తెలంగాణ రాజకీయాల్లో అప్రకటిత మిత్రపక్షాలుగా ఉన్న ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్, ఎంఐఎం పార్టీల మధ్య రాజకీయ వివాదాలు ముసురుకుంటున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతోపాటు.. రాజకీయ రచ్చను రోడ్డెక్కిస్తున్నారు. ఈ పరిణామాలు.. ఈ రెండు పార్టీల మధ్య ఉన్న మిత్రబంధాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయన్న వాదన వినిపిస్తోంది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి కూడా.. ఎంఐఎంతో బీఆర్ ఎస్ చెలిమి అందరికీ తెలిసిందే.
ఎన్నికల సమయంలో కొన్ని నియోజకవర్గాల్లో అసలు పోటీ కూడా పెట్టకుండానే బీఆర్ఎస్ వ్యవహరించింది. వాటిని ఎంఐఎం సునాయాసంగా గెలుచుకుంది. అదేవిధంగా ఎంఐఎం ఎదుగుదలకు కూడా అడ్డు పడకుండా చర్యలు తీసుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంటికి వెళ్లేందుకు అప్పట్లో మంత్రులకు కూడా అవకాశం లభించని విషయం తెలిసిందే. కానీ, ఎంఐఎం అధినేత సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు.. బీఆర్ ఎస్ నేతను నేరుగా ప్రగతి భవన్లోనే కలుసుకున్న సందర్భాలు ఉన్నాయి.
అలాంటి రెండు పార్టీల మధ్య ఇప్పుడు వివాదాలు చోటు చేసుకున్నాయి. మేం లేకపోతే.. బీఆర్ఎస్కు 2023లో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ దక్కి ఉండేదా? అంటూ.. ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. ప్రస్తుతం రేవంత్ రెడ్డి చేపడుతున్న మూసీ ప్రక్షాళనకు ఆయన పరోక్షంగా మద్దతు ఇచ్చారు. మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ చేసిందేమీ లేదనడం ద్వారా బీఆర్ఎస్ను ఆయన విమర్శల గోదాలోకి నెట్టారు.
అక్కడితో కూడా ఆగకుండా.. బీఆర్ఎస్ పార్టీ జాతకం అంతా మా దగ్గర ఉందంటూ మరో బాంబు పేల్చారు. మేము నోరు విప్పితే బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేరంటూ వార్నింగ్ ఇచ్చినంత పనిచేశారు. తద్వారా.. ఒవైసీ.. బీఆర్ ఎస్ విషయంలో తన వైఖరిని చెప్పకనే చెప్పినట్టు అయింది. ఈ మొత్తానికి కారణం.. హైడ్రా అనే చర్చ జరుగుతోంది. చెరువులను ఆక్రమించి కట్టారన్న విమర్శలు ఉన్న ఒవైసీ కాలేజీలను కూల్చేందుకు రంగం రెడీ అవుతున్న నేపథ్యంలో యూటర్న్ తీసుకున్నారని బీఆర్ ఎస్ నాయకులు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. పైగా మరో నాలుగేళ్లపాటు.. బీఆర్ ఎస్తో ఎలానూ పని లేదు. కాబట్టి.. ఒవైసీ ఇలా వ్యాఖ్యానిస్తున్నారన్న చర్చ సాగుతుండడం గమనార్హం.
This post was last modified on November 4, 2024 11:54 am
స్టార్ హీరోల సినిమాల్లో అభిమానులు ప్రధానంగా ఆశించేది ఎలివేషన్ సీన్లు.. డ్యాన్సులు, ఫైట్లు. ఇవి ఉంటే, కథ కొంచెం అటు…
ఇటీవల టాలీవుడ్ అనే కాక మొత్తం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన పెళ్లి వేడుక అంటే.. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలదే.…
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ఇన్స్టాగ్రామ్లో 10 కోట్ల మందికి పైగా ఫాలోవర్లను…
వైసీపీ హయాంలో ఏపీకి రావాల్సిన పలు ఐటీ దిగ్గజ కంపెనీలు, పరిశ్రమలు తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకకు తరలిపోయాయని టీడీపీ నేతలు…
ఏపీలోని కూటమి ప్రభుత్వంలో వైసీపీ కోవర్టులు ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అయితే.. రాజకీయంగా కాదు.. అధికారికంగా.. పలువురు…
టీ20 వరల్డ్ కప్లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో గురువారం భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య సెమీఫైనల్ జరగనుంది. అయితే…