దీపావళి సందర్భంగా దీపం-2 పథకాన్ని ఏపీ సీఎం చంద్రబాబుతో పాటుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విడివిడిగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళంలో చంద్రబాబు ఆ పథకం మొదలుబెట్టగా, ఏలూరు జిల్లాలో ఈ పథకం ప్రారంభోత్సవం తర్వాత వైసీపీ ప్రభుత్వం, మాజీ సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 11 సీట్లు వచ్చినా వైసీపీ నోళ్లు లెగుస్తున్నాయని, ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే కాళ్లు విరగ్గొట్టి కూర్చోబెడతామని పవన్ డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, తొక్కి పట్టి నారతీస్తానని హెచ్చరించారు. భవిష్యత్తులో వైసీపీ నేతల నోళ్లు లేవకుండా చేస్తానని పవన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
తమది మంచి ప్రభుత్వమే గానీ, మెతక ప్రభుత్వం కాదని, యుద్ధం కావాలంటే మంచి పాలనతో యుద్ధమే ఇస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ దోపిడీ వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, అందుకే వారిని తరిమికొట్టినా వాళ్ళ నోళ్లు మూతపడడం లేదని పవన్ అన్నారు. సోషల్ మీడియాలో నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని, ఆడపిల్లలను ఇబ్బంది పెట్టేలాగా పోస్టులు పెడితే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.
ఆడబిడ్డల మానప్రాణాలకు ఇబ్బంది కలగకుండా చూడడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని, ఆడపిల్లల గురించి అసహ్యంగా తాము మాట్లాడలేదని పవన్ అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, గత ప్రభుత్వం పథకాల సరిగా అమలు చేయలేదని పవన్ అన్నారు. హామీలు అమలు కాకుంటే జన సైనికుల ప్రేమ ఎంత బలంగా ఉంటుందో కోపం కూడా అంతే బలంగా ఉంటుందని, పదవి వచ్చిన తర్వాత పదింతలు ఎక్కువగా కష్టపడే వ్యక్తిని తాను అని చెప్పారు.
ఇక, తనకు ప్రాణహాని ఉందని షర్మిల దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం తప్పకుండా ఆమెకు రక్షణ కల్పిస్తుందని చెప్పుకొచ్చారు. అమ్మా షర్మిల మీ అన్న రక్షణ కల్పించలేకపోయాడు..కానీ, మీకు ఈ కూటమి ప్రభుత్వం రక్షణగా ఉంటుంది అని పవన్ అన్నారు. బాధ్యత గల నాయకురాలిగా విమర్శలు చేయొచ్చని, కానీ ప్రాణహాని ఉందంటే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి షర్మిలకు రక్షణ కల్పిస్తామని చెప్పారు.
This post was last modified on November 2, 2024 6:33 am
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…