జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన సొంత నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురంలో తాజాగా 12 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. పిఠాపురం మండలంలోని ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో ఉన్న భోగాపురంలో ఆయన 12 ఎకరాలను కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు తాజాగా పూర్తి చేశారు. పవన్ కల్యాణ్ తరఫున పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న జనసేన నాయకుడు తోట సుధీర్ రిజిస్ట్రేషన్ చేయించారు.
ఎందుకు?
ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల సమయంలో ఆయనపై వైసీపీ నాయకులు నాన్ లోకల్ అంటూ.. పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. “ఇక్కడ పిఠాపురం ప్రజలకు ఏం అవసరం వచ్చినా.. నేను ఉన్నా. మరి పవన్ కల్యాణ్.. ఉండేది హైదరాబాద్లో. ఇక్కడి ప్రజలకు ఆయన అందుబాటులో ఉండడు. ఏ అవసరం వచ్చినా.. హైదరాబాద్కు వెళ్లి క్యూ కట్టుకుని ఆయన ఇంటి ముందు నిలబడాలి” అని వైసీపీ అభ్యర్థి, అప్పటి ఎంపీ వంగా గీత ప్రచారంలో చేశారు.
ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్.. పిఠాపురం ప్రజలకు భారీ హామీ ఇచ్చారు. తనను గెలిపిస్తే.. పిఠాపురంలో నే ఇల్లు కట్టుకుంటానని.. ఇక్కడే ఉంటానని నెలకు 2 వారాల పాటు పిఠాపురం నుంచే ప్రజల సమస్యలు వింటానని కూడా ఆయన చెప్పారు. ఆ హామీ మేరకు.. ఆయన తాజాగా 12 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. దీనిలో క్యాంపు కార్యాలయం 2.5 ఎకరాల్లో, ఆఫీసు 3 ఎకరాల్లో నిర్మించనున్నారు.
ఇక, మిగిలిన స్థలంలో పార్కింగు తోపాటు ఫాం హౌస్ను కూడా నిర్మించనున్నట్టు తోట సుధీర్ చెప్పారు. ఇదిలావుంటే.. ఎన్నికల సమయంలోనే పవన్ కల్యాణ్.. ఓ ఇంటిని అద్దెకు తీసుకున్న విషయం తెలిసిందే. ఆయన పిఠాపురానికి ఎప్పుడు వెళ్లినా.. అక్కడే ఉంటూ ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకుంటున్నారు. త్వరలోనే క్యాంపు కార్యాలయం నిర్మించనున్నారు.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…