ్లు, పిల్లల మీద దారుణమైన పోస్టుల పెట్టేవారిని సహించబోమని.. వాళ్లకు బుద్ధి చెబుతామని చంద్రబాబు నొక్కి వక్కాణిస్తున్నారు.

వైసీపీ సోషల్ మీడియా తీరును ఈ సందర్భంగా ఆయన ఎండగట్టారు. అదే సమయంలో చంద్రబాబు స్వపక్షానికి కూడా గట్టి వార్నింగ్ ఇవ్వడం విశేషం. రాజకీయ నాయకులు కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మహిళలు, పిల్లల జోలికి వెళ్తే.. హద్దులు దాటి సోషల్ మీడియా పోస్టుల పెడితే వదిలేది లేదని చెప్పిన బాబు.. వైసీపీకి చెందిన నేతల కుటుంబ సభ్యుల జోలికి వెళ్లినా కూడా ఇంతే కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.

హద్దులు దాటి ప్రవర్తిస్తున్న సోషల్ మీడియా జనాల వల్ల ఈ రోజుల్లో అన్ని పార్టీల వాళ్లూ బాధితులే. చంద్రబాబు ఇలా మాట్లాడడం మంచి పరిణామం. నిజంగా ఆయన మాటల్లోని చిత్తశుద్ధి చేతల్లోనూ కనిపిస్తే.. సోషల్ మీడియా విశృంఖలత్వం కొంచెమైనా తగ్గుతుందని ఆశించవచ్చు.

This post was last modified on November 10, 2024 5:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

59 seconds ago

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

1 hour ago

కేసీఆర్ వరకు వెళ్లిన సీతక్క పంచాయితీ

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…

2 hours ago

KVN… అగ్ర సంస్థకు అంతులేని అడ్డంకులు

సౌత్ లో అతి పెద్ద నిర్మాణ సంస్థగా ఎదగాలని ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్. మూలాలు కర్ణాటకనే…

3 hours ago

ప్రచారంలో నాయకుడు లేడు కానీ రూపం ఉంది

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంకేతికత సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. టీవీకే అధినేత విజయ్ ప్రత్యక్షంగా అన్ని నియోజకవర్గాలను సందర్శించడం కష్టంగా…

5 hours ago

వైభవ్ సూర్యవంశీని ఆపాలంటే…

ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టిక చూస్తుంటే రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి 'రాజసం' ఉట్టిపడేలా ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి…

5 hours ago