Political News

జ‌గ‌న్ పాల‌న‌.. చంద్ర‌బాబు టెస్టులు!

గ‌త వైసీపీ హ‌యాంలో జ‌గ‌న్ సాగించిన పాల‌న ఇప్పుడు ముఖ్య‌మంత్రిగా ఉన్న చంద్ర‌బాబుకు విష‌మ ప‌రీక్ష‌లు పెడుతోందనే భావ‌న కూట‌మి పార్టీల మ‌ధ్య చ‌ర్చ‌గా మారింది. ఈ విష‌యాన్ని మంత్రులు ప‌దే ప‌దే కూడా చెబుతున్నారు. జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యాలు.. వేసిన అడుగులు కూడా.. ఏపీ అభివృద్ధికి, లేదా.. ఇప్పుడు ఉన్న ప్ర‌భుత్వం తీసుకునే నిర్ణ‌యాల‌కు ప్ర‌తిబంధ‌కాలుగా మారాయ‌ని అంటున్నారు. కీల‌క‌మైన ప్రాజెక్టుల నుంచి మౌలిక స‌దుపాయాల వ‌ర‌కు కూడా.. ఇదే ప‌రిస్థితి నెల‌కొంద‌ని చెబుతున్నారు.

రుషికొండ‌: విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ముఖ ప‌ర్యాట‌క ప్రాంతం రుషి కొండ‌పై వైసీపీ హ‌యాంలో రూ.500 కోట్ల‌ను వెచ్చించి చేసిన నిర్మాణం.. ప్ర‌భుత్వానికి తీవ్ర త‌ల‌నొప్పిగా మారింది. దీనిని ఉంచుకునేందుకు.. అవ‌కాశం లేదు. అమ్మేందుకు అవ‌కాశం లేదు. పైగా గ్రీన్ ట్రైబ్యున‌ల్ స‌హా హైకోర్టులోనూ కేసులు న‌డుస్తున్నాయి. వీటికి నెల నెలా ఖ‌ర్చులు పెట్టాల్సి ఉంది. ఇక‌, ఈ నిర్మాణం మెయింటెనెన్స్‌కు కూడా నెల‌కు రూ.6 ల‌క్ష‌ల వ‌ర‌కు స‌ర్కారు వెచ్చిస్తోంది.

పోల‌వ‌రం: పోల‌వ‌రం వంటి కీలక ప్రాజెక్టు విష‌యంలో వైసీపీ హ‌యాంలో ఎత్తును త‌గ్గిస్తూ.. చేసిన నిర్ణ‌యం కూడా ఇప్పుడ కూట‌మి స‌ర్కారును ఇర‌కాటంలో ప‌డేసింది. జ‌గ‌న్ ఒప్పుకొన్నారు.. ఇప్పుడు మీరు ఎందుకు మెలిక పెడుతున్నారంటూ.. కేంద్రం పెద్ద‌లు .. ఎత్తు విష‌యంలో ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు. దీంతో విధిలేని ప‌రిస్థితిలో 41.86 మీట‌ర్లే దీనిని ప‌రిమితం చేసి ముందు నిర్మాణం అయ్యేలా చేస్తారు. అనంత‌రం.. స‌ర్కారు సొంత నిధుల నుంచి మిగిలిన 4 మీట‌ర్ల ఎత్తును నిర్మించ‌నుంది.

అమ‌రావ‌తి: ఐదేళ్ల వైసీపీపాల‌న‌లో రాజ‌ధాని నిర్మాణాన్ని ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ఇక్క‌డ పెరిగిన తుమ్మ‌, పిచ్చి మొక్క‌లు తొల‌గించేందుకు ఏకంగా 40 కోట్లు ఖ‌ర్చు చేశారు. అదేవిధంగా ర‌హ‌దారులు తొవ్వేశారు. ట్రాన్స్ ఫార్మ‌ర్ల‌ను ధ్వంసం చేశారు. ఇళ్ల‌కు గోడ‌లు కొన్ని చోట్ల బీట‌లు వ‌చ్చాయి. నిర్మాణాలు బాగానే ఉన్నా.. ఫ్లోరింగ్ ధ్వంస‌మైంది. ఇలా.. మ‌రో 200 కోట్ల వ‌ర‌కు వెచ్చించి.. వాటిని బాగు చేసుకోవాల్సిన ప‌రిస్తితి ఏర్ప‌డింది.

రోడ్లు: గ‌త ఐదేళ్ల‌లో వైసీపీ స‌ర్కారు ర‌హ‌దారుల బాగుచేత‌, నిర్మాణాల‌పై దృస్టి పెట్ట‌లేదు. దీంతో ఇప్పుడు వాటిని బాగు చేసేందుకు వెయ్యి కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు(కేవలం అతుకులు వేసేందుకే) ఖ‌ర్చు చేయాల్సివ‌స్తోంది. అవే వైసీపీ హ‌యాంలోనే బాగు చేసి ఉంటే.. ఇప్పుడు ఆ నిధుల‌ను కొత్త వాటికి వినియోగించేవారు. ఇలా.. అనేక అంశాల్లో వైసీపీ పాల‌న చేసిన చెడును క‌డిగేందుకు.. చంద్ర‌బాబు ప‌రీక్ష‌లు ఎదుర్కొంటున్నార‌ని.. కూట‌మి పార్టీల నాయ‌కులు చెబుతున్నారు.

This post was last modified on November 3, 2024 10:21 pm

Share

Recent Posts

విజ‌య్ స‌రైన‌ సినిమా చేసుంటే…

త‌మిళ సినిమాల్లో నంబ‌ర్ వ‌న్ స్థాయిలో ఉంటూ రాజ‌కీయాల వైపు అడుగులేసిన విజ‌య్ సినీ రంగాన్ని ఖాళీ చేస్తూ చేసిన…

45 minutes ago

సెకండాఫ్ జాగ్రత్త పడి ఉంటే కల్ట్ క్లాసిక్ అయ్యేది

మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…

1 hour ago

ఆ నలుగురు… ట్రెండు సృష్టిస్తారా

ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…

2 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

6 hours ago

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

13 hours ago

కొత్త నిర్మాతకు పెద్ద ఇబ్బందులు

ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…

14 hours ago