Political News

ఇడుపులపాయ‌కు జ‌గ‌న్‌.. ఆ జోష్ ఏమైంది!

వైసీపీ అధినేత జ‌గ‌న్ స‌హ‌జంగా త‌న సొంత జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన‌ప్పుడు.. స్థానిక నాయ‌కులు తండోప తండాలుగా వ‌స్తారు. అధికారంలో ఉన్నా.. లేకున్నా.. కామ‌న్‌గా జ‌రిగేదే. అయితే.. ఇప్పుడు మాత్రం ఆ జోష్ క‌నిపించ‌లేదు. జ‌గ‌న్ బెంగ‌ళూరు నుంచి ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో సొంత జిల్లా క‌డ‌ప‌లోని ఇడుపులపా య‌కు చేరుకున్నారు. అనంత‌రం… త‌మ సొంత ఎస్టేట్‌కు వెళ్లారు. ఈ విష‌యంపై గ‌త రెండు రోజులుగా ఇక్క‌డ ప్ర‌చారంలో ఉంది.

దీంతో పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ నాయ‌కులు వ‌స్తార‌న్న ఉద్దేశంతో ముందుగానే జిల్లా ఎస్పీకి కూడా జ‌గ‌న్ భ‌ద్ర‌తా సిబ్బంది స‌మాచారం చేర‌వేశారు. భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేయాల‌ని.. ఎక్క‌డా ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాల‌ని కూడా కోరారు. దీంతో పెద్ద ఎత్తున భ‌ద్ర‌త‌ను క‌ల్పించారు. కానీ, భ‌ద్ర‌త‌కు వ‌చ్చిన పోలీసుల సంఖ్య‌లో కూడా.. నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో వైసీపీ నాయ‌కులు అవాక్క‌య్యారు.

ఇదిలావుంటే.. సొంత జిల్లాలో ప‌ర్య‌టిస్తున్న జ‌గ‌న్‌కు.. పొరుగు జిల్లాల‌కు చెందిన నాయ‌కులు వ‌చ్చి.. స్వాగ‌తం ప‌ల‌క‌డం.. వారే పుష్ప‌గుచ్ఛాలు అందించ‌డం గ‌మ‌నార్హం. గుంటూరుకు చెందిన నాయ‌కులు, ఎక్క‌డో విశాఖ‌కు చెందిన నాయ‌కులు క‌డ‌ప‌లో ద‌ర్శ‌న‌మిచ్చారు. స్థానికంగా ఉన్న నాయ‌కులుప‌ల‌చ‌గా క‌నిపించారు. మ‌రీ ముఖ్యంగా సొంత కుటుంబానికి చెందిన నాయ‌కులే క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

అయితే.. వీరంతా వేరే కార్య‌క్ర‌మాల్లో ఉన్నార‌ని పార్టీలో చ‌ర్చ‌సాగుతోంది. ఏదేమైనా.. ష‌ర్మిలతో ఆస్తి వివాదాలు రాజుకున్న స‌మ‌యంలో సొంత జిల్లాలో ఇలా కేడ‌ర్‌, నాయ‌కులు ప‌లుచ‌న కావ‌డం చ‌ర్చ‌కు దారితీసింది.

This post was last modified on October 29, 2024 9:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

18 minutes ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

45 minutes ago

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

1 hour ago

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

1 hour ago

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

3 hours ago

కేసీఆర్ వరకు వెళ్లిన సీతక్క పంచాయితీ

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…

3 hours ago