Political News

జ‌గ‌న్ పాల‌న‌.. చంద్ర‌బాబు టెస్టులు!

గ‌త వైసీపీ హ‌యాంలో జ‌గ‌న్ సాగించిన పాల‌న ఇప్పుడు ముఖ్య‌మంత్రిగా ఉన్న చంద్ర‌బాబుకు విష‌మ ప‌రీక్ష‌లు పెడుతోందనే భావ‌న కూట‌మి పార్టీల మ‌ధ్య చ‌ర్చ‌గా మారింది. ఈ విష‌యాన్ని మంత్రులు ప‌దే ప‌దే కూడా చెబుతున్నారు. జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యాలు.. వేసిన అడుగులు కూడా.. ఏపీ అభివృద్ధికి, లేదా.. ఇప్పుడు ఉన్న ప్ర‌భుత్వం తీసుకునే నిర్ణ‌యాల‌కు ప్ర‌తిబంధ‌కాలుగా మారాయ‌ని అంటున్నారు. కీల‌క‌మైన ప్రాజెక్టుల నుంచి మౌలిక స‌దుపాయాల వ‌ర‌కు కూడా.. ఇదే ప‌రిస్థితి నెల‌కొంద‌ని చెబుతున్నారు.

రుషికొండ‌: విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ముఖ ప‌ర్యాట‌క ప్రాంతం రుషి కొండ‌పై వైసీపీ హ‌యాంలో రూ.500 కోట్ల‌ను వెచ్చించి చేసిన నిర్మాణం.. ప్ర‌భుత్వానికి తీవ్ర త‌ల‌నొప్పిగా మారింది. దీనిని ఉంచుకునేందుకు.. అవ‌కాశం లేదు. అమ్మేందుకు అవ‌కాశం లేదు. పైగా గ్రీన్ ట్రైబ్యున‌ల్ స‌హా హైకోర్టులోనూ కేసులు న‌డుస్తున్నాయి. వీటికి నెల నెలా ఖ‌ర్చులు పెట్టాల్సి ఉంది. ఇక‌, ఈ నిర్మాణం మెయింటెనెన్స్‌కు కూడా నెల‌కు రూ.6 ల‌క్ష‌ల వ‌ర‌కు స‌ర్కారు వెచ్చిస్తోంది.

పోల‌వ‌రం: పోల‌వ‌రం వంటి కీలక ప్రాజెక్టు విష‌యంలో వైసీపీ హ‌యాంలో ఎత్తును త‌గ్గిస్తూ.. చేసిన నిర్ణ‌యం కూడా ఇప్పుడ కూట‌మి స‌ర్కారును ఇర‌కాటంలో ప‌డేసింది. జ‌గ‌న్ ఒప్పుకొన్నారు.. ఇప్పుడు మీరు ఎందుకు మెలిక పెడుతున్నారంటూ.. కేంద్రం పెద్ద‌లు .. ఎత్తు విష‌యంలో ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు. దీంతో విధిలేని ప‌రిస్థితిలో 41.86 మీట‌ర్లే దీనిని ప‌రిమితం చేసి ముందు నిర్మాణం అయ్యేలా చేస్తారు. అనంత‌రం.. స‌ర్కారు సొంత నిధుల నుంచి మిగిలిన 4 మీట‌ర్ల ఎత్తును నిర్మించ‌నుంది.

అమ‌రావ‌తి: ఐదేళ్ల వైసీపీపాల‌న‌లో రాజ‌ధాని నిర్మాణాన్ని ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ఇక్క‌డ పెరిగిన తుమ్మ‌, పిచ్చి మొక్క‌లు తొల‌గించేందుకు ఏకంగా 40 కోట్లు ఖ‌ర్చు చేశారు. అదేవిధంగా ర‌హ‌దారులు తొవ్వేశారు. ట్రాన్స్ ఫార్మ‌ర్ల‌ను ధ్వంసం చేశారు. ఇళ్ల‌కు గోడ‌లు కొన్ని చోట్ల బీట‌లు వ‌చ్చాయి. నిర్మాణాలు బాగానే ఉన్నా.. ఫ్లోరింగ్ ధ్వంస‌మైంది. ఇలా.. మ‌రో 200 కోట్ల వ‌ర‌కు వెచ్చించి.. వాటిని బాగు చేసుకోవాల్సిన ప‌రిస్తితి ఏర్ప‌డింది.

రోడ్లు: గ‌త ఐదేళ్ల‌లో వైసీపీ స‌ర్కారు ర‌హ‌దారుల బాగుచేత‌, నిర్మాణాల‌పై దృస్టి పెట్ట‌లేదు. దీంతో ఇప్పుడు వాటిని బాగు చేసేందుకు వెయ్యి కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు(కేవలం అతుకులు వేసేందుకే) ఖ‌ర్చు చేయాల్సివ‌స్తోంది. అవే వైసీపీ హ‌యాంలోనే బాగు చేసి ఉంటే.. ఇప్పుడు ఆ నిధుల‌ను కొత్త వాటికి వినియోగించేవారు. ఇలా.. అనేక అంశాల్లో వైసీపీ పాల‌న చేసిన చెడును క‌డిగేందుకు.. చంద్ర‌బాబు ప‌రీక్ష‌లు ఎదుర్కొంటున్నార‌ని.. కూట‌మి పార్టీల నాయ‌కులు చెబుతున్నారు.

This post was last modified on November 3, 2024 10:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దేవరకొండా… ఇక ఆ సినిమా దేవుడికేనా?

తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…

42 minutes ago

బిగ్ బాస్-9‌లో ఇతనే పెద్ద సర్ప్రైజ్

ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…

1 hour ago

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

5 hours ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

5 hours ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

6 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

8 hours ago