వైసీపీ రహస్యాలను బట్టబయలు చేసేందుకు కూటమి సర్కారు సిద్ధమైంది. వైసీపీ హయాంలో సుమారు 320కి పైగా రహస్య జీవోలు ఇచ్చారన్న విమర్శలు ఉన్న విషయం తెలిసిందే. అప్పట్లో టీడీపీ సహా బీజేపీ నాయకులు కూడా.. రహస్య జీవోలపై న్యాయ పోరాటం కూడా చేశారు. హైకోర్టుకు వెళ్లి వైసీపీ సర్కారుపై పిటిషన్లు కూడా వేశారు. అప్పట్లో కోర్టు ఆదేశాల మేరకు కొన్ని జీవోలను అప్పటికప్పుడు ఆన్లైన్ చేసినా.. వందల సంఖ్యలో జీవోలను మాత్రం దాచి పెట్టారు.
కోర్టు చెప్పినా.. రాజకీయ పార్టీల నుంచి ప్రజా సంఘాల నుంచి విమర్శలు వచ్చినా.. వైసీపీ ప్రభుత్వం పెద్దగా స్పందించలేదు. ఇక, ఎన్నికల సమయంలో చంద్రబాబు మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చాక.. వైసీపీ రహస్య జీవోలను బట్టబయలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇలా ఇచ్చిన హామీని ఇప్పుడు అమలు చేస్తున్నారు. వైసీపీ హయాంలో ఇచ్చిన రహస్య జీవోలను ప్రజల సమక్షంలో పెట్టేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
సుమారు 320 జీవోలను రహస్యంగా ఉంచారని అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. వీటిలో రెవెన్యూ జీవోలే ఎక్కువగా ఉన్నాయని సమాచారం. అదేవిధంగా హోం శాఖకు చెందిన జీవోలు కూడా ఉన్నాయని భావిస్తున్నారు. ఇప్పుడు వీటిని జీవోఐఆర్(గవర్నమెంట్ ఆర్డర్ ఇష్యూ రిజిస్టర్)లో వాటిని పబ్లిక్ డొమైన్లో ఉంచనున్నారు. తద్వారా.. అసలు వైసీపీ హయాంలో ఏయే అంశాలపై రహస్య జీవోలు ఇచ్చారు..? వాటి వెనుక ఉన్న ఉద్దేశాలు ఏంటి? అనేది ప్రజలకు తెలియజెప్పాలని కూటమి సర్కారు నిర్ణయించుకుంది.
This post was last modified on October 28, 2024 7:35 pm
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…