ఏపీలోని జనసేన తరహా పార్టీ తమిళనాడులోనూ ఆవిర్భవించింది. ప్రముఖ తమిళ హీరో విజయ్.. తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీని కొన్నాళ్ల కిందట ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఆయన అప్పట్లో తన పార్టీ సిద్ధాంతాలను ప్రకటించలేదు. దీనిపై కసరత్తు చేస్తున్నామని చెప్పారు.
కానీ, ఆదివారం సాయంత్రం విల్లుపురం జిల్లాలో నిర్వహించిన టీవీకే పార్టీ తొలి మహానాడులో ఆయన తన పార్టీ సిద్ధాంతాలు సహా భవిష్యత్తును ఆవిష్కరించారు. ప్రశ్నించేందుకే పార్టీ పెట్టినట్టు ఆయన చెప్పారు. కేంద్రంలోని బీజేపీని, రాష్ట్రంలోని డీఎంకేని ఆయన తూర్పార బట్టారు. నిరంకుశ పాలనకురెండు ప్రభుత్వాలు కేరాఫ్గా నిలుస్తున్నాయని విమర్శలు గుప్పించారు.
ఇక్కడ పవన్ మాదిరిగానే
ఏపీలో తొలినాళ్లలో జనసేన అధినేత పవన్ను నటుడు.. సినిమాలు చేసుకునేవాడు.. అంటూ కొందరు విపక్ష నాయకులు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అలానే.. విజయ్నుకూడా.. రాజకీయంగా ఆటపట్టించడం గమనార్హం. ఈ విషయాన్ని విజయ్ తన ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావించారు. “నన్ను ఆర్టిస్ట్ అంటూ పలువురు విమర్శలు చేస్తున్నారు. అయినా వెరవను. నటులు ప్రజాసేవకు పనికి వస్తారని ఎన్నో ఉదంతాలు చాటి చెబుతున్నాయి. ఏపీలో నందమూరి తారక రామారావు, తమిళనాడులో ఎంజీఆర్లు రాణించలేదా..? ప్రజా నాయకులుగా వెలుగొందలేదా?” అని తనదైన శైలిలో ఆయన ప్రసంగించారు.
అనుభవం లేదని..
జనసేన అధినేత 2014లో పార్టీని ప్రకటించినప్పుడు.. అనుభవం లేదంటూ.. కొందరు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సేమ్ టు సేమ్.. విజయ్ను ఉద్దేశించి కూడా కొందరు ఇవే వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనికి కూడా విజయ్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ‘‘నాకు రాజకీయ అనుభవం లేకపోవచ్చు. కానీ, నేను పాలిటిక్స్ విషయంలో భయపడడం లేదు’’ అని అన్నారు. సినిమాలతో పోల్చుకుంటే.. రాజకీయాలు ఎలా ఉంటాయో తనకు తెలుసునని వ్యాఖ్యానించారు.
ఇక్కడ అందరూ రాజకీయాలతో ఆడుకునే వారేనని చెప్పారు. నేను సినిమాల్లోకి వచ్చినప్పుడు కూడా నన్ను అవమానించారు. అయినా, కఠోర శ్రమ, ధైర్యంతో ఈ స్థాయికి చేరుకున్నా అని విజయ్ వ్యాఖ్యానించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిస్థాయి మెజార్టీతో విజయం సాధించి.. అధికారంలోకి రావడమే లక్ష్యమని విజయ్ ప్రకటించారు.
ఇవీ.. సిద్ధాంతాలు..
This post was last modified on October 28, 2024 5:37 am
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…