ఏపీలోని జనసేన తరహా పార్టీ తమిళనాడులోనూ ఆవిర్భవించింది. ప్రముఖ తమిళ హీరో విజయ్.. తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీని కొన్నాళ్ల కిందట ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఆయన అప్పట్లో తన పార్టీ సిద్ధాంతాలను ప్రకటించలేదు. దీనిపై కసరత్తు చేస్తున్నామని చెప్పారు.
కానీ, ఆదివారం సాయంత్రం విల్లుపురం జిల్లాలో నిర్వహించిన టీవీకే పార్టీ తొలి మహానాడులో ఆయన తన పార్టీ సిద్ధాంతాలు సహా భవిష్యత్తును ఆవిష్కరించారు. ప్రశ్నించేందుకే పార్టీ పెట్టినట్టు ఆయన చెప్పారు. కేంద్రంలోని బీజేపీని, రాష్ట్రంలోని డీఎంకేని ఆయన తూర్పార బట్టారు. నిరంకుశ పాలనకురెండు ప్రభుత్వాలు కేరాఫ్గా నిలుస్తున్నాయని విమర్శలు గుప్పించారు.
ఇక్కడ పవన్ మాదిరిగానే
ఏపీలో తొలినాళ్లలో జనసేన అధినేత పవన్ను నటుడు.. సినిమాలు చేసుకునేవాడు.. అంటూ కొందరు విపక్ష నాయకులు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అలానే.. విజయ్నుకూడా.. రాజకీయంగా ఆటపట్టించడం గమనార్హం. ఈ విషయాన్ని విజయ్ తన ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావించారు. “నన్ను ఆర్టిస్ట్ అంటూ పలువురు విమర్శలు చేస్తున్నారు. అయినా వెరవను. నటులు ప్రజాసేవకు పనికి వస్తారని ఎన్నో ఉదంతాలు చాటి చెబుతున్నాయి. ఏపీలో నందమూరి తారక రామారావు, తమిళనాడులో ఎంజీఆర్లు రాణించలేదా..? ప్రజా నాయకులుగా వెలుగొందలేదా?” అని తనదైన శైలిలో ఆయన ప్రసంగించారు.
అనుభవం లేదని..
జనసేన అధినేత 2014లో పార్టీని ప్రకటించినప్పుడు.. అనుభవం లేదంటూ.. కొందరు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సేమ్ టు సేమ్.. విజయ్ను ఉద్దేశించి కూడా కొందరు ఇవే వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనికి కూడా విజయ్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ‘‘నాకు రాజకీయ అనుభవం లేకపోవచ్చు. కానీ, నేను పాలిటిక్స్ విషయంలో భయపడడం లేదు’’ అని అన్నారు. సినిమాలతో పోల్చుకుంటే.. రాజకీయాలు ఎలా ఉంటాయో తనకు తెలుసునని వ్యాఖ్యానించారు.
ఇక్కడ అందరూ రాజకీయాలతో ఆడుకునే వారేనని చెప్పారు. నేను సినిమాల్లోకి వచ్చినప్పుడు కూడా నన్ను అవమానించారు. అయినా, కఠోర శ్రమ, ధైర్యంతో ఈ స్థాయికి చేరుకున్నా అని విజయ్ వ్యాఖ్యానించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిస్థాయి మెజార్టీతో విజయం సాధించి.. అధికారంలోకి రావడమే లక్ష్యమని విజయ్ ప్రకటించారు.
ఇవీ.. సిద్ధాంతాలు..
This post was last modified on October 28, 2024 5:37 am
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…