Political News

విద్యుత్ చార్జీలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యుత్ చార్జీలు పెంచారని వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. 2024-29 ఐదేళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారం చేపట్టిన 5 నెలల లోపు ప్రజలపై విద్యుత్ చార్జీల భారం మోపారి వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. పేదలపై విద్యుత్ చార్జీల భారానికి కారణం గత ప్రభుత్వానిదేనని చంద్రబాబు విమర్శించారు. ఒక్క యూనిట్ విద్యుత్ వాడకుండా వేల కోట్ల రూపాయలు చెల్లించిన ఘనత గత ప్రభుత్వానిదేనని చంద్రబాబు ఆరోపించారు.

కమీషన్లకు కక్కుర్తి పడి అడ్డగోలుగా విద్యుత్ కొనుగోలు చేశారని, 9 సార్లు కరెంటు చార్జీలు పెంచి 36 వేల కోట్ల భారం ప్రజలపై వేశారని జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు మండిపడ్డారు. జగన్ హయాంలో ఏపీకి వచ్చేందుకు పలు దేశాల పారిశ్రామికవేత్తలు భయపడ్డారని గుర్తు చేసుకున్నారు. ఐదేళ్లపాటు అధికారంలో ఉండి అందిన చోట అప్పులు చేసి రాష్ట్ర ప్రజలపై 10 లక్షల కోట్ల అప్పుల భారం వేశారని చంద్రబాబు ఆరోపించారు. గతంలో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను కూడా జగన్ ప్రభుత్వం రద్దు చేసిందని గుర్తు చేశారు.

పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన వైసీపీ….అందులో కీలక భాగమైన డయాఫ్రం వాల్ ను పూర్తిగా నాశనం చేసిందని ఆరోపించారు. గతంలో కరెంటు కోతలపై పెద్ద చర్చ జరిగిందని, కానీ తాను విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి విద్యుత్ కొరత లేకుండా చేసి మిగులు విద్యుత్ తెచ్చానని చెప్పారు. అమరావతిలో విద్యుత్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామని, ఇప్పుడు మొదలుపెట్టిన సబ్ స్టేషన్లు ఏడాదిలో పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు. 2014లో తాను ముఖ్యమంత్రి అయ్యేనాటికి 22.5 మిలియన్ యూనిట్లు విద్యుత్ కొరత ఉందని గుర్తు చేసుకున్నారు.

అమరావతిని జగన్ ప్రభుత్వం ఎడారిగా మార్చిందని, మద్యం తాకట్టు పెట్టి మరీ అప్పులు తెచ్చిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిని అక్కున చేర్చుకుని కాపాడిన ఘనత ఆడబిడ్డలకు దక్కుతుందని చంద్రబాబు అన్నారు. దుర్మార్గం, అహంకారంతో ముందుకుపోయిన వైసీపీకి ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెప్పారని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతిని దేశంలోనే నంబర్ వన్ సిటీగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని చంద్రబాబు చెప్పారు.

This post was last modified on November 7, 2024 9:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`చ‌లానా` పడిందా… బ్యాంక్ నుండి మనీ కట్

వాహ‌న‌దారుల‌కు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ర‌హ‌దారుల‌పై ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా వాహ‌నాలు న‌డుపుతూ..…

45 minutes ago

బాబు, లోకేష్… సొంతూరికి వెళ్తూ స‌మ‌స్య‌ల‌పై దృష్టి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల‌ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…

6 hours ago

జిల్లాల విషయంలో తగ్గేదేలే అంటున్న రేవంత్

రాష్ట్రంలో అభివృద్ది చేసే విష‌యంలో ఎవ‌రు ఎన్ని విధాల అడ్డు ప‌డినా.. తాము ముందుకు సాగుతామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్…

8 hours ago

బడ్జెట్ 2026: అప్పులు తగ్గేలా నిర్మలమ్మ ప్లాన్

2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…

10 hours ago

టీమ్ ఇండియాలోకి కొత్త కుర్రాడు

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…

10 hours ago

ఒక్క సెలవు కూడా తీసుకొని సీఎం

ప్ర‌జ‌ల కోసం తాను ఒక్క‌రోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా ప‌నిచేస్తున్న‌ట్టు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ…

12 hours ago