తెలంగాణ రాజకీయాల్లో అప్రకటిత మిత్రపక్షాలుగా ఉన్న ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్, ఎంఐఎం పార్టీల మధ్య రాజకీయ వివాదాలు ముసురుకుంటున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతోపాటు.. రాజకీయ రచ్చను రోడ్డెక్కిస్తున్నారు. ఈ పరిణామాలు.. ఈ రెండు పార్టీల మధ్య ఉన్న మిత్రబంధాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయన్న వాదన వినిపిస్తోంది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి కూడా.. ఎంఐఎంతో బీఆర్ ఎస్ చెలిమి అందరికీ తెలిసిందే.
ఎన్నికల సమయంలో కొన్ని నియోజకవర్గాల్లో అసలు పోటీ కూడా పెట్టకుండానే బీఆర్ఎస్ వ్యవహరించింది. వాటిని ఎంఐఎం సునాయాసంగా గెలుచుకుంది. అదేవిధంగా ఎంఐఎం ఎదుగుదలకు కూడా అడ్డు పడకుండా చర్యలు తీసుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంటికి వెళ్లేందుకు అప్పట్లో మంత్రులకు కూడా అవకాశం లభించని విషయం తెలిసిందే. కానీ, ఎంఐఎం అధినేత సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు.. బీఆర్ ఎస్ నేతను నేరుగా ప్రగతి భవన్లోనే కలుసుకున్న సందర్భాలు ఉన్నాయి.
అలాంటి రెండు పార్టీల మధ్య ఇప్పుడు వివాదాలు చోటు చేసుకున్నాయి. మేం లేకపోతే.. బీఆర్ఎస్కు 2023లో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ దక్కి ఉండేదా? అంటూ.. ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. ప్రస్తుతం రేవంత్ రెడ్డి చేపడుతున్న మూసీ ప్రక్షాళనకు ఆయన పరోక్షంగా మద్దతు ఇచ్చారు. మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ చేసిందేమీ లేదనడం ద్వారా బీఆర్ఎస్ను ఆయన విమర్శల గోదాలోకి నెట్టారు.
అక్కడితో కూడా ఆగకుండా.. బీఆర్ఎస్ పార్టీ జాతకం అంతా మా దగ్గర ఉందంటూ మరో బాంబు పేల్చారు. మేము నోరు విప్పితే బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేరంటూ వార్నింగ్ ఇచ్చినంత పనిచేశారు. తద్వారా.. ఒవైసీ.. బీఆర్ ఎస్ విషయంలో తన వైఖరిని చెప్పకనే చెప్పినట్టు అయింది. ఈ మొత్తానికి కారణం.. హైడ్రా అనే చర్చ జరుగుతోంది. చెరువులను ఆక్రమించి కట్టారన్న విమర్శలు ఉన్న ఒవైసీ కాలేజీలను కూల్చేందుకు రంగం రెడీ అవుతున్న నేపథ్యంలో యూటర్న్ తీసుకున్నారని బీఆర్ ఎస్ నాయకులు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. పైగా మరో నాలుగేళ్లపాటు.. బీఆర్ ఎస్తో ఎలానూ పని లేదు. కాబట్టి.. ఒవైసీ ఇలా వ్యాఖ్యానిస్తున్నారన్న చర్చ సాగుతుండడం గమనార్హం.
This post was last modified on November 4, 2024 11:54 am
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…