Political News

పాపం వాలంటీర్లు.. పవన్ కీలక వ్యాఖ్యలు

వాలంటీర్ల వ్యవస్థపై రద్దు చేయబోమని ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడుస్తున్నా ఎన్డీఏ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.

ఎన్నికలకు ముందు వాలంటీర్లకు పదివేల రూపాయలు జీతం ఇస్తామని, వారిని తీసివేసే ప్రసక్తి లేదని హామీ ఇచ్చిన కూటమి పార్టీలు…అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుపై మౌనం వహిస్తున్నాయి.

ఎన్నికలకు ముందే దాదాపు సగం మంది వాలంటీర్లు రాజీనామా చేయగా రాజీనామా చేయకుండా ఉన్న వాలంటీర్లకు జీతాలు కూడా పడకుండా ఉన్న వైనం చర్చనీయాంశమైంది.

ఈ నేపథ్యంలోనే వాలంటీర్ల వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. సర్పంచ్ సంఘాలతో అమరావతిలో భేటీ అయిన పవన్ కళ్యాణ్ వాలంటీర్ల వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలన్న సర్పంచ్ ల విజ్ఞప్తిపై పవన్ కళ్యాణ్ స్పందించారు.

గత ప్రభుత్వం వాలంటీర్లను మోసం చేసిందని, వాలంటీర్లకు మేలు చేయాలన్న ఉద్దేశ్యంతో తమ ప్రభుత్వం ఉందని పవన్ చెప్పారు. వాలంటీర్లు ఉద్యోగంలో ఉంటే రద్దు చేయవచ్చని, కానీ వాళ్లు అసలు వ్యవస్థలోనే లేరంటూ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇదో సాంకేతిక సమస్య అని, అందుకే అపరిష్కృతంగా ఉందని పవన్ చెప్పారు. వాలంటీర్ల వ్యవస్థను ఎన్డీఏ ప్రభుత్వం పక్కనబెట్టిన కారణాన్ని పవన్ పరోక్షంగా చెప్పేశారు. తాజాగా పవన్ వ్యాఖ్యలతో త్వరలోనే వాలంటీర్ల వ్యవస్థ రద్దవుతుందన్న ప్రచారం జోరందుకుంది. ఈ విషయంపై త్వరలోనే ప్రభుత్వం అధికారికంగా ప్రకటన కూడా చేసే అవకాశముంది.

This post was last modified on November 7, 2024 5:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`చ‌లానా` పడిందా… బ్యాంక్ నుండి మనీ కట్

వాహ‌న‌దారుల‌కు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ర‌హ‌దారుల‌పై ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా వాహ‌నాలు న‌డుపుతూ..…

25 minutes ago

బాబు, లోకేష్… సొంతూరికి వెళ్తూ స‌మ‌స్య‌ల‌పై దృష్టి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల‌ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…

6 hours ago

జిల్లాల విషయంలో తగ్గేదేలే అంటున్న రేవంత్

రాష్ట్రంలో అభివృద్ది చేసే విష‌యంలో ఎవ‌రు ఎన్ని విధాల అడ్డు ప‌డినా.. తాము ముందుకు సాగుతామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్…

8 hours ago

బడ్జెట్ 2026: అప్పులు తగ్గేలా నిర్మలమ్మ ప్లాన్

2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…

9 hours ago

టీమ్ ఇండియాలోకి కొత్త కుర్రాడు

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…

9 hours ago

ఒక్క సెలవు కూడా తీసుకొని సీఎం

ప్ర‌జ‌ల కోసం తాను ఒక్క‌రోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా ప‌నిచేస్తున్న‌ట్టు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ…

11 hours ago