Political News

అసెంబ్లీకి డుమ్మాకొట్టడంలో జగన్ కొత్త ట్రెండ్

ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాను హోం మంత్రిని కాదని, ఒకవేళ తాను హోం మంత్రిని అయితే పరిస్థితి వేరేగా ఉంటుందని పవన్ వ్యాఖ్యానించడం దేశ రాజకీయాలలో కలకలం రేపింది. ఈ క్రమంలోనే ఆ వ్యాఖ్యలను పాజిటివ్ గా హోంమంత్రి అనిత తీసుకున్నప్పటికీ వైసీపీ నేతలు మాత్రం పవన్ పై, సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే పవన్ కామెంట్ లపై ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ తొలిసారిగా స్పందించారు.

రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి అనడం ఆశ్చర్యకరంగా ఉందని జగన్ అన్నారు. సరస్వతి పవర్ భూముల్లో పవన్ కళ్యాణ్ పర్యటించారని, 1000 ఎకరాల్లో పట్టా భూములున్నాయని, కేవలం 4 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందని, అయితే ఆ భూమిని సరస్వతి పవర్ తీసుకోలేదన్న విషయాన్ని సర్వే చేసిన ఎమ్మార్వోనే చెప్పారని జగన్ గుర్తు చేశారు. ఆనాడు గ్రామసభలో రైతులు అడిగిన రేటు కంటే ఎక్కువ ఇచ్చి కొన్నామని గుర్తు చేశారు.

సరస్వతి పవర్ కట్టకపోవడానికి టీడీపీ, కాంగ్రెస్ నేతలే కారణమని…ఆ కేసుల వల్లే ఆ భూములను ఈడీ అటాచ్ చేసిందని జగన్ ఆరోపించారు. పవన్ ఏం మాట్లాడుతున్నారో, ఎలా మంత్రి అయ్యారో అర్థం కావడం లేదని జగన్ ఎద్దేవా చేశారు. చంద్రబాబును ప్రశ్నించే ధైర్యం పవన్ కళ్యాణ్ కు లేదని, అందుకే తాటతీస్తా, తోలు తీస్తా అంటూ సినిమా డైలాగులు కొడుతున్నారని విమర్శించారు. లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి దగ్గర ఉంటుందని, ప్రశ్నించాల్సింది ముఖ్యమంత్రిని అని, ఒక దళిత హోం మంత్రిని కాదని జగన్ అన్నారు.

అసెంబ్లీలో వైసీపీ సభ్యులకు మైక్ ఇస్తే వలన ఎండగడతామని, కానీ, మైక్ ఇవ్వడంలేదని, అటువంటప్పుడు అసెంబ్లీకి వెళ్లి ఉపయోగం ఏమిటని జగన్ ప్రశ్నించారు. అందుకే ఇకనుంచి మీడియా ప్రతినిధులే నా స్పీకర్లు, మీడియా సమక్షంలోనే ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలపై చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని జగన్ అన్నారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో మీడియా ముందుకు వస్తానని చెప్పారు.

టీడీపీ అఫీషియల్ ఎక్స్ ఖాతాలో చేసేవన్నీ ఫేక్ పోస్ట్ లని, తన సొంత తల్లిని చంపేందుకు జగన్ ప్రయత్నిస్తున్నాడని టిడిపి ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిందని జగన్ గుర్తు చేశారు. దానిపై విజయమ్మ లేఖ విడుదల చేస్తే అది ఫేక్ అని ప్రచారం చేశారని, స్వయంగా ఆమె అది ఫేక్ లెటర్ కాదని మీడియా ముందుకు రావాల్సిన పరిస్థితి కల్పించాలని విమర్శించారు. ఓ పోలీస్ అధికారికి తన భార్య భారతి రెడ్డి ఫోన్ చేసిందని ఏబీఎన్ లో ఒక కథనం ప్రచారం అయిందని, ఆ రకంగా చూస్తే ఏబీఎన్ రాధాకృష్ణను, లోకేష్ ను అరెస్టు చేయాలని అన్నారు.

ఏది ఏమైనా మీడియా ముందు అసెంబ్లీ పెట్టి ప్రశ్నిస్తాను అన్న జగన్ పై సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. దేశ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మీడియా ముందు అసెంబ్లీ పెట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ఎమ్మెల్యేలుగా ఎన్నికల్లో పోటీ చేయడం ఎందుకని చురకలంటిస్తున్నారు. అసెంబ్లీలో అధికార పక్షాన్ని ప్రశ్నించే హక్కు ఎమ్మెల్యేలకు మాత్రమే ఉంటుంది కాబట్టి అసెంబ్లీకి అన్ని పార్టీల తరఫున గెలుపొందిన ఎమ్మెల్యేలు వెళుతుంటారని అంటున్నారు.

This post was last modified on November 7, 2024 9:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? .. పార్టీ నాయ‌కులు దీన‌స్థితిలో ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే…

16 minutes ago

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

32 minutes ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

1 hour ago

శర్వానంద్ భోగికి అసలైన ఛాలెంజ్

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

2 hours ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

2 hours ago

నంది అవార్డులంటే అంత చులకనా

ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…

3 hours ago