అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టేందుకు పులివెందుల ఎమ్మెల్యే జగన్ కుంటిసాకులు వెతుకుతున్నారని ఎన్డీఏ కూటమి పార్టీల నేతలు విమర్శిస్తోన్న సంగతి తెలిసిందే. అసెంబ్లీకి వచ్చి అధికార పక్షాన్ని ప్రశ్నించాల్సిన జగన్…మైక్ ఇవ్వడం లేదంటూ కారణాలు చెప్పి మీడియా ముందు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను అని చెప్పడంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేగా జగన్ జీతం తీసుకోవడం దండగ అని, పులివెందుల ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
అసెంబ్లీ సమావేశాలకు రానని జగన్ చెప్పిన నేపథ్యంలో తాజాగా జగన్ పై ఆయన సోదరి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేని జగన్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. అంతేకాదు, జగన్ తో పాటు శాసన సభకు హాజరు కాని మిగతా వైసీపీ ఎమ్మెల్యేలు కూడా తమ తమ పదవులకు రాజీనామా చేయాలని షర్మిల అన్నారు.
కాగా, అసెంబ్లీకి రాని జగన్కు రాజకీయ పార్టీ ఎందుకని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతంరెడ్డిని ప్రకటించి ఆ తర్వాత వెనక్కి తగ్గారని, బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు డిమాండ్ చేస్తున్న జగన్.. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎందుకు దూరంగా ఉంటున్నారని ప్రశ్నించారు.
ఇక, పులివెందులలోని ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయని జగన్కు జీతమెందుకని భూమిరెడ్డి ప్రశ్నించారు. జగన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, అలా అయిన మరో ఎమ్మెల్యే పులివెందులకు వచ్చి డెవలప్ చేస్తారని చెప్పారు. జగన్ అసెంబ్లీకి రాకుండా పారిపోవడం సిగ్గుచేటని, ఎన్నికల్లో అక్రమాలు చేయడంతో జగన్ దిట్ట అని విమర్శించారు.
This post was last modified on November 8, 2024 6:40 pm
తెలుగు దేశం పార్టీ నిర్వహించే పసుపు పండుగ మహానాడుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపలో…
సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే త్రివిక్రమ్కు ఎంత అభిమానమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఒక సినీ వేడుకలో ఆయన సిరివెన్నెల గురించి…
హరిహర వీరమల్లు షూటింగ్ కు ముగింపుకొచ్చేసింది. సెట్స్ లో నిన్నటి నుంచి పవన్ కళ్యాణ్ హాజరు కావడంతో టీమ్ ఉత్సహంగా…
కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు చేస్తుందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్ ఫోర్స్మెంటు డైరెక్టరేట్(ఈడీ) పై సుప్రీంకోర్టు తాజాగా ఆగ్రహం వ్యక్తం చేసింది.…
కూటమి ప్రభుత్వం 11 మాసాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో సహజంగానే ప్రభుత్వం ఏం చేసిందన్న విషయంపై చర్చ జరుగుతుంది. అయితే..…
"మీ మీ బ్యాంకు ఖాతాలను మరోసారి అప్ డేట్ చేసుకోండి" అంటూ.. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్న దాతలకు సూచించింది.…