వైసీపీ అధినేత జగన్ సహజంగా తన సొంత జిల్లా పర్యటనకు వెళ్లినప్పుడు.. స్థానిక నాయకులు తండోప తండాలుగా వస్తారు. అధికారంలో ఉన్నా.. లేకున్నా.. కామన్గా జరిగేదే. అయితే.. ఇప్పుడు మాత్రం ఆ జోష్ కనిపించలేదు. జగన్ బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో సొంత జిల్లా కడపలోని ఇడుపులపా యకు చేరుకున్నారు. అనంతరం… తమ సొంత ఎస్టేట్కు వెళ్లారు. ఈ విషయంపై గత రెండు రోజులుగా ఇక్కడ ప్రచారంలో ఉంది.
దీంతో పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ నాయకులు వస్తారన్న ఉద్దేశంతో ముందుగానే జిల్లా ఎస్పీకి కూడా జగన్ భద్రతా సిబ్బంది సమాచారం చేరవేశారు. భద్రతను కట్టుదిట్టం చేయాలని.. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని కూడా కోరారు. దీంతో పెద్ద ఎత్తున భద్రతను కల్పించారు. కానీ, భద్రతకు వచ్చిన పోలీసుల సంఖ్యలో కూడా.. నాయకులు, కార్యకర్తలు రాకపోవడం గమనార్హం. దీంతో వైసీపీ నాయకులు అవాక్కయ్యారు.
ఇదిలావుంటే.. సొంత జిల్లాలో పర్యటిస్తున్న జగన్కు.. పొరుగు జిల్లాలకు చెందిన నాయకులు వచ్చి.. స్వాగతం పలకడం.. వారే పుష్పగుచ్ఛాలు అందించడం గమనార్హం. గుంటూరుకు చెందిన నాయకులు, ఎక్కడో విశాఖకు చెందిన నాయకులు కడపలో దర్శనమిచ్చారు. స్థానికంగా ఉన్న నాయకులుపలచగా కనిపించారు. మరీ ముఖ్యంగా సొంత కుటుంబానికి చెందిన నాయకులే కనిపించకపోవడం గమనార్హం.
అయితే.. వీరంతా వేరే కార్యక్రమాల్లో ఉన్నారని పార్టీలో చర్చసాగుతోంది. ఏదేమైనా.. షర్మిలతో ఆస్తి వివాదాలు రాజుకున్న సమయంలో సొంత జిల్లాలో ఇలా కేడర్, నాయకులు పలుచన కావడం చర్చకు దారితీసింది.
This post was last modified on October 29, 2024 9:05 pm
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…