Political News

వైసీపీ ‘ర‌హస్యం’ బ‌ట్ట‌బ‌య‌లు!

వైసీపీ ర‌హ‌స్యాల‌ను బ‌ట్ట‌బ‌య‌లు చేసేందుకు కూట‌మి స‌ర్కారు సిద్ధ‌మైంది. వైసీపీ హ‌యాంలో సుమారు 320కి పైగా ర‌హ‌స్య జీవోలు ఇచ్చార‌న్న విమ‌ర్శ‌లు ఉన్న విషయం తెలిసిందే. అప్ప‌ట్లో టీడీపీ స‌హా బీజేపీ నాయ‌కులు కూడా.. ర‌హ‌స్య జీవోల‌పై న్యాయ పోరాటం కూడా చేశారు. హైకోర్టుకు వెళ్లి వైసీపీ స‌ర్కారుపై పిటిష‌న్లు కూడా వేశారు. అప్ప‌ట్లో కోర్టు ఆదేశాల మేర‌కు కొన్ని జీవోల‌ను అప్ప‌టిక‌ప్పుడు ఆన్‌లైన్ చేసినా.. వంద‌ల సంఖ్య‌లో జీవోల‌ను మాత్రం దాచి పెట్టారు.

కోర్టు చెప్పినా.. రాజ‌కీయ పార్టీల నుంచి ప్ర‌జా సంఘాల నుంచి విమ‌ర్శ‌లు వ‌చ్చినా.. వైసీపీ ప్ర‌భుత్వం పెద్ద‌గా స్పందించ‌లేదు. ఇక‌, ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వ‌చ్చాక‌.. వైసీపీ ర‌హ‌స్య జీవోల‌ను బ‌ట్ట‌బ‌య‌లు చేస్తామ‌ని హామీ ఇచ్చారు. ఇలా ఇచ్చిన హామీని ఇప్పుడు అమ‌లు చేస్తున్నారు. వైసీపీ హ‌యాంలో ఇచ్చిన ర‌హ‌స్య జీవోల‌ను ప్ర‌జ‌ల స‌మ‌క్షంలో పెట్టేందుకు ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది.

సుమారు 320 జీవోల‌ను ర‌హ‌స్యంగా ఉంచార‌ని అధికారులు కూడా అంచ‌నా వేస్తున్నారు. వీటిలో రెవెన్యూ జీవోలే ఎక్కువ‌గా ఉన్నాయ‌ని స‌మాచారం. అదేవిధంగా హోం శాఖ‌కు చెందిన జీవోలు కూడా ఉన్నాయ‌ని భావిస్తున్నారు. ఇప్పుడు వీటిని జీవోఐఆర్‌(గ‌వ‌ర్న‌మెంట్ ఆర్డ‌ర్ ఇష్యూ రిజిస్ట‌ర్‌)లో వాటిని ప‌బ్లిక్ డొమైన్‌లో ఉంచ‌నున్నారు. త‌ద్వారా.. అస‌లు వైసీపీ హ‌యాంలో ఏయే అంశాల‌పై ర‌హ‌స్య జీవోలు ఇచ్చారు..? వాటి వెనుక ఉన్న ఉద్దేశాలు ఏంటి? అనేది ప్ర‌జ‌ల‌కు తెలియ‌జెప్పాల‌ని కూట‌మి స‌ర్కారు నిర్ణ‌యించుకుంది.

This post was last modified on October 28, 2024 7:35 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రతిచోట చీపురు పట్టుకొని పవన్ ఊడవాలా?

పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…

2 hours ago

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

3 hours ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

3 hours ago

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

4 hours ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

13 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

13 hours ago