Political News

లోకేష్ కు రాజకీయాలు వద్దన్న బ్రాహ్మణి ఎలా కన్విన్స్ అయ్యారు?

అమెరికాలోని లాస్‍వేగాస్‍లో జరుగుతున్న ‘‘ఐటీ సర్వ్ అలైన్స్ సినర్జీ సమ్మిట్‍-2024’’లో ఏపీ ఐటీ శాఖా మంత్రి మంత్రి నారా లోకేష్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయిన లోకేష్ ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఆ తర్వాత సదస్సులో లోకేష్ కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా తనను రాజకీయాల్లో కొనసాగవద్దు అని తన భార్య బ్రాహ్మణి తనతో చెప్పిన విషయాన్ని లోకేష్ గుర్తు చేసుకున్నారు.

రాజకీయాల్లో ఎన్నో ఇబ్బందులుంటాయని, అవసరమా అని బ్రాహ్మణి తనను చాలాసార్లు అడిగిందని, ప్రత్యేకించి చంద్రబాబు గారి అరెస్టు సమయంలో కుటుంబం బాగా ఇబ్బంది పడిన సమయంలో బ్రాహ్మణి, తాను చాలా ఆవేదన చెందామని చెప్పారు. కానీ, హైదరాబాద్ లో 45 వేల మంది ఐటీ ఉద్యోగులు రాజకీయాలకు అతీతంగా బాబు గారికి మద్దతుగా నిలిచారని, అది చూసిన తర్వాత బ్రాహ్మణి తాను రాజకీయాలలో కొనసాగడం గురించి ప్రశ్నించలేదని అన్నారు.

ఇక, అమెరికాలోని పలు నగరాల్లో చాలామంది ఎన్నారైలు చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారని, వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. రాజకీయాల కోసం, ప్రజల కోసం ఇంత త్యాగం చేశాం అయినా అక్రమ అరెస్టులు తప్పలేదు…అని బ్రాహ్మణి ఆవేదన వ్యక్తం చేసిందని, కానీ, ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు గారికి వస్తున్న మద్దతు చూసి తన నిర్ణయం మార్చుకుందని అన్నారు.

45 ఏళ్ళు ప్రజల కోసమే పని చేసిన చంద్రబాబు గారిని, అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు ప్రజలందరూ చంద్రబాబు గారి కోసం నిలబడిన తీరు చూసిన తర్వాత తమ కుటుంబం ఆ అభిప్రాయం మార్చుకుందని చెప్పారు. కష్టాల్లో చంద్రబాబు గారి కోసం నిలబడ్డ ప్రజల కోసం తాము పని చేస్తూనే ఉంటామని అన్నారు.

This post was last modified on October 30, 2024 6:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`చ‌లానా` పడిందా… బ్యాంక్ నుండి మనీ కట్

వాహ‌న‌దారుల‌కు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ర‌హ‌దారుల‌పై ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా వాహ‌నాలు న‌డుపుతూ..…

25 minutes ago

బాబు, లోకేష్… సొంతూరికి వెళ్తూ స‌మ‌స్య‌ల‌పై దృష్టి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల‌ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…

6 hours ago

జిల్లాల విషయంలో తగ్గేదేలే అంటున్న రేవంత్

రాష్ట్రంలో అభివృద్ది చేసే విష‌యంలో ఎవ‌రు ఎన్ని విధాల అడ్డు ప‌డినా.. తాము ముందుకు సాగుతామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్…

8 hours ago

బడ్జెట్ 2026: అప్పులు తగ్గేలా నిర్మలమ్మ ప్లాన్

2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…

9 hours ago

టీమ్ ఇండియాలోకి కొత్త కుర్రాడు

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…

9 hours ago

ఒక్క సెలవు కూడా తీసుకొని సీఎం

ప్ర‌జ‌ల కోసం తాను ఒక్క‌రోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా ప‌నిచేస్తున్న‌ట్టు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ…

11 hours ago