వైసీపీ రహస్యాలను బట్టబయలు చేసేందుకు కూటమి సర్కారు సిద్ధమైంది. వైసీపీ హయాంలో సుమారు 320కి పైగా రహస్య జీవోలు ఇచ్చారన్న విమర్శలు ఉన్న విషయం తెలిసిందే. అప్పట్లో టీడీపీ సహా బీజేపీ నాయకులు కూడా.. రహస్య జీవోలపై న్యాయ పోరాటం కూడా చేశారు. హైకోర్టుకు వెళ్లి వైసీపీ సర్కారుపై పిటిషన్లు కూడా వేశారు. అప్పట్లో కోర్టు ఆదేశాల మేరకు కొన్ని జీవోలను అప్పటికప్పుడు ఆన్లైన్ చేసినా.. వందల సంఖ్యలో జీవోలను మాత్రం దాచి పెట్టారు.
కోర్టు చెప్పినా.. రాజకీయ పార్టీల నుంచి ప్రజా సంఘాల నుంచి విమర్శలు వచ్చినా.. వైసీపీ ప్రభుత్వం పెద్దగా స్పందించలేదు. ఇక, ఎన్నికల సమయంలో చంద్రబాబు మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చాక.. వైసీపీ రహస్య జీవోలను బట్టబయలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇలా ఇచ్చిన హామీని ఇప్పుడు అమలు చేస్తున్నారు. వైసీపీ హయాంలో ఇచ్చిన రహస్య జీవోలను ప్రజల సమక్షంలో పెట్టేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
సుమారు 320 జీవోలను రహస్యంగా ఉంచారని అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. వీటిలో రెవెన్యూ జీవోలే ఎక్కువగా ఉన్నాయని సమాచారం. అదేవిధంగా హోం శాఖకు చెందిన జీవోలు కూడా ఉన్నాయని భావిస్తున్నారు. ఇప్పుడు వీటిని జీవోఐఆర్(గవర్నమెంట్ ఆర్డర్ ఇష్యూ రిజిస్టర్)లో వాటిని పబ్లిక్ డొమైన్లో ఉంచనున్నారు. తద్వారా.. అసలు వైసీపీ హయాంలో ఏయే అంశాలపై రహస్య జీవోలు ఇచ్చారు..? వాటి వెనుక ఉన్న ఉద్దేశాలు ఏంటి? అనేది ప్రజలకు తెలియజెప్పాలని కూటమి సర్కారు నిర్ణయించుకుంది.
This post was last modified on %s = human-readable time difference 7:35 pm
‘ఆర్ఎక్స్ 100’ మూవీతో అరంగేట్రంలోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు అజయ్ భూపతి. ఆ తర్వాత తన నుంచి వచ్చిన…
'పుష్ప: ది రూల్' విడుదల తేదీ దగ్గర పడేకొద్దీ ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇండియా మొత్తం ఎదురు చూస్తున్న…
తెలంగాణ రాజకీయాల్లో జున్వాడ రేవ్ పార్టీ(పోలీసులు చెబుతున్న ప్రకారం) వ్యవహారం తీవ్ర రగడకు దారి తీసింది. రేవ్ పార్టీ అనంతరం…
2025 సంక్రాంతికి గేమ్ ఛేంజర్ తో పాటు వెంకటేష్ 76 రిలీజ్ చేయాలనే ఒత్తిడి నిర్మాత దిల్ రాజు మీద…
ఈ రోజుల్లో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ రీల్స్ మోజులో పడుతున్నారు. తమలో దాగి ఉన్న నైపుణ్యాలను చాటేందుకు…
గుంటూరు కారం తర్వాత మహేష్ బాబుని మళ్ళీ తెరమీద చూడలేమని బెంగపడుతున్న అభిమానులను రిలీఫ్ దక్కే శుభవార్త రాబోతోందట. అశోక్…