Political News

వైసీపీ ‘ర‌హస్యం’ బ‌ట్ట‌బ‌య‌లు!

వైసీపీ ర‌హ‌స్యాల‌ను బ‌ట్ట‌బ‌య‌లు చేసేందుకు కూట‌మి స‌ర్కారు సిద్ధ‌మైంది. వైసీపీ హ‌యాంలో సుమారు 320కి పైగా ర‌హ‌స్య జీవోలు ఇచ్చార‌న్న విమ‌ర్శ‌లు ఉన్న విషయం తెలిసిందే. అప్ప‌ట్లో టీడీపీ స‌హా బీజేపీ నాయ‌కులు కూడా.. ర‌హ‌స్య జీవోల‌పై న్యాయ పోరాటం కూడా చేశారు. హైకోర్టుకు వెళ్లి వైసీపీ స‌ర్కారుపై పిటిష‌న్లు కూడా వేశారు. అప్ప‌ట్లో కోర్టు ఆదేశాల మేర‌కు కొన్ని జీవోల‌ను అప్ప‌టిక‌ప్పుడు ఆన్‌లైన్ చేసినా.. వంద‌ల సంఖ్య‌లో జీవోల‌ను మాత్రం దాచి పెట్టారు.

కోర్టు చెప్పినా.. రాజ‌కీయ పార్టీల నుంచి ప్ర‌జా సంఘాల నుంచి విమ‌ర్శ‌లు వ‌చ్చినా.. వైసీపీ ప్ర‌భుత్వం పెద్ద‌గా స్పందించ‌లేదు. ఇక‌, ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వ‌చ్చాక‌.. వైసీపీ ర‌హ‌స్య జీవోల‌ను బ‌ట్ట‌బ‌య‌లు చేస్తామ‌ని హామీ ఇచ్చారు. ఇలా ఇచ్చిన హామీని ఇప్పుడు అమ‌లు చేస్తున్నారు. వైసీపీ హ‌యాంలో ఇచ్చిన ర‌హ‌స్య జీవోల‌ను ప్ర‌జ‌ల స‌మ‌క్షంలో పెట్టేందుకు ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది.

సుమారు 320 జీవోల‌ను ర‌హ‌స్యంగా ఉంచార‌ని అధికారులు కూడా అంచ‌నా వేస్తున్నారు. వీటిలో రెవెన్యూ జీవోలే ఎక్కువ‌గా ఉన్నాయ‌ని స‌మాచారం. అదేవిధంగా హోం శాఖ‌కు చెందిన జీవోలు కూడా ఉన్నాయ‌ని భావిస్తున్నారు. ఇప్పుడు వీటిని జీవోఐఆర్‌(గ‌వ‌ర్న‌మెంట్ ఆర్డ‌ర్ ఇష్యూ రిజిస్ట‌ర్‌)లో వాటిని ప‌బ్లిక్ డొమైన్‌లో ఉంచ‌నున్నారు. త‌ద్వారా.. అస‌లు వైసీపీ హ‌యాంలో ఏయే అంశాల‌పై ర‌హ‌స్య జీవోలు ఇచ్చారు..? వాటి వెనుక ఉన్న ఉద్దేశాలు ఏంటి? అనేది ప్ర‌జ‌ల‌కు తెలియ‌జెప్పాల‌ని కూట‌మి స‌ర్కారు నిర్ణ‌యించుకుంది.

This post was last modified on October 28, 2024 7:35 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సినిమాల్లేవ్ కానీ అంతటా ఆమే..

బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…

3 hours ago

మళ్లీ రెండేళ్లంటే కష్టం రాజా

ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…

7 hours ago

మహేష్ రన్నింగ్ స్టైల్ మార్చడమేంటి జక్కన్నా?

తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…

9 hours ago

దురంధర్ VS విశ్వరూపం – ఎందుకీ రచ్చ?

ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…

9 hours ago

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

11 hours ago

టార్గెట్ వైసీపీ… బాబు-ప‌వ‌న్ రచిస్తున్న వ్యూహం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు సుమారు గంట‌కుపైగా చ‌ర్చ‌లు జ‌రిపారు. బుధ‌వారం ఉద‌యం ఉండ‌వ‌ల్లిలోని ముఖ్య‌మంత్రి నివాసానికి…

11 hours ago