Political News

అసెంబ్లీకి డుమ్మాకొట్టడంలో జగన్ కొత్త ట్రెండ్

ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాను హోం మంత్రిని కాదని, ఒకవేళ తాను హోం మంత్రిని అయితే పరిస్థితి వేరేగా ఉంటుందని పవన్ వ్యాఖ్యానించడం దేశ రాజకీయాలలో కలకలం రేపింది. ఈ క్రమంలోనే ఆ వ్యాఖ్యలను పాజిటివ్ గా హోంమంత్రి అనిత తీసుకున్నప్పటికీ వైసీపీ నేతలు మాత్రం పవన్ పై, సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే పవన్ కామెంట్ లపై ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ తొలిసారిగా స్పందించారు.

రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి అనడం ఆశ్చర్యకరంగా ఉందని జగన్ అన్నారు. సరస్వతి పవర్ భూముల్లో పవన్ కళ్యాణ్ పర్యటించారని, 1000 ఎకరాల్లో పట్టా భూములున్నాయని, కేవలం 4 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందని, అయితే ఆ భూమిని సరస్వతి పవర్ తీసుకోలేదన్న విషయాన్ని సర్వే చేసిన ఎమ్మార్వోనే చెప్పారని జగన్ గుర్తు చేశారు. ఆనాడు గ్రామసభలో రైతులు అడిగిన రేటు కంటే ఎక్కువ ఇచ్చి కొన్నామని గుర్తు చేశారు.

సరస్వతి పవర్ కట్టకపోవడానికి టీడీపీ, కాంగ్రెస్ నేతలే కారణమని…ఆ కేసుల వల్లే ఆ భూములను ఈడీ అటాచ్ చేసిందని జగన్ ఆరోపించారు. పవన్ ఏం మాట్లాడుతున్నారో, ఎలా మంత్రి అయ్యారో అర్థం కావడం లేదని జగన్ ఎద్దేవా చేశారు. చంద్రబాబును ప్రశ్నించే ధైర్యం పవన్ కళ్యాణ్ కు లేదని, అందుకే తాటతీస్తా, తోలు తీస్తా అంటూ సినిమా డైలాగులు కొడుతున్నారని విమర్శించారు. లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి దగ్గర ఉంటుందని, ప్రశ్నించాల్సింది ముఖ్యమంత్రిని అని, ఒక దళిత హోం మంత్రిని కాదని జగన్ అన్నారు.

అసెంబ్లీలో వైసీపీ సభ్యులకు మైక్ ఇస్తే వలన ఎండగడతామని, కానీ, మైక్ ఇవ్వడంలేదని, అటువంటప్పుడు అసెంబ్లీకి వెళ్లి ఉపయోగం ఏమిటని జగన్ ప్రశ్నించారు. అందుకే ఇకనుంచి మీడియా ప్రతినిధులే నా స్పీకర్లు, మీడియా సమక్షంలోనే ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలపై చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని జగన్ అన్నారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో మీడియా ముందుకు వస్తానని చెప్పారు.

టీడీపీ అఫీషియల్ ఎక్స్ ఖాతాలో చేసేవన్నీ ఫేక్ పోస్ట్ లని, తన సొంత తల్లిని చంపేందుకు జగన్ ప్రయత్నిస్తున్నాడని టిడిపి ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిందని జగన్ గుర్తు చేశారు. దానిపై విజయమ్మ లేఖ విడుదల చేస్తే అది ఫేక్ అని ప్రచారం చేశారని, స్వయంగా ఆమె అది ఫేక్ లెటర్ కాదని మీడియా ముందుకు రావాల్సిన పరిస్థితి కల్పించాలని విమర్శించారు. ఓ పోలీస్ అధికారికి తన భార్య భారతి రెడ్డి ఫోన్ చేసిందని ఏబీఎన్ లో ఒక కథనం ప్రచారం అయిందని, ఆ రకంగా చూస్తే ఏబీఎన్ రాధాకృష్ణను, లోకేష్ ను అరెస్టు చేయాలని అన్నారు.

ఏది ఏమైనా మీడియా ముందు అసెంబ్లీ పెట్టి ప్రశ్నిస్తాను అన్న జగన్ పై సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. దేశ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మీడియా ముందు అసెంబ్లీ పెట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ఎమ్మెల్యేలుగా ఎన్నికల్లో పోటీ చేయడం ఎందుకని చురకలంటిస్తున్నారు. అసెంబ్లీలో అధికార పక్షాన్ని ప్రశ్నించే హక్కు ఎమ్మెల్యేలకు మాత్రమే ఉంటుంది కాబట్టి అసెంబ్లీకి అన్ని పార్టీల తరఫున గెలుపొందిన ఎమ్మెల్యేలు వెళుతుంటారని అంటున్నారు.

This post was last modified on November 7, 2024 9:44 pm

Share

Recent Posts

ఎంఎస్ సుబ్బులక్ష్మి… వాళ్ళిద్దరికీ పెద్ద ఛాలెంజ్

రేపు ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ ఓపెనింగ్ జరగనుంది. అల్లు అరవింద్, రాక్ లైన్ వెంకటేష్, బన్నీ వాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న…

8 minutes ago

మనోళ్లకు మండాడి అంతెందుకు నచ్చింది

నిన్నటి తమిళ కమెడియన్ ఇప్పటి హీరో సూరి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తిరుగుతూ ఆశ్చర్యానికి గురవుతున్నాడు. కారణం ప్రతి చోటా…

60 minutes ago

వాస్తవంలోకి రావయ్యా విశాల్

గత నెల మకుటం అనే సినిమా విడుదలయ్యిందనే సంగతి హార్డ్ కోర్ మూవీ ఫాలోయర్స్ కి తప్ప సామాన్య ప్రేక్షకులకు…

3 hours ago

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం కన్నుమూత

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం, టీడీపీ నేత ఆళ్ల నాని (57) కన్నుమూశారు. నానికి హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆయనను…

3 hours ago

రెండు కిక్ ఇచ్చాయి… ఒకటి షాక్ కొట్టింది

నిర్మాత నాగవంశీ ఈ మధ్య మంచి జోష్ లో ఉన్న విషయం తెలిసిందే. అఖిల్ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ లెనిన్…

4 hours ago

బ్యాక్ గ్రౌండ్ ఉన్నా ఫలితం దక్కలేదు

మొన్న గురువారం విడుదలైన సినిమాల్లో మారెమ్మ కూడా ఉంది. మాములుగా అయితే స్టార్ కాస్టింగ్ లేని ఇలాంటి మూవీని జనం…

5 hours ago