Political News

బాబు వార్నింగ్.. వైసీపీ కుటుంబాల జోలికెళ్లారో!

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చర్చలన్నీ.. వైసీపీ సోషల్ మీడియా మీద ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం మీదే నడుస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొన్ని నెలల పాటు సంయమనంతోనే వ్యవహరించింది.

ఒకప్పుడు వైసీపీ ప్రభుత్వ తరహాలో కక్ష సాధింపు చర్యలకు దిగలేదు. కానీ దీన్ని అలుసుగా తీసుకుని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఎప్పట్లాగే రెచ్చిపోతున్నారని.. టీడీపీ, జనసేన నేతలను బూతులు తిడుతూ.. ప్రభుత్వాన్ని, అధికార పార్టీలను అస్సలు లెక్క చేయనట్లు వ్యవహరిస్తున్నాయనే విమర్శలు ఆ పార్టీల మద్దతుదారుల నుంచి వినిపించాయి.

ఇటీవలే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోం మంత్రిత్వ శాఖ, పోలీసులు మెతకగా వ్యవహరిస్తున్నారనే విధంగా మాట్లాడ్డంతో ప్రభుత్వం ఒక్కసారిగా అలెర్ట్ అయింది. అప్పట్నుంచి వైసీపీ సోషల్ మీడియా మీద పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేల మందికి నోటీసులు వెళ్లాయి. కేసులు నమోదవుతున్నాయి. అరెస్టులు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు సైతం కొన్ని రోజులుగా సోషల్ మీడియా దుష్పరిణామాల మీద మాట్లాడుతున్నారు. పోలీసు చర్యలను సమర్థించుకునేలా.. సోషల్ మీడియాలో హద్దులు దాటి ప్రవర్తించే, దారుణమైన భాషతో పోస్టులు పెట్టే వారి గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఆడవాళ్లు, పిల్లల మీద దారుణమైన పోస్టుల పెట్టేవారిని సహించబోమని.. వాళ్లకు బుద్ధి చెబుతామని చంద్రబాబు నొక్కి వక్కాణిస్తున్నారు.

వైసీపీ సోషల్ మీడియా తీరును ఈ సందర్భంగా ఆయన ఎండగట్టారు. అదే సమయంలో చంద్రబాబు స్వపక్షానికి కూడా గట్టి వార్నింగ్ ఇవ్వడం విశేషం. రాజకీయ నాయకులు కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మహిళలు, పిల్లల జోలికి వెళ్తే.. హద్దులు దాటి సోషల్ మీడియా పోస్టుల పెడితే వదిలేది లేదని చెప్పిన బాబు.. వైసీపీకి చెందిన నేతల కుటుంబ సభ్యుల జోలికి వెళ్లినా కూడా ఇంతే కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.

హద్దులు దాటి ప్రవర్తిస్తున్న సోషల్ మీడియా జనాల వల్ల ఈ రోజుల్లో అన్ని పార్టీల వాళ్లూ బాధితులే. చంద్రబాబు ఇలా మాట్లాడడం మంచి పరిణామం. నిజంగా ఆయన మాటల్లోని చిత్తశుద్ధి చేతల్లోనూ కనిపిస్తే.. సోషల్ మీడియా విశృంఖలత్వం కొంచెమైనా తగ్గుతుందని ఆశించవచ్చు.

This post was last modified on November 10, 2024 5:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`చ‌లానా` పడిందా… బ్యాంక్ నుండి మనీ కట్

వాహ‌న‌దారుల‌కు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ర‌హ‌దారుల‌పై ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా వాహ‌నాలు న‌డుపుతూ..…

32 minutes ago

బాబు, లోకేష్… సొంతూరికి వెళ్తూ స‌మ‌స్య‌ల‌పై దృష్టి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల‌ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…

6 hours ago

జిల్లాల విషయంలో తగ్గేదేలే అంటున్న రేవంత్

రాష్ట్రంలో అభివృద్ది చేసే విష‌యంలో ఎవ‌రు ఎన్ని విధాల అడ్డు ప‌డినా.. తాము ముందుకు సాగుతామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్…

8 hours ago

బడ్జెట్ 2026: అప్పులు తగ్గేలా నిర్మలమ్మ ప్లాన్

2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…

9 hours ago

టీమ్ ఇండియాలోకి కొత్త కుర్రాడు

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…

9 hours ago

ఒక్క సెలవు కూడా తీసుకొని సీఎం

ప్ర‌జ‌ల కోసం తాను ఒక్క‌రోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా ప‌నిచేస్తున్న‌ట్టు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ…

11 hours ago