Political News

పిఠాపురంలో భూమి కొన్న ప‌వ‌న్ క‌ల్యాణ్.. రీజ‌నేంటి?

జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం తూర్పుగోదావ‌రి జిల్లాలోని పిఠాపురంలో తాజాగా 12 ఎక‌రాల భూమిని కొనుగోలు చేశారు. పిఠాపురం మండ‌లంలోని ఇల్లింద్రాడ రెవెన్యూ ప‌రిధిలో ఉన్న భోగాపురంలో ఆయ‌న 12 ఎక‌రాల‌ను కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన రిజిస్ట్రేష‌న్ కార్య‌క్ర‌మాలు తాజాగా పూర్తి చేశారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌ర‌ఫున పౌర స‌ర‌ఫ‌రాల కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా ఉన్న జ‌న‌సేన నాయ‌కుడు తోట సుధీర్ రిజిస్ట్రేష‌న్ చేయించారు.

ఎందుకు?

ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. ఈ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌న‌పై వైసీపీ నాయ‌కులు నాన్ లోక‌ల్ అంటూ.. పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశారు. “ఇక్క‌డ పిఠాపురం ప్ర‌జ‌ల‌కు ఏం అవ‌స‌రం వ‌చ్చినా.. నేను ఉన్నా. మ‌రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఉండేది హైద‌రాబాద్‌లో. ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు ఆయ‌న అందుబాటులో ఉండ‌డు. ఏ అవ‌స‌రం వ‌చ్చినా.. హైద‌రాబాద్‌కు వెళ్లి క్యూ క‌ట్టుకుని ఆయ‌న ఇంటి ముందు నిల‌బ‌డాలి” అని వైసీపీ అభ్య‌ర్థి, అప్ప‌టి ఎంపీ వంగా గీత ప్ర‌చారంలో చేశారు.

ఈ నేప‌థ్యంలోనే ప‌వ‌న్ క‌ల్యాణ్.. పిఠాపురం ప్ర‌జ‌ల‌కు భారీ హామీ ఇచ్చారు. త‌న‌ను గెలిపిస్తే.. పిఠాపురంలో నే ఇల్లు క‌ట్టుకుంటాన‌ని.. ఇక్క‌డే ఉంటాన‌ని నెల‌కు 2 వారాల పాటు పిఠాపురం నుంచే ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు వింటాన‌ని కూడా ఆయ‌న చెప్పారు. ఆ హామీ మేర‌కు.. ఆయ‌న తాజాగా 12 ఎక‌రాల భూమిని కొనుగోలు చేశారు. దీనిలో క్యాంపు కార్యాల‌యం 2.5 ఎక‌రాల్లో, ఆఫీసు 3 ఎక‌రాల్లో నిర్మించ‌నున్నారు.

ఇక‌, మిగిలిన స్థ‌లంలో పార్కింగు తోపాటు ఫాం హౌస్‌ను కూడా నిర్మించ‌నున్న‌ట్టు తోట సుధీర్ చెప్పారు. ఇదిలావుంటే.. ఎన్నిక‌ల స‌మ‌యంలోనే ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఓ ఇంటిని అద్దెకు తీసుకున్న విషయం తెలిసిందే. ఆయ‌న పిఠాపురానికి ఎప్పుడు వెళ్లినా.. అక్క‌డే ఉంటూ ప్ర‌జ‌ల నుంచి ఫిర్యాదులు తీసుకుంటున్నారు. త్వ‌ర‌లోనే క్యాంపు కార్యాల‌యం నిర్మించ‌నున్నారు.

This post was last modified on November 6, 2024 11:38 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

38 minutes ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

42 minutes ago

గుణశేఖర్ గారు లాజిక్ మిస్సయ్యారు

ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…

1 hour ago

షాకిచ్చిన రామ్ చరణ్… పెద్ది వస్తోందా?

ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…

1 hour ago

మే 1 కోసం కొత్త సినిమాల కొట్లాట

ఏప్రిల్ 30 'పెద్ది' తప్పుకున్నాక అందరి దృష్టి ఆ స్లాట్ మీద పడింది. ఇది ముందే ఊహించిన 'గాయపడ్డ సింహం'…

3 hours ago

ఇలా అర్థం చేసుకున్నారా.. టొవినో ఆవేద‌న‌

మ‌ల‌యాళ స్టార్ హీరో టొవినో థామ‌స్.. తాను జూనియ‌ర్ ఎన్టీఆర్, ప్ర‌శాంత్ నీల్ క‌ల‌యిక‌లో తెర‌కెక్కుతున్న‌ డ్రాగ‌న్ (వ‌ర్కింగ్ టైటిల్)…

4 hours ago