Political News

పిఠాపురంలో భూమి కొన్న ప‌వ‌న్ క‌ల్యాణ్.. రీజ‌నేంటి?

జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం తూర్పుగోదావ‌రి జిల్లాలోని పిఠాపురంలో తాజాగా 12 ఎక‌రాల భూమిని కొనుగోలు చేశారు. పిఠాపురం మండ‌లంలోని ఇల్లింద్రాడ రెవెన్యూ ప‌రిధిలో ఉన్న భోగాపురంలో ఆయ‌న 12 ఎక‌రాల‌ను కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన రిజిస్ట్రేష‌న్ కార్య‌క్ర‌మాలు తాజాగా పూర్తి చేశారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌ర‌ఫున పౌర స‌ర‌ఫ‌రాల కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా ఉన్న జ‌న‌సేన నాయ‌కుడు తోట సుధీర్ రిజిస్ట్రేష‌న్ చేయించారు.

ఎందుకు?

ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. ఈ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌న‌పై వైసీపీ నాయ‌కులు నాన్ లోక‌ల్ అంటూ.. పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశారు. “ఇక్క‌డ పిఠాపురం ప్ర‌జ‌ల‌కు ఏం అవ‌స‌రం వ‌చ్చినా.. నేను ఉన్నా. మ‌రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఉండేది హైద‌రాబాద్‌లో. ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు ఆయ‌న అందుబాటులో ఉండ‌డు. ఏ అవ‌స‌రం వ‌చ్చినా.. హైద‌రాబాద్‌కు వెళ్లి క్యూ క‌ట్టుకుని ఆయ‌న ఇంటి ముందు నిల‌బ‌డాలి” అని వైసీపీ అభ్య‌ర్థి, అప్ప‌టి ఎంపీ వంగా గీత ప్ర‌చారంలో చేశారు.

ఈ నేప‌థ్యంలోనే ప‌వ‌న్ క‌ల్యాణ్.. పిఠాపురం ప్ర‌జ‌ల‌కు భారీ హామీ ఇచ్చారు. త‌న‌ను గెలిపిస్తే.. పిఠాపురంలో నే ఇల్లు క‌ట్టుకుంటాన‌ని.. ఇక్క‌డే ఉంటాన‌ని నెల‌కు 2 వారాల పాటు పిఠాపురం నుంచే ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు వింటాన‌ని కూడా ఆయ‌న చెప్పారు. ఆ హామీ మేర‌కు.. ఆయ‌న తాజాగా 12 ఎక‌రాల భూమిని కొనుగోలు చేశారు. దీనిలో క్యాంపు కార్యాల‌యం 2.5 ఎక‌రాల్లో, ఆఫీసు 3 ఎక‌రాల్లో నిర్మించ‌నున్నారు.

ఇక‌, మిగిలిన స్థ‌లంలో పార్కింగు తోపాటు ఫాం హౌస్‌ను కూడా నిర్మించ‌నున్న‌ట్టు తోట సుధీర్ చెప్పారు. ఇదిలావుంటే.. ఎన్నిక‌ల స‌మ‌యంలోనే ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఓ ఇంటిని అద్దెకు తీసుకున్న విషయం తెలిసిందే. ఆయ‌న పిఠాపురానికి ఎప్పుడు వెళ్లినా.. అక్క‌డే ఉంటూ ప్ర‌జ‌ల నుంచి ఫిర్యాదులు తీసుకుంటున్నారు. త్వ‌ర‌లోనే క్యాంపు కార్యాల‌యం నిర్మించ‌నున్నారు.

This post was last modified on November 6, 2024 11:38 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

17 minutes ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

25 minutes ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

2 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

3 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

4 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

4 hours ago