Political News

బాబు వార్నింగ్.. వైసీపీ కుటుంబాల జోలికెళ్లారో!

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చర్చలన్నీ.. వైసీపీ సోషల్ మీడియా మీద ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం మీదే నడుస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొన్ని నెలల పాటు సంయమనంతోనే వ్యవహరించింది.

ఒకప్పుడు వైసీపీ ప్రభుత్వ తరహాలో కక్ష సాధింపు చర్యలకు దిగలేదు. కానీ దీన్ని అలుసుగా తీసుకుని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఎప్పట్లాగే రెచ్చిపోతున్నారని.. టీడీపీ, జనసేన నేతలను బూతులు తిడుతూ.. ప్రభుత్వాన్ని, అధికార పార్టీలను అస్సలు లెక్క చేయనట్లు వ్యవహరిస్తున్నాయనే విమర్శలు ఆ పార్టీల మద్దతుదారుల నుంచి వినిపించాయి.

ఇటీవలే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోం మంత్రిత్వ శాఖ, పోలీసులు మెతకగా వ్యవహరిస్తున్నారనే విధంగా మాట్లాడ్డంతో ప్రభుత్వం ఒక్కసారిగా అలెర్ట్ అయింది. అప్పట్నుంచి వైసీపీ సోషల్ మీడియా మీద పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేల మందికి నోటీసులు వెళ్లాయి. కేసులు నమోదవుతున్నాయి. అరెస్టులు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు సైతం కొన్ని రోజులుగా సోషల్ మీడియా దుష్పరిణామాల మీద మాట్లాడుతున్నారు. పోలీసు చర్యలను సమర్థించుకునేలా.. సోషల్ మీడియాలో హద్దులు దాటి ప్రవర్తించే, దారుణమైన భాషతో పోస్టులు పెట్టే వారి గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఆడవాళ్లు, పిల్లల మీద దారుణమైన పోస్టుల పెట్టేవారిని సహించబోమని.. వాళ్లకు బుద్ధి చెబుతామని చంద్రబాబు నొక్కి వక్కాణిస్తున్నారు.

వైసీపీ సోషల్ మీడియా తీరును ఈ సందర్భంగా ఆయన ఎండగట్టారు. అదే సమయంలో చంద్రబాబు స్వపక్షానికి కూడా గట్టి వార్నింగ్ ఇవ్వడం విశేషం. రాజకీయ నాయకులు కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మహిళలు, పిల్లల జోలికి వెళ్తే.. హద్దులు దాటి సోషల్ మీడియా పోస్టుల పెడితే వదిలేది లేదని చెప్పిన బాబు.. వైసీపీకి చెందిన నేతల కుటుంబ సభ్యుల జోలికి వెళ్లినా కూడా ఇంతే కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.

హద్దులు దాటి ప్రవర్తిస్తున్న సోషల్ మీడియా జనాల వల్ల ఈ రోజుల్లో అన్ని పార్టీల వాళ్లూ బాధితులే. చంద్రబాబు ఇలా మాట్లాడడం మంచి పరిణామం. నిజంగా ఆయన మాటల్లోని చిత్తశుద్ధి చేతల్లోనూ కనిపిస్తే.. సోషల్ మీడియా విశృంఖలత్వం కొంచెమైనా తగ్గుతుందని ఆశించవచ్చు.

This post was last modified on November 10, 2024 5:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? .. పార్టీ నాయ‌కులు దీన‌స్థితిలో ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే…

19 minutes ago

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

36 minutes ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

1 hour ago

శర్వానంద్ భోగికి అసలైన ఛాలెంజ్

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

2 hours ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

2 hours ago

నంది అవార్డులంటే అంత చులకనా

ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…

3 hours ago