గత వైసీపీ హయాంలో జగన్ సాగించిన పాలన ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు విషమ పరీక్షలు పెడుతోందనే భావన కూటమి పార్టీల మధ్య చర్చగా మారింది. ఈ విషయాన్ని మంత్రులు పదే పదే కూడా చెబుతున్నారు. జగన్ తీసుకున్న నిర్ణయాలు.. వేసిన అడుగులు కూడా.. ఏపీ అభివృద్ధికి, లేదా.. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు ప్రతిబంధకాలుగా మారాయని అంటున్నారు. కీలకమైన ప్రాజెక్టుల నుంచి మౌలిక సదుపాయాల వరకు కూడా.. ఇదే పరిస్థితి నెలకొందని చెబుతున్నారు.
రుషికొండ: విశాఖపట్నంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం రుషి కొండపై వైసీపీ హయాంలో రూ.500 కోట్లను వెచ్చించి చేసిన నిర్మాణం.. ప్రభుత్వానికి తీవ్ర తలనొప్పిగా మారింది. దీనిని ఉంచుకునేందుకు.. అవకాశం లేదు. అమ్మేందుకు అవకాశం లేదు. పైగా గ్రీన్ ట్రైబ్యునల్ సహా హైకోర్టులోనూ కేసులు నడుస్తున్నాయి. వీటికి నెల నెలా ఖర్చులు పెట్టాల్సి ఉంది. ఇక, ఈ నిర్మాణం మెయింటెనెన్స్కు కూడా నెలకు రూ.6 లక్షల వరకు సర్కారు వెచ్చిస్తోంది.
పోలవరం: పోలవరం వంటి కీలక ప్రాజెక్టు విషయంలో వైసీపీ హయాంలో ఎత్తును తగ్గిస్తూ.. చేసిన నిర్ణయం కూడా ఇప్పుడ కూటమి సర్కారును ఇరకాటంలో పడేసింది. జగన్ ఒప్పుకొన్నారు.. ఇప్పుడు మీరు ఎందుకు మెలిక పెడుతున్నారంటూ.. కేంద్రం పెద్దలు .. ఎత్తు విషయంలో ప్రశ్నలు సంధిస్తున్నారు. దీంతో విధిలేని పరిస్థితిలో 41.86 మీటర్లే దీనిని పరిమితం చేసి ముందు నిర్మాణం అయ్యేలా చేస్తారు. అనంతరం.. సర్కారు సొంత నిధుల నుంచి మిగిలిన 4 మీటర్ల ఎత్తును నిర్మించనుంది.
అమరావతి: ఐదేళ్ల వైసీపీపాలనలో రాజధాని నిర్మాణాన్ని పట్టించుకోకపోవడంతో ఇక్కడ పెరిగిన తుమ్మ, పిచ్చి మొక్కలు తొలగించేందుకు ఏకంగా 40 కోట్లు ఖర్చు చేశారు. అదేవిధంగా రహదారులు తొవ్వేశారు. ట్రాన్స్ ఫార్మర్లను ధ్వంసం చేశారు. ఇళ్లకు గోడలు కొన్ని చోట్ల బీటలు వచ్చాయి. నిర్మాణాలు బాగానే ఉన్నా.. ఫ్లోరింగ్ ధ్వంసమైంది. ఇలా.. మరో 200 కోట్ల వరకు వెచ్చించి.. వాటిని బాగు చేసుకోవాల్సిన పరిస్తితి ఏర్పడింది.
రోడ్లు: గత ఐదేళ్లలో వైసీపీ సర్కారు రహదారుల బాగుచేత, నిర్మాణాలపై దృస్టి పెట్టలేదు. దీంతో ఇప్పుడు వాటిని బాగు చేసేందుకు వెయ్యి కోట్ల రూపాయల వరకు(కేవలం అతుకులు వేసేందుకే) ఖర్చు చేయాల్సివస్తోంది. అవే వైసీపీ హయాంలోనే బాగు చేసి ఉంటే.. ఇప్పుడు ఆ నిధులను కొత్త వాటికి వినియోగించేవారు. ఇలా.. అనేక అంశాల్లో వైసీపీ పాలన చేసిన చెడును కడిగేందుకు.. చంద్రబాబు పరీక్షలు ఎదుర్కొంటున్నారని.. కూటమి పార్టీల నాయకులు చెబుతున్నారు.
This post was last modified on November 3, 2024 10:21 pm
వందల కోట్లతో ప్యాన్ ఇండియా మూవీస్ తీస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు అవసరం. ఎవరికైనా ఇది తప్పదు. ఎప్పుడో 2027…
కొన్నేళ్ల ముందు నందమూరి తారకరత్న ఒక రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గుండెపోటుకు గురి కావడం, కొన్ని రోజుల పాటు…
ప్రియాంకా చోప్రా మన ప్రేక్షకులకు కొత్త కాదు. హిందీ సినిమాలు రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్ళు, రామ్ చరణ్ జంజీర్…
నాగచైతన్యను ఇప్పటివరకు క్లాస్ లుక్లో, లవర్ బాయ్గా చూసి అలవాటు పడ్డ కళ్లకు ఈ ఫొటో ఒక్కసారిగా షాక్ ఇస్తోంది.…
సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం…
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…