Political News

వైసీపీ వేస్ట్ పార్టీ.. మ‌న‌మే దూకుడు పెంచుదాం: ష‌ర్మిల‌

ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ ష‌ర్మిల విజ‌య‌వాడ‌లోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాల‌యంలో పార్టీ సీనియ‌ర్లు, ఇత‌ర నాయ‌కుల‌తో సోమవారం భేటీ అయ్యారు. గ‌త ప‌ది రోజులుగా సాగుతున్న ఆస్తుల వివాదాలు, రాజ‌కీయ ర‌చ్చ నేప‌థ్యంలో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు గాడి త‌ప్పుతున్నార‌న్న సంకేతాలు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో అధిష్టానం హెచ్చ‌రిక‌లు చేయ‌క‌ముందే.. ష‌ర్మిల అలెర్ట్ అయ్యారు. పార్టీ నాయ‌కుల‌కు దిశానిర్దేశం చేశారు. వ‌చ్చే నెల నుంచి రాష్ట్రంలో క్షేత్ర‌స్తాయి ప‌ర్య‌ట‌న‌లు ప్రారంభించ‌ను న్న‌ట్టు చెప్పారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుని వాటిపై పోరాటాలు చేయాల‌ని ఆమె పిలుపునిచ్చారు.

ఈ క్ర‌మంలో వైసీపీపై ష‌ర్మిల ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ‘వైసీపీ వేస్ట్ పార్టీ. అది ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ‌ను ఎప్పుడో కోల్పోయింది. ఇప్పుడు ప్ర‌జ‌ల ఆశ‌ల‌న్నీ.. మ‌న‌మీదేఉన్నాయి’ అని ష‌ర్మిల పేర్కొన్నారు. వైసీపీపై ఎన్నో ఆకాంక్ష‌ల‌తో 2019లో ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టార‌ని.. కానీ, ఆ నాయ‌కులు దోచుకుని దాచుకోవ‌డంలోనే బిజీ అయ్యార‌ని ష‌ర్మిల పేర్కొన్నారు. అందుకే ప్ర‌జ‌లు చిత్తుగా ఓడించి చెత్త బుట్ట‌లో ప‌డేశార‌ని చెప్పారు.

‘ఒక్క‌రంటే ఒక్క‌రికి కూడా నిబ‌ద్ధ‌త లేదు. ఆ పార్టీ ఆద‌ర‌ణ కోల్పోయింది. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని వైసీపీ నెర‌వేర్చ‌లేదు. అందుకే సామాన్యులు కూడా తిట్టుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. ఇది మ‌నం అందిపుచ్చుకుని ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకునేందుకు ప్రాదాన్యం ఇద్దాం. వారి త‌ర‌ఫున పోరాటాలు చేద్దాం’ అని ష‌ర్మిల పేర్కొన్నారు. వ‌చ్చే నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టించేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్న‌ట్టు ష‌ర్మిల పేర్కొన్నారు. ఎక్క‌డ ఏస‌మ‌స్య వ‌చ్చినా.. వెంట‌నే స్పందించాల‌న్నారు. త‌న దృష్టికి తీసుకువ‌స్తే.. దానిపై అంద‌రూ ఉమ్మ‌డి పోరాటాల‌కు దిగేందుకు అవ‌కాశం ఉంటుంద‌న్నారు.

ఇండియా కూట‌మిలో ఉన్న సీపీఐ, సీపీఎం త‌దిత‌ర పార్టీల‌తో క‌లిసి ఉద్య‌మాలు నిర్మించేందుకు కూడా సిద్ధంగా ఉండాల‌ని నాయ‌కుల‌కు ష‌ర్మిల పిలుపునిచ్చారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న క్రెడిబులిటిని స‌ద్వినియోగం చేసుకుందామ‌ని ష‌ర్మిల చెప్పారు. స‌మ‌స్యల ప‌రిష్కారం, అదేవిధంగా ప్ర‌జ‌ల‌కు భరోసా నింపే విధంగా కార్యక్రమాలు ఉండాల‌ని.. ఆ ర‌కంగా ప్లాన్ చేయాల‌ని పార్టీ నాయ‌కుల‌కు ఆమె సూచించారు.

This post was last modified on October 29, 2024 9:30 am

Share
Show comments
Published by
Satya
Tags: YS Sharmila

Recent Posts

విజయ్ గెలిస్తే… వైసీపీకి ఒరిగేదేంటి?

తమిళనాట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. అందుక్కారణం నటుడు విజయ్ పార్టీ టీవీకే మ్యాజిక్ మార్కు దిశగా…

22 minutes ago

రజినీ వదిలేస్తే.. విజయ్ వాడుకున్నాడు..

తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే పార్టీ ముందంజలో ఉండటం చూస్తుంటే, అందరికీ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ ప్రయాణం…

26 minutes ago

అక్కడ కూడా కాంగ్రెస్ లో సీఎం సీటు పంచాయతీ!

కాంగ్రెస్ పార్టీ..దేశంలోనే అతి పురాతన రాజకీయ పార్టీ… అదే ఆ పార్టీకి పెద్ద మైనస్. పాత పార్టీ… పాత పాట……

37 minutes ago

ఒక రోజుకే ప్రేక్షకులు మర్చిపోయారు

సాయిపల్లవి బాలీవుడ్ డెబ్యూ ఏక్ దిన్ ఈ ఏడాది అతి పెద్ద డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచేందుకు పరుగులు పెడుతోంది.…

55 minutes ago

స్వాతంత్ర్యం తర్వాత మొదటిసారి.. దీదీ కోటలో బీజేపీ మ్యాజిక్!

పశ్చిమ బెంగాల్ రాజకీయం ఊహించని మలుపు తిరిగింది. గత పదిహేనేళ్లుగా రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కోట…

1 hour ago

బీజేపీ కూటమితో విజ‌య్ క‌లుస్తారా?.. ఏం జ‌రుగుతుంది?

త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో భారీ విజ‌యం న‌మోదు చేసుకున్న విజ‌య్ పార్టీ టీవీకే 110 స్థానాల్లో ఆధిక్యం సంపాయించింది. అయితే.. అధికారంలోకి…

2 hours ago