Political News

ఇడుపులపాయ‌కు జ‌గ‌న్‌.. ఆ జోష్ ఏమైంది!

వైసీపీ అధినేత జ‌గ‌న్ స‌హ‌జంగా త‌న సొంత జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన‌ప్పుడు.. స్థానిక నాయ‌కులు తండోప తండాలుగా వ‌స్తారు. అధికారంలో ఉన్నా.. లేకున్నా.. కామ‌న్‌గా జ‌రిగేదే. అయితే.. ఇప్పుడు మాత్రం ఆ జోష్ క‌నిపించ‌లేదు. జ‌గ‌న్ బెంగ‌ళూరు నుంచి ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో సొంత జిల్లా క‌డ‌ప‌లోని ఇడుపులపా య‌కు చేరుకున్నారు. అనంత‌రం… త‌మ సొంత ఎస్టేట్‌కు వెళ్లారు. ఈ విష‌యంపై గ‌త రెండు రోజులుగా ఇక్క‌డ ప్ర‌చారంలో ఉంది.

దీంతో పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ నాయ‌కులు వ‌స్తార‌న్న ఉద్దేశంతో ముందుగానే జిల్లా ఎస్పీకి కూడా జ‌గ‌న్ భ‌ద్ర‌తా సిబ్బంది స‌మాచారం చేర‌వేశారు. భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేయాల‌ని.. ఎక్క‌డా ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాల‌ని కూడా కోరారు. దీంతో పెద్ద ఎత్తున భ‌ద్ర‌త‌ను క‌ల్పించారు. కానీ, భ‌ద్ర‌త‌కు వ‌చ్చిన పోలీసుల సంఖ్య‌లో కూడా.. నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో వైసీపీ నాయ‌కులు అవాక్క‌య్యారు.

ఇదిలావుంటే.. సొంత జిల్లాలో ప‌ర్య‌టిస్తున్న జ‌గ‌న్‌కు.. పొరుగు జిల్లాల‌కు చెందిన నాయ‌కులు వ‌చ్చి.. స్వాగ‌తం ప‌ల‌క‌డం.. వారే పుష్ప‌గుచ్ఛాలు అందించ‌డం గ‌మ‌నార్హం. గుంటూరుకు చెందిన నాయ‌కులు, ఎక్క‌డో విశాఖ‌కు చెందిన నాయ‌కులు క‌డ‌ప‌లో ద‌ర్శ‌న‌మిచ్చారు. స్థానికంగా ఉన్న నాయ‌కులుప‌ల‌చ‌గా క‌నిపించారు. మ‌రీ ముఖ్యంగా సొంత కుటుంబానికి చెందిన నాయ‌కులే క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

అయితే.. వీరంతా వేరే కార్య‌క్ర‌మాల్లో ఉన్నార‌ని పార్టీలో చ‌ర్చ‌సాగుతోంది. ఏదేమైనా.. ష‌ర్మిలతో ఆస్తి వివాదాలు రాజుకున్న స‌మ‌యంలో సొంత జిల్లాలో ఇలా కేడ‌ర్‌, నాయ‌కులు ప‌లుచ‌న కావ‌డం చ‌ర్చ‌కు దారితీసింది.

This post was last modified on October 29, 2024 9:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`చ‌లానా` పడిందా… బ్యాంక్ నుండి మనీ కట్

వాహ‌న‌దారుల‌కు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ర‌హ‌దారుల‌పై ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా వాహ‌నాలు న‌డుపుతూ..…

44 minutes ago

బాబు, లోకేష్… సొంతూరికి వెళ్తూ స‌మ‌స్య‌ల‌పై దృష్టి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల‌ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…

6 hours ago

జిల్లాల విషయంలో తగ్గేదేలే అంటున్న రేవంత్

రాష్ట్రంలో అభివృద్ది చేసే విష‌యంలో ఎవ‌రు ఎన్ని విధాల అడ్డు ప‌డినా.. తాము ముందుకు సాగుతామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్…

8 hours ago

బడ్జెట్ 2026: అప్పులు తగ్గేలా నిర్మలమ్మ ప్లాన్

2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…

10 hours ago

టీమ్ ఇండియాలోకి కొత్త కుర్రాడు

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…

10 hours ago

ఒక్క సెలవు కూడా తీసుకొని సీఎం

ప్ర‌జ‌ల కోసం తాను ఒక్క‌రోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా ప‌నిచేస్తున్న‌ట్టు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ…

12 hours ago