Political News

పిఠాపురంలో భూమి కొన్న ప‌వ‌న్ క‌ల్యాణ్.. రీజ‌నేంటి?

జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం తూర్పుగోదావ‌రి జిల్లాలోని పిఠాపురంలో తాజాగా 12 ఎక‌రాల భూమిని కొనుగోలు చేశారు. పిఠాపురం మండ‌లంలోని ఇల్లింద్రాడ రెవెన్యూ ప‌రిధిలో ఉన్న భోగాపురంలో ఆయ‌న 12 ఎక‌రాల‌ను కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన రిజిస్ట్రేష‌న్ కార్య‌క్ర‌మాలు తాజాగా పూర్తి చేశారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌ర‌ఫున పౌర స‌ర‌ఫ‌రాల కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా ఉన్న జ‌న‌సేన నాయ‌కుడు తోట సుధీర్ రిజిస్ట్రేష‌న్ చేయించారు.

ఎందుకు?

ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. ఈ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌న‌పై వైసీపీ నాయ‌కులు నాన్ లోక‌ల్ అంటూ.. పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశారు. “ఇక్క‌డ పిఠాపురం ప్ర‌జ‌ల‌కు ఏం అవ‌స‌రం వ‌చ్చినా.. నేను ఉన్నా. మ‌రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఉండేది హైద‌రాబాద్‌లో. ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు ఆయ‌న అందుబాటులో ఉండ‌డు. ఏ అవ‌స‌రం వ‌చ్చినా.. హైద‌రాబాద్‌కు వెళ్లి క్యూ క‌ట్టుకుని ఆయ‌న ఇంటి ముందు నిల‌బ‌డాలి” అని వైసీపీ అభ్య‌ర్థి, అప్ప‌టి ఎంపీ వంగా గీత ప్ర‌చారంలో చేశారు.

ఈ నేప‌థ్యంలోనే ప‌వ‌న్ క‌ల్యాణ్.. పిఠాపురం ప్ర‌జ‌ల‌కు భారీ హామీ ఇచ్చారు. త‌న‌ను గెలిపిస్తే.. పిఠాపురంలో నే ఇల్లు క‌ట్టుకుంటాన‌ని.. ఇక్క‌డే ఉంటాన‌ని నెల‌కు 2 వారాల పాటు పిఠాపురం నుంచే ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు వింటాన‌ని కూడా ఆయ‌న చెప్పారు. ఆ హామీ మేర‌కు.. ఆయ‌న తాజాగా 12 ఎక‌రాల భూమిని కొనుగోలు చేశారు. దీనిలో క్యాంపు కార్యాల‌యం 2.5 ఎక‌రాల్లో, ఆఫీసు 3 ఎక‌రాల్లో నిర్మించ‌నున్నారు.

ఇక‌, మిగిలిన స్థ‌లంలో పార్కింగు తోపాటు ఫాం హౌస్‌ను కూడా నిర్మించ‌నున్న‌ట్టు తోట సుధీర్ చెప్పారు. ఇదిలావుంటే.. ఎన్నిక‌ల స‌మ‌యంలోనే ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఓ ఇంటిని అద్దెకు తీసుకున్న విషయం తెలిసిందే. ఆయ‌న పిఠాపురానికి ఎప్పుడు వెళ్లినా.. అక్క‌డే ఉంటూ ప్ర‌జ‌ల నుంచి ఫిర్యాదులు తీసుకుంటున్నారు. త్వ‌ర‌లోనే క్యాంపు కార్యాల‌యం నిర్మించ‌నున్నారు.

This post was last modified on November 6, 2024 11:38 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జ‌గ‌న్ రోడ్డున ప‌డేస్తే.. కూట‌మి ఆదుకుంది!

వైసీపీ అధినేత జ‌గ‌న్ హ‌యాంలో ఓ కుటుంబం రోడ్డున ప‌డింది. కేవ‌లం మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వం క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రించి…

9 minutes ago

కోనసీమకు ప్రభుత్వం గుడ్ న్యూస్

కోనసీమ జిల్లా వాసులు ఎంతో పవిత్రంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పండుగ జగ్గన్నతోట ప్రభల తీర్థం. ఇది తరతరాలుగా సంప్రదాయబద్ధంగా కొనసాగుతూ…

11 minutes ago

పిఠాపురంలో పిచ్చి పిచ్చి వేషాలేస్తే…

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. వైసీపీ నేత‌ల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో పిచ్చి పిచ్చి…

35 minutes ago

రాజు గారెక్కడ రాజాసాబ్?

ప్రభాస్‌ను సూటులో స్టైలిష్ గా చూపిస్తూ ‘రాజాసాబ్’ సినిమా ఫస్ట్ గ్లింప్స్ వదిలినపుడు ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ అనుకున్నారంతా.…

2 hours ago

రాజధాని ఎఫెక్ట్: వైసీపీలో చీలిక?

వైసీపీలో చీలిక ఏర్పడుతోందా? ప్రజల మనోభావాలను విస్మరిస్తున్న వైసీపీ అధినేతపై ఆ పార్టీ నాయకులు గుస్సాగా ఉన్నారా? అంటే ఔననే…

4 hours ago

కోర్టు కటాక్షం… జన నాయకుడికి మోక్షం

ప్రపంచవ్యాప్తంగా విజయ్ అభిమానులను తీవ్ర మనస్థాపానికి గురి చేసిన జన నాయకుడు సెన్సార్ వివాదం ఒక కొలిక్కి వచ్చేసింది. యు/ఏ…

4 hours ago