Political News

జ‌గ‌న్ పాల‌న‌.. చంద్ర‌బాబు టెస్టులు!

గ‌త వైసీపీ హ‌యాంలో జ‌గ‌న్ సాగించిన పాల‌న ఇప్పుడు ముఖ్య‌మంత్రిగా ఉన్న చంద్ర‌బాబుకు విష‌మ ప‌రీక్ష‌లు పెడుతోందనే భావ‌న కూట‌మి పార్టీల మ‌ధ్య చ‌ర్చ‌గా మారింది. ఈ విష‌యాన్ని మంత్రులు ప‌దే ప‌దే కూడా చెబుతున్నారు. జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యాలు.. వేసిన అడుగులు కూడా.. ఏపీ అభివృద్ధికి, లేదా.. ఇప్పుడు ఉన్న ప్ర‌భుత్వం తీసుకునే నిర్ణ‌యాల‌కు ప్ర‌తిబంధ‌కాలుగా మారాయ‌ని అంటున్నారు. కీల‌క‌మైన ప్రాజెక్టుల నుంచి మౌలిక స‌దుపాయాల వ‌ర‌కు కూడా.. ఇదే ప‌రిస్థితి నెల‌కొంద‌ని చెబుతున్నారు.

రుషికొండ‌: విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ముఖ ప‌ర్యాట‌క ప్రాంతం రుషి కొండ‌పై వైసీపీ హ‌యాంలో రూ.500 కోట్ల‌ను వెచ్చించి చేసిన నిర్మాణం.. ప్ర‌భుత్వానికి తీవ్ర త‌ల‌నొప్పిగా మారింది. దీనిని ఉంచుకునేందుకు.. అవ‌కాశం లేదు. అమ్మేందుకు అవ‌కాశం లేదు. పైగా గ్రీన్ ట్రైబ్యున‌ల్ స‌హా హైకోర్టులోనూ కేసులు న‌డుస్తున్నాయి. వీటికి నెల నెలా ఖ‌ర్చులు పెట్టాల్సి ఉంది. ఇక‌, ఈ నిర్మాణం మెయింటెనెన్స్‌కు కూడా నెల‌కు రూ.6 ల‌క్ష‌ల వ‌ర‌కు స‌ర్కారు వెచ్చిస్తోంది.

పోల‌వ‌రం: పోల‌వ‌రం వంటి కీలక ప్రాజెక్టు విష‌యంలో వైసీపీ హ‌యాంలో ఎత్తును త‌గ్గిస్తూ.. చేసిన నిర్ణ‌యం కూడా ఇప్పుడ కూట‌మి స‌ర్కారును ఇర‌కాటంలో ప‌డేసింది. జ‌గ‌న్ ఒప్పుకొన్నారు.. ఇప్పుడు మీరు ఎందుకు మెలిక పెడుతున్నారంటూ.. కేంద్రం పెద్ద‌లు .. ఎత్తు విష‌యంలో ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు. దీంతో విధిలేని ప‌రిస్థితిలో 41.86 మీట‌ర్లే దీనిని ప‌రిమితం చేసి ముందు నిర్మాణం అయ్యేలా చేస్తారు. అనంత‌రం.. స‌ర్కారు సొంత నిధుల నుంచి మిగిలిన 4 మీట‌ర్ల ఎత్తును నిర్మించ‌నుంది.

అమ‌రావ‌తి: ఐదేళ్ల వైసీపీపాల‌న‌లో రాజ‌ధాని నిర్మాణాన్ని ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ఇక్క‌డ పెరిగిన తుమ్మ‌, పిచ్చి మొక్క‌లు తొల‌గించేందుకు ఏకంగా 40 కోట్లు ఖ‌ర్చు చేశారు. అదేవిధంగా ర‌హ‌దారులు తొవ్వేశారు. ట్రాన్స్ ఫార్మ‌ర్ల‌ను ధ్వంసం చేశారు. ఇళ్ల‌కు గోడ‌లు కొన్ని చోట్ల బీట‌లు వ‌చ్చాయి. నిర్మాణాలు బాగానే ఉన్నా.. ఫ్లోరింగ్ ధ్వంస‌మైంది. ఇలా.. మ‌రో 200 కోట్ల వ‌ర‌కు వెచ్చించి.. వాటిని బాగు చేసుకోవాల్సిన ప‌రిస్తితి ఏర్ప‌డింది.

రోడ్లు: గ‌త ఐదేళ్ల‌లో వైసీపీ స‌ర్కారు ర‌హ‌దారుల బాగుచేత‌, నిర్మాణాల‌పై దృస్టి పెట్ట‌లేదు. దీంతో ఇప్పుడు వాటిని బాగు చేసేందుకు వెయ్యి కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు(కేవలం అతుకులు వేసేందుకే) ఖ‌ర్చు చేయాల్సివ‌స్తోంది. అవే వైసీపీ హ‌యాంలోనే బాగు చేసి ఉంటే.. ఇప్పుడు ఆ నిధుల‌ను కొత్త వాటికి వినియోగించేవారు. ఇలా.. అనేక అంశాల్లో వైసీపీ పాల‌న చేసిన చెడును క‌డిగేందుకు.. చంద్ర‌బాబు ప‌రీక్ష‌లు ఎదుర్కొంటున్నార‌ని.. కూట‌మి పార్టీల నాయ‌కులు చెబుతున్నారు.

This post was last modified on November 3, 2024 10:21 pm

Share

Recent Posts

పిఠాపురంలో ఎవ్వ‌రికి ఛాన్స్ లేద‌బ్బా.. !

సామాజికంగా.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం ప‌రంగా.. నాయ‌కులు దూకుడు ప్ర‌ద‌ర్శిస్తారు. నియోజ‌క‌వ‌ర్గాల్లో పాగా వేసేందుకు ప్ర‌య‌త్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజ‌క‌వ‌ర్గంలో ఒక్కొక్క‌…

55 minutes ago

కూట‌మి కాన్ఫిడెన్స్ ఏంటి?

వ‌చ్చే ఎన్నికల్లోనూ కూట‌మి విజ‌యం సాధిస్తుంద‌న్న బ‌ల‌మైన సంకేతాలు వ‌స్తున్నాయి. నాయ‌కులు చెప్ప‌డ‌మే కాదు.. క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న కొన్ని ఆన్‌లైన్…

1 hour ago

రవితేజ పోటీని యష్ తట్టుకోవాలంటే

ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…

2 hours ago

టార్గెట్ చేరుకున్న టాక్సిక్ తెలుగు వేడుక

నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…

3 hours ago

మెగా హీరోలు అభిమానులు ఇద్దరూ చెక్ చేసుకోవాలి

సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…

4 hours ago

ఎండోస్కోపిక్ కెమెరాతో పేపర్ లీక్… బీజేపీ రాష్ట్రంలో సంచలనం

రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…

4 hours ago