అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టేందుకు పులివెందుల ఎమ్మెల్యే జగన్ కుంటిసాకులు వెతుకుతున్నారని ఎన్డీఏ కూటమి పార్టీల నేతలు విమర్శిస్తోన్న సంగతి తెలిసిందే. అసెంబ్లీకి వచ్చి అధికార పక్షాన్ని ప్రశ్నించాల్సిన జగన్…మైక్ ఇవ్వడం లేదంటూ కారణాలు చెప్పి మీడియా ముందు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను అని చెప్పడంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేగా జగన్ జీతం తీసుకోవడం దండగ అని, పులివెందుల ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
అసెంబ్లీ సమావేశాలకు రానని జగన్ చెప్పిన నేపథ్యంలో తాజాగా జగన్ పై ఆయన సోదరి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేని జగన్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. అంతేకాదు, జగన్ తో పాటు శాసన సభకు హాజరు కాని మిగతా వైసీపీ ఎమ్మెల్యేలు కూడా తమ తమ పదవులకు రాజీనామా చేయాలని షర్మిల అన్నారు.
కాగా, అసెంబ్లీకి రాని జగన్కు రాజకీయ పార్టీ ఎందుకని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతంరెడ్డిని ప్రకటించి ఆ తర్వాత వెనక్కి తగ్గారని, బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు డిమాండ్ చేస్తున్న జగన్.. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎందుకు దూరంగా ఉంటున్నారని ప్రశ్నించారు.
ఇక, పులివెందులలోని ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయని జగన్కు జీతమెందుకని భూమిరెడ్డి ప్రశ్నించారు. జగన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, అలా అయిన మరో ఎమ్మెల్యే పులివెందులకు వచ్చి డెవలప్ చేస్తారని చెప్పారు. జగన్ అసెంబ్లీకి రాకుండా పారిపోవడం సిగ్గుచేటని, ఎన్నికల్లో అక్రమాలు చేయడంతో జగన్ దిట్ట అని విమర్శించారు.
This post was last modified on November 8, 2024 6:40 pm
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…