ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చర్చలన్నీ.. వైసీపీ సోషల్ మీడియా మీద ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం మీదే నడుస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొన్ని నెలల పాటు సంయమనంతోనే వ్యవహరించింది.
ఒకప్పుడు వైసీపీ ప్రభుత్వ తరహాలో కక్ష సాధింపు చర్యలకు దిగలేదు. కానీ దీన్ని అలుసుగా తీసుకుని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఎప్పట్లాగే రెచ్చిపోతున్నారని.. టీడీపీ, జనసేన నేతలను బూతులు తిడుతూ.. ప్రభుత్వాన్ని, అధికార పార్టీలను అస్సలు లెక్క చేయనట్లు వ్యవహరిస్తున్నాయనే విమర్శలు ఆ పార్టీల మద్దతుదారుల నుంచి వినిపించాయి.
ఇటీవలే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోం మంత్రిత్వ శాఖ, పోలీసులు మెతకగా వ్యవహరిస్తున్నారనే విధంగా మాట్లాడ్డంతో ప్రభుత్వం ఒక్కసారిగా అలెర్ట్ అయింది. అప్పట్నుంచి వైసీపీ సోషల్ మీడియా మీద పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేల మందికి నోటీసులు వెళ్లాయి. కేసులు నమోదవుతున్నాయి. అరెస్టులు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు సైతం కొన్ని రోజులుగా సోషల్ మీడియా దుష్పరిణామాల మీద మాట్లాడుతున్నారు. పోలీసు చర్యలను సమర్థించుకునేలా.. సోషల్ మీడియాలో హద్దులు దాటి ప్రవర్తించే, దారుణమైన భాషతో పోస్టులు పెట్టే వారి గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఆడవాళ్లు, పిల్లల మీద దారుణమైన పోస్టుల పెట్టేవారిని సహించబోమని.. వాళ్లకు బుద్ధి చెబుతామని చంద్రబాబు నొక్కి వక్కాణిస్తున్నారు.
వైసీపీ సోషల్ మీడియా తీరును ఈ సందర్భంగా ఆయన ఎండగట్టారు. అదే సమయంలో చంద్రబాబు స్వపక్షానికి కూడా గట్టి వార్నింగ్ ఇవ్వడం విశేషం. రాజకీయ నాయకులు కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మహిళలు, పిల్లల జోలికి వెళ్తే.. హద్దులు దాటి సోషల్ మీడియా పోస్టుల పెడితే వదిలేది లేదని చెప్పిన బాబు.. వైసీపీకి చెందిన నేతల కుటుంబ సభ్యుల జోలికి వెళ్లినా కూడా ఇంతే కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
హద్దులు దాటి ప్రవర్తిస్తున్న సోషల్ మీడియా జనాల వల్ల ఈ రోజుల్లో అన్ని పార్టీల వాళ్లూ బాధితులే. చంద్రబాబు ఇలా మాట్లాడడం మంచి పరిణామం. నిజంగా ఆయన మాటల్లోని చిత్తశుద్ధి చేతల్లోనూ కనిపిస్తే.. సోషల్ మీడియా విశృంఖలత్వం కొంచెమైనా తగ్గుతుందని ఆశించవచ్చు.
This post was last modified on November 10, 2024 5:50 pm
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ డీఎంకే, ప్రతిపక్ష పార్టీ ఏఐడీఎంకేలకు టీవీకే పెద్ద షాకిచ్చిన సంగతి తెలిసిందే.…
తమిళనాడు ఎన్నికల కౌంటింగ్ ట్రెండ్స్లో 105 స్థానాల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ముందంజలో ఉండటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే…
తమిళనాట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. అందుక్కారణం నటుడు విజయ్ పార్టీ టీవీకే మ్యాజిక్ మార్కు దిశగా…
తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే పార్టీ ముందంజలో ఉండటం చూస్తుంటే, అందరికీ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ ప్రయాణం…
కాంగ్రెస్ పార్టీ..దేశంలోనే అతి పురాతన రాజకీయ పార్టీ… అదే ఆ పార్టీకి పెద్ద మైనస్. పాత పార్టీ… పాత పాట……
సాయిపల్లవి బాలీవుడ్ డెబ్యూ ఏక్ దిన్ ఈ ఏడాది అతి పెద్ద డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచేందుకు పరుగులు పెడుతోంది.…