వైసీపీ నేతలు కొందరు పార్టీ నుంచి వెళ్లిపోయారు. మరికొందరు తట్టాబుట్టా సర్దుకున్నారు. అయితే.. ఇంకొందరు.. నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారు. కనీసం నాలుగు మాసాల్లో ఒక్కసారి కూడా నియోజకవర్గాల మొహం చూడని ఫైర్ బ్రాండ్లు ఉన్నారంటే ఆశ్చర్యం వేస్తుంది. వీరిలో గుడివాడ మాజీ ఎమ్మెల్యే, మంత్రి.. కొడాలి నాని హైదరాబాద్ వరకు పరిమితం అయ్యారు. ఏదైనా పని ఉండి ఏపీలోకి వస్తున్నా.. ఆయన విజయవాడ వరకు వచ్చి.. ఆ వెంటనే వెళ్లిపోతున్నారు.
ఇక, గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వివాదాస్పద నాయకుడు వల్లభనేని వంశీ అసలు అజ లేకుండా పోయారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉంటున్నారని చెబుతున్నా.. నాలుగు నెలలుగా ఆయన అమెరికాలోనే ఉంటున్నారా? అనేది సందేహం. ఇక, మాజీ మంత్రి ఫైర్ బ్రాండ్, రోజా తన సొంత నియోజకవర్గం నగరిలో కాలు పెట్టకుండా.. పైపైనే రాజకీయాలు చేస్తున్నారు. అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసలు పుంగనూరు మొహం చూసి మూడున్నర మాసాలైంది.
అలాగే.. విజయవాడ సెంట్రల్లో వైసీపీ తరఫున వాయిస్ వినిపించేవారే కరువయ్యారు. ఎన్నికలకు ముందు టికెట్ను పశ్చిమ నియోజకవర్గం నాయకుడు వెల్లంపల్లి శ్రీనివాస్కు ఇవ్వడంతో ఇక్కడి నేత మల్లాది విష్ణు నాకెందుకులే అని తప్పించుకుంటున్నారు. ఇక, వెల్లంపల్లి ఓడిపోయిన తర్వాత.. ఇంటికి, వ్యాపారాలకు పరిమితమయ్యారు. అదేవిధంగా అనంతపురం జిల్లా పెనుకొండలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పెనుకొండ నుంచి అప్పటి మంత్రి ఉషశ్రీచరణ్ పోటీ చేసి ఓడిపోయారు.
తర్వాత నియోజకవర్గం జోలికి కూడా పోవడం లేదు. బెంగళూరు-హైదరాబాద్ చుట్టూ తిరుగుతున్నారు. ఇలా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. 50 నుంచి 60 మంది నాయకులు నియోజకవర్గాల మొహం చూడడం లేదు. దీనికి కారణం.. ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి నాయకుల దూకుడు ఎక్కువగా ఉండడంతోపాటు.. గతంలో జరిగిన అక్రమాలను వెలికి తీస్తున్నారు. దీంతో ఇప్పుడు నియోజకవర్గంలోకి అడుగు పెడితే.. రచ్చ మరింత పెరుగుతుందని భావిస్తూ.. నాయకులు సైలెంట్ అయ్యారని తెలుస్తోంది.
This post was last modified on October 28, 2024 2:34 pm
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…