ఏపీలో సర్కారు మారింది. ప్రభుత్వ విధానాలతోపాటు.. ఆలోచనలు కూడా మారాయి. సంపద సృష్టి.. ఆదాయ వనరుల పెంపు దిశగా సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నం సక్సెస్ అవుతోందన్న చర్చ సాగుతోంది.
తాజాగా ఏపీ పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కించేలా.. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు.. వినూత్న ప్రయోగాన్ని ఆవిష్కరించింది. అదే సీ ప్లేన్ టూరిజం అంటే.. నదులలో ప్రయాణించే విమానంతో రాష్ట్రంలో పర్యాటకానికి బూస్ట్ ఇచ్చే కార్యక్రమం. దీనిని తాజాగా సీఎం చంద్రబాబు ఆవిష్కరించి.. తనే స్వయంగా తొలి ప్రయాణం కూడా చేశారు.
విజయవాడలోని కృష్ణానదిలో ఉన్న భవానీ ఘాట్ నుంచి శ్రీశైలం వరకు ఆయన అధికారులు, మంత్రులతో కలిసి.. సీప్లేన్లో పర్యటించారు. ఈ సీప్లేన్ పూర్తిగా నీటిపైనే ప్రయాణిస్తుంది. ఎక్కడైనా బ్రిడ్జిలు వస్తే.. పైకి ఎగిరి.. తిరిగి నీటిమీదకు చేరుతుంది.
ఇదొక గొప్ప అనుబూతిని కలిగించే పర్యాటక యాత్ర. దీనిని ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. స్వయంగా ప్రయాణించి.. విజయ వాడ నుంచి శ్రీశైలం వరకు చేరుకున్నారు. ఇదేసమయంలో ఆయన సంప్రదాయ వస్త్ర ధారణతో కనిపించడం.. టీడీపీ నేతలకు, బాబు అభిమానులకు కనువిందు చేసింది. దీనిని త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
రాష్ట్ర పర్యాటక రంగంలో గత టీడీపీ హయాంలోనూ అనేక వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అప్పట్లో ప్రత్యేక బోటింగ్ విధానం తీసుకువచ్చారు. అదేవిధంగా ఏటా మూడు సార్లు.. పర్యాటక వారోత్సవాలు నిర్వహించేవారు. అదేవిధంగా హిందూ దేవాలయాలకు ఉచితం ప్రసాదం అనే స్కీంను తీసుకువచ్చారు. పతంగుల పండుగను కూడా నిర్వహించారు.
తద్వారా రాష్ట్ర ఆదాయాన్ని రెట్టింపు(పర్యాటక రంగంలో) చేసే కార్యక్రమాలకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఇక, ఇప్పుడు దానికి మించిన అధునాతన వ్యవస్థను, పర్యాటకులను మంత్రుముగ్ధులను చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం గమనార్హం. ప్రస్తుతం ప్రవేశ పెట్టి సీప్లేన్ పర్యాటకం దేశంలోనే తొలిది కావడం గమనార్హం.
This post was last modified on November 10, 2024 10:13 am
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…
ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…
ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా దశాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన కథానాయిక సమంత. కానీ కొన్నేళ్లుగా…
సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…